-
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ప్రతిఒక్కరికీ కన్ఫర్మ్డ్ టికెట్!
రద్దీ రైళ్లతో విసిగిపోయిన ప్రయాణికులకు శుభవార్త ఇది. 2027 నాటికల్లా ప్రతి రైలు ప్రయాణికుడికి కన్ఫర్మ్డ్ టికెట్ లభించనుంది. ఈ మేరకు రైళ్ల సంఖ్యను పెంచుతూ విస్తృత విస్తరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ వార్తా సంస్థ ఎన్డీటీవీ పేర్కొంది. దీపావళి పండుగ సందర్భంగా ఇటీవల ప్రయాణికులతో రద్దీగా మారిన ప్లాట్ఫామ్లు, రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల చిత్రాలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఛత్ పండుగ కోసం బిహార్ వెళ్లే రైలు ఎక్కే ప్రయత్నంలో 40 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ విస్తరణ ప్రణాళికలు చేపట్టనుండటం కోట్లాది మంది ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం. కొత్త రైళ్లు, ట్రాక్ల నిర్మాణం ఈ విస్తరణ ప్రణాళిక కింద ఏటా 4,000-5,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం జరుగనుంది. ప్రస్తుతం రోజుకు 10,748 రైళ్లు నడుస్తుండగా ఈ సంఖ్యను 13,000కు పెంచాలన్న ఈ ప్రణాళిక లక్ష్యంగా తెలుస్తోంది. రాబోయే మూడు నాలుగేళ్లలో 3,000 కొత్త రైళ్లను ట్రాక్లపైకి తీసుకురావాలనేది ప్రణాళిక అని రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే ఏటా 800 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుండగా ఈ సామర్థ్యాన్ని 1,000 కోట్లకు పెంచాలనేది కూడా విస్తరణ ప్రణాళికలో భాగం. ప్రయాణ సమయం తగ్గింపుపై దృష్టి ఇక రైళ్ల ప్రయాణ సమయాన్ని తగ్గించడంపైనా రైల్వే శాఖ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా మరిన్ని ట్రాక్ల నిర్మాణం, వేగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోనుంది. రైల్వే శాఖ అధ్యయనం ప్రకారం, ఢిల్లీ నుంచి కోల్కతాకు ప్రయాణంలో త్వరణం, వేగాన్ని పెంచితే రెండు గంటల ఇరవై నిమిషాలు ఆదా అవుతాయి. పుష్ అండ్ పుల్ టెక్నిక్ త్వరణం, వేగాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఏటా దాదాపు 225 రైళ్లు తయారవుతుండగా వీటిలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లలో యాక్సిలరేషన్, డీసిలరేషన్ సామర్థ్యం సాధారణ రైళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. -
ఆ రైళ్లలో నో వెయిటింగ్ లిస్ట్
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఇక వెయిటింగ్ లిస్టు కష్టాలు తప్పనున్నాయి. సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీకి రైల్వేశాఖ ఉద్వాసన పలికింది. ఇప్పటివరకూ... చాంతాడంత వెయిటింగ్ లిస్టు... చార్ట్ సన్నద్ధమయ్యే వరకూ ఉత్కంఠగా ఎదురుచూపు... చివరకు బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే చేసేది లేక ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే 'వికల్ప్' పథకాన్ని తొలిసారిగా అందుబాటులోకి తెస్తోంది. సువిధ రైళ్లలో కేవలం ఆర్ఏసీ టికెట్లను మాత్రమే ఇవ్వనుంది. ఈ విధానం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతోపాటు, తత్కాల్ టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులకు రీఫండ్ విషయంలో కూడా నిబంధనలను మార్పు చేసింది. అలాగే తత్కాల్ టికెట్లను రద్దు చేసుకునే ప్రయాణికులు కొత్త విధానం ద్వారా టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు. ఇంతకుముందు తత్కాల్ టికెట్లు రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి వచ్చేది కాదు. తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కొంతమేరకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక తత్కాల్ టికెట్ల జారీ సమయంలో కూడా రైల్వేశాఖ మార్పులు చేసింది. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కేవలం ఏసీ కోచ్ తత్కాల్ టికెట్లకు, స్లీపర్ కోచ్ అయితే 11 నుంచి 12 గంటల సమయంలో టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే వచ్చే నెల నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేయనుంది. ఈ రైళ్లలో పేపర్ లెస్ టికెట్ విధానం అమల్లోకి రానుంది. మొబైల్ టికెట్లను అనుమతించనుంది. అలాగే రైల్వే టికెట్ బుకింగ్ వెబ్సైట్ను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది.
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
Advertisement