-
దాల్మియా భారత్ రిఫ్రాక్టరీస్ విక్రయం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ దాల్మియా భారత్కు చెందిన దేశీ రిఫ్రాక్టరీ బిజినెస్ను కొనుగోలు చేస్తున్నట్లు వియన్నా కంపెనీ ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా తాజాగా పేర్కొంది. దాల్మియా భారత్ రిఫ్రాక్టరీస్ లిమిటెడ్(డీబీఆర్ఎల్)కు చెందిన రిఫ్రాక్టరీ బిజినెస్ కొనుగోలుకి రూ. 1,708 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా సీఈవో స్టీఫెన్ బోర్గాస్ వెల్లడించారు. ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియాకు చెందిన షేర్ల మార్పిడి ద్వారా డీల్ను పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. డీబీఆర్ఎల్.. తమ బిజినెస్ను దాల్మియా ఓసీఎల్కు బదిలీ చేయనుంది. తదుపరి డీవోసీఎల్ పూర్తి ఈక్విటీని 27 మిలియన్ ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియా షేర్ల జారీ ద్వారా వియన్నా కంపెనీ సొంతం చేసుకోనుంది. ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియా షేరు జారీ ధర రూ. 632.50తో చూస్తే డీల్ విలువను 20.8 కోట్ల యూరోలు(సుమారు రూ. 1,708 కోట్లు)గా స్టీఫెన్ తెలియజేశారు. -
పాడి.. లాభాల దిగుబడి
ఉద్యోగస్తులమైతేనే అభివృద్ధి సాధ్యం అని చాలా మంది మహిళలు అనుకుంటారు... తమకు ఉద్యోగం చేసే పరిస్థితి లేదు కనుక.. ఇక జీవితం ఇంతే అని కొందరు భావిస్తుంటారు... అయితే చేయాలే గానీ ఎన్నో అవకాశాలు ఉన్నామని మరికొందరు నిరూపిస్తున్నారు... మూడో కోవకు చెందిన వారే మైలవరం మండల మహిళలు... పాడి పరిశ్రమను ఎంచుకుని కుటుంబాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నారు. మైలవరం : మండలంలోని మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు. తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందడుగు వేస్తున్నారు. పాడి పరిశ్రమను ఎంపిక చేసుకొని తద్వారా లబ్ధి పొందుతున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తమ జీవన మనుగడను అభివృద్ధి వైపు పయనింప చేయుటకు దాల్మియా సీయస్ఆర్, నాబార్డ్, ఏపీజీబీ దోహద పడుతున్నాయని వారు చెబుతున్నారు. దాదాపు 309 మంది మహిళలకు పాడి పరిశ్రమ ఏర్పాటు కోసం దాల్మియా సీయస్ఆర్.. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించి పంపిణీ చేసింది. నవాబుపేట గ్రామానికి చెందిన 175 మంది మహిళలకు రూ.లక్ష చొప్పున, దుగ్గనపల్లి గ్రామంలోని 38 మందికి రూ.50 వేలు, తలమంచిపట్నంలోని 40 మందికి రూ.15 వేలు, చిన్నకొమెర్ల గ్రామానికి చెందిన 60 మందికి రూ.50 వేలు, పెద్దకొమెర్లలోని ఐదుగురికి 60 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. దీంతో మహిళలు పాడి గేదెలను కొని తద్వారా జీవన మనుగడ సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా పాడిగేదెలు పెట్టుకొని వచ్చే డబ్బుతో ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా. దాల్మియా సీయస్ఆర్ సహకారంతో పాడి గేదెలను కొన్నాం. మేము బతుకుటకు ఓ దారిని చూపించిన దాల్మియా యాజమాన్యానికి ఎప్పు డూ రుణపడి ఉంటాం. మరికొన్ని రుణాలను ఇస్తే మరిన్ని గేదెలు కొని జీవనం సాగిస్తాం. – చీపాటి శాంతమ్మ, మహిళా రైతు, దుగ్గనపల్లె మహిళా సంఘాలుగా ఏర్పడ్డాం మా గ్రామంలో 34 మంది మహిళలం రైతు సంఘాలుగా ఏర్పడ్డాం. ఒక్కొక్క సంఘంలో ఐదుగురు మహిళా రైతులు ఉన్నారు. దాల్మియా సీయస్ఆర్ మహిళా సంఘాలకు పంపిణీ చేసిన ఆర్థిక సహకారంతో గేదెలను కొని తద్వారా జీవనం సాగిస్తున్నాం. – ఓబులమ్మ, మహిళా రైతు, నవాబుపేట జీవనోపాధుల పెంపుదలతోనే అభివృద్ధి ఆర్థిక సుస్థిరత్వం సాధించాలంటే జీవనోపాధుల పెంపుదల ద్వారానే సుసాధ్యం అవుతుంది. అందులో భాగంగానే దాల్మియా సీయస్ఆర్ ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు పాడి పరిశ్రమలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. మహిళలు సంఘటితంగా పాడిపరిశ్రమ ఏర్పాటు కోసం సుముఖత చూపారు. ఆయా బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందేటట్లు కృషి చేశాం. భవిష్యత్తులో ఇంకొన్ని కార్యక్రమాలు చేపడుతాం. – రాజశేఖర్రాజు, దాల్మియా సీయస్ఆర్ విభాగాధిపతి -
ఫిక్సింగ్ నియంత్రణకు ఐదు సూత్రాలు
కోల్కతా: ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే చాంపియన్స్ లీగ్ టి20లో అవినీతిని అరికట్టేందుకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు దాల్మియా సూచించిన ఐదు పాయింట్ల ప్రతిపాదనలను వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 1. ప్రతీ జట్టు వెంట ఉండే భద్రతా సిబ్బందితో పాటు అదనంగా అవినీతి వ్యతిరేక మరియు భద్రతా యూనిట్ అధికారి ఉండాలి. 2. డగ్ అవుట్, మ్యాచ్ అధికారుల ఏరియాలో ఇతరుల కదలికలను నిషేధించాలి. 3. ముఖ్యంగా టోర్నీ సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు బయటి వారి నుంచి ఎలాంటి బహుమతులను స్వీకరించరాదు. అలాంటివేమన్నా ఉంటే టోర్నీ ప్రారంభానికి 15 రోజుల ముందే ఆ బహుమతి విలువతో పాటు ఇచ్చిన వ్యక్తి గురించి కూడా వెల్లడించాల్సి ఉంటుంది. 4. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ మొబైల్ నంబర్లను ముందే బహిరంగపర్చాలి. ఆటగాళ్లకు వచ్చే కాల్స్ను హోటల్ ఎక్స్ఛేంజ్ ద్వారా టీమ్ మేనేజర్ రూఢి చేసుకుంటారు. 5. అవసరమనుకుంటే ఏసీఎస్యూ అధికారులు స్థానిక అధికారుల సహాయాన్ని తీసుకోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement