-
ఆ గుహలోకి వెళ్తే ..ఆత్మలను లైవ్లో చూడొచ్చట!
ఆత్మల గురించి కథలు కథలుగా వినడం లేదా సినిమాల్లో చూడటమే. గాన్నీ ప్రత్యక్షం చూసిన అనుభవం ఎవరికీ ఉండదు. మహా అయితే దేన్నో చూసి ఊహించుకుని భయపటమే జరగుతుంది. ఈ గుహలోకి వెళ్తే ఆ కోరక తీరిపోతుందట. ఏంటీ..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగా ఆత్మలను ప్రత్యక్ష్యంగా చూడాలనుకునేవాళ్లు నేరుగా ఈ గుహలోకి వెళ్లిపోతే ఆ ఫీలింగ్ దక్కుతుందట. పైగా ఆ అనుభవాన్ని అంత తేలిగ్గా మరిచిపోలేరట కూడా. ఆ గుహ ఎకడుందంటే..? ఇదేదో మామూలు కొండగుహ కాదు, దయ్యాల నిలయం. ఫిన్లండ్లోని కోలి అభయారణ్య ప్రాంతంలో ఉన్న ఈ గుహను స్థానిక ఫిన్నిష్ భాషలో ‘పిరున్కిర్కో’ అంటారు. అంటే, దయ్యాల ఆలయం అని అర్థం. ప్రేతాత్మల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వచ్చి, ఈ గుహలో కాసేపు గడిపి వెళుతుంటారు. ఈ గుహలోకి అడుగుపెట్టిన తర్వాత గుహలో ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి కలిగినట్లు ఇందులోకి వెళ్లి వచ్చిన చాలామంది చెప్పారు. ఇందులోకి అడుగు పెట్టగానే ఎవరో అదృశ్యంగా తాకుతున్న అనుభూతి కలిగిందని, చెవిలో ఎవరో గుసగుసలు చెబుతున్నట్లుగా అనిపించిందని పలువురు చెప్పారు. గుహలో ఎవరో రోదిస్తున్న ధ్వని వినిపించినట్లుగా కూడా కొందరు చెప్పారు. ఈ గుహ లోపలి పొడవు 34 మీటర్లు ఉంటుంది. అంతా ఖాళీగా, చీకటిగా ఉంటుంది. ఈ గుహలోని ఆత్మ గురించి ఫిన్లండ్లో చాలా కథలు శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇందులోకి వెళ్లేవారికి అక్కడ ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి ఎందుకు కలుగుతోందనే దానిపై నిగ్గు తేల్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఫిన్లండ్ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధనలు ప్రారంభించారు. (చదవండి: ఆ ఫౌంటెన్ కోసం ఏకంగా రూ. 16 కోట్లు ..! కానీ చివరికి..) -
మిస్టీరియస్ డెవిల్స్ బ్రిడ్జ్..
-
వామ్మో దెయ్యాల ఊళ్లు.. ఆ ఇళ్లలో ప్రేతాత్మలు ఉన్నాయా?.. అక్కడికి వెళ్లాలంటే?
ఆ ఊళ్లో ఎటుచూసినా చెదురు మదురుగా విసిరేసినట్లుండే భూత్ బంగ్లాలే కనిపిస్తాయి. వీధుల్లో తిరుగుతుంటే, అక్కడక్కడా పాడుబడిన వాహనాలు కనిపిస్తాయి. ప్రపంచంలో అక్కడక్కడా అరుదుగా కనిపించే దెయ్యాల ఊళ్లుగా పేరుమోసిన ఊళ్లలో ఆ ఊరొకటి. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటారా? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఊరి పేరు బోడీ. ఇదొక చిన్న పట్టణం. రెండువందలకు పైగా ఇళ్లు, చర్చిలు, పాడుబడిన సెలూన్లు, జూదశాలలు, వినోదకేంద్రాలు, హోటళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే, ఈ ఊళ్లో మనుషులెవరూ ఉండరు. అప్పుడప్పుడు పర్యాటకులు వచ్చిపోతుంటారు. పర్యాటకులు బస చేయడానికి ఇక్కడా ఎలాంటి వసతులూ ఉండవు. బాగున్న రోజుల్లో ఈ ఊరి జనాభా పదివేలకు పైగానే ఉండేది. ఊరికి దగ్గరగానే బంగారు గని ఉండేది. గనిలో పనిచేసేవాళ్లంతా ఈ ఊళ్లో ఉండేవాళ్లు. ఊరే కాదు, ఊరవతల ఉండే బంగారు గని కూడా ఇప్పుడు ఖాళీగా మిగిలింది. దెయ్యాల భయంతోనే జనాభా అంతా ఈ ఊరిని విడిచిపెట్టి తలోదిక్కూ వెళ్లిపోయారు. డెబ్బయ్యేళ్ల కిందట ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇంకెవ్వరూ ఇక్కడకు వచ్చి స్థిరపడే ప్రయత్నం చేయకపోవడంతో 1962లో కాలిఫోర్నియా ప్రభుత్వం దీనిని ‘బోడీ స్టేట్ హిస్టారిక్ పార్క్’గా మార్చింది. గుండెధైర్యం ఉన్న పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వస్తుంటారు. వారిలోనూ కొందరు ఇక్కడ కొన్ని పాడుబడిన ఇళ్లలో ప్రేతాత్మలు చూశామని, కొన్ని ఇళ్ల నుంచి పిల్లలు ఆడుకుంటున్న చప్పుళ్లు విన్నామని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. పాడుబడిన ఇళ్లలో అప్పటి జనాలు వాడుకున్న ఫర్నిచర్, ఇతర వస్తువులు దుమ్ముపట్టి ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ ఊరిని సందర్శించడానికి పగటి వేళల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. రుతువును బట్టి సందర్శకులను అనుమతించే వేళల్లో మార్పులు ఉంటాయి. -
ఔను! ఆ పబ్లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో
CCTV camera captures pen moving on its own: ఇటీవల ఒక ప్రోఫెసర్ దెయ్యాలు ఉన్నాయి అంటూ తెగ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత యూఎస్లో ఒక పార్క్లో దెయ్యం కూర్చోని ఉంటుందటూ భయపడితే అదేంటో అంతు తేల్చడానికి వెళ్లిన వాళ్లు అది ఒక షాప్లో ఉండే బొమ్మ అని చెప్పి సందేహాన్ని క్లియర్ చేశారు. కానీ యూకేలోని పబ్ని చూస్తే ఇప్పుడూ కచ్చితంగా మీరు నిర్ణయం మార్చుకుంటారు. పైగా సీసీఫుటేజ్లో రికార్డు అయిన వాటిని చూస్తే మాత్రం ఔనును దెయ్యలు ఉన్నాయని అనుకుండా ఉండలేరు. అసలు విషయంలోకెళ్తే...యూకేకి చెందిన రిచెల్ స్టాక్స్, ఆష్లీగ్ నైస్బిట్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు డార్లింగ్టన్లోని మార్పెత్లో బ్లాక్ అండ్ గ్రే పబ్ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత నంచి వారే ఆ పబ్ని నడపడం మొదలు పెట్టారు. అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. పబ్లో వింత వింత శబ్దాలు రావడం, వస్తువులన్నీ వాటంతట అవే కదలడం జరిగింది. దీంతో ఆ పబ్లో పనిచేసే సిబ్బంది సైతం విధులకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. అంతేకాదు ఆ అక్కాచెల్లళ్లు పబ్లోని మెట్లమీద నుంచి నడుస్తుంటే ఏవో వింత శబ్దం వచ్చిందని, పైగా సెల్లార్కి వెళ్లాలన్న భయంగా ఉందని పేర్కొన్నారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు ఆ పబ్ని తనిఖీ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే ఈ అక్కా చెల్లెళ్లు పోలీసుల ముందే దెయ్యాలు ఉన్నాయని చూపించేందుకు ఒక సాహసం చేశారు. ఈ క్రమంలో వాళ్లు ఒక పెన్ని చేతిలో పెట్టుకుని ఇక్కడ ఎవరైన ఉంటే ఈ పెన్నుని కదిలించండి అన్నారు. అంతే కాసేపటికి నిజంగానే ఆ పెన్ను దానంతటే అదే కదిలింది. దీంతో భయంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఆ పబ్లోని సీసీఫుటేజ్ని పరిశీలించి చూస్తే ...నిజంగానే ఏవో వింత ఆకారాలు, మనిషి నీడలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్కి గురైయ్యారు. అంతేకాదు ఈ సీసీఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ధైర్యం ఉంటే మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: బిగ్గరగా మాట్లాడుతోందని ఆ లెక్చరర్ను ఏం చేశారంటే?) -
ఇదేం పిచ్చో.. బాల్కనీ అంతా దెయ్యం బొమ్మలతో నింపేశాడు!
బొమ్మలతో మనం మాట్లాడితే పర్వాలేదు. అవే బొమ్మలు మనతో మాట్లాడితే భయపడక తప్పదు. ఇలా బొమ్మలతో భయపెట్టే సినిమాలు ఎన్నో! విచిత్రంగా ఓ సామాన్యుడు కూడా బొమ్మలతో భయపెట్టిస్తున్నాడు. నిజానికి అతని ఉద్దేశం వేరే అయినా స్థానికులు మాత్రం అతని ఇంటిలోపలికి కాదుకదా కనీసం కింద నుంచి బాల్కనీ వైపు చూడ్డానికి కూడా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. వెనెజులా రాజధాని కారకస్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ ఎటాన్లస్ గోన్సాల్వెజ్కు ఓ డ్రైవర్తో మంచి స్నేహం ఉండేది. అతని కారులో ఎప్పుడూ బొమ్మలు ఉండేవి. అది చూసిన గోన్సాల్వెజ్ కొడుకు తనకు కూడా ఇలా బొమ్మలను ఒక చోట సెట్ చేయమని కోరాడు. దీంతో, గోన్సాల్వెజ్ మూడేళ్లపాటు శ్రమించి బాల్కనీ నిండా బొమ్మలతో విచిత్రంగా నింపాడు. అయితే, ఆ బొమ్మల బాల్కనీ చూసిన కొడుకు సంతోషించినా, స్థానికులు మాత్రం కలవరపడుతున్నారు. అచ్చం దెయ్యం బొమ్మల్లా కనిపించే వాటిని చూసి, అతనేదో క్షుద్రపూజలు చేస్తున్నాడని, వాటిని తీసేయాల్సిందే అంటూ గొడవకు దిగారు. ఇలా కొన్ని నెలలపాటూ ఈ బొమ్మలపై గొడవ జరిగింది. ఏం చేసినా గోన్సాల్వెజ్ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానికులే సైలెంటైపోయారు. దీంతో, ప్రస్తుతం ఈ బొమ్మల బాల్కనీ అక్కడ ఓ ల్యాండ్ మార్క్గా మారింది. కొంతమంది కేవలం ఆ బాల్కనీని చూడ్డానికి అదేపనిగా వస్తున్నారు. ప్రస్తుతం అతను ఇంటిలోనికి అనుమతించడటం లేదు కానీ, కింద నుంచి చూసే అవకాశం మాత్రం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నక్సలైట్లమని నకిలీ పిస్టల్తో బెదిరింపులు
సకుటుంబ సపరివార సమేతం
పలకరించిన వరుణుడు
ఉన్న పెన్షన్లు తీసేస్తారు
‘బాబు కుయుక్తుల్లో చిక్కుకున్న ఎన్నికల కమిషన్’
ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని మీ కేశవ్ మెచ్చుకోలేదా బాబూ?
బాగా పనిచేస్తున్నారు.. ఇదే స్ఫూర్తి కొనసాగాలి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement