-
ఇక పాకెట్లోనే డేటా వ్యాలెట్!
కేజీ రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : ♦ ప్రతి వ్యక్తి సగటున రోజుకు 3.5 గిగాబైట్స్ (జీబీ)ని వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ♦ 2021 నాటి గణాంకాల ప్రకారం.. రోజూ 2.5 క్విన్ టిలియన్ (18 జీరోలు) డేటా ఉత్పత్తి అవుతోంది. ..ఇలా ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం డేటా వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మనకు ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్పైనే ఆధారపడుతున్నాం. దాని నుంచి పొందిన డేటాను భద్రపర్చడం, అవసరమైనప్పుడు తిరిగి అందుబాటులోకి తేవడం కష్టంగా మారుతోంది. మూడు దశాబ్దాల క్రితం మెమొరీ స్టోరేజ్.. ఫ్లాపీతో మొదలైంది. ఆ తర్వాత సీడీ, డీవీడీ, మెమొరీ కార్డు, పెన్ డ్రైవ్ ఇలా విభిన్న రూపాలను సంతరించుకుంది. ఈ కోవలో ఇప్పుడు డేటా సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటికి కూడా భారీ స్థలం, వ్యయం, అధిక విద్యుత్ వినియోగం అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్కు చెందిన బయోమెమొరీ అనే ఒక స్టార్టప్ సంస్థ.. డీఎన్ఏ డిజిటల్ డేటా స్టోరేజీ విధానంపై పలు పరిశోధనలు చేసింది. మన ప్యాకెట్లో పట్టే వ్యాలెట్ సైజులో ఉంచుకునే క్రెడిట్ కార్డు తరహాలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. వ్యాలెట్ సైజులోనే.. ఇకపై సొంత డేటా, కంపెనీ డేటా.. ఇలా ఏదైనా ఇక ఏ డేటా సెంటర్ నుంచో బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ సీఈవో మీరే అయితే.. సంస్థకు సంబంధించిన మొత్తం సమాచారం మీ జేబులో ఉంచుకునే రోజులు రాబోతున్నాయి. కొత్త తరహా డేటా సెంటర్లను అభివృద్ధి చేసే ప్రక్రియపై బయో మెమొరీ స్టార్టప్ సంస్థ ప్రయోగాలు దాదాపు సఫలీకృతమయ్యాయి. సుమారు వెయ్యి డాలర్ల ధరకే ఈ డీఎన్ఏ డేటా స్టోరేజీని అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. 150 ఏళ్లపాటు సురక్షితం.. కేవలం డేటా స్టోరేజీ విషయంలోనే కాకుండా.. భద్రంగా దాచుకునేందుకు కూడా ఈ డీఎన్ఏ డేటా ఉపయుక్తం కానుంది. వాస్తవానికి హార్డ్ డిస్క్లకు 5 ఏళ్లు, ఫ్లాష్ డ్రైవ్స్కు 10 ఏళ్ల మన్నిక ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యాలెట్ సైజులో ఉండే డేటా బ్యాంకు 150 ఏళ్ల పాటు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా వైరస్ల బెడద కూడా ఉండదు. అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు. ఇతరులెవరూ దీన్ని యాక్సిస్ చేయలేరు. ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు జరిగినప్పుడు కూడా సమాచారం చెక్కుచెదరకుండా ఉండేలా రూపుదిద్దుకుంటోంది. ఎంత పెద్ద డేటానైనా కేవలం నానో సెకన్లలోనే చెక్ చేసుకునే సదుపాయం కూడా ఈ డీఎన్ఏ డేటా బ్యాంకుల ద్వారా అందుబాటులోకి రానుంది. డేటా సెంటర్ల కేంద్రంగా.. విశాఖ ఇంటర్నెట్ద్వారా సమాచార సేవలు నిరంతరాయంగా అందాలంటే డేటా సెంటర్లే కీలకం. అటువంటి డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలోనూ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే నిక్సీ ఓ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా.. రూ.21,844 కోట్ల పెట్టుబడితో దిగ్గజ సంస్థ ఆదానీ సైతం డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఓవైపు.. డేటా సెంటర్ల ఏర్పాటులో ఆయా దేశాలు పోటీపడుతుండగా.. బయోమెమొరీ స్టార్టప్ సంస్థ చేస్తున్న ప్రయోగాలతో వ్యాలెట్ రూపంలో డేటా బ్యాంక్ మార్కెట్లోకి వస్తే సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు ఖాయమంటున్నారు. భారత్లో భారీ డేటా సెంటర్లు.. ప్రస్తుతం హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ ఆపరేషన్స్ జరుగుతున్న దేశాల్లో 44 శాతంతో యూఎస్ మొదటి స్థానాన్ని ఆక్రమించగా.. చైనా 8 శాతం, జపాన్, యూకే 6 శాతం చొప్పున, ఆస్ట్రేలియా, జర్మనీ 5 శాతం చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డేటా వినియోగానికి అనుగుణంగా భారత్లోనూ అడుగులు పడుతున్నాయి. మొత్తం డేటా ట్రాఫిక్ 2025 నాటికి నెలకు 7 ఎక్సాబైట్స్ నుంచి 21 ఎక్సాబైట్స్కు పెరుగుతుందని ఒక అంచనా. డేటా వ్యాపారం 2022లో 4.9 బిలియన్ డాలర్లుండగా.. 2027 నాటికి ఇది 10.09 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. 25 ఎకరాల స్థలంలో మహారాష్ట్రలోని పూణే సమీపంలోని పింప్రీలో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు అమెజాన్, గూగుల్ సైతం డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి. -
ఇదో ఇంటర్నెట్ ఆట!
కొందరు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల లీల డేటా కార్డుల అద్దెలు రూ.22 లక్షలు వినియోగించకపోయినా తప్పని వ్యయం సాక్షి, సిటీబ్యూరో: కాగితం లేకుండానే సమాచారం పంపిణీ కోసమని ల్యాప్టాప్లు పొందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గడచిన రెండేళ్లలో రూ. 21,87,701లను ఇంటర్నెట్ సదుపాయం కోసం డేటాకార్డుల నెలవారీ ఖర్చుల కింద ఖర్చు చేసేశారు. ల్యాప్టాప్ల కోసమని రూ.40లక్షలు ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ వాటిని వినియోగిస్తున్నారా? అంటే అదీ లేదు. ఇదీ మన కార్పొరేటర్ల తీరు. జీహెచ్ఎంసీ అధికారులు తమకు అవసరమైన సమాచారం పంపేందుకు తాము సైతం తమ ప్రతిపాదనల్ని అధికారులకు పంపేందుకు ల్యాప్టాప్లను వాడతామని, ఇంటర్నెట్ సదుపాయం కోసం డేటాకార్డులతో సహా పొందారు. గత మూడేళ్లుగా ల్యాప్టాప్లు వాడుతున్న కార్పొరేటర్లు గడిచిన రెండేళ్లలో డేటాకార్డుల బిల్లుల కింద పై మొత్తాన్ని వినియోగించారు. కాగితం లేకుండానే పనులు నిర్వహిస్తామని చెప్పిన వారు వాటిని వినియోగించకపోవడంతో అటు కాగితాల ఖర్చు వాటిని వారికి చేరవేసేందుకు కొరియర్ ఖర్చులు అయ్యాయి. ఎలాగూ బడ్జెట్ ఉందని ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్షన్ పొందిన వారు వాటిని వినియోగించకపోవడమే విమర్శలకు తావిస్తోంది. ఏంచేస్తున్నారు.. ? కార్పొరేటర్ల ల్యాప్టాప్లను వారి సంతానం వాడుకుంటున్నారు. ఇంటర్నెట్ ద్వారా కొందరు యూట్యూబ్లో మూవీలు చూసేందుకు వాడుకుంటుండగా, ఇంకొందరు చాటింగ్కు వాడుకుంటున్నారు. మరికొందరు తమ చదువులకు పనికి వచ్చే సమాచారం కోసం వినియోగిస్తున్నారు.. ఇప్పటికీ కొంద రు కార్పొరేటర్లకు ల్యాప్టాప్ను వినియోగించడమే తెలియదంటే విడ్డూరం కాక మరేంటి. గ్రేటర్లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులు ఉండగా .. ల్యాప్టాప్లను వాడుతున్నవారు 55 శాతం ల్యాప్టాప్లను కుటుంబీకులు వాడుతున్న వారు 30శాతం వాడని వారు 15 శాతం ఇలా అందరూ వాడటం లేదు. వాడే వారు సైతం ఇతర అవసరాలకు వాడుతుండడంతో జీహెచ్ఎంసీకి తప్పుతాయనుకున్న స్టేషనరీ, కొరియర్ ఖర్చులు తగ్గలేదు. డేటాకార్డులతో సహా కార్పొరేటర్లకు గౌరవ వేతనం, ఫోన్బిల్లులు, తదితర ఖర్చులకుగాను గడచిన రెండేళ్లలో జీహెచ్ఎంసీ మొత్తం రూ. రూ. 3.47 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.68 కోట్లు ఖర్చు చేయగా, 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.79 కోట్లు ఖర్చు చేసింది.
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement