-
డీఏ ఫైలుపై సీఎం సంతకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు 5.99 శాతం కరువుభత్యం(డీఏ) ఇచ్చే ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సంతకం చేశారు. దీంతో ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. తెలంగాణలో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ వర్తిస్తుంది. కాగా, డీఏ పెంపుతో ప్రతిసంవత్సరం దాదాపు 900 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి. -
కరువు భత్యానికి ఆమోదం
-
కరువు భత్యానికి ఆమోదం
డీఏ ఇచ్చిన తొలి గవర్నర్గా నరసింహన్ రికార్డు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. వారు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కరువు భత్యం (డీఏ) చెల్లింపునకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఆమోదముద్ర వేశారు. అయితే ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించారు. కేంద్రం రెండు నెలల క్రితమే డీఏ ప్రకటించడం తెలిసిందే. జనవరి నుంచి జూన్ వరకు వర్తించే ఈ డీఏ చెల్లింపునకు ఆర్థిక శాఖ మొదట మోకాలడ్డినా, విభజన నేపథ్యంలో వేతనాలను వారం ముందుగానే చెల్లిస్తున్నందున డీఏను కూడా చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడం తెలిసిందే. ఆ తర్వాత ‘డీఏపై దయ తలుస్తారా?’ శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన వార్తను కూడా గవర్నర్ తెలుసుకున్నారు. ఆర్థిక శాఖ నుంచి వచ్చిన డీఏ ఫైలును పరిశీలించి ఆమోదముద్ర వేశారు. ఉద్యోగులకు డీఏ మంజూరు చేసిన తొలి గవర్నర్గా ఆయన రికార్డు సృష్టించారు. గవర్నర్ నుంచి ఆమోదముద్ర లభించడంతో ఉద్యోగులకు 8.56 శాతం డీఏ మంజూరైంది. దీనివల్ల ఖజానాపై నెలకు రూ.193 కోట్ల భారం పడనుంది. గవర్నర్ ఆమోదించిన ఫైలును ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్కు పంపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసినందున డీఏ పెంపును ఆయన కూడా నేడో రేపో అనుమతిస్తారని సమాచారం. ఆ వెంటనే డీఏ పెంపు ఉత్తర్వులు వెలువడతాయి. పెన్షన్దారుల హర్షం రాష్ట్రంలోని 10 లక్షల మంది పెన్షనర్లకు గవర్నర్ డీఏ మంజూరు చేయడం పట్ల పెన్షన్దారుల చర్చా వేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య హర్షం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వారికిది ఊరట కల్పిస్తుందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement