-
పొదుపు డిపాజిట్ స్వాహా?
ఆమదాలవలస/రూరల్:పట్టణంలోని ఆంధ్రా బ్యాంకు ఎదుట డ్వాక్రా సం ఘాల సభ్యులు ఆందోళన చేశారు. డ్వాక్రా సంఘాల పొ దుపు డిపాజిట్ డబ్బులను వెలుగు సీఎఫ్(కమ్యూనిటీ ఫెసిలిటేటర్) ఉమాదేవి స్వాహా చేసినట్టు ఆరోపించా రు. ఏపీఎంను, బ్యాంకు అధికారులను నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సరుబుజ్జిలి మండలం డకరవలస పంచాయతీ పరిధి డకరవలస, సుభద్రాపురం, సూర్యనారాయణపురం గ్రామాల్లో 18 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు ఆమదాలవలస పట్టణంలో మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఆంధ్రా బ్యాంకులో పొదుపు డిపాజిట్, వెలుగు రుణాలు వంటివి లావాదేవీలు జరుగుతుండేవి. డకరవలస పంచాయతీ ఆంధ్రా బ్యాంకుకు దత్తత గ్రామం కావడంతో మండలం వేరొకటి అయినా బ్యాంకు రుణాలు మాత్రం ఈ బ్యాంకులోనే పొందాలి. ఈ లావాదేవీలు జరుగుతున్న క్రమంలో 18 డ్వాక్రా సంఘాలకు చెందిన పొదుపు డిపాజిట్ సొమ్ము స్వాహా చేశారు. ఒక్కొక్క సంఘం నుంచి రూ. 7,200 చొప్పున మొత్తం రూ. 1,29,600 స్వాహా జరిగినట్టు డ్వాక్రా సంఘాల అధ్యక్షులు సైలాడ శారదమ్మ, చింతాడ రూపావతి, కొల్ల రమణమ్మ, కొల్ల సుగుణమ్మ, బెవర జ్యోతి, కొల్ల కరుణమ్మతో పాటు మరికొంత మంది సభ్యులు ఆరోపించారు. ఎటువంటి తీర్మానాలు లేకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి మా డిపాజిట్ సొమ్మును స్వాహా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘాల తీర్మానాలు చేయకుండానే సొమ్ములు ఎలా మాయం చేశారని బ్యాం కు అధికారులను నిలదీయడంతో బ్యాంకు మేనేజర్ వి.సురేష్రాజు స్పందిస్తూ పొదుపు డిపాజిట్ ఎవరూ స్వాహా చేయలేదన్నారు. ఆ సొమ్మును మీ సంతకాలతో ఉన్న విత్డ్రా ఫారమ్లు సీఎఫ్ మాకు అందించడంతో స్త్రీనిధి ద్వారా సమృద్ధి పథకానికి చెల్లించినట్టు తెలిపారు. ఎవరి అనుమతులు, సంతకాలు చేయకుండానే సంఘాల సొమ్మును వేరొక పథకానికి ఎలా జమ చేస్తారని సభ్యులు బ్యాంకులో గట్టిగా కేకలు వేయడంతో బ్యాంకు మేనేజర్ సరుబుజ్జిలి ఏపీఎం ఎం.కూర్మారావుకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. బ్యాంకుకు చేరుకున్న ఏపీఎంను సంఘాల సభ్యులు నిలదీశారు. సీఎఫ్ సొమ్మును స్వాహా చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి బ్యాంకుకు చేరుకుని సంఘాల సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పొదుపు డిపాజిట్ సొమ్ము సంఘాల సభ్యులకు తెలియకుండా విత్డ్రా చేసిన విధానంపై దర్యాప్తు చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో పాటు సొమ్ములను తిరిగి సంఘాల సభ్యులకు చెల్లిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. -
రుణమాఫీపై మహిళల కన్నెర్ర
* సీఎఫ్ను నిలదీసిన డ్వాక్రా సంఘాల సభ్యులు * మాఫీ సొమ్ము ఖాతాలో వేసేవరకూ సంతకాలు చేయబోమని స్పష్టీకరణ సూర్యమణిపురం(వజ్రపుకొత్తూరు): డ్వాక్రా రుణమాఫీపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ పంచాయతీ సూర్యమణిపురం గ్రామ స్వయంసహాయక సంఘాల మహిళలు కన్నెర్ర చేశారు. మాఫీ మాయాజాలంపై కమ్యూనిటీ ఫెసిలిటేటర్(సీఎఫ్)ను నిలదీశారు. పంచాయతీకి చెందిన సీఎఫ్ బి.ఉమ ఆదివారం సూర్యమణిపురం గ్రామానికొచ్చి స్వయంసహాయక సంఘానికి ఇచ్చే పెట్టుబడి నిధి పత్రాన్ని సభ్యులకు చదివి వినిపించి సంతకాలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ అగస్థీశ్వర, పార్వతి, ఉషోదయ, వెంకటేశ్వర స్వయంసహాయక సంఘాలకు చెందిన 40 మంది మహిళలు ఆమెను చుట్టుముట్టారు. మాఫీ సొమ్ము ఖాతాలో వేసేవరకూ సంతకాలు చేసేది లేదని కుండబద్దలు కొట్టారు. మాఫీ మాయలో మరోసారి తమను బలిపశువులు చేసి సంతకాలు తీసుకోవద్దని, రుణమాఫీని పూర్తిస్థాయిలో తమ ఖాతాలకు జమ చేస్తేనే సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. రూ.1.50 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేడు రూ.3 వేలు కూడా ఖాతాలకు జమ చేయకుండా తమను వంచనకు గురిచేసి సంతకాలు తీసుకోమని పంపించాడా? అంటూ ఆమెను నిలదీశారు. ఈ సందర్భంగా పైల ఎర్రమ్మ అనే డ్వాక్రా మహిళ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు 60 ఏళ్లని, తామంతా రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్నామని చెప్పింది. రుణమాఫీ సొమ్మంతా ఒకేసారి ఖాతాలో వేయకుండా తాము తనువు చాలించాక వేస్తారా? అంటూ మండిపడింది. చంద్రబాబు మాటలకు మోసపోయామని, స్వయంసహాయక సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ కోనేరు అనసూయ, పల్లి అనురాధ, డి.ఆరుద్ర, జి.రాజేశ్వరి తదితర మహిళలు మండిపడ్డారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement