-
సైబర్ వార్ మొదలైందా?
లండన్, ఇంగ్లండ్ : గ్లోబల్ సైబర్ దాడులపై అమెరికా, బ్రిటన్లు సోమవారం సంయుక్తంగా హెచ్చరికలు జారీ చేశాయి. దేశాల్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా రష్యా సైబర్ దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి. 2015లో మొదలైన ఈ సైబర్ అటాక్స్ మరింత విస్తృతమయ్యే ప్రమాదం ఉందని అన్నాయి. ఈ దాడుల్లో ప్రభుత్వ, వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించాయి. గతేడాది ‘నాట్పెట్యా’ అనే సైబర్ దాడిలో ఉక్రెయిన్ కకావికలమైన విషయం తెలిసిందే. కేవలం ఉక్రెయిన్కే పరిమితం కానీ ఈ దాడిలో మరికొన్ని దేశాలు కూడా నష్టాలను చవి చూశాయి. ఈ దాడులను కూడా రష్యానే ప్రోత్సహించిందని అమెరికా, బ్రిటన్లు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యా, సిరియా ప్రభుత్వ సేనలకు వ్యతిరేకంగా సిరియాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు దాడుల చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం బ్రిటన్ దేశంలో పెద్ద ఎత్తున హ్యాకింగ్ జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజా దాడులు సైబర్వార్కు తెరతీస్తాయనే భయాందోళనలు బ్రిటన్ వ్యాప్తంగా వ్యాపించాయి. సైబర్ అటాక్ జరిగిన తర్వాత ఎవరు? ఎక్కడి నుంచి ఆ దాడి చేశారన్న విషయాన్ని గుర్తించడం అసాధ్యంగా మారింది. దీంతో అసలు దోషులు ఎవరో తెలుసుకోలేక బాధిత దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కాగా, అమెరికా, బ్రిటన్ల హ్యాకింగ్ ఆరోపణలను రష్యా ఖండించింది. ఆయా దేశాలపై సైబర్ దాడికి ప్రోత్సహించామని అనడంలో వాస్తవం లేదని పేర్కొంది. కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం వెనుక రష్యా హస్తముందని అమెరికా ఇంటిలిజెన్స్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
భారత్, పాక్ మధ్య సైబర్ యుద్ధం
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సైబర్ యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ యుద్ధం చేసేదీ సైబర్ సైనికులు కాదు. అజ్ఞాత హ్యాకర్లు. వారు పాకిస్తాన్ ప్రభుత్వ వెబ్సైట్ను హ్యాక్ చేసి ‘జన గణ మన అధినాయక జయహే’ అనే జాతీయ గీతాన్ని పోస్ట్ చేశారు. మధ్యలో అశోకచక్రం కలిగిన త్రివర్ణ పతాకం గోడపై స్వాతంత్య్ర దినోత్సవ అభినందనలు కూడా పోస్ట్ చేశారు. ‘మానసిక స్వేచ్ఛ, హృదయాల్లో ఉప్పొంగుతున్న పరువు, ప్రతిష్టలు అందించిన మహనీయులకు ఇవే మా అభినందనులు’ అన్న పదాలను కూడా పోస్ట్ చేశారు. సకాలంలో పాకిస్తాన్ ఐటీ నిపుణులు స్పంధించి వెబ్సైట్ను పునురుద్ధరించారు. భారత జాతీయవాదులు తమ ప్రభుత్వ వెబ్సైట్ను హ్యాక్చేసినట్లు చెప్పారు. అయితే దీనిపై పాకిస్తాన్ విదేశాంగశాఖ స్పందించలేదు. ప్రతి ఏటా, ఆగస్టు వచ్చిందంటే భారత్, పాక్ దేశాల మధ్య హ్యాకర్ల ఈ తరహా యుద్ధం సహజమేనని, గతంలో పాకిస్తాన్ హ్యాకర్లు భారత ప్రభుత్వ వెబ్సైట్లను, పోర్టల్స్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యానాలను పోస్ట్ చేశారని ఇండియన్ సైబర్ ఆర్మీ డైరెక్టర్ కిస్లే చౌధరి తెలిపారు. ఎక్కడైనా, ఏ దేశంలోనైనా కీలకమైన సమాచారాన్ని తస్కరించేందుకు హ్యాకర్లు దాడులు చేస్తుంటారని, భారత్, పాక్ విషయంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేందుకే హ్యాకర్లు దాడులు చేస్తుంటారని చౌధరి వివరించారు. వీళ్లలో ఎక్కువ మంది స్కూలు, కాలేజీ విద్యార్థులే ఉంటారని మరొక సైబర్ నిపుణులు తెలిపారు. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబర్ దాడులు నిర్వహించడం సాధారణమేనని ఆయన కూడా చెప్పారు. అయితే కొన్ని సంఘటనలకు నిరసనగా భారత హ్యాకర్లు పాక్ వెబ్సైట్లను హ్యాక్ చేస్తుంటారని ఆయన తెలిపారు. భారత మాజీ నావికాదళాధికారి కుల్భూషన్ జాధవ్కు పాకిస్తాన్ మరణ శిక్ష విధించడాన్ని నిరసిస్తూ ఈ ఏడాది మొదట్లో 30 పాకిస్తాన్ ప్రభుత్వ వెబ్సైట్లను వారు హ్యాక్ చేశారని ఆయన వివరించారు. ఇక ఇప్పుడు పాక్ హ్యాకర్లు కూడా భారత్ వెబ్సైట్లపై ప్రతీకార దాడులకు దిగవచ్చని ఆయన హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement