-
నాకే ఎదురుచెప్తావా.. డీఎంకే నేత దాడిలో సైనికుడు మృతి
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార డీఎంకే పార్టీకి చెందిన కౌన్సిలర్ రెచ్చిపోయాడు. భారత ఆర్మీకి చెందిన సైనికుడిపై దాడి చేయడంతో గాయపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనలో డీఎంకే కౌన్సిలర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మృతుడి సోదరుడు కూడా సైనికుడే కావడంతో కౌన్సిలర్పై చర్యలు తీసుకునే వారకు తాను విధుల్లో చేరనని తెగేసి చెప్పాడు. వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన భారత ఆర్మీ సైనికుడు ప్రభు, అతడి అన్ని ప్రభాకర్.. ఫిబ్రవరి 8వ తేదీన పోచంపల్లిలో ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద బట్టలు ఉతికారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి.. వారితో వాదనకు దిగారు. ఇక్కడ బట్టలు ఎందుకు వాష్ చేస్తున్నావ్ అంటూ వారిద్దర్నీ ప్రశ్నించారు. దీంతో, వారి మధ్య వాదనలు పెరిగాయి. అయితే, ఇదే సమయంలో కొందరు వ్యక్తులు.. అక్కడే కార్లు వాష్ చేయడం, మరో ఇద్దరూ కూడా బట్టలు వాష్ చేస్తున్నారు. అయినప్పటికీ చిన్నస్వామి.. వీరిద్దరితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభు బద్రర్స్తో దురుసుగా మాట్లాడుతూ.. మీరు సైనికులు కావొచ్చు కానీ.. నన్ను మీరు ఏమీ చేయలేరని వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం.. ఆగ్రహానికి లోనైన చిన్నస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదే రోజు రాత్రి కౌన్సిలర్ చిన్నస్వామి, అతడి అనుచరులు కలిసి ప్రభు ఇంటిపై దాడి చేశారు. ప్రభు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా.. చిన్నస్వామి తన అనుచరులతో వారిపై కత్తితో దాడికి దిగాడు. ప్రభును రక్షించే క్రమంలో కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. అయితే, ప్రభు తలపై కత్తితో వేటువేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, అతడిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ఈ క్రమంలో గాయాల కారణంగా ఆరోగ్యం విషమించి ప్రభు.. మంగళవారం అకాల మరణం చెందాడు. కాగా, ప్రభు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. కౌన్సిలర్ చిన్నస్వామిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగానే మరో సైనికుడు ప్రభాకర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన అన్నను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు తాను విధుల్లోకి వెళ్లే ప్రసక్తిలేదని తెలిపారు. న్యాయం కోసం డిమాండ్ చేశాడు. -
120మంది బీజేపీ కౌన్సిలర్లు అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఉదయం 120మంది బీజేపీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పారశుద్ధ్య కార్మికులకు వెంటనే జీత భత్యాలు చెల్లించాలనే డిమాండ్తో కేజ్రీవాల్ నివాసం ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సుభాష్ ఆర్యా అనే బీజేపీ సీనియర్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ ధర్నా చోటు చేసుకుంది. ఫోర్త్ ఢిల్లీ ఫైనాన్స్ కమిషన్(ఎఫ్డీఎఫ్సీ) నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని నినాదాలు చేస్తూ వారు ఆందోళనకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురి మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బలవంతంగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
Advertisement