-
ఐపీవోకు జెమినీ వంట నూనెలు
హైదరాబాద్: వంట నూనెల తయారీ సంస్థ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతిని కోరుతూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్లతోపాటు.. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు సైతం వాటాలను విక్రయానికి ఉంచనున్నట్లు జెమినీ ఎడిబుల్స్ తెలియజేసింది. ప్రదీప్ చౌధరి రూ. 25 కోట్లు, అల్కా చౌధరి రూ. 225 కోట్లు, గోల్డెన్ ఆగ్రి ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ రూ. 750 కోట్లు, బ్లాక్ రివర్ ఫుడ్ 2పీటీఈ రూ. 1,250 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ పీటీఈ రూ. 250 కోట్లు చొప్పున ఈక్విటీని ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. వాటాల వివరాలిలా ప్రస్తుతం జెమినీ ఎడిబుల్స్లో గోల్డెన్ అగ్రికి 56.27 శాతం, అల్కా చౌధరికి 11.56 శాతం, బ్లాక్ రివర్ ఫుడ్కు 25 శాతం, ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్కు 6.6 శాతం, ప్రదీప్కు 0.57 శాతం చొప్పున వాటా ఉంది. ఫ్రీడమ్ బ్రాండ్తో జెమినీ ఎడిబుల్స్ వంట నూనెలు విక్రయించే సంగతి తెలిసిందే. వంట నూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్ తయారీ, పంపిణీ, బ్రాండింగ్ను కంపెనీ నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈక్విటీ షేర్లను లిస్టింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. కాగా.. ఇటీవలే ఫార్చూన్, ఆధార్ బ్రాండ్ వంట నూనెల దిగ్గజం అదానీ విల్మర్ సైతం సెబీకి ఐపీఓ కోసం దరఖాస్తు చేయడం గమనార్హం! -
గగన్పహాడ్ ఆయిల్ పరిశ్రమలో ప్రమాదం
ముగ్గురి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం హైదరాబాద్ : వంట నూనె తయారీ పరిశ్రమలో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్పహాడ్లోని గోవర్ధన్ ఆయిల్ తయారీ పరిశ్రమలో మద్దెల యాదవ్(30), మాధవ్(28), సురేష్ (28), సుజాదుద్దీన్, సంజయ్కుమార్ కార్మికులుగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం నూనె తయారీ పైపుల అడుగు భాగంలో ఉన్న హౌజ్లోని వ్యర్థాలను తొలగించేందుకు వీరు వెళ్లారు. ఈ సమయంలో అందులోని విషవాయువు కారణంగా స్పృహ కోల్పోయారు. విషయాన్ని గమనించిన ఇతర కార్మికులు వారిని శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా మద్దూరు మండలం చిన్న ఎక్కులారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు యాదవ్, మాధవ్లతోపాటు బీహార్కు చెందిన సురేష్లు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముస్తఫానగర్కు చెందిన సుజాదుద్దీన్, బీహార్కు చెందిన సంజయ్కుమార్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ ఏసీపీ సుదర్శన్, సీఐ సుధాకర్లు పరిశ్రమలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిశ్రమ యాజమాన్యం అందుబాటులో లేదు. కార్మికుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కార్మికులు మృతిచెందినా యజమానులెవరూ అక్కడకు రాకపోవడంపై మృతుల కుటుంబసభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement