-
తెలంగాణకే తలమానికం! ట్విన్ టవర్స్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్కు పేరు ఖరారైంది. ట్విన్ టవర్స్గా పిలుస్తున్న దీన్ని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ)గా నామకరణం చేశారు. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. వాస్తవానికిది నాలుగు టవర్స్తో కూడిన సముదాయం. టీఎస్ఐసీసీసీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నతాధికారులకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. 2015 నవంబర్లో దీని నిర్మాణం ప్రారంభమైంది. గురువారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, నగర కొత్వాల్ సీవీ ఆనంద్ తదితరులు ‘టీఎస్ఐసీసీసీ’ని సందర్శించి పనులపై సమీక్షించారు. 83.4 మీటర్లకు పరిమితం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఏడెకరాల్లో ఈ జంట భవనాలను 135 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తొలుత భావించారు. అప్పుడున్న నిబంధనల ప్రకారం బంజారాహిల్స్లో 15 మీటర్లకు మించిన ఎత్తులో నిర్మాణాలు జరపకూడదు. ఈ ఆంక్షలను సడలిస్తూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి పురపాలక శాఖ అనుమతి ఇచ్చింది. మరోపక్క ఇంత ఎత్తైన భవనాలు నిర్మించాలంటే దానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 83.4 మీటర్ల ఎత్తుతో నిర్మించుకోవడానికి సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతించింది. ఈ మేరకు పోలీసు విభాగం 20 అంతస్తులతో 83.4 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ‘టీఎస్ఐసీసీసీ’లో స్వరూప, స్వభావాలివీ.. నగర పోలీసు కమిషనరేట్ ఆగస్టు ఆఖరు కల్లా టీఎస్ఐసీసీసీలోకి తరలనుంది. 18వ అంతస్తులో కొత్వాల్ కార్యాలయం ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తదితరాలు సైతం అక్కడికే వెళ్తాయి. నాలుగు బ్లాకుల్లో (ఏ, బీ, సీ, డీ) 5.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు. బ్లాక్–ఏలో 20 అంతస్తులు (16216 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్–బీలో 18 అంతస్తులు (12320 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్–సీలో జీ+2 ఫ్లోర్లు (7920 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్–డీలో జీ+1 ఫ్లోర్ (2230 చదరపు మీటర్లు విస్తీర్ణం). పూర్తిస్థాయిలో డబుల్ ఇన్సులేటెడ్ గ్లాస్తో నిర్మించే ఈ టవర్స్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ అదనపు ఆకర్షణ. భవనంపై హెలిప్యాడ్, 17వ అంతస్తులో పబ్లిక్ అబ్జర్వేషన్ డెస్క్, పోలీసు మ్యూజియం ఉంటాయి. 900 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్ వసతి ఉంది. (చదవండి: పేపర్ లీక్ వ్యవహారం.. ఐదుగురు అధికారుల సస్పెన్షన్) -
పోలీస్ నిఘా నేత్రాలు
ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా.. ఇప్పుడు భద్రత ప్రమాణాల్లో జాతీయస్థాయిలో నాలుగోస్థానంలో నిలిచింది. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతో చీమ కుట్టినా తెలిసిపోతోంది. ఇప్పటికే 3500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా మరో 50వేల కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా పోలీస్శాఖ ముందుకెళ్తోంది. దీనికి సీపీ కమలాసన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కరీంనగర్ క్రైం: గతంలో పోలీస్స్టేషన్ అంటే భయపడే స్థాయి నుంచి ప్రజలు వచ్చి ఫిర్యాదు చేసేందుకు కావాల్సిన వాతావరణం కల్పించారు జిల్లా పోలీస్ అధికారులు. స్టేషన్ అధికారుల కోసం ఎదురు చూడకుండా.. అధికారి ఉన్నా.. లేకపోయినా.. ఫిర్యాదు చేసే అవకాశం ఏర్పాటు చేశారు. బాధితులు కూర్చునేందుకు కార్పొరేట్ స్థాయిలో మోడల్ పోలీస్స్టేషన్లుగా తీర్చిదిద్దారు. రాష్ట్ర రాజధానికే పరిమితమైన కార్డెన్సెర్చ్లను కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అమలు చేసి మంచి ఫలితాలను రాబట్టారు సీపీ కమలాసన్రెడ్డి. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్డ్రైవ్తో చెక్ పెట్టారు. నేరాల నియంత్రణ, చేధనతో పాటు అధిక భద్రత కల్పించే సీసీ కెమెరాలపై దృష్టి సారించి వాటిని ఏర్పాటు చేశారు. అత్యాధునిక టెక్నాలజి కలిగిన వాటిని ఏర్పాటు చేయడంతోపాటు వాటి కోసం కమాండ్ కంట్రోల్ చేశారు. దీనిలో ప్రజలకు అవగాహన కల్పించి వారిని కూడా భాగస్వాములను చేయడంతో కమినరేట్వ్యాప్తంగా 3500 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. కార్డెన్ అండ్ సెర్చ్ కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వీబీ.కమలాసన్రెడ్డి మొదట నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. కార్డెన్సెర్చ్ నిర్వహించడం ద్వారా నేరస్తులకు చెక్ పెట్టడమే కాకుండా ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంచారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో 100కు పైగా కార్డెన్సెర్చ్లు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. నేరస్తులపై సమగ్ర సర్వే నిర్వహించి వాటిని సర్వర్లో నిక్షిప్తం చేశారు. వారిని నిత్యం గమనించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. నేరం జరిగిన ఐదు నిమిషాల్లో చేరుకునేలా బ్లూకోల్ట్స్ బృందాలను ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు పెట్టికేసు నమోదు చేసేలా ఆధునిక ట్యాబ్లు సమకూర్చారు. అర్ధరాత్రి తర్వాత రోడ్లపై తిరిగే వారిని నియంత్రించడానికి ఆపరేషన్ నైట్సేఫ్టీ పేరిట తనిఖీలు నిర్వహించి.. పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. డ్రంకెన్డ్రైవ్లు రాష్ట్ర రాజధాని తర్వాత అత్యధికంగా డ్రంకెన్డ్రైవ్ కేసులు కరీంనగర్లోని నమోదు అయ్యాయి. వారవారం క్రమం తప్పకుంగా ప్రత్యేక డ్రంకెన్డ్రైవ్లు నిర్వహిస్తుండడంతో మందుబాబుల గుండెల్లో గుబులు పుట్టిన్నారు. ఇప్పటివరకు 7,195 మంది పట్టుబడ్డారు. డ్రంకెన్డ్రైవ్తో రోడ్డు ప్రమాదాణాలు తగ్గాయని మహిళలు పేర్కొంటున్నారు. 2016 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 7,195 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో 1822మందికి జైలు శిక్ష విధించారు. 4,350మందికి జరిమానా, 357 మందితో శ్రమదానం చేయించారు. వీరినుంచి 1,18,34,250 జరిమానా వసూలు చేశారు. 409 మందికి ఒకరోజు శిక్ష, 763 మందికి రెండురోజులు, 245 మందికి మూడురోజులు, 122 మందికి నాలుగురోజులు, 108 మందికి ఐదు రోజులు, 56 మందికి ఆరు రోజులు, 55 మందికి ఏడు రోజులు, 44 మందికి 10 రోజులు, 15 మందికి 15 రోజుల నుంచి నెల, ముగ్గురికి రెండు నెలల 18 రోజులు, ఇద్దరికి మూడు నెలల జైలు శిక్షలు విధించారు. 2016లో 1165 మంది, 2017లో 3897 మంది, 2018లో ఇప్పటివరకు 2133 మంది మందుబాబులు పట్టుబడ్డారు, మరో 666 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటితోపాటు బహిరంగ మద్యపానం నిషేధం కఠినంగా అమలు చేస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా మూడు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. జిల్లాలో నేరాల నియంత్రణ, చేధన లక్ష్యంగా కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నేనుసైతం కార్యక్రమం ద్వారా కెమెరాలు బిగిస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల్లో నాలుగు మండలాలు పూర్తిస్థాయిలో సీసీ నీడలోకి వెళ్లాయి. మరో 7 మండలాల్లో ఈనెల చివరివరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా 3500 సీసీ కెమోరాల్లో కరీంనగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 250, టుటౌన్ పరిధిలో 359, త్రిటౌన్ పరిధిలో 353, కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో 172, కొత్తపల్లిలో 137 సీసీ కెమెరాలు ఉండగా మిగిలినవి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. లేక్ పోలీస్ అవుట్పోస్టు మానేరు డ్యాం, ఉజ్వల, డీర్ పార్క్ సమీపంలో గతంలో పలు అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోవడంతో ఎంపీ నిధులతో లేక్ పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు పెట్రోలింగ్ చేయడంతో పాటు సందర్శకులను పెంచేందుకు ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరంతరం ఇంటర్ సెప్టెర్ వాహనంతోపాటు బ్లూకోల్ట్స్ బృందాలు గస్తీ తిరిగే ఏర్పాటు చేశారు. షీటీం.. ప్రత్యేకంగా మహిళలు, విద్యార్థినులు భద్రత కోసం షీటీంను బలోపేతం చేశారు. వారికి అత్యాధునికమైన కెమెరాలు అందించి పోకిరీల భరతం పడుతున్నారు. 20 షీటీం బృందాలు సీఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 796 మందిని పోకిరీలను పట్టుకున్నారు. వారికి కౌన్సిలింగ్లు నిర్వహించి 48 వరకూ వివిధ రకాల కేసులు నమోదు చేశారు. పీడీ యాక్ట్ 2017 జనవరి 24న మొదటిసారి కమిషనరేట్ పరిధిలో పీడీ యాక్ట్ అమలు చేశారు. ఇప్పటివర కూ 42 మంది వివిధ రకాల నేరస్తులపై పీడీ యా క్ట్ అమలు చేశారు. వీరిలో ఇద్దరు రౌడీషీటర్లు, ఇద్ద రు నకిలీ నక్సలైట్లు, దృష్టి మళ్లించే నేరాలకు పాల్పడేవారు ముగ్గురు, ౖఫైనాన్స్ వ్యాపారంలో మోసం చేసినవారు ఒకరు, దోపిడి దొంగతనాలకు పాల్పడిన 34 మందిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. ఎన్నో కార్యక్రమాలు కమిషనరేట్ పరిధిలో పలు నూతన కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏదైనా నేర సంఘటన జరిగిన 5 నిమిషాల్లో చెరుకునేలా బ్లూకోల్ట్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశంతో అందరికీ శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నేరస్తుల సమాచారాన్ని వెంటనే నిక్షిప్తం చేసేలా సీసీటీఎన్ఎస్ అనుసంధానం చేశారు. హరితహరం కార్యక్రమంలో భాగంగా 25 వేల మొక్కలను నాటి చేసి వాటిని సంరక్షిస్తున్నారు. ఫిర్యాదుదారులకు వారి పిర్యాదులపై సమాచారాన్ని అందించేందుకు ప్రతి నెల 10వ తేదీన ఫీడ్బ్యాక్ డే నిర్వహిస్తున్నారు. ఈ ఫీడ్బ్యాక్ డే సమర్థవంతంగా అమలు చేయడంతో రాష్టŠల్రంలోనే ద్వితీయ స్థానం పొందింది. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ–పోలీస్ విధానం దేశంలోనే మొదటిసారిగా ఈ–పోలీస్ విదానాన్ని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో ఈనెల 18న సీపీ కమలాసన్రెడ్డి ప్రారంభించారు. నిలబడి ఉన్న ఓ పోలీస్రూపం ప్రజలకు అభివాదం చేస్తున్నట్లు ఉంటుంది. దీనిలో రహస్య కెమెరా బిగించి ఉండడం వల్ల బస్టాండ్లో జరిగే అసాంఘిక, అక్రమ కార్యకలాపాలు, పోకిరీ చేష్టలు, అనుమానిత వ్యక్తుల కదలికలు నిరంతరం రికార్డ్ అవుతూ ఉంటాయి. ఈ కెమెరా పోలీస్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయడం వల్ల ప్రతి కదలికలనూ కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలిస్తుంటారు. అనుమానిత వస్తువు, వ్యక్తులు కనిపించినప్పుడు బస్టాండ్లో ఉండే సిబ్బందిని అలర్ట్ చేస్తారు. ప్రయాణంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు డయల్ 100కు ఫిర్యాదు చేయాలని ఈ పోలీస్ సూచిస్తుంది. -
జీపీఎస్ గుప్పిట్లో గస్తీ కార్లు
నగర పోలీసు కమిషనరేట్లో మరో కొత్త అధ్యాయానికి తెర మొబైల్ పెట్రోలింగ్ కార్లకు జీపీఎస్తో అనుసంధానం పంజగుట్ట, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ ఠాణాల నుంచి షురూ ఏదైనా అనుకోని ఘటనపై సమాచారం అందిన వెంటనే పెట్రోలింగ్ వాహనం ఘటనా స్థలానికి ఎంత సమయంలో చేరకుంది? డ్రైవర్, సిబ్బంది కానీ ఏమైనా ఆలస్యం చేశారా? తదితర విషయాలు పోలీసు కంట్రోల్ రూంలోని అధికారులకు గతంలో తెలిసేవి కావు. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. జీపీఎస్ అనుసంధానంతో గస్తీ వాహనం ఎప్పుడు ఎక్కడ ఉంది? ఏఏ రూట్లో ఏం వేగంతో వెళ్తోంది తదితర వివరాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. సిటీబ్యూరో: నగర పోలీస్ కమిషనరేట్ మరో కొత్త అంకానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు మొబైల్ పెట్రోలింగ్ కార్లకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్)తో అనుసంధానం చేసింది. తొలిసారిగా పంజగుట్ట, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ వాహనాలకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. గత ఆగస్టులో జంట కమిషనరేట్లకు ప్రభుత్వం 1600 ఇన్నోవా కార్లు అందజేయగా, వాటిలో 124 నగరంలోని ఠాణాలకు పెట్రోలింగ్కు కేటాయించిన విషయం తెలిసిందే. గస్తీ వాహనాలను జీపీఎస్ విధానంలోకి తీసుకొస్తామని అప్పట్లో కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ప్రకటించగా, దీనిని అమలుకు సాంకేతిక నిపుణులు, ఐటీ సెల్ అధికారులు మూడు నెలలు శ్రమించారు. ప్రయోగాత్మకంగా మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో అమలు చేస్తున్నారు. త్వరలో నగరంలోని అన్ని ఠాణాలకు విస్తరిస్తారు. ఈ విధానం ఆపదలో ఉన్నవారికి పోలీసు సేవలు మరింత త్వరగా అందేందుకు ఉపకరిస్తుంది. ఇలా పనిచేస్తుంది... వాహనంలో వెహికిల్ ట్రాకింగ్ డివైస్ (వీటీడీ) అమర్చుతారు. ఈ పరికరం సిమ్ కార్డు రూపంలో ఉంటుంది. దీనికి కేటాయించిన ఐడీ నంబర్ను జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సర్వర్కు లింక్ చేస్తారు. కంప్యూటర్ స్క్రీన్ పై వాహన కదలికలను గమనిస్తారు. స్క్రీన్ పై ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల కార్లు కనిపించేలా డిజైన్ చేశారు. ఎరుపు రంగు కారు కనిపిస్తే ఆ వాహనం ఇంజన్ ఆఫ్లో ఉన్నట్లుగా, పసుపు రంగు కారు కనిపిస్తే వాహనం ఇంజన్ ఆన్లో ఉన్నట్లుగా, ఆకుపచ్చ రంగు కనిపిస్తే వాహనం రన్నింగ్లో ఉన్నట్లుగా గుర్తిస్తారు. స్క్రీన్ పై ఉన్న కారు బొమ్మను క్లిక్ చేస్తే ఆ వాహనం ఎంత వేగంతో వెళ్తోంది, ఎక్కడ పార్క్ చేసి ఉందో ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాకుండా గస్తీ వాహనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏఏ రూట్లో తిరిగింది. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది. ఎక్కడ ఎంత సేపు ఆగింది పూర్తి డేటా సర్వర్లో నమోదు అవుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement