-
దాశరథి, కాళోజీలు ఏం చేశారని విగ్రహాలు?
హన్మకొండ చౌరస్తా/కోరుట్ల: దాశరథి, కాళోజీ నారాయణరావు తెలంగాణకు ఏం చేశారని వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రశ్నించారు. మాజీ మంత్రి సంగంరెడ్డి సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సభ మంగళవారం హన్మకొండలో పబ్లిక్గార్డెన్లో జరిగింది. ప్రజాగాయకుడు గద్దర్, విమలక్కతో కలసి కంచ ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం 1969లో జరిగిన ఉద్యమంలో సంగంరెడ్డి సత్యనారాయణ చురకైన పాత్ర పోషించార న్నారు. విగ్రహాలు పెట్టాలంటే పోరాట యోధులు కుమ్రం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సత్యనారాయణలవి ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం కొమురవెల్లి మల్లన్న అని.. తాము పులులను పూజించం, ప్రజలను మాత్రమే పూజిస్తామన్నారు. నేడు సీఎం కేసీఆర్ ఆర్య దేవతలను పూ జిస్తున్నారని, బ్రా హ్మణ సంస్కృతిని పెంచి పోషిస్తున్నార న్నారు. సద్దుల బతుకమ్మకు చీరలు ఇవ్వమని మహిళలు అడిగారా? అని ప్రశ్నించిన కంచ ఐలయ్య.. మీరేమో పట్టుచీరలు కట్టుకుని మాకు పీలికలు ఇస్తారా.. అని దుయ్య బట్టారు. మరోసారి చీరలు ఇచ్చి తెలంగాణ మహిళలను అవమానించాలని చూస్తే సహిం చేది లేదన్నారు. మాదిగలు చెప్పులు, డప్పులు తయారు చేస్తూ పౌరుషంగా బతుకుతారని, మాలలకు కర్రలు తిప్పే దమ్ముందన్నారు. అలాగే, గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్న నారాయణ, చైతన్యలను మూసి వేయించే వరకూ పోరాడుతామన్నారు. ఐలయ్యకు కోరుట్ల కోర్టు సమన్లు హిందూ దేవుళ్లను అవమానించడంతో పాటు ఆర్యవైశ్యులు దొంగ వ్యాపారాలు చేస్తున్నారని కించపరిచే రీతిలో ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’అనే రచన చేసిన కంచ ఐలయ్యకు జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. కోరుట్ల ఆర్యవైశ్య సంఘం నాయకుడు మంచాల జగన్ పదిహేను రోజుల క్రితం కోరుట్ల కోర్టులో అడ్వకేట్ బోయిని సత్యం ద్వారా కంచ ఐలయ్య రచనపై పిటిషన్ వేశారు. విచారించిన కోరుట్ల మున్సిఫ్ కోర్డు జడ్జి ఏ.వెంకటేశ్వరరావు.. కంచ ఐలయ్యను కోరుట్ల కోర్టుకు హాజరు కావాలని కోరుతూ సమన్లు జారీ చేశారు. కాగా, కోర్టు కంచ ఐలయ్యకు కోర్టు సమన్లు జారీ చేయడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పద్యానవనం: సకలజనరంజనం కర్తవ్యం
‘‘నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తార్చినాను నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను నేను వేస్తంభాల నీడలో నొక తెల్గు తోట నాటి సుమాలు దూసినాను నేను పోతన కవీశాను గంటములోని ఒడుపుల కొన్నింటి బడసినాను...’’ ఇదిగో జాబిల్లీ నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే... అంటాడు శ్రీశ్రీ. ‘...మురికి గుడిసెల్లో నివసించే పరమ దరిద్రుల నుదుటి మీద ఏ కన్నంలోంచో జాగా చేసుకొని ఎలాగైనా పరామర్శ చేస్తావు కదూ?’ అని శరచ్చంద్రికను ప్రశ్నిస్తూ, పేదల పక్షం వహించమని పరోక్షంగా అభ్యర్థిస్తాడు మహాకవి. నిజమే! కాలం అనేకానేక పరిణామాలకు నిరంతర సాక్షి, ద్రష్ట, కొన్నిసార్లు తీర్పరీ! కాలం కళ్లెదుట జరిగిన పలు పరిణామాల క్రమంలో అంతిమంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎలా తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఎవరి కోసం తెచ్చారు? అంటే, సమాధానాలు తేటమయ్యే క్రమంలోనే ఆ ప్రశ్నలు రోజు రోజుకు మరింత మసకబారి పోతాయి. చరిత్ర పుటల్లో పదాలు, వాక్యాలు, పంక్తులవుతాయి. వ్యక్తులతో నిమిత్తం లేకుండా చరిత్ర గతిలో పర్యవసానాలే మిగులుతాయి. ఉద్యమ గొప్పతనం ఉద్యమకాలంలో తెలియదు. వ్యక్తులు, జనసమూహాల ఇష్టాయిష్టాల్ని బట్టో, కొంతమంది ఇతరేతర ప్రయోజనాల్ని బట్టో కాకుండా, రేపటి ఫలాలను బట్టే నిన్నటి ఉద్యమం వెనుక సహేతుకత నిర్ధారణ అవుతుంది. శీర్షభాగాన ఉండి ఉద్యమం నడిపిన వారికి, విమర్శించే నాటికన్నా ఆచరించే నాడు బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. పేదరికంతో, వేదనతో, ఇబ్బందులతో అలమటించే ప్రతి మనిషి ఆర్తికి స్పందనై పాలన ప్రతిబింబించాలి. ఒక బాదుషా కాదని మరో బాదుషాకు కిరీటం తొడగడానికి రాలేదు ఈ కొత్తశకం. ఏలికల కన్నా ముఖ్యంగా పంట ప్రతి కృశీవలునికి దక్కాలి. అందుకే ప్రజాకవి ఇక్బాల్ అంటాడు, (జిస్ ఖేత్ దహఖుకొమయస్సేర్ నహోరోజీ ఉస్ ఖేత్కె హర్ ఖూషయె గందంకో జలాదో) ‘‘యే చేను కృషివలునికి తిండి ఈయదో ఆ చేనులో ప్రతి మొక్కను కాల్చేయండి’’ అని. ‘యద్భావం తద్భవతి’. సత్సంకల్పంతో మొదలెడితే సత్ఫలితాలే లభిస్తాయి. అయితే, ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలి. ఇల్లలకగానే పండుగ కాదు. మహాత్మాగాంధీ చెప్పినట్టు గమ్యం మాత్రమే కాదు, మార్గం కూడా ఉదాత్తమైనదే కావాలి. స్వాతంత్రోద్యమ పథాన ఉన్నపుడు పరవాలేదు, అటువంటి మార్గదర్శకత్వం నిరంతరం లభించేది పండిత్ జవహార్లాల్ నెహ్రూకి. స్వాతంత్రానంతరం ప్రభుత్వ బాధ్యతల్లోకి రావడానికి గాంధీజీ ససేమిరా అన్నారు. భారత ప్రథమ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెహ్రూకు ఒక గగుర్పాటు కలిగింది. బాపూజీ తోడు అడుగడుగున లభించదు. సాంఘిక అసమానతలు, ఆర్థిక అంతరాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉండే ఇంత పెద్ద దేశాన్ని పాలించడం ఎలా? నిర్ణయాలు తీసుకోవడం ఎలా? ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి ఎందరెందరో బలిదానాల యజ్ఞ ఫలాల్ని అందరికీ అందించడం ఎలా? చేయగలనా? అన్న శంక వెంటాడుతోంది. వెంటనే గాంధీజీ దగ్గరకు వెళ్లిపోయారు. ‘బాపూ, చెప్పండి ఎలా పాలించాలి, నాకేదో కొంచెం భయంగా ఉంది, ఏదైనా మార్గం నిర్దేశించండి’ అని అడిగినపుడు పూజ్య బాపూజీ స్పందన సర్వకాల సర్వావస్థల యందూ గొప్ప మార్గనిర్దేశనమే! గాంధీజీ వెంటనే తన ముందు దస్త్రాల్లోంచి... దీన వదనంతో, ఎముకల గూడులాగున్న బక్క, నిరుపేద సామాన్యుడి ఫోటో ఒకటి తీసి, ‘‘చాచా! ఆందోళన పడొద్దు. ఇదుగో ఈ ఫొటోను నీ టేబుల్పై ఉంచుకో, దేశ పథనిర్దేశకుడిగా నీవు విధానపరమైన ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఒకసారి ఈ ఫొటో వంక చూడు తదేకంగా! సదరు నిర్ణయం ఏ కొంచెమైనా ఇతని ఉన్నతికి తోడ్పడుతుందా? అని ఆలోచించు. అవుననిపిస్తే నిస్సందేహంగా నిర్ణయం తీసేసుకో’ అని సలహా ఇచ్చారు. ఆ స్పృహ ఇప్పుడు కావాలి. పాలకులకు ఆ సోయి ఉండాలి. ఈన గాచి నక్కల పాల్జేసిన గతి పట్టించకుండా అప్రమత్తమై మెలగాలి. బహుముఖీయ భావనై ఈ పద్యంలో మహాకవి దాశరథి పేర్కొన్నట్టు అందరూ కత్తులు దూయరు. ఉద్యమ వాకిట్లో వనాలు నాటి సుమాలు దూసినవారు ఎందరో! పాటై పల్లవించిన వారు, పద్యమై విజృంభించినవారు, పరపాలనా శృంఖలాలు తెగ్గొట్టినవాళ్లు, ఆకాశం ఎత్తైఆర్చినవారు, సకల జనులై సమ్మెకట్టిన వాళ్లు, ఆశతో-నిరాశతో ఆవిరైన వాళ్లు... ఇలా ఎందరెందరో. వారందరి ఆశయాల ఫలాల్ని వారసులకు, వాటాదారులకు, వాస్తవ హక్కుదారులకు దఖలు పరచాలి. సకలజనరంజన తక్షణ కర్తవ్యం. - దిలీప్రెడ్డి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement