-
సేవా భోజ్ యోజన పథకం: జీఎస్టీ రిఫండ్
-
అన్నదానం చేస్తే జీఎస్టీ రిఫండ్
న్యూఢిల్లీ: అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘సేవా భోజ్ యోజన’గా పిలిచే ఈ పథకం ద్వారా ఆ సంస్థలకు కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ), సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. రెండేళ్ల పాటు రూ.325 కోట్ల వ్యయంతో సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని అమలుచేయనుంది. కనీసం ఐదేళ్లుగా పనిచేస్తూ నెలకు కనీసం 5 వేల మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలు తదితరాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హమైన సంస్థలు సాంస్కృతిక శాఖ వద్ద నమోదుచేసుకోవాలి. దర్పన్ పోర్టల్లో సమర్పించే దరఖాస్తులను సాంస్కృతిక శాఖ నియమించిన కమిటీ పరిశీలించి 4 వారాల్లో నిర్ణయం తీసుకుంటుంది. వాటి పనితీరుపై సంతృప్తి చెందితే గడువు ముగిశాక రిజిస్ట్రేషన్ను పునరుద్ధరిస్తారు. పాలక మండలి సభ్యులు, ధర్మకర్తలు, చైర్మన్లలో ఎవరైనా వైదొలగినా, కొత్తవారు నియమితులైన సంగతిని, అన్నదానం చేస్తున్న ప్రాంతాలలో మార్పు తదితర సమాచారాన్ని సాంస్కృతిక శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేసే బాధ్యత ఆ సంస్థపైనే ఉంటుంది. -
కళల బంగారులోకం!
గోల్డెన్ త్రెషోల్డ్.. ఒకప్పుడు ‘కవికోకిల’కు బంగారు వాకిలి. ఇప్పుడు కవిసంగమమ్, కవిపుంగవుల కవితా లోగిలి. సాంస్కృతిక వికాసానికి కేంద్రం. థియేటర్ ఆర్ట్స్కు వేదిక. కళాభిమానులకు నెలవు. ఇంకా చెప్పాలంటే.. అదో కొత్త ‘బంగారులోకం’! గోల్డెన్ త్రెషోల్డ్ నేపథ్యమిది. స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీనాయుడు తన 13వ ఏటనే 1300 లైన్ల ఇంగ్లిష్ కవితాఖండికను రాశారు. దాని పేరే గోల్డెన్ త్రెషోల్డ్. 1896లో లండన్లో, 1905లో హైదరాబాద్ అబిడ్స్లోని తన నివాసంలో ఆ కవితాఖండిక ఆవిష్కృతమైంది. అప్పటి నుంచి ఆమె నివాసం ‘గోల్డెన్ త్రెషోల్డ్’గా మారింది. మరిప్పుడు..! గోల్డెన్ త్రెషోల్డ్లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పురుడుపోసుకుంది. యూనివర్సిటీ గచ్చిబౌలికి తరలిన అనంతరం ‘సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్’ విభాగాన్ని ఇక్కడే నిర్వహిస్తున్నారు. లలిత కళలు, నృత్యం, రంగస్థల కళలు, మాస్ కమ్యూనికేషన్ కోర్సులను అభ్యసించే విద్యార్థినీవిద్యార్థులతో ఈ ఆవరణ నిత్యం ‘కళ’కళలాడుతోంది! కదిలే థియేటర్! వేర్లు స్థిరంగా ఉంటాయి. శాఖలు విస్తరిస్తాయి. ఈ సూత్రంతో పనిచేస్తోంది ‘థియేటర్ ఔట్రీచ్’. నగర సాంస్కృతిక వేదికగా గోల్డెన్ త్రెషోల్డ్కు గుర్తింపు తేవడంలో థియేటర్ ఆర్ట్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ అనంతకృష్ణన్ నేతృత్వంలోని టీం కృషి చేస్తోంది. ఇక్కడి రంగస్థల కళల శాఖలో చదువుకున్న అనేకమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా, నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా రూపొందారు. నేషనల్ థియేటర్ ఆఫ్ డ్రామాకు చెందిన వివిధ రాష్ట్రాల బృందాలు గోల్డెన్ త్రెషోల్డ్లో వర్క్షాప్లను నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలు ఇస్తున్నాయి. ఇక్కడ రూపొందించిన అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి, మిస్ మీనా, పతంజలి నాటకోత్సవం, అప్సా రెయిన్బో తదితర నాటికలను రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు తీసుకెళ్లారు! ఆయా ప్రాంతాలలోని కళాకారులను, కళాభిమానులను గోల్డెన్ త్రెషోల్డ్కు ఆహ్వానిస్తున్నారు. ఆరుబయలు రంగస్థలం, సమావేశ మందిరం, డాక్యుమెంటరీలు ప్రదర్శించేందుకు అనువైన హాల్ తదితర సౌకర్యాలను వివరిస్తున్నారు. ్టజ్ఛ్చ్టిట్ఛౌఠ్టట్ఛ్చఛిజి.ఛిౌఝ ద్వారా తమను సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు. కళల ‘సంగమమ్’ దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ఈ ఆవరణ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమానికి వేదిక అవుతోంది. ఫేస్బుక్లో దాదాపు మూడువేల మంది సభ్యులు, అంతకు రెట్టింపు సంఖ్యలో పాఠకులు గల కవిసంగమమ్ సంస్థ సభ్యులు ముఖాముఖి కలుసుకునేందుకు తెలుసుకునేందుకు వేదిక ‘గోల్డెన్ త్రెషోల్డ్’! నెలనెలా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కవులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పిట్టలుగా తామొస్తే చెట్టులా ‘గోల్డెన్ త్రెషోల్డ్’ ఆదరిస్తోందని కవిసంగమమ్ బాధ్యుడు యాకూబ్ కితాబునిచ్చారు! నాటకరంగం కోసం అంకితమై పృథ్వీ థియేటర్ (ముంబై) రంగశంకర (బెంగళూరు) శ్రీరామ్సెంటర్ (న్యూఢిల్లీ) తరహాలో గోల్డెన్ త్రెషోల్డ్ను ‘పెర్ఫార్మింగ్ ఆర్ట్’ కేంద్రంగా మలచాలని థియేటర్ ఔట్ రీచ్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పెద్ది రామారావు నేతృత్వంలోని రాజీవ్ వెలిచేటి, రాజీవ్ కృష్ణన్, విష్ణువర్ధన్, నస్రీన్, భాషా తదితరుల బృందం కృషి చేస్తోంది. పున్నా కృష్ణమూర్తి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement