-
స్వామికార్యం... స్వకార్యం...
ఏ ముహుర్తాన ఎవరికి వచ్చిన ఆలోచనోగానీ... సచిన్, షేన్వార్న్ కలిసి అమెరికాలో నిర్వహించిన క్రికెట్ ఆల్స్టార్స్ సిరీస్ సూపర్ హిట్ అయింది. అమెరికాలో క్రికెట్ను అభివృద్ధి చేయడమనే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు చెబుతున్నా... ఆర్థికంగా కూడా ఈ లీగ్ కాసుల వర్షం కురిపించింది. దీంతో స్వామికార్యం... స్వకార్యం.. రెండూ నెరవేరాయి. క్రికెట్ ఆల్స్టార్స్ సిరీస్ సూపర్ హిట్ సాక్షి క్రీడావిభాగం: ఇంతకాలం క్రికెట్ ప్రధానంగా కామన్వెల్త్ దేశాలలోనే ఆదరణ పొందింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలకూ ఈ ఆటను విస్తరించడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకూ ఎంతో కొంత ఆటను తీసుకెళ్లగలిగారు. అయితే ఏ దేశంలోనూ ఈ ఆటకు ప్రాముఖ్యతను పెంచలేకపోయారు. అసోసియేట్, అఫిలియేట్ సభ్యులుగా ఈ దేశాలన్నింటికీ ఐసీసీలో స్థానం కల్పించి, బాగానే నిధులూ ఇస్తున్నారు. అయినా దీనిని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ ఈ మూడు దేశాలూ ప్రస్తుతం క్రికెట్కు ప్రధాన ఆధారం. ఈ జాబితాలో చైనా, అమెరికా చేరితే ఆట మరింత విసృ్తతమవుతుంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఐసీసీ ఉన్న సమయంలో సచిన్, షేన్వార్న్ ఓ కొత్త ప్రతిపాదనతో ఐసీసీ దగ్గరకు వెళ్లారు. ఇంగ్లండ్లో బీజం గత ఏడాది లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లను కలిపి రెండు జట్లుగా తయారు చేసి మ్యాచ్ నిర్వహించారు. అందులో ఆడిన మాజీలు బాగా ఉత్సాహంగా కనిపించారు. దీంతో మాజీలతో లీగ్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన సచిన్, వార్న్లకు వచ్చింది. వెంటనే దీని గురించి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి దేశంలోనూ ఓ లీగ్ ఉన్నందున... అమెరికాలాంటి ప్రదేశంలో మ్యాచ్లు ఆడితే బాగుంటుందని భావించారు. అయితే ఆటకు ఆదరణ లేని చోట ఇంత మంది స్టార్లతో వెళ్లి ఆడటం కూడా అంత సులభం కాదు. అమెరికా క్రికెట్ సంఘం ఇప్పటికే రకరకాల వివాదాల్లో ఉంది. అయినా ఈ దిగ్గజాలు మొండిగా ముందుకెళ్లారు. ఐసీసీని ఒప్పించడం వీరి తొలి విజయం. మౌలిక సదుపాయాలు లేనందున అక్కడి బేస్బాల్ స్టేడియాలలో మ్యాచ్లను నిర్వహించాలని భావించారు. మొత్తానికి నవంబరు 7 నుంచి 14 వరకు మూడు టి20 మ్యాచ్లు నిర్వహించారు. పిల్లలకు పాఠాలు అమెరికాలోని స్థానికులకు ఈ ఆటను ఏ మేరకు పరిచయం చేశారనేది ఇప్పుడే చెప్పలేం. అయితే అక్కడ వివిధ దశలలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులకు మాత్రం ఈ సిరీస్ వరంలా మారింది. అమెరికా తరఫున అన్ని దశలలో క్రికెట్ ఆడేవారంతా దిగ్గజాలతో కలిసి గడిపారు. చిన్న పిల్లలకు వార్న్, సచిన్ స్వయంగా ఆటలో మెళకువలు నేర్పించారు. ఈ సిరీస్ ద్వారా క్రికెట్కు సంబంధించి వారం రోజుల పాటు అమెరికాలో జరిగిన హడావుడి ఐసీసీలోనూ సంతోషం పెంచింది. న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజ్లో వార్న్, సచిన్ గంట మోగించడం సహా రకరకాల కార్యక్రమాలతో మీడియా దృష్టినీ ఆకర్షించగలిగారు. భారతీయులే లక్ష్యం నిజానికి ఈ టోర్నీ విజయవంతం అవుతుందనే నమ్మకం మొదటి నుంచీ ఉండటానికి కారణం అమెరికాలో భారీసంఖ్యలో స్థిరపడిన భారతీయులు. కరీబియన్ దీవుల్లో భారత్ ఏ మ్యాచ్ ఆడినా అమెరికా నుంచి భారీగా అభిమానులు వెళుతుంటారు. అక్కడ ప్రపంచకప్లు జరిగితే భారత్ ఆడే మ్యాచ్లకు సగం స్టేడియం అమెరికాలో ఉన్న భారతీయులతోనే నిండుతుంది. సచిన్ ఆడుతున్నాడంటే కచ్చితంగా భారతీయులు క్రికెట్ చూడటానికి వస్తారు. వాస్తవంలోనూ అదే జరిగింది. మ్యాచ్లు జరిగింది మూడు నగరాల్లోనే అయినా... పెద్ద దేశం అమెరికాలో ప్రతి మూల నుంచీ క్రికెట్ అభిమానులు మ్యాచ్లకు వచ్చారు. భారీగా ఆదాయం అమెరికాలో బేస్బాల్ చాలా పెద్ద ఆట. ఎక్కడ బేస్బాల్ మ్యాచ్ జరిగినా స్టేడియంలో ప్రేక్షకులు నిండిపోతారు. అయితే బేస్బాల్ మ్యాచ్కు కనిష్టంగా టిక్కెట్ ధర డాడ్జర్ స్టేడియంలో పై స్టాండ్లో 9 డాలర్లు (రూ. 593). కింది స్టాండ్లో గరిష్ట టిక్కెట్ ధర 50 డాలర్లు (రూ. 3,300). ఈ సిరీస్కు అదే స్టేడియంలో పైస్టాండ్లో టిక్కెట్ను 50 డాలర్లకు అమ్మారు. కింది స్టాండ్లో టిక్కెట్ను 175 డాలర్లకు (రూ. 11,600) అమ్మడం విశేషం. అయినా సరే అభిమానులు భారీగా వచ్చారు. మూడు మ్యాచ్లకు కలిపి లక్షమంది హాజరయ్యారని వార్న్ చెప్పాడు. ఇందులో కోటా టిక్కెట్లు, ఉచిత పాస్లు పోయినా కనీసం 50 వేల టిక్కెట్లు కొన్నారని అనుకున్నా... సగటున ఒక్కో టిక్కెట్ ధర 125 డాలర్లు అనుకుంటే... సుమారుగా 38 కోట్ల రూపాయలు టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం. ఇక ఈ సిరీస్ కోసం 9 కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరించాయి. వీటికి అదనంగా క్రికెటర్లతో కలిసి డిన్నర్లు ఏర్పాటు చేశారు. ప్రతి నగరంలో సుమారు 700 మంది దీనికి హాజరయ్యారు. వీటి ద్వారా సుమారు 25 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ ఈ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. వీటికి కూడా ప్రకటనలు బాగానే వచ్చాయి. టీవీ రైట్స్కు ఎంత మొత్తం లభించిందనేది బయటకు తెలియకపోయినా... కనీసం ఓ 20 కోట్ల రూపాయలైనా వస్తుంది. మొత్తం మీద ఆల్స్టార్స్ సిరీస్ ద్వారా 100 కోట్ల రూపాయలకు పైనే ఆదాయం వచ్చింది. స్టేడియాలు, టిక్కెట్లు, హోటల్స్, సెక్యూరిటీ ఇలా అనేక రకాల ఖర్చులు ఉంటాయి. అన్ని పోయినా కనీసం 50 కోట్ల రూపాయలైనా దీని ద్వారా లాభం వస్తుందని అంచనా. ఇందులో ఐసీసీకి 20 శాతం వాటా ఇచ్చినా సుమారు 40 కోట్లు ఇద్దరు దిగ్గజాలకు దక్కి ఉండాలి. క్రికెటర్లకూ లాభమే ఈ సిరీస్లో ఆడినందుకు ఒక్కో క్రికెటర్కు 20 లక్షల రూపాయలు చెల్లించారని సమాచారం. మొత్తం 30 మందికి కలిపి సుమారు 6 కోట్ల రూపాయలు ఆటగాళ్లకు దక్కాయి. ఇదే సమయంలో మాజీలందరికీ ఇదో పెద్ద పిక్నిక్లా కనిపించింది. దాదాపు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్లా వెళ్లారు. తాము ఆడే రోజుల్లో ఐపీఎల్ లేకపోవడం వల్ల ఈ మాజీలలో మెజారిటీ సభ్యులకు క్రికెట్ ద్వారా వచ్చే డబ్బు రుచి తెలియలేదు. వాళ్లందరికీ ఇప్పుడు డబ్బులు రావడంతో పాటు అమెరికాలో క్రికెట్ ఆడిన కొత్త అనుభవం కూడా లభించింది. -
బ్లాస్టర్స్ లెక్క సరి చేస్తారా!
వారియర్స్తో నేడు రెండో టి20 క్రికెట్ ఆల్స్టార్స్ సిరీస్ హోస్టన్: అమెరికాలోని క్రికెట్ అభిమానులు దిగ్గజాల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు మరో అవకాశం. ఆల్స్టార్స్ సిరీస్లో భాగంగా నేడు జరిగే రెండో టి20 మ్యాచ్లో సచిన్ బ్లాస్టర్స్ జట్టు వార్న్ వారియర్స్లో తలపడనుంది. తొలి మ్యాచ్లో ఓటమిపాలైన సచిన్ సేన సిరీస్లో నిలబడాలంటే ఈ మ్యాచ్లో నెగ్గడం తప్పనిసరి. మొదటి మ్యాచ్లాగే దీనికి కూడా స్థానిక బేస్బాల్ మైదానం వేదిక కానుంది. ఇక్కడి మినట్ మెయిడ్ పార్క్లో టి20 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్ తర్వాత వరుసగా క్రికెట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న వెటరన్లు రెండో మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యారు. సచిన్ జట్టులో అతనితో పాటు సెహ్వాగ్ మాత్రమే గత మ్యాచ్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్లో ఉన్న సెహ్వాగ్ తనదైన శైలిలో చెలరేగాడు. ఈ మ్యాచ్లో లక్ష్మణ్కు బదులుగా గంగూలీ బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్లో షోయబ్ అక్తర్, మురళీలలో కాస్త మెరుపు కనిపించింది. పదును లేని ఆంబ్రోస్ స్థానంలో మెక్గ్రాత్కు అవకాశం దక్కవచ్చు. ఇక వారియర్స్ కెప్టెన్ షేన్వార్న్ ఫుల్ జోష్తో ఫిట్గా బౌలింగ్ చేశాడు. వరల్డ్ కప్ కూడా ఆడిన వెటోరి వెటరన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక స్టార్స్ అందరిలోకి ఇటీవలి వరకు అంతర్జాతీయ క్రికెట్లో టచ్లో ఉన్న సంగక్కర అలవోక బ్యాటింగ్కు తోడు పాంటింగ్ చురుకుదనం వారియర్స్ను గెలిపించాయి. ఈ సారి కూడా అదే పునరావృతం అవుతుందేమో చూడాలి. వార్న్ జట్టు మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈసారీ హోరే... న్యూయార్క్లో జరిగిన తొలి మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. ఎవరూ ఊహించని విధంగా 35 వేల మంది మ్యాచ్కు రావడం ఐసీసీని కూడా ఆశ్చర్యపరిచింది. ఎక్కువ సంఖ్యలో భారతీయులు వచ్చినా... ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అభిమానులు కూడా వేలాదిగా వచ్చారు. మిగిలిన రెండు మ్యాచ్లు జరిగే హోస్టన్, లాస్ఏంజిల్స్లో కూడా చాలావరకు టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కాబట్టి ఈసారి కూడా స్టేడియం అభిమానులతో హోరెత్తనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం (రేపు) ఉదయం గం. 7. 30నుంచి స్టార్ స్పోర్ట్స్ 2లో ప్రత్యక్ష ప్రసారం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement