-
విద్యుత్ ఆదా ఒప్పందానికి ఎన్డీఎమ్సీ యత్నాలు
న్యూఢిల్లీ: విద్యుత్ తక్కువ వినియోగం ఉండే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని...కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖతో విద్యుత్ ఆదా ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎమ్సీ) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుత అగ్రిమెంట్ వల్ల ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్(డీటీఎల్),ఎన్డీమ్సీ సంవత్సరమంతా ఒకే పరిమాణంలో విద్యుత్ను కొనుగోలు చేసేవి. ‘వేసవి, శీతాకాలంలో విద్యుత్ వినియోగంలో చాలా తేడా ఉంటోంది. కాబట్టి ప్రస్తుత ఒప్పందాన్ని పునర్ పరిశీలించాలని మేం కేంద్ర మంత్రిత్వశాఖను కోరాం. ప్రధానంగా అక్టోబర్- ఏప్రిల్, మార్చి- సెప్టెంబర్లో ఉండే విద్యుత్ వినియోగ తేడాలను సరిచేయాలనుకుంటున్నాం’ అని ఎన్డీఎమ్సీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవ చెప్పారు. 2005 వరకు ఎన్డీమ్సీ తన పరిధిలోని అన్ని ప్రాంతాలకు మిగులు విద్యుత్ను మంచి ధరకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించేది. అయితే ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ) ఈ విధానాన్ని పక్కన పెట్టింది. మిగులు విద్యుత్ను చాలా తక్కువ ధరకు డిస్కమ్లకు అమ్మాలనే నిబంధనను పెట్టింది. ఎక్కువ ధరకు విద్యుత్ను కొని, తక్కువ ధరకు అమ్మడం వల్ల గతేడాది ఎన్డీఎమ్సీ దాదాపు రూ. 150 కోట్లు నష్టపోయింది. అంతేకాక వినియోగదారులకు సక్రమంగా విద్యుత్ను అందించడం, వీధి దీపాల పర్యవేక్షణలో విఫలమయ్యారనే కారణాలతో కేంద్రహోం మంత్రిత్వ శాఖ...ఎన్డీఎమ్సీని తన చేతుల్లోకి తీసుకుంది. ‘ ఈ విషయాలపై మంత్రిత్వశాఖతో ఏప్రిల్లో మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. కొనుగోలు, అమ్మకం విధానాల్లో స్థిరత్వం లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయి. అందువల్ల ప్రస్తుత ఒప్పందాన్ని మార్చాల్సిన అవసరముంది’ అని శ్రీవాత్సవ వివరించారు. 150 మెగావాట్లు మాత్రమే వినియోగం: ప్రస్తుత ఒప్పంద వివరాలను ఎన్డీఎమ్సీ ఆర్థిక సలహాదారు కుమార్ హృషికేష్ విలేకరులకు వెల్లడించారు. ‘ప్రస్తుతం ఎన్డీఎమ్సీ ప్రతిరోజూ దాదాపు 380 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తోంది. అయితే శీతాకాలంలో ప్రతిరోజూ కేవలం 150 మెగావాట్ల విద్యుత్ వినియోగం మాత్రమే ఉంటోంది. దీంతో 30 మెగావాట్ల మిగులు విద్యుత్ను వీవీఐపీ ప్రాంతాల్లో నిరంతరాయంగా కరెంటు ఉండటానికి వినియోగిస్తోంది. ఈ మొత్తం విద్యుత్ కూడా పూర్తిగా వినియోగించుకోవడం లేదు’ అని ఆయన చెప్పారు. ఢిల్లీలో కాకుండా ఎన్డీఎమ్సీలోని మిగిలిన ప్రాంతాల్లో విద్యుత్ చార్జీలు తక్కువగా ఉంటున్నాయి. నివాసప్రాంతాల్లో 200 యూనిట్లలోపు వినియోగదారులకు రూ. 3.25 ఉంటోంది. ఢిల్లీలో మాత్రం ఈ ధర రూ. 4గా ఉంది. ‘ ఇలాంటి పరిస్థితిల్లో ఇంకా తక్కువ ధరకు విద్యుత్ను డిస్కంలకు అమ్మడం వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిపై మేం పంపిన ప్రతిపాదన ఆమోదం పొందాల్సిన అవసరముంది. నష్టాలతో విద్యుత్ను అమ్మడం కుదరదు’ అని హృతికేష్ చెప్పారు. శుక్రవారం నుంచి 400 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు 50 శాతం విద్యుత్ ధరను మినహాయింపు, ప్రతి ఇంటికి 20 లీటర్ల ఉచిత నీరును ఎన్డీఎమ్సీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో పెరిగిన విద్యుత్ చార్జీలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 7 శాతం వరకు పెంచారు. పెంచిన చార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) ఈమేరకు గురువారం నిర్ణయం తీసుకుంది. మూడు ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థల విజ్ఞప్తి మేరకు చార్జీలు పెంచినట్టు డీఈఆర్సీ తెలిపింది. బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ (బీవైపీల్) నుంచి విద్యుత్ వాడుకునే వారిపై 7 శాతం, బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్పీఎల్) వినియోగదారులపై 4.5 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్) వినియోగదారులపై 2.5 శాతం వడ్డించారు. -
స్వాధీనమయ్యేదెన్నడో?
తనకూ ఓ ఇల్లు కానీ, కనీసం స్థలంకానీ ఉండాలని సామాన్యులు ఆశిస్తారు. తక్కువ ధరలో కొనగలిగితే బాగుంటుందని భావిస్తారు. ప్రైవేటు బిల్డర్లు నిర్మించే ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండవు కనుక ప్రభుత్వ ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకుంటారు. అందులో కొంతమందికే ఫ్లాట్లు దక్కుతాయి. మిగిలినవారికి మిగిలేది నిరాశే. అయితే అసలు కేటాయింపే జరగక పోతే ఇక వారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి. రోహిణీ ప్రాంతంలో 32 ఏళ్ల క్రితం డీడీఏ ప్లాట్లు దక్కినా అవి ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు ఎదురుచూపులే మిగిలాయి. న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఇటీవల ప్రకటించిన నూతన గృహనిర్మాణ ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. అనేకమంది నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాలవారు వీటికోసం పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదిలాఉంచితే 1982లో నగరంలోని రోహిణీ ప్రాంతంలో డీడీఏ నిర్మించిన స్థలాల కేటాయింపు ప్రక్రియ ఏనాడో పూర్తయినప్పటికీ వాటి దరఖాస్తుదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అక్కడ విద్యుత్, రహదారులు, మురుగుకాల్వలు వంటి మౌలిక వసతులను డీడీఏ ఇప్పటిదాకా కల్పించలేదు. దీంతో అనేకమంది బాధితులు ఈ ఏడాది జూన్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం నాలుగు నెలల్లోగా దరఖాస్తుదారులకు అందజేయాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పందించిన డీడీఏ అధికారులు విద్యుత్ సరఫరా నెట్వర్క్ను ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ)ని ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల ఓ లేఖ రాశారు. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. అంతేకాకుండా విద్యుత్ నెట్వర్క్కు సంబంధించి కనీస మౌలిక వసతులను కల్పించాల్సిందిగా టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ (టీపీడీడీఎల్)ను కూడా ఆదేశించారు. విద్యుత్కు సంబంధించిన పనులు పూర్తయితే తమ బడ్జెట్కు లోబడి గృహాలను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారని సదరు లేఖలో అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారి ఒక రు మీడియాతో మాట్లాడుతూ 1982లో దరఖాస్తు చేసినవారిలో కొంతమంది ఏడు సంవత్సరాల క్రితం స్థలాలు ఇచ్చామని అంగీకరించారు. త్వరలో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం వివిధ కారణాలవల్ల 1982 నాటి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్దిష్ట కాలవ్యవధిలోగా ప్లాట్లను కేటాయించడం సాధ్యం కాకపోవచ్చని తెలియజేస్తూ త్వరలో అత్యున్నత న్యాయస్థానంలో ఓ రివ్యూ పిటిషన్ను దాఖలు చేసేయోచనలో ఉన్నట్టు డీడీఏ అధికారి ఒకరు తెలియజేశారు. మాట నిలబెట్టుకోలేకపోయింది డీడీఏ తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని 1982లో ప్లాట్కోసం దరఖాస్తు చేసుకున్న రాహుల్ గుప్తా అనే నగరవాసి వాపోయాడు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమందికి ప్లాట్లు ఇవ్వలేకపోయిన ఈ సంస్థ మళ్లీ తాజాగా గృహ పథకాన్ని ఎలా ప్రారంభిస్తుందని ఆయన ప్రశ్నించారు. 2003-07 మధ్యకాలంలో కేటాయింపులు జరిపిన ప్లాట్లకు సంబంధించి అంతర్గత మురుగుకాల్వల నిర్మాణం కోసం డీడీఏ అధికారులు ఇటీవల టెండర్లను ఆహ్వానించారు. -
జరిమానాలతోనే అంతా దారిలోకి..
న్యూఢిల్లీ: ఆకస్మిక తనిఖీలతో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని నగరంలోని మూడు కార్పొరేషన్లు హైకోర్టుకు తెలియజేశాయి. వాటి స్థానంలో ఆర్థిక ప్రతిబంధాలను విధిస్తే బాగుంటుందని సూచించాయి. జస్టిస్ బదర్ దురేజ్ అహ్మద్, జస్టిస్ సిద్ధార్ధ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనానికి బుధవారం సమగ్ర వివరాలతో కూడిన ఓ నివేదికను అందజేశాయి. నగరంలో ప్రస్తుతం 1.52 లక్షల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అందులో పేర్కొన్నాయి. వీటి తొలగింపు విషయంలో తాము ఏమాత్రం సందేహించబోమని తెలిపాయి. ఇందుకు స్పందించిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణనాటికి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ఓ కార్యాచరణ ప్రణాళికను తమకు అందజేయాలని సూచించింది. పట్టణ అభివృద్ధి విభాగం, ఢిల్లీ ప్రభుత్వ సలహాలు, సూచనలను జత చేయాలని పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం విషయంలో ఈ మూడు కార్పొరేషన్లకు సహకరించాలంటూ ఢిల్లీ జల్బోర్డు (డీజేబీ), ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ)లను ఆదేశించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఏ విభాగమూ బాధ్యతలనుంచి తప్పుకునేందుకు యత్నించవద్దని హితవు పలికింది. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) కమిషనర్ తన వాదనను కోర్టుకు వినిపిస్తూ తమ పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటి యజమానులు క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తాము ఎంతగానో యత్నించామని, అయినప్పటికీ పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయామన్నారు. ఇటువంటి నిర్మాణాలకు నీటి సరఫరాను నిలిపివేస్తే మున్ముందు ఈ సమస్య తీవ్రత తగ్గుతుందన్నారు. దీంతోపాటు పోలీసు నిఘా కూడా అవసరమన్నారు. నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేయాల్సిందిగా ఢిల్లీ జల్ బోర్డుతోపాటు పంపిణీ సంస్థలకు తాము లేఖలు రాస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోతోందన్నారు. ఈ సంస్థలు అక్రమ నిర్మాణదారుల విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. -
విద్యుత్ చార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ కోతలతో సతమతమవుతోన్న ఢిల్లీవాసులపై మరోసారి విద్యుత్తు చార్జీల భారం పడింది. విద్యుత్ చార్జీలను 8.32 శాతం పెంచుతున్నట్లు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్(డీఈఆర్సీ) ప్రకటించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని ప్రాంతాల్లోని వినియోగదారులు మరింత ఎక్కువ పెంపు భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యుత్తు చార్జీలను 9.52 శాతం పెంచారు. డీఈఆర్సీ చైర్మన్ పి.డి. సుధాకరం గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యుత్తు చార్జీలను స్వల్పంగా పెంచుతున్నామని, పవర్ పర్చేజ్ అగ్రీమెంట్ చార్జీలను(పీపీఏసీ) తొలగిస్తున్నందువల్ల విద్యుత్తు చార్జీల పెంపు భారం వినియోగదారులపై అంతగా ఉండదని ఆయన చెప్పారు. విద్యుత్తును తక్కువ ఖరీదుకు కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. గృహవినియోగదారులతోపాటు వ్యాపార, వాణిజ్య కార్యాకలాపాలకు వినియోగించే విద్యుత్ చార్జీలను కూడా పెంచారు. ఢిల్లీ మెట్రో విద్యుత్తు చార్జీలు 11 శాతం పెరిగాయి. ఢిల్లీకి సరఫరా అయ్యే విద్యుత్ ఎక్కువగా థర్మల్ ఆధారిత విద్యుత్తు కావడంతో బొగ్గు ధరలు పెరిగినందువల్ల విద్యుత్తు చార్జీలను పెంచాలని మూడు డిస్కంలు - బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కంపెనీలు చేసిన డిమాండ్ మేరకు విద్యుత్తు చార్జీలను పెంచినట్లు సుధాకర్ చెప్పారు. 800 పై యూనిట్ల వారికే భారం.. విద్యుత్తు చార్జీల పెంపు భారం 800 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే వినియోగదారులపై పడింది. 0- 200 యూనిట్ల స్లాబ్కు విద్యుత్తు చార్జీలను యూనిట్కు 10 పైసల చొప్పున, 201-400 యూనిట్ల స్లాబ్ కు చార్జీలను యూనిట్కు 15 పైసల చొప్పున, 401-800 యూనిట్ల వరకున్న స్లాబ్కు యూనిట్కు 50 పైసల చొప్పున, 801- 1,200 యూనిట్ల వరకున్న స్లాబ్కు యూనిట్కు రూ.1.10 చొప్పున చార్జీలను పెంచినట్లు సుధాకర్ ప్రకటించారు. 1,200 పైగా యూనిట్ల స్లాబ్కు కొత్తగా ప్రవేశపెట్టారు.1,200 పైనున్న విద్యుత్తు స్లాబ్కు యూనిట్కు రూ.1.75 చొప్పున చార్జీల పెంపు వర్తిస్తుంది. ఎన్డీఎమ్సీ ప్రాంతాలలో 200 -400 యూనిట్లకు యూనిట్కు 25 పైసల చొప్పున చార్జీలు పెరిగాయి. పీపీఏసీల తొలగింపుతో తగ్గిన భారం.. విద్యుత్తు చార్జీలను పెంచినప్పటికీ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ చార్జీలను(పీపీఏసీ) తొలగించారు. దీంతో నెలవారీ బిల్లులో సర్చార్జీల మోత ఉండదు. ప్రస్తుతం సర్చార్జీ పేరుతో ఆరు నుంచి ఎనమిది శాతం వసూలు చేస్తున్నారు. పీపీఏసీ తొలగించడం వల్ల 400 యూనిట్ల లోపు విద్యుత్తు వాడేవారికి నెలసరి బిల్లు మరింత తగ్గుతుందని సుధాకర్ చెప్పారు. గతంలో 70 శాతం వినియోగదారులు 400 యూనిట్ల వరకు ఉపయోగించేవారని ఆయన చెప్పారు. 800 యూనిట్ల కన్నాఎక్కువగా విద్యుత్తు వాడేవారికి నెలవారీ బిల్లు మాత్రం పెరగనుందన్నారు. పవర్ పర్చేజ్ కాస్ట్ అగ్రీమెంట్ చార్జీలను తొలగించడం వల్ల పెంచిన విద్యుత్తు చార్జీల పెంపుప్రభావం పెద్దగా ఉండదని, పీపీఏసీని మూడు నెలల వరకు తొలగిస్తున్నామని, దానిని అమలుచేయాలా వద్దా అనేదానిపై అక్టోబర్లో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సుధాకర్ తెలిపారు. పీపీఏసీ అవసరమని డీఈఆర్సీ అభిప్రాయపడితే మూడు నెలల తరువాత దానిని అమలుచేస్తామని, అలా జరిగినట్లయితే విద్యుత్తు చార్జీల పెంపు ప్రభావం నవంబర్లో కనిస్తుందని డీఈఆర్సీ అధికారులు తెలిపారు. విద్యుత్తు చార్జీల పెంపు వల్ల రూ.1,245 కోట్ల ఆదాయం లభిస్తుందని డీఈఆర్సీ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని ససాన్లో అల్ట్రామెగాపవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్తును చౌకగా కొనే ప్రయత్నం చేస్తున్నట్లు డీఈఆర్సీ చైర్మన్ సుధాకర్ తెలిపారు. ప్రజల డిమాండ్ మేరకు సీజీహెచ్ఎస్, డీడీఏ కాలనీలలో పార్కింగ్ వంటి కామన్ ఏరియాలలో సాధారణ డొమెస్టిక్ స్లాబ్ల ప్రకారం విద్యుత్తు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఈ కామన్ ఏరియాలకు అత్యధిక డొమెస్టిక్ స్లాబ్ను వర్తింపచేస్తున్నారని చెప్పారు. అలాగే పార్కులలో గృహేతర స్లాబ్ల ప్రకారం కాకుండా డొమెస్టిక్ స్లాబ్ ప్రకారం విద్యుత్తు చార్జీలను వసూలుచేస్తారు. తీవ్రంగా వ్యతిరేకించిన ఆప్, కాంగ్రెస్ విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ ప్రభుత్వం ఇచ్చిన సబ్సీడీని ఎత్తివేశారని, 50 శాతం సబ్సీడీ ఇస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ నెలరోజులకే సబ్సీడీ ఇచ్చి పారిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ విమర్శించారు. ఎన్నికల సమయంలో 30 శాతం విద్యుత్తు సబ్సీడీ ఇస్తామని ప్రకటించిన బీజేపీ తన హామీని మరిచిపోయిందని ఆయన ఆరోపించారు. కేంద్రం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని చార్జీలను త గ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గించవచ్చని, అయినా చార్జీలను పెంచుతున్నారని ఆప్ ఆరోపించింది. విద్యుత్తు చార్జీలను పెంచడం ప్రజలపై అదనపు భారం మోపడమేనని బీజేపీ నేత జగ్దీశ్ ముఖీ పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement