-
పాలిసెట్లో 81.75 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్–21 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 17న జరిగిన పాలిసెట్–21 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,02,496 మంది దరఖాస్తు చేసుకోగా, 92,557 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 81.75శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.. అంటే 75,666 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 39,186, బాలికలు 33,071 మంది ఉన్నారు. సాధారణంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పాలిసెట్ పరీక్షను నిర్వహిస్తుండగా... కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో పదోతరగతి బోర్డు పరీక్షలు నిర్వహించకపోవడంతో బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు సైతం ఈ సెట్ ఫలితాల ఆధారంగా నిర్వహిస్తున్నారు. అతి త్వరలో ప్రవేశాల కౌన్సెలింగ్కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ వేర్వేరుగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. పాలిసెట్లో సాధించిన మార్కులు, ర్యాంకులకు సంబంధించిన సమాచారం, ర్యాంకు కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ తెలిపారు. -
ఇదేం పద్ధతి?
నల్లగొండ టూటౌన్: ‘కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించరా..?, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించరా..?, విధుల్లో బాధ్యతారాహిత్యం పనికిరాదు’ అంటూ తెలంగాణ కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.వాణీప్రసాద్ ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఎన్జీ కళాశాలలో జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల అకాడమిక్ సంబంధించిన షెడ్యూల్ను, ఆర్థిక వివరాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... విద్యార్థులకు సరైన విద్యను అందించకపోతే ఎలా అని అధ్యాపకులను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ విద్యార్థులకు సరైన బోధన చేయకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. కళాశాలలో మంచి వాతావరణాన్ని కల్పించాలని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని సూచించారు. తాను గతంలో తనిఖీ చేసిన సమయంలో ఇక్కడి సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. అదేవిధంగా కొత్త కోర్సులు, కళాశాల సమస్యలపై చర్చించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.నాగేందర్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్రెడ్డి, ఏడుకొండల్, దయాకర్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement