-
రాచకొండకు రాచఠీవి
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కేంద్రం సంసిద్ధత రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు పంపిన తెలంగాణ ప్రభుత్వం పానుగల్ ఆలయాలు, ఉదయసముద్రంతో కలిపి టూరిజం సర్క్యూట్ మరుగున పడిన రాచకొండ కోటకు కొత్త వెలుగు సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన కోట.. ఇరవై అడుగుల ఎత్తున్న ప్రాకారాలు.. అంతెత్తున అలరారే దర్వాజాలు.. కాకతీయ శిల్పకళాచాతుర్యం ఉట్టిపడే దేవాలయాలు.. గుట్టల సమూహంలో ప్రకృతి సోయగం.. కనుచూపుమేరలో పరచుకున్న పచ్చదనం.. ఇదంతా రాచకొండ గుట్టల వైభవం. అందమైన గుట్టలు.. వాటిపై గొప్పగా రూపుదిద్దుకున్న కోట.. అసలు ఈ పేరుతో ఓ చారిత్రక అద్భుతం ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. రాష్ర్ట రాజధానికి కూతవేటు దూరంలోనే ఉన్నా ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం త్వరలో పర్యాటక శోభ సంతరించుకోబోతోంది. హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సుందర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో కొత్తగా అభివృద్ధి చేసే టూరిజం సర్క్యూట్లో భాగంగా దీనిపై కేంద్ర సర్కారు దృష్టి సారించింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ర్ట ప్రభుత్వం మూడు రోజుల క్రితమే కేంద్రానికి పంపింది. రాచకొండ పరిసరాలను ఫిల్మ్సిటీగా అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడటంతో ఆ ప్రాంతానికి మహర్దశ రావడం ఖాయంగా కనిపిస్తోంది. టూరిజం సర్క్యూట్తో కొత్త వెలుగులు తెలంగాణ రాష్ర్టంలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం 8 ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ. 45 కోట్లతో వరంగల్-కరీంనగర్ మెగా సర్క్యూట్తో పాటు నల్గొండ జిల్లాలోని మూడు ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్గా ఎంపిక చేశారు. కాకతీయుల కాలంలో పానుగల్లో నిర్మితమైన ఛాయ సోమేశ్వర దేవాలయం, పచ్చల సోమేశ్వర దేవాలయాలతోపాటు అక్కడికి చేరువలోని ఉదయసముద్రం రిజర్వాయర్లను కలిపి రాచకొండ కోటను ఓ సర్క్యూట్గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు రూ. 8 కోట్లు కేటాయించాలని తాజాగా కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో అధికారులు సూచించారు. కనీసం రూ. 5 కోట్లు మంజూరవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులతో ఉదయసముద్రం రిజర్వాయర్లో బోట్లు ప్రవేశపెట్టాలని, పానుగల్ దేవాలయ సమూహం వద్ద పర్యాటకులకు వసతులు కల్పించాలని యోచిస్తోంది. ఇక ఇప్పటివరకు పెద్దగా ప్రాచుర్యంలోకి రాని రాచకొండపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అక్కడికి పర్యాటకులు సులభంగా చేరుకోవడానికి వీలుగా రోడ్లు వేయడంతో పాటు బస్సులను ఏర్పాటుచేయనున్నారు. పర్యాటకుల బస కోసం భవనాలు, రెస్టారెంట్లు నిర్మించనున్నారు. రక్షిత మంచినీటి వసతి, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఖాళీ ప్రాంతాల్లో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతారు. చిన్నపిల్లలను ఆకట్టుకునేలా ఆటవిడుపు కేంద్రాలను కూడా నిర్మిస్తారు. కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించనుంది. తొలిదశలో ఈ పనులు పూర్తి చేసిన తర్వాత గోల్కొండ తరహాలో సౌండ్ అండ్ లైట్ షోతో పాటు రాచకొండ కోట చరిత్రను తెలిపే విజువల్ ఎఫెక్ట్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలు ఇక్కడ ట్రెక్కింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సాహసాలను ఇష్టపడే వారికి అలాంటి మరిన్ని ఏర్పాట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం నుంచి ఆమోదం రాగానే వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. -
ఏడాది లోగా కొత్త తాలూకాలు
కమిటీల నివేదికలు పరిశీలించి నిర్ణయం : సీఎం సాక్షి, బెంగళూరు : నూతన తాలూకాల ఏర్పాటు విషయమై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. హైదరాబాద్-కర్ణాటక విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గుల్బర్గాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. నూతన తాలూకాల ఏర్పాటుపై నాలుగు వేర్వేరు కమిటీలు ఇచ్చిన నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. వీటి సిఫార్సులలో ఉత్తమమైనవాటిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఆర్థిక, పాలన పరమైన ఇబ్బందులు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఆర్థిక ఏడాదిలోపు నూతన తాలూకాల ఏర్పాటు విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో అతివృష్టి వల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించి రూ.426 కోట్లను పరిహారంగా ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటకకు రానున్నారని, ఆ సమయంలో పరిహారం విషయమై ఆయనతో చర్చించనున్నట్లు చెప్పారు. గుల్బర్గాలో అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు బయోటెక్నాలజీకు సంబంధించిన పరిశ్రమలను స్థాపించాలనే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. హైదరాబాద్ - కర్ణాటక విమోచన పోరాట గాథలకు సంబంధించిన విషయాలను అక్షరబద్ధం చేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన నిపుణులతో కూడిన ప్రత్యేక మండలికి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ - కర్ణాటక ప్రాంతంలోని జిల్లాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని నూతన పారిశ్రామిక విధానంలో పొందుపరిచామని తెలిపారు. -
తప్పుకుంటా!
గవర్నర్ భరద్వాజ్ వైరాగ్యం.. *సీఎం, మంత్రులు విలువ ఇవ్వడం లేదు * సలహాలకే పరిమితం చేస్తున్నారు * గత బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు * నేడు కాంగ్రెస్ పాలనపై కూడా అంతే * ఎమ్మెల్యేల విదేశీ పర్యటన అర్థరహితం * రాష్ర్టంలోనే అధ్యయనం చేయవచ్చు మైసూరు, న్యూస్లైన్ : ‘ముఖ్యమంత్రి, మంత్రులే గవర్నర్ మాట వినడం లేదు. నా సలహాలు వారికి మాత్రమే పరిమితం. ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్లడం వారి వ్యక్తిగత విషయం. ఇందులో నేను జోక్యం చేసుకోను. అయితే ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల అభివృద్ధి, ప్రాధాన్యతలపై అధ్యయనం జరపాల్సిన అవసరం ఉంది. నా మాట వినని సీఎం, మంత్రుల గురించి నేనేమీ మాట్లాడను. గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నా’ అని రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్. భరదాజ్ వైరాగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. నగరంలో శుక్రవారం ఓ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ ఎవరి మాటా వినడం లేదన్నారు. కనుక గవర్నర్ పదవి నుంచి వైదొలగాలని యోచిస్తున్నానని అన్నారు. గత బీజేపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పాలనపై కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలు అధ్యయనాలు జరపడానికి రాష్ట్రంలోనే చాలా ప్రదేశాలున్నాయని, కనుక వారు విదేశీ పర్యటనలకు వెళ్లడంలో అర్థం లేదని ఆయన చురకలు అంటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు ఊహించని షాక్
'కోపం' ఇంత ప్రమాదకరమైనదా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
Droupadi Murmu In Ayodhya: అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (ఫొటోలు)
భారత్లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..
నేడు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ విచారణ
వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం
టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
తప్పక చదవండి
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
- తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
Advertisement