-
'ఇద్దరు సీఎంలది ఆధిపత్యపోరు'
హైదరాబాద్: ప్రాంతీయ సెంటిమెంట్లకు ఛాంపియన్లమని పేరుతెచ్చుకునే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇష్టానుసారంగా ప్రకటనలు గుప్పిస్తున్నారని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఇద్దరు సీఎంల మధ్య ఆధిపత్యపోరు జరుగుతున్నదని, ఇది ఇరు రాష్ట్రాలకూ చేటు చేస్తుందన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన నిధుల కోసం టీపీసీసీ పోరాడుతుందని స్పష్టం చేశారు. -
'టీఆర్ఎస్ ఏ ముఖంతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది'
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తో పొత్తుకు ససేమిర అని ఇప్పడు బీజేపీతో పొత్తుకు యత్నిస్తోన్న టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబు నిప్పులు చెరిగారు. సోమవారం హైదరాబాద్లో శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఓడించేందుకు బీజేపీ యత్నించిందని ఆయన ఆరోపించారు. అలాంటి బీజేపీతో టీఆర్ఎస్ ఏ ముఖంతో పొత్తు పెట్టుకుంటుందంటూ ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలే టీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి... మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చిన జిల్లాకు చెందిన పెద్దపల్లి ఎంపీ వివేక్ చేరికపై తనకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నమ్మి తామంతా పని చేశామని... కానీ వివేక్ వంటి వారు కాంగ్రెస్పై నమ్మకం లేక పార్టీని విడిచి వెళ్లారన్నారు. వివేక్ మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తమ పార్టీ అధిష్టానానికి వివరిస్తామన్నారు. -
బంద్ విజయవంతం
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్బాబు నుంచి శాసనసభా వ్యవహారాలశాఖను మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. సీఎం కిరణ్ తీరుపై నిరసనలు వెల్లువెత్తాయి. ఊరూరా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కీలకదశకు చేరుకున్న తరుణంలో... ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సందర్భంగా శాఖ మార్పును తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఆకాంక్షను అవమానించేలా ముఖ్యమంత్రి వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ ముఖ్య నేతలు జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే బంద్లో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ తది తర నాయకులు బంద్ను పర్యవేక్షించారు. కార్యకర్తలు ఉదయం నుంచే బస్స్టేషన్ నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నగరంలో ఒకటి రెండు సంఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా జరిగింది. తెరిచిన ఉన్న ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని, జిలేబీ సెంటర్ను కార్యకర్తలు బలవంతంగా మూసివేసేందుకు ప్రయత్నిస్తూ సామగ్రి ఎత్తేయడంతో ఉద్రిక్తత నెల కొంది. పోలీసులు వచ్చి ఆందోళన సద్దుమణిగింపజేశారు. మిగతా పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లోనూ బంద్ ప్రభా వం కనిపించింది. జిల్లా అంతటా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరగలేదు. సినిమాహాళ్లు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించారు. దిష్టిబొమ్మల దహనం సీఎం తీరును నిరసిస్తూ అన్ని మండలాల్లో ఆయన దిష్టిబొమ్మల శవయాత్రలు, దహనాలు నిర్వహించారు. అనేక చోట్ల రాస్తారోకోలు చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నాయకులందరూ సీఎం తీరును ముక్త కంఠంతో ఖండించారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం దిష్టిబొమ్మ శవయాత్రలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు. మంత్రి సొంత నియోజకవర్గం మంథనిలో కాంగ్రెస్ నాయకులు 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. కాటారంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోగా సహచరులు అడ్డుకున్నారు. యైటింక్లయిన్కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించా రు. మంథని జేఎన్టీయూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. గొల్లపల్లి బస్టాండ్లో క్యారం ఆడుతూ నిరసన తెలిపారు. హుస్నాబాద్లో బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్ను ముట్టడించిన ఓయూ జేఏసీ
హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు స్థానచలనం కల్పించిన నేపథ్యంలో ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ను బుధవారం ఓయూ జేఏసీ ముట్టడించింది. సీఎంకు నిరసనగా ఓయూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓయూ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. కాగా, శ్రీధర్బాబును తొలగించడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర మంత్రులు సీఎం కిరణ్ కుమార్రెడ్డిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ ప్రాంతానికి చెందిన మంత్రులపై మొండివైఖరిని అవలంభిస్తున్నారని ఇప్పటికే కొందరు సీఎం పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు శాసన సభ వ్యవహారాలను తప్పించి, వాణిజ్య పన్నులు కేటాయించడం వారిలో మరింత ఆగ్రహన్ని పెంచింది. వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్ బాబుకు అప్పగించారు. అయితే వాణిజ్య శాఖను తీసుకునేందుకు తాను సిద్ధంగా లేనని శ్రీధర్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
‘సమైక్య’ ఊసే వద్దు
పీసీసీ చీఫ్కు స్పష్టం చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపీలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మంత్రివర్గ బృందానికీ (జీవోఎం) సమర్పించే నివేదికలో రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే ప్రస్తావనే తీసుకురావొద్దని తెలంగాణ మంత్రులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తెగేసి చెప్పారు. అయితే, విభజన వల్ల సీమాంధ్రలో తలెత్తే సమస్యలను ప్రస్తావిస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అవసరమైతే తాము కూడా అందుకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలోనూ సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు వ్యవహరించాలని, ఈ విషయంలో పార్టీ ప్రతినిధిగా పీసీసీ అధ్యక్షుడు వెళితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రుల నివాస ప్రాంగణంలో సోమవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్బాబు, రాంరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్కుమార్రెడ్డి, బసవరాజు సారయ్య, పి.సుదర్శన్రెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీలు పాల్వాయి గోవర్ధన్రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీమంత్రి షబ్బీర్అలీ, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు బొత్సతో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ నేతలంతా డిప్యూటీ సీఎం నివాసంలో సమావేశమై పీసీసీ చీఫ్కు, జీవోఎంకు సమర్పించాల్సిన నివేదికపై కసరత్తు చేశారు. అప్పుల్లో ఎక్కువ భారాన్ని తెలంగాణపై మోపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement