-
కస్టమర్కు అనుకూలంగా సేవలు ఉండాలి
ముంబై: బ్యాంకులు కస్టమర్కు ప్రాధాన్యం ఇస్తూ, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్బీఐకి ప్యానెల్ సిఫారసు చేసింది. మరణించిన ఖాతాదారు వారసులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతించాలని, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్ తదితర సూచలను ప్యానెల్ చేసిన వాటిల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ను బ్యాంకుకు సంబంధించి ఏ శాఖలో అయినా, ఏ నెలలో అయినా సమర్పించేందుకు అనుమతించాలని, దీనివల్ల రద్దీని నివారించొచ్చని పేర్కొంది. ఆర్బీఐ నియంత్రణలోని సంస్థల పరిధిలో వినియోగదారు సేవా ప్రమాణాల సమీక్షపై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. గతేడాది మే నెలలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో అద్యక్షతన ఈ కమిటీని నియమించడం గమనార్హం. సూచనలు.. ఇంటి రుణాన్ని తీర్చివేసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తిరిగి రుణ గ్రహీతకు స్వాధీనం చేసే విషయంలో నిర్ధేశిత గడువు ఉండాలి. గడువులోగా ఇవ్వకపోతే బ్యాంక్/ఎన్బీఎఫ్సీపై జరిమానా విధించాలి. డాక్యుమెంట్లు నష్టపోతే, వాటిని తిరిగి పొందే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు అయ్యే వ్యయాలను బ్యాంకులే పెట్టుకోవాలి. కస్టమర్లకు సంబంధించి రిస్క్ కేటగిరీలను సూచించింది. వేతన జీవులు అయితే వారికి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, వారిని హై రిస్క్గా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులను తక్కువ రిస్క్ వారిగా కేటాయించొచ్చని సూచించింది. కస్టమర్లతో వ్యవహారాలు నిర్వహించే సిబ్బంది, వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా నిర్ణీత కాలానికోసారి తప్పనిసరి శిక్షణ పొందాలని కూడా పేర్కొంది. -
ఇదో కొత్తరకం కేఫ్... ఇంత వరకు ఎవ్వరూ చూసుండరు!
రెస్టారెంట్లో కస్టమర్లను ఆకట్టుకునేలా రెస్టారెంట్స్ని రకరకాలుగా అలంకరిస్తారు. అంతేకాదు కస్టమర్లకు కావల్సిన అన్నిరకాల సదుపాయాలను అందించేందకు విశేషంగా ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఒక రెస్టారెంట్ ఏకంగా ఎక్వేరియంలా చేసి కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. (చదవండి: ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!) అసలు విషయం ఏమిటంటే....ఒక రెస్టారెంట్ సరికొత్త ఆలోచనతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా రెస్టారెంట్ని మోకాలు లోతు వరకు నీటితో నింపి అందులో రకరకాల చేపలను ఉంచుతుంది. అందలోనే టేబుల్స్ వేసి కస్టమర్లను కూర్చోమంటూ ఆహ్వానిస్తుంది. అక్కడ అలా నీళ్లలోని రకరకాల రంగురంగుల చేపలను చూస్తూ అక్కడ వాళ్లు అందించే ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తినేలా తయారుచేసింది. పైగా ఆ రెస్టారెంట్ గోడపై "స్వీట్ ఫిష్ కేఫ్" అని బోర్డ్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి చూడండి. (చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను) -
ఎనీ టైం మోసం.. ఏటీఎంల వద్ద భద్రత కరువు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖాతాదారుల సౌకర్యం కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలకు చెందిన బ్యాంకులు ఏటీఎంలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో 27 బ్యాంకులకు గ్రామీణ ప్రాంతాల్లో 164, పట్టణ ప్రాంతాల్లో 95 శాఖలు ఉన్నాయి. అన్ని బ్యాంకుల పరిధిలో మొత్తంగా 163 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో బ్యాంకుల ఆవరణలో పనిచేస్తున్న వాటిని ఆన్ సైట్ ఏటీఎంలుగా(53 చోట్ల), మిగతా వాటిని ఆఫ్సైట్ ఏటీఎంలుగా పరిగణిస్తున్నారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్, హెచ్డీఎఫ్సీ, ఆంధ్రా బ్యాంకు ఆధ్వర్యంలో ఎక్కువ సంఖ్యలో ఏటీఎంలు నెలకొల్పారు. ఆన్సైట్ ఏటీఎంలలో పాక్షికంగా మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. పట్టణాల్లోని ఆఫ్సైట్, మారుమూల ప్రాంతాల్లోని ఆన్సైట్, ఆఫ్సైట్ ఏటీఎంలతో కనీస భద్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదు. 24 గంటల పాటు కాపలా ఉండాల్సిన చోట ఒకటి లేదా రెండు షిఫ్టుల్లో మాత్రం సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద భద్రత లేకపోవడంతో ఖాతాదారులు ఏ క్షణంలో ఏ ఉపద్రవం ఎదురవుతుందో తెలియక భయాందోళన నడుమ నగదు విత్డ్రా చేసుకోవాల్సి వస్తోంది. ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ పనిచేయడం లేదు. ఒకరొకరుగా వెళ్లాల్సిన ఖాతాదారులు మూకుమ్మడిగా ఏటీఎం వద్దకు వెళ్తున్నారు. దీంతో లావాదేవీల వివరాలు, పాస్వర్డ్ తదితరాలను రక్షించుకోవడం ఖాతాదారులకు ఇబ్బందిరకంగా తయారవుతోంది. సీసీ కెమెరాలు ఉన్నా సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే కోణంలో బ్యాంకు సిబ్బంది తనిఖీలు చేస్తున్న దాఖలా కనిపించడం లేదు. ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఏసీలు ఒకటి రెండుచోట్ల మినహా ఎక్కడా పనిచేయడం లేదు. దీంతో సాఫ్ట్వేర్ సమస్యలతో ఏటీఎంలలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అధికారులు ‘ఔటాఫ్ ఆర్డర్’ బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ లోపంతో ఏటీఎంలు చెత్త కుండీలను తలపిస్తున్నాయి. లావాదేవీలకు సంబంధించిన స్లిప్లతో చెత్తబుట్టలు నిండినా ఖాళీ చేయడం లేదు. దీంతో ఏటీఎంలు దోమలకు ఆవాసాలుగా మారాయి. వారాంతాలు, లావాదేవీలు ఎక్కువగా జరిగే నెల మొదటి, రెండు వారాల్లో నగదు నిండుకున్నా రోజుల తరబడి భర్తీ చేయడం లేదు. జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో వుండే ఏటీఎంలలో నగదు నిండుకోవడంతో తరచూ ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ బ్యాంకుల ఏటీఎంలలో త్వరితగతిన నగదు నిండుకోవడంతో ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను ఆశ్రయిస్తున్నారు. సర్వీస్ టాక్స్ పేరిట ప్రైవేటు బ్యాంకుల లావాదేవీలు ఖాతాదారులపై భారం వేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల్లోని ఏటీఎంలతో నగదు నిల్వలు లేకపోవడంతో ఖాతాదారులు వ్యయ, ప్రయాసలు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తం చేశాం ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత బ్యాంకులపైనే ఉంది. భద్రత చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే బ్యాంకర్లను అప్రమత్తం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాం. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నదీ లేదని తనిఖీలు చేసుకోవాల్సిందిగా సూచించాం. రాత్రి వేళల్లో ఏటీఎంలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా పోలీసు గస్తీ బృందాలకు ఆదేశాలు జారీ చేశాం. విజయ్ కుమార్, ఎస్పీ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement