-
పింక్ బాల్ క్రికెట్: మనోళ్ల సత్తా ఎంత?
ప్రస్తుతం ప్రపంచం మొత్తం టీమిండియా-బంగ్లాదేశ్ల మధ్య జరిగే రెండో టెస్టుపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టెస్టు ప్రారంభానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ తొలి డేనైట్ టెస్టుకు కోల్కతాలోని ఈడెన్ గార్జెన్స్ ఆతిథ్యమిస్తోంది. డేనైట్ టెస్టు కోసం రెగ్యులర్గా వాడే రెడ్ బాల్స్కు బదులు పింక్ బాల్స్ను వాడతారు. దీంతో ఈ రెండు బంతుల మధ్య తేడా ఏంటి, పింక్ బాల్తో మనోళ్లు నెగ్గుకరాగలరా? అనే అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత టీమిండియా సభ్యుల్లో కొంతమందికి పింక్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. సారథి విరాట్ కోహ్లి, వైఎస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్లు తొలిసారి పింక్ బాల్ క్రికెట్ ఆడనుండటం విశేషం. అయితే ఇప్పటికే టీమిండియాతో పాటు, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలుత బెంగళూరులో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్లో పాల్గొన్నారు. అనంతరం కోల్కతాలో ఫ్లడ్లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే పింక్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం కొంతమందికి ఉండటం టీమిండియాకు లాభించే అంశం. ఎవరు, ఎక్కడ పింక్ బాల్ క్రికెట్ ఆడారో చూద్దాం.. మహ్మద్ షమీ: ప్రతీ ఒక్కరి దృష్టి ఈ మీడియం పేసర్ పైనే ఉంది. ఎందుకంటే పింక్ బాల్ రివర్స్ స్వింగ్కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో రివర్స్ స్వింగ్ సుల్తాన్ అయిన షమీ బంగ్లా పని పడతాడని భావిస్తున్నారు. క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సూపర్ లీగ్ ఫైనల్లో పింక్ బంతులను ఉపయోగించారు. ఈ మ్యాచ్లో షమీ రెచ్చి పోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో ఈ అనుభవంతో బంగ్లాతో జరిగే మ్యాచ్లో షమీపైనే అందరి దృష్టి ఉంది. వృద్దిమాన్ సాహా: క్యాబ్ సూపర్ లీగ్ ఫైనల్లో భాగంగా వృద్దిమాన్ సాహా పింక్ బాల్ క్రికెట్ ఆడాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 33 పరుగులు సాధించగా.. రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా: ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో పింక్ బాల్ క్రికెట్లో ఈ ఆల్రౌండర్ ప్రధాన ఆయుధంగా కానున్నాడు. దులీప్ ట్రోఫీ-2016లో భాగంగా పింక్ బంతులను వాడారు. ఈ టోర్నీలో రెండు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్లో 48, 17 పరుగులు సాధించాడు. మయాంక్ అగర్వాల్: పింక్ బాల్ క్రికెట్లో ఇతడు టీమిండియా స్టార్ అనే చెప్పాలి. 92,161,58,57,52 వరుసగా మయాంక్ సాధించిన పరుగులు. ఐదు ఇన్నింగ్స్ల్లో 419 పరుగులు సాధించాడు. దీంతో బంగ్లాతో జరిగే మ్యాచ్లో మయాంక్ కీలకం కానున్నాడు. రోహిత్ శర్మ: దులీప్ ట్రోఫీ-2016లో భాగంగా ఇండియా బ్లూ తరుపున బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ల్లో 30,32 పరుగులు సాధించాడు. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా రెడ్పై 335 పరుగుల తేడాతో ఇండియా బ్లూ ఘన విజయం సాధించింది. చటేశ్వర పుజారా: టెస్టు బ్యాట్స్మన్గా ప్రసిద్ది గాంచిన చటేశ్వర పుజారా దేశవాళీ పింక్ బాల్ క్రికెట్లో అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా రెడ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా బ్లూ బ్యాట్స్మన్ పుజారా ఏకంగా 256 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు పింక్ బాల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్మన్ పుజారానే కావడం విశేషం. దీంతో పుజారా అనుభవం బంగ్లా మ్యాచ్లో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇషాంత్ శర్మ: దులీప్ ట్రోఫీ-2016లో భాగంగా ఓ మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతేకాకుండా 9 పరుగులు సాధించాడు. ఇక కుల్దీప్ యాదవ్ దులీప్ ట్రోపీ-2016లో 11 వికెట్లు పడగొట్టి బౌలర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.కాగా, హనుమ విహారీ, రిషభ్ పంత్లు దులీప్ ట్రోఫీ-2017లో ఆడిన ఆనుభవం ఉంది. ఈ టోర్నీలో విహారీ 105 పరుగులు సాధించగా, పంత్ 72 పరుగులు మాత్రమే సాధించాడు. వీరి అనుభవం టీమిండియా డబుల్ ప్లస్ కానుంది. -
హిట్.. హిట్.. హుర్రే..!
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టెస్టు మ్యాచ్లకు ఆదరణ ఇప్పటికీ తగ్గలేదు. ఏ దేశంలో ఆడినా ప్రేక్షకులు బాగానే ఉంటారు. ఇక యాషెస్ సిరీస్ అయితే పోటెత్తుతారు. కాబట్టి డేనైట్ టెస్టు క్రికెట్కు కూడా భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంలో ఆశ్చర్యం లేకపోయినా... మూడు రోజుల్లో ఏకంగా లక్షా 23 వేల 736 మంది మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడ టం కచ్చితంగా గొప్ప విషయమే. అంతేకాదు... ఈ టెస్టుకు ప్రపంచ వ్యాప్తంగా టీవీ రేటింగ్స్ కూడా విశేషంగా వచ్చాయి. దీంతో ఐసీసీ ఆనందంలో మునిగింది. డేనైట్ మ్యాచ్లను మరింత విస్తరించాలనే ఆలోచనలో ఉంది. డేనైట్ టెస్టు ప్రయోగం విజయవంతం * మరిన్ని మ్యాచ్ల ఆలోచనలో ఐసీసీ సాక్షి క్రీడావిభాగం: టి20ల మాయలో టెస్టు క్రికెట్కు ఆదరణ తగ్గిపోతోందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. భారత్, పాకిస్తాన్ లేదా యాషెస్ సిరీస్కు తప్ప మిగిలిన ఏ దేశాల మధ్య టెస్టులు జరిగినా ప్రేక్షకులు రావడం లేదు. క్రికెట్ను విపరీతంగా ప్రేమించే భారత్లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ప్రేక్షకులే లేరు. పాఠశాల పిల్లలను ఉచితంగా స్టేడియాలకు తీసుకొచ్చినా కనీసం నాలుగు వేల మందిని కూడా స్టేడియానికి రప్పించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల మధ్య అడిలైడ్లో జరిగిన టెస్టుకు వచ్చిన ఆదరణ అమోఘం. స్టేడియానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో పాటు టీవీల్లో ఈ మ్యాచ్ను విశేషంగా చూశారు. ఒక్క ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆఖరి రోజు రాత్రి 32 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. ఇటు భారత్లోనూ ఇది పూర్తిగా పగటి పూట రావడంతో వీక్షకులు సంఖ్య బాగానే ఉంది. వచ్చే ఏడాది మరో రెండు తొలిసారి తమ దగ్గర నిర్వహించిన డేనైట్ మ్యాచ్ విజయవంతం కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ఉత్సాహంలో ఉంది. వచ్చే ఏడాది తమ సీజన్ ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టును డేనైట్గా నిర్వహించాలని భావిస్తోంది. అలాగే పాకిస్తాన్తో కూడా ఓ టెస్టు పింక్ బంతితో ఆడాలనే ప్రతిపాదన చేస్తున్నారు. అటు ఐసీసీ కూడా అన్ని బోర్డులనూ ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరింది. సమస్యలు లేవా? పింక్ బంతితో మ్యాచ్లు ఆడటం వల్ల సమస్యలు పెద్దగా లేవు. లైట్ల వెలుతురులో ఈ బంతి మైదానంలో వెళుతుంటే మరింత ఆహ్లాదంగా ఉంది. కాబట్టి బంతి రంగు విషయంలో ఇన్నాళ్ల కష్టం ఫలించినట్లే. అయితే పింక్ బంతి ఎరుపు బంతులతో పోలిస్తే త్వరగా మెత్తబడుతోందనే ఫిర్యాదు ఒకటుంది. దీనితో పాటు సాయం సమయంలో కాస్త ఇబ్బందిగా ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లు చెబుతున్నారు. సూర్యాస్తమయం జరుగుతున్న సమయంలో... లైట్ల ప్రభావం పూర్తిగా రాకముందు ఒక గంట పాటు బ్యాటింగ్ క్లిష్టంగా ఉందని అంటున్నారు. కాబట్టి బంతి తయారీదారులు దీనికి పరిష్కారాన్ని వెతకాల్సి రావచ్చు. అలాగే పింక్ బంతి కోసం పచ్చిక ఎక్కువగా ఉండేలా పిచ్ను రూపొం దించారు. దీనివల్ల మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగి సింది. ఇలాంటి పిచ్ మీద ఆడటం ఉపఖండం జట్లకు చాలా కష్టం. అయితే అంత పచ్చిక లేకున్నా సమస్య లేదని ఆస్ట్రేలియా కోచ్ లీమన్ అంటున్నారు. ఇంకా ప్రయోగాలు చేయాలి రాత్రి పూట టెస్టు మ్యాచ్లు ఆడేందుకు వీలుగా బంతిని తయారు చేసేందుకు కూకాబూరా కంపెనీ పదేళ్లు కష్టపడింది. రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత తొలి మ్యాచ్ జరిగింది. అయితే వచ్చే ఏడాది కాలంలో ఈ బంతిని మరింత మెరుగుపరచాలని క్రికెటర్లు కోరుతున్నారు. ఏమైనా క్రికెట్ చరిత్రలో ఇదో పెద్ద మలుపనే అనుకోవాలి. టి20లు వచ్చాక, ఆటలో వేగం పెరిగి... రోజంతా కూర్చుని మ్యాచ్లు చూసే ఓపిక అభిమానులకు తగ్గిపోయింది. రాత్రి పూట మ్యాచ్లు చూడటం ఎప్పుడైనా బాగానే ఉంటుంది. అయితే ఉపఖండంలోని పిచ్లపై ఈ బంతితో ఆడటం కష్టమని నిర్వాహకులే చెబుతున్నారు. కాబట్టి ఈ విజయవంతమైన ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలంటే ఐసీసీ కూడా భారీగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- వంద మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement