-
రెండేళ్లలో రూ.1,139కోట్లతో అభివృద్ధి
ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మహబూబాబాద్ : నియోజకవర్గంలో రెండేళ్లలో రూ.1,139 కోట్ల 53లక్షల నిధులు మంజూరు కాగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిషన్ భగీరథ కింద రూ.576 కోట్లు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ కింద 124 చెరువులు ఎంపిక కాగా మరమ్మతుల నిమిత్తం రూ.60 కోట్లు విడుదలయ్యూయని చెప్పారు. మైనర్ ఇరిగేషన్ కింద ట్యాంకుల నిర్మాణానికి రూ.3 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లు, ఇతర నిర్మాణాలకు రూ.62.86 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ నుంచి 131 పనుల(బోర్వెల్స్, పైపులైన్స్, ఓపెన్ వెల్స్)కు రూ.3.5కోట్లు రాగా పనులు చేసిన ట్లు చెప్పారు. ఐటీడీఏ కింద 20 పనులు చేయగా ఇందుకు రూ. 11.88కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో విద్యా, సంక్షేమ శాఖల నుంచి ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతులు ప్రహరీ, తాగునీటి సౌకర్యం, ఇతరాల కోసం రూ.6.27 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆర్అండ్బీ శాఖకు చెందిన 34 పనులు జరగ్గా రూ. 193.07కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మానుకోట నుంచి ఈదులపూసపల్లి రోడ్కు రూ.25కోట్లు కేటారుుంచామని, టెండర్ పూర్తరుు్యందన్నారు. వ్యవసాయ శాఖ నుంచి పనిము ట్లు, ట్రాక్టర్లకు రూ.2కోట్లు మంజూరైనట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్కు సంబంధించి నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్, గూడూరు, గోదాములకు రూ.9.5 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ట్రాన్స్కో నుంచి సబ్స్టేషన్లు, ఇతరాల కోసం రూ.68.7 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో ఎస్ఎన్సీయూ, గూడూరులో హెల్త్సెంటర్ కోసం రూ. 5.15 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. నియోజకవర్గానికి 400 డబుల్బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా నిర్మాణానికి రూ.21.2 కోట్లు కేటారుుంచామని తెలిపారు. మానుకోటలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి రూ.2కోట్లు, మున్సిపాలిటీలోని 44 పనులకు రూ.2.41 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. సీడీఎఫ్ నుంచి 69 పనులకు రూ.3 కోట్లు కేటారుుంచానన్నారు. రెండు గిరిజన గురుకుల భవన నిర్మాణాలకు రూ.5కోట్లు మంజూరయ్యూయని తెలిపారు. నెల్లికుదురు మండ లం ఆలేరు నుంచి కోమటిపల్లి రోడ్డు కోసం రూ.6.5 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మానుకోటలో సెంట్రల్ లైటింగ్ కోసం రూ.5కోట్లు మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందన్నారు. అనంతారం మైసమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ నుంచి రూ.3కోట్లు, టూరిజం శాఖ నుంచి రూ.కోటి మంజూరయ్యాయన్నారు. గూడూరు ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందని తెలిపారు. నెల్లికుదురు, మునిగలవీడు, మేచరాజుపల్లి, మట్టెవాడ, అన్నారంలో బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరయ్యూయని వివరించారు. మున్నేరువాగుపై చెక్డ్యామ్, ఇతర పనుల కోసం రూ.30 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సమావేశంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రామ్మోహన్రెడ్డి, డోలి లింగుబాబు, పొనుగోటి రామకృష్ణారావు, చౌడవరపు రంగన్న, తూము వెంకన్న, ఆదిల్, చిట్యాల జనార్ధన్, జెర్రిపోతుల వెంకన్న, మల్సూర్, వెన్నమల్ల అజయ్, పెద్ది సైదులు, చారి, దార యాదగిరిరావు, రాజేష్ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం తగదని, బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథ పనుల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. బాధ్యులైన ఇంజినీర్లు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవన్నారు. మంగళవారం ప్రగతిభవన్లో హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీలు కవిత, బీబీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, భూపతిరెడ్డి, రాజేశ్వర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్రెడ్డి, మేయర్ సుజాత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కోటి మొక్కలు.. రెండేళ్లలో ప్రతి నియోజకవర్గంలో కోటి మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, 11 రకాల కాంపోనెంట్ల కింద 3.35 కోట్ల మొక్కలను పెట్టేందుకు ఈ నెలాఖరులోపు ఉపాధి పనులతో గుంతలను తవ్వించాలని సూచించారు. వర్షాలు ప్రారంభం ఆయన వెంటనే మొక్కలు నాటడాన్ని చేపట్టి ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగస్వాములను చేసేందుకు మండలాలు, గ్రామాల వారీగా రూపొందించిన కార్యాచరణ నివేదికలను ప్రజాప్రతినిధులకు అందజేయాలన్నారు. మిషన్ కాకతీయ.. మిషన్ కాకతీయ మొదటి దశ కింద రూ. 234 కోట్లతో 76,724 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు మంజూరు చేసిన 658 పనులలో 571 పనులు పూర్తి అయ్యాయని పోచారం తెలిపారు. మిగిలిన 87 పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండో దశ కింద గుర్తించిన 674 పనులలో 50 వేల ఎకరాలకు నీరు అందించే 649 చెరువుల పునరుద్ధరణకు రూ. 227 కోట్ల అంచనాతో పనులను మంజూరయ్యాయన్నారు. వాటిలో 610 పనుల అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, 604 పనులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోపు అగ్రిమెంట్తో పాటు గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టాలన్నారు. ప్రతి వర్షపు చుక్కను నిలువ చేసేందుకు అనువుగా చెరువుల తూములు, అలుగులను ముందస్తుగా పటిష్టపర్చాలని సూచించారు. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునికీకణకు ప్రభుత్వం రూ. 115 కోట్లను మంజూరు చేయనుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోకి రాని భూములకు నీటి వసతి కల్పించేందుకు చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నామన్నారు. పథకాల అమలులో మనమే ఫస్టు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మన జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని అధికారులకు సూచిం చారు. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. ఉపాధి హామీ తదితర పథకాల్లో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 24 శాతం ఉంటే, జిల్లాలో 21.46 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చెట్లకు కూడా నీరందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రం లోని రఘునాథ చెరువును ట్యాంకు బండ్గా మార్చనున్నామని కవిత తెలిపారు. చెరువు పక్కనుంచే నిజాంసాగర్ కాలువ వెళ్తున్నందున అందులోనుంచి నీరు ఈ చెరువులోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ట్యాంకు బండ్ నిర్మించనున్నట్లు తెలిపారు. జూన్ 10 నుంచి హరితహారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటించడానికి ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. వచ్చేనెల 10 నుంచి హరితహారం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో రెండేళ్లల్లో వేయి ఎకరాలలో గమ్కరియా మొక్కలను నాటించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసేందుకు సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణానికి అవసరమైన 43.73 ఎకరాల ప్రభుత్వ భూములలో 42.22 ఎకరాలను సేకరించామని తెలిపారు. అలాగే 2.65 ఎకరాల ప్రైవేటు భూములలో రెండు ఎకరాలను సేకరించి అప్పగించామన్నారు. పైపులైన్లు, ఇతర నిర్మాణ పనులకు అవసమరైన 36 హెక్టార్ల అటవీ భూములను అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద సేకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే 36 రైల్వే క్రాసింగ్ల గుండా పైపులైన్లు నిర్మించేందుకు రైల్వే అధికారులతో సంయుక్తంగా సర్వే ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. జాతీయ రహదారులకు సంబంధించి 35, ఆర్అండ్బీకి సంబంధించి 451, పీఆర్కు సంబంధించి 748, సాగునీటి కాలువలకు సంబంధించి 206 చోట్ల క్రాసింగ్లు ఉన్నాయని, వాటిపై సంయుక్త తనిఖీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన అన్ని పనులను ఏకకాలంలో పూర్తి చేయించేందుకు రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘భగీరథ’ వేగం పెంచండి ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిజామాబాద్ జిల్లాలో రూ. 4 వేల కోట్ల విలువైన పనులను ప్రభుత్వం చేపడుతోందని, చరిత్రలో ఇది ఒక అద్భుత విషయమని మంత్రి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రూ. 41.11 కోట్లతో జలాల్పూర్ వద్ద నిర్మిస్తున్న ఇన్టెక్ వెల్ పనులలో ఎక్కువ మంది కూలీలను నియమించాలని సూచించారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,350 కోట్లు, సింగూరు నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జిల్లాలోని 1,645 ఆవాసాలకు సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. జూన్ 30 నాటికి 121 గ్రామాలకు, డిసెంబరు నాటికి మరో 148 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు వ్యవసాయ భూములలో వేసే పైపులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదు ‘‘మిషన్ కాకతీయ విషయంలో నాకు ఒక్కసారి కూడా ఇరిగేషన్ ఎస్ఈ, సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వలేదు’’ అని ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయో కూడా చెప్పడం లేదన్నారు. ఎస్ఈ వద్ద తన ఫోన్ నంబరు కూడా లేదని పేర్కొన్నారు. ఈఈ, డీఈలకు కూడా నేను తెలియదన్నారు. రాజేశ్వర్ ఆవేదనపై మంత్రి పోచారం స్పందించారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో.. ఇందల్వాయి నుంచి ధర్పల్లికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డు అత్యంత దారుణంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రోడ్డుకు అనుమతుల విషయంలో అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోడ్డు బాగు చేయించలేకపోతున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడా చెట్లు అడ్డుగా లేవన్నారు. అయినా అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అనుమతులు ఇస్తే రోడ్డు వేయించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో మిషన్ కాకతీయ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదని, అధికారులు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. -
జెడ్పీ పాలనా తీరును పరిశీలించిన కేంద్ర బృందం
హన్మకొండ : జిల్లా ప్రజాపరిషత్ పనితీరు, వివిధ పథకాల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, ఉద్యోగుల సేవలు తదితర వివరాలు సేకరించేందుకు కేంద్ర బృందం సోమవారం వరంగల్ జిల్లా పరిషత్కు వచ్చింది. తెలంగాణలో ఉత్తమ జిల్లా పరిషత్గా వరంగల్ ఎంపిక కావడంతో పనులను పరిశీలించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జెడ్పీల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వివరాలు సేకరించింది. దేశంలోని అన్ని జిల్లా ప్రజాపరిషత్లు ఈ ఫార్మాట్లో వివరాలు పొందుపరిచాయి. అరుుతే తెలంగాణలో వరంగల్ జెడ్పీ అత్యధిక పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జెడ్పీలలో ఆన్లైన్లో పొందుపర్చిన మేరకు పనులు జరిగాయా? లేదా అని తెలుసుకునేందుకు కేరళ, మణిపూర్లకు చెందిన ఐఏఎస్ అధికారులు రాంనాయర్, కె.కె.ఠక్కర్తో కూడిన కేంద్ర బృందం జిల్లా పర్యటనకు వచ్చింది. అందుబాటులో ఉన్న జెడ్పీటీసీ సభ్యులతో బృందం అధికారులు సమావేశమై వారి నుంచి పలు సమాధానాలు రాబట్టారు. అధికారాల బదలాయింపు, సమావేశాల నిర్వహణ తీరు, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు జెడ్పీటీసీ సభ్యులు తమ సమస్యలను వివరించారు. జెడ్పీలకు నిధులు నిలిచిపోవడంతో అభివృద్ది కుంటుపడుతోందని చెప్పారు. కాగా, ఈ బృందం మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పథకాల అమలు, నిధుల వినియోగంపై తెలుసుకోనున్నారు. కేంద్ర బృందాలు అన్ని రాష్ట్రాలలో పర్యటించి పనితీరును పరిశీలించిన తర్వాత జాతీయ స్థాయిలో అధిక పాయింట్లు సాధించిన జిల్లాకు ప్రత్యేక నిధులు కేటారుుస్తారని జెడ్పీ సీఈవో అనిల్కుమార్రెడ్డి చెప్పారు. జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజాపరిషత్గా ఎంపికైతే కేంద్రం నుంచి పారితోషికం కింద రూ.40 లక్షలు వస్తాయన్నారు. బృందం వెంట జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ తదితరులు ఉన్నారు. -
నత్తే నయం!
కొనసాగుతున్న అభివృద్ధి పనులు కానరాని నాణ్యత {పమాణాలు పూర్తికాని రోడ్ల విస్తరణ అధికారుల తీరుపై మేయర్ గుర్రు విజయవాడ సెంట్రల్ : నగరంలో అభివృద్ధి పనులు నీరసంగా సాగుతున్నాయి. సమగ్ర ప్రణాళిక లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. దీంతో అంచనాలు పెరిగిపోయి నగరపాలక సంస్థపై ఆర్థిక భారం పడుతోంది. కొండ ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి నెలకొంది. పుష్కలంగా నిధులు మంజూరైనప్పటికీ ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. ఫలితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. జరిగిన పనుల్లోనూ నాణ్యత లోపించిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కమిషనర్కే మస్కా 13వ ఆర్థిక సంఘం, ప్లాన్, నాన్ప్లాన్, ఇరిగేషన్ గ్రాంట్లు, స్టేట్ఫైనాన్స్, నగరపాలక సంస్థ జనరల్ గ్రాంట్ల ద్వారా నగరంలోని మూడు సర్కిళ్లలో రూ. 158.28 కోట్లతో 750 పనులను నాలుగు నెలల కిందట చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ పూర్తికావాల్సి ఉంది. ఇందులో 494 పనులు పూర్తికాగా, 138 అభివృద్ధి దశలో ఉన్నాయి. 82 ప్రారంభ దశలో ఉండగా, 36 పనులు ఇంకా టెండర్ దశలో కునారిల్లుతున్నట్లు ఇంజినీరింగ్ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతంటే అదీ అనుమానమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ దెబ్బతింటోంది. సర్కిల్-1 పరిధిలో పనులు ప్రారంభం కాకుండానే తప్పుడు రికార్డులతో కమిషనర్ను పక్కదారి పట్టించేందుకు ఏఈ, డీఈలు యత్నించారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో ఈ విషయం బయటపడడంతో వారిని విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ తరహాలో కొందరు ఏఈలు కాగితాలపైనే పనులు జరిగినట్లు చూపిస్తూ మస్కా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతకు తిలోదకాలు ఇప్పటివరకు జరిగిన పనులను నిశితంగా పరిశీలిస్తే 40 శాతం పనులు నాసిరకంగా ఉన్నాయనే వాదనలున్నాయి. సర్కిల్-3 చేపట్టిన డ్రెయినేజీ పనుల్లో నాణ్యత లోపించడంపై మేయర్ కోనేరు శ్రీధర్ తప్పుబట్టారు. చీఫ్ ఇంజినీర్కు ఫిర్యాదు చేశారు. కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు పనుల్లో నాణ్యత లేకుంటే ఎలా అంటూ నిలదీసినట్లు తెలిసింది. సర్కిల్-1 చేపట్టిన పనుల్లో కొన్ని నాసిరకంగా ఉండడంపై కమిషనర్ జి.వీరపాండియన్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి కమిషనర్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. సింగ్నగర్ ప్రాంతంలో చేపట్టిన కొన్ని పనుల్లో డొల్లతనం వెలుగుచూసింది. విస్తరణ పనులకు అడ్డంకులు.. సమగ్ర ప్రణాళికలు, ఏర్పాట్లు లేకుండా టెండర్లు పిలవడంతో రోడ్ల విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దుర్గగుడి ఫ్లైఓవర్, కృష్ణాపుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు నగరంలో సుమారు 29 రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. దీనికి సంబంధించి నిధులు కేటాయించడంతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. విస్తరణకు మార్కింగ్ ప్రకారం రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు చేపట్టారు. మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను ఇప్పటికీ తొలగించకపోవడంతో రోడ్డు పనులు ఆగిపోయాయి. స్తంభాలు తొలగిస్తేనే పనులు చేయగలుగుతామని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. భవానీపురం, విద్యాధరపురం, సింగ్నగర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. విస్తరణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓ కొలిక్కిరాలేదు. దీనిపై మేయర్ కోనేరు శ్రీధర్ సీరియస్ అయ్యారు. స్తంభాల తొలగింపునకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలంటూ కమిషనర్కు లేఖరాసినట్లు తెలుస్తోంది. -
‘మై షుగర్’కు పూర్వవైభవం
- సెప్టెంబర్లో చక్కెర ఉత్పత్తి - అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కూడా మండ్య : చాలా కాలం తర్వాత మండ్య జిల్లాలో మై షుగర్ కంపెనీ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. సెప్టెంబర్లో ఈ పరిశ్రమలో చక్కెర ఉత్పత్తిని ప్రారంభించే దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన ఈ పరిశ్రమ పాలక మండలి సభ్యులు కేవలం పదవులను అలంకరించేందుకు పరిమితయ్యారు తప్పా, పరిశ్రమ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో పరిశ్రమ మూతపడేందుకు కారణమైంది. ఈ ఐదేళ్లలో పరిశ్రమ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చెరుకును క్రష్ చేస్తే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. సాంకేతిక లోపాలు తలె త్తాయి. చెరుకును క్రష్ చేసే సమయంలో యంత్రాలు ఆగిపోయేవి. ఈ ప్రభావం చెరుకు రైతులపై తీవ్రంగా చూపింది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సైతం ఈ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టాయి. ఈ అవినీతిపై లోకాయుక్తలో కేసు కూడా నడుస్తోంది. పరిశ్రమ పూర్తిగా మూతపడే పరిస్థితి ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో మై షుగర్ పరిశ్రమ అభివృద్ధికి రూ. 120 కోట్లను ప్రకటించింది. కంపెనీలో చెడిపోయిన యంత్రాలకు మరమ్మతు చేయడం, అవసరమైన విడిభాగాలను చేర్చడం, అన్ని విధాలుగా పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్లో చెరుకు క్రషింగ్ మై షుగర్ కంపెనీ తొలిదశలో ఏర్పాటు చేసిన బాయిలర్లు పూర్తిగాచెడిపోయాయి. కొంత కాలంగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో బాయిలర్లతో పాటు చెరుకును పొడి చేసే యంత్రాలు కూడా చెడిపోయాయి. ఇప్పటికే ఈ యంత్రాలను బాగు చేస్తున్నారు. ఇందు కోసం తమిళనాడు నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పిం చారు. ఈ నెల చివరకు యంత్రాలను సిద్ధం చేసి సెప్టెంబర్ మొదటి వారంలో చెరుకు క్రషింగ్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా చెడిపోయిన బాయిలర్లు మై షుగర్ కంపెనీలో ఉన్న రెండు బాయిలర్లు ఎందుకు పనికి రానంతా చెడిపోయాయి. మరో పదేళ్ల పాటు పనిచేయాల్సిన బాయిలర్లు సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ దుస్థితికి చేరుకున్నాయి. ఇదే విషయాన్ని శాంకేతిక నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. 2011 -12 పంట కాలంలో ఒక బాయిలర్లో చుక్క నీరు కూ డా లేకుండా నడిపించడంతో అది మొత్తం కాలిపోయింది. నిధుల కొరత గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన రూ. 120 కోట్లు ఇప్పటి వరకు మంజూరు కాలేదని అధికారులు తెలి పా రు. అయితే చెడిపోయిన బాయిలర్లును నోయిడా కంపెనీకి చెందిన నిపుణులకు చూపించామని, అవసరమున్న పరికరాలను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. బడ్జెట్ విషయం మంత్రి వర్గం సమావేశంలో కూడా చర్చలు జరిపారని, అనంతరం రూ. 95 కోట్లు విడుదల చేయడానికి మంత్రి వర్గం అంగీకరించిందని, ఈ నిధు లు కూడా విడుదల కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ యూనిట్ ప్రారంభం 2007లో మైషుగర్ ప్యాక్టరీలో విద్యుత్ యూనిట్ను సా్థి పంచారు. ఈ యూనిట్ కేవలం 17 గంటలు మాత్రమే పనిచేసేది. తర్వాత విద్యుత్ లేకుండా పోయేది. ప్రస్తుతం దీనిని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్ మహదేవు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నాటికి ప్రతి రోజూ 15 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి కర్ణాటక పవర్ కార్పొరేషన్కు విక్రయించనున్నట్లు స్పష్టం చేశారు. విడుతల వారీగా విద్యుత్ ఉత్పాదన శక్తి కూడా 30 మెగా వాట్లకు పెంచనున్నట్లు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్తో 'సలార్' బైక్ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
తప్పక చదవండి
- అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
Advertisement