-
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.వి.కృష్ణారెడ్డి, తాగునీరు– పారిశుధ్యం ప్రాజెక్టు డైరెక్టర్ హరిరామ్ నాయక్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుతో వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్జీవోలతో కలిసి గ్రామాల్లో మంచినీరు, ఇంటింటికి నీటి కుళాయిల ప్రాధాన్యంపై ప్రచారం చేయనున్నట్టు వివరించారు. ఎంపిక చేసిన ఎన్జీవో ప్రతినిధులకు యునిసెఫ్ ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ తరగతులను బుధవారం విజయవాడలో ప్రారంభించారు. మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన వీరు జిల్లాల వారీగా మరికొందరికి శిక్షణనిచ్చి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు రూ.25 వేల కోట్ల ఖర్చుతో అన్ని గ్రామాల్లోను ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 40 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేస్తామన్నారు. దీంతోపాటు మురుగు నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, వర్షపు నీరు పునర్వినియోగంపై దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ఎన్జీవోలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని యునిసెఫ్ అందిస్తున్నట్టు తెలిపారు. -
శెవ్వా.. కంపు పంపకం
=మరుగుదొడ్ల నిర్మాణాల్లో ప్రధాన పార్టీలకు వాటాలు =నేతలకు ఆదాయ వనరులుగా మేడారం జాతర పనులు సాక్షిప్రతినిధి, వరంగల్ : మేడారం జాతర పనులు.. రాజకీయ నాయకులకు ఆదాయ వనరులయ్యూరుు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులను పంచుకుంటున్నారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిపై చేపట్టే పనులు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. జాతర ఏర్పాట్లలో భాగంగా గ్రామీణ నీటిసరఫరా శాఖ రూ.9.30 కోట్లతో పనులు చేపడుతోంది. రూ.4.80 కోట్లు పారిశుద్ధ్య పనులకు, రూ.4.50 కోట్లు తాగునీటి సరఫరా పనులకు కేటాయించారు. పారిశుద్ధ్య పనుల కింద జాతర ప్రాంతంలో 10వేల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో మరుగుదొడ్డి (యూనిట్)కి రూ.2300 చొప్పున రూ.2.30కోట్లతో ఈ పనులు పూర్తి చేయనున్నారు. వీటి ని కాంగ్రెస్ పార్టీ నేతలు 40 శాతం, టీఆర్ఎస్, టీడీపీ నేతలు 30 శాతం చొప్పున చేపట్టేలా బుధవారం ఒప్పందం కుదిరింది. మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రతి జాతరలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నా.. పంపకాల ఆనవాయితీ కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. ఈసారి జాతరలోనూ నాసిరకం నిర్మాణాలే జరుగను న్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువ పనులు టెండర్ పద్ధతిన చేపట్టగా.. మరుగుదొడ్ల నిర్మాణాలకు నామినేషన్ పద్ధతిని ఎంచుకున్నారు. దీంతో అందినకాడికి దండుకునే పనిలో పార్టీల నేతలు తలమునకలయ్యారు. నిర్మాణాలు ఇక్కడే.. ములుగు శివారులోని ఆది దేవత గట్టమ్మ ఆలయం వద్ద మొదలుకుని మేడారం చిలకలగుట్ట, జంపన్నవాగు, పడిగాపూర్, నార్లాపూర్, కాల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూరు, ఊరట్టం, శివరాంసాగర్, గద్దెల పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ(వీడీసీ)లకు పనులు అప్పగిం చాల్సి ఉండగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తు ఒప్పందాలకు తెరలేపారు. పంపకాల ఆధారంగా ఆ మూడు పార్టీలకు ‘కంపు’పనులు అప్పగిస్తే ఎటువంటి ఫిర్యాదులూ ఉండవని భావిస్తున్న అధికారులు ఈ తతంగానికి అంగీకరించినట్లు తెలిసింది. వీడీసీల సిఫారసుతో నామినేషన్ పద్ధతిన అప్పగించనున్న ఈ పనుల కోసం కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు హన్మకొండ కేంద్రం గా పలుసార్లు చర్చలు జరిపినా వాటాల పై మొదట్లో స్పష్టత రాలేదు. అధికారంలో ఉన్న తమకు 50శాతం పనులు.. టీడీపీ, టీఆర్ఎస్లకు 25 శాతం చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ వారు పట్టుబట్టారు. ఈ ప్రతిపాదనకు టీడీపీ, టీఆర్ఎస్ వారు అంగీకరించలేదు. చివర కు కాంగ్రెస్కు 40, టీఆర్ఎస్, టీడీపీకి 30 శాతం చొప్పున వాటా ఉండేలా ఒప్పందం కుదిరింది. వీడీసీల ప్రతిపాదనలు రాలేదు : శ్రీనివాసరావు, ఆర్డబ్లూఎస్ ఈఈ మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి వీడీసీ నుంచి ప్రతిపాదనలు ఇప్పటి వరకు మావద్దకు రాలేదు. రెండుమూడు రోజుల్లో తెప్పించుకుని పనులను అప్పగిస్తాం. 10వేల మరుగుదొడ్లు నిర్మించనున్నాం. వీటిలో 8వేలు వీడీసీ ద్వారా ఇవ్వనున్నాం. మిగిలిన 2వేలకు సంబంధించి చివర్లో స్థలాలు(లొకేషన్) మారే అవకా శం ఉంది. వీటిపై తర్వాత చర్యలు తీసుకుంటాం. నాసిరకం పనులకు తావులేకుండా చూస్తాం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
Advertisement