-
పంటల నిల్వకు 9,000 కొత్త గోదాములు
సాక్షి, అమరావతి: మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరో 9 వేల కొత్త గోదాములు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అనుబంధంగా పంటల్ని ఆరబెట్టుకునేందుకు వీలుగా ప్లాట్ఫామ్లు సైతం నిర్మించనుంది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖకు మండల, జిల్లా స్థాయిలో 1,055 గోదాములు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 9 లక్షల టన్నులు కాగా.. రైతు బంధు పథకానికి వినియోగించగా మిగిలే గోదాములను భారత ఆహార సంస్థ, పౌర సరఫరాల సంస్థ, ఇతర వ్యాపార సంస్థలకు మార్కెటింగ్ శాఖ అద్దెకు ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో పంటల సేకరణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పశువుల మేత, మందుల విక్రయాలు వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. వీటికి గోదాముల కొరత రాకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం గ్రీన్ సిగ్నల్ ► మార్కెటింగ్ శాఖపై గురువారం నిర్వహించిన సమీక్షలో కొత్త గోదాముల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ► మొత్తం రూ.4 వేల కోట్లతో గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మించడంతోపాటు వీటికి అనుబంధంగా సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ► వీటిలో ఒక్క గోదాముల నిర్మాణానికే రూ.3,150 కోట్లు వ్యయం కాగలదని అంచనా. ఇతర నిర్మాణాలు, యూనిట్ల ఏర్పాటుకు రూ.350 కోట్లు ఖర్చు కాగలదని అధికారులు అంచనా వేశారు. ► కొత్తగా నిర్మించే ఒక్కో గోదాము నిల్వ సామర్థ్యం 500 టన్నులు. తుపానులు, వర్షాలు కురిసిన సమయంలో పంటలు తడిచిపోకుండా ఉండేందుకు వీటిని వినియోగిస్తారు. ► అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వీటిని నిర్మిస్తుండటంతో రైతులెవరైనా ఎరువులకు పెద్ద మొత్తంలో ఆర్డరు ఇస్తే... వాటిని ఈ గోదాముల్లో నిల్వ ఉంచి పంపిణీ చేస్తారు. నిధుల సేకరణ, టెండర్లకు చర్యలు మార్కెటింగ్ శాఖను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. అవసరమైన నిధుల సేకరణ, టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంటల్ని ఆరబెట్టుకునే ప్లాట్ఫామ్తోపాటు 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో ఒక్కో గోడౌన్ నిర్మాణానికి రూ.35 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశాం. దశల వారీగా వీటిని నిర్మిస్తాం. సత్వరమే వీటిని నిర్మించే పనులను మా శాఖతోపాటు ఇతర ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించాలా, మా శాఖలోనే అదనపు డివిజన్ ఏర్పాటు చేయాలా అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నాం. – ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
పరిచయం లేని రైతు బంధు
పంట ఉత్పత్తుల నిల్వకు గోదాంల నిర్మాణం అవగాహన కల్పించని అధికారులు బయట ఆరబెట్టి నష్టపోతున్న రైతులు నర్సంపేట : రైతన్న రెక్కల కష్టం నీళ్ల పాలవుతోంది. పంట ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేందుకు వెళ్తే తేమ ఉందంటూ వ్యాపారులు సాకులు చెబుతున్నారు. దీంతో రోడ్లపై ఆరబెట్టి అకాల వర్షాలకు తడిసి నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకునేందుకు ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో గోదాంలు నిర్మించింది. అవసరం మేరకు వాటిలో నిల్వ చేసుకోవచ్చు. అరుుతే వాటిపై అవగాహన లేక రైతులు వినియోగించుకోలేకపోతున్నారు. ఆరుగాలం కష్టపడితే చేతికి వచ్చిన పంటను గత్యంతరం లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. రైతు బంధు పథకంపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫమైనట్లు ఆరోపణలు వస్తున్నారుు. రైతులను ఆదుకునే పథకం మార్కెట్కు తీసుకువచ్చిన పంట ఉత్పత్తులను తగిన ధర లభించని సమయంలో రైతులకు అండగా నిలిచేదే రైతు బంధు పథకం. ప్రచారం చేయడంలో, అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ పథకం కాగితాలకే పరిమితమవుతోంది. సీజన్కు ముందే రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడితేనే లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. రూరల్ జిల్లాలో పెద్ద మార్కెట్గా నర్సంపేటకు పేరుంది. ఇక్కడి మార్కెట్కు మహబూబాబాద్ జిల్లా రైతులు సైతం తమ ధాన్యాన్ని విక్రరుుంచుకోవడానికి తీసుకువస్తుంటారు. నర్సంపేట నియోజకవర్గం కింద పాకాల ఆయకట్టులో వేలాది ఎకరాల్లో పంటల సాగు అవుతుంటారుు. ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగు ఎక్కువగా అవుతోంది. దీంతో పాటు నర్సంపేట నియోజకవర్గంలోని రైతులు ధాన్యాన్ని ఎక్కువగా మార్కెట్కు తీసుకువస్తుంటారు. వరి ధాన్యం సీజన్ ప్రారంభం జిల్లాలో రబీలో సుమారు 35వేల 294 హెక్టార్ల విస్తీర్ణంలో పలు పంటలు పండించనున్నారు. ఖరీఫ్లో 70వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగయ్యారుు. ఇందులో రబీలో 13వేల 43 హెక్టార్లు, మొక్కజొన్న 15 వేల 50 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తుండగా ఖరీఫ్లో రెట్టింపు ఉంటుంది. రెండేళ్ల నుంచి ‘రైతు బంధు’ పథకం కింద రుణాలు ఇచ్చేందుకు గాను ప్రభుత్వం మార్కెట్కు రూ.10లక్షల నిధులు కూడా మంజూరు చేస్తోంది. ఇంతకుమించి రుణాలు తీసుకున్నా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ రెండేళ్ల నుంచి ఒక్క రైతు కూడా రైతు రుణబంధు కింద రుణం పొందలేదంటే పథకంపై రైతులకు ఏమేర అవగాహన ఉందో అర్థమవుతోంది. మరికొన్ని రోజుల్లో వరిధాన్యం మార్కెట్కు రావడం ప్రారంభమవుతుంది. ఇప్పటికై నా ఈ పథకంపై అవగాహన కల్పిస్తే రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. సీజన్ ప్రారంభానికి ముందే అవగాహన సదస్సులు నిర్వహించాలి. మార్కెటింగ్ శాఖలతోపాటు వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థారుులో పథకంపై రైతులను చైతన్యపర్చాలి. నర్సంపేట మార్కెట్లో భారీ గోదాంలు నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో 5వేల మెట్రిక్ టన్నుల గోదాం, 2వేల మెట్రిక్ టన్నుల గోదాం, వెరుు్య మెట్రిక్ టన్నుల గోదాంలు 3, ఆరు వందల మెట్రిక్ టన్నుల గోదాంలు రెండు ఉన్నారుు. ఇందులో మూడు ఎఫ్సీఐ వాడుకుంటుండగా మరో మూడు ప్రైవేట్ ట్రేడర్స్ వాడుకుంటున్నారు. వెరుు్య మెట్రిక్ టన్నుల గోదాం ఖాళీగా ఉంది. కానీ ఈ ఏడాది మొక్కజొన్న బయట ఆరబెట్టిన రైతులు వర్షాలకు ధాన్యం రాశులు కొట్టుకుపోగా భారీగా నష్టం వాటిల్లింది. రైతుల కోసం ఉన్న గోదాంల సమాచారం ఎవరికీ తెలియకపోవడంతో నిరుపయోగంగా మారింది. పథకం అమలు ఇలా.. మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తులను అమ్ముకొని నష్టపోకుండా కొంతకాలం సరుకులను గోదాముల్లో నిల్వ ఉంచుకొని ఆశించిన ధర వచ్చినప్పుడు అమ్ముకొని లాభం పొందేందుకు రైతుబంధు పథకం దోహదపడుతుంది. సరుకును 9నెలల పాటు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది. మొదటి ఆరు నెలలు ఉచితంగా, తర్వాత మూడు నెలలు 12శాతం వడ్డీ వసూలు చేస్తారు. పంట విలువలో గరిష్టంగా రూ.2లక్షలు మించకుండా 75శాతం రుణంగా వెంటనే పొందవచ్చు. ధరలు పెరిగిన సమయంలో సరుకు అమ్ముకొని లాభం పొందే అవకాశం ఉంటుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement