-
ఈ రూట్లలో నో వెయిటింగ్ లిస్టు
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్కతా మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు ఉండదని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ చెప్పారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సరుకు రావాణా కారిడార్లు (డీఎఫ్సీ) 2021 కల్లా పూర్తి కానున్న నేపథ్యంలో రైళ్ల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. రూ.2.6 లక్షల కోట్లతో నిర్మించనున్న డీఎఫ్సీల నిర్మాణం పూర్తయితే సరుకు రవాణా రైళ్లు ఈ మార్గాల్లో వెళ్తాయి. దీంతో రైళ్ల వేగం పెంచడంతోపాటు ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రైళ్లను నడపవచ్చాన్నారు. ఫలితంగా ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు ఉండదని పేర్కొన్నారు. రైళ్లలో నేరాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వినోద్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2022 మార్చి నాటికల్లా అన్ని రైల్వే స్టేషన్లు, బోగీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆందోళనల్లో రైల్వేకు వాటిల్లిన రూ.80 కోట్ల ఆస్తి నష్టాన్ని బాధ్యులైన వారి నుంచే వసూలు చేస్తామని వినోద్ యాదవ్ సోమవారం ప్రకటించారు. ఇందులో తూర్పు రైల్వేకు రూ.70 కోట్లు, ఈశాన్య రైల్వేకు రూ.10 కోట్ల నష్టం జరిగింది. -
ఒడిదుడుకుల వారం..!
మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వారంలో వచ్చే టాటా మోటార్స్, ఐటీసీ, సన్ ఫార్మా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్కు కీలకాంశాలని వారంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్తో రూపాయి మారకం.. తదితర అంశాలు కూడా మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా పరిణామాల ప్రభావం.. మన స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ వారంలో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. ఈ గురువారం (ఈ నెల 25న) ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు ఎక్స్పైరీ అవుతాయని, మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. రాజకీయ అనిశ్చితి పెరగడంతో అమెరికా మార్కెట్, ఇతర ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయని వివరించారు. కంపెనీల ఫలితాల సీజన్ కొనసాగుతోందని, అందరి కళ్లు ఈ వారంలో ఫలితాలను వెల్లడించే కంపెనీలపై ఉంటుందని తెలిపారు. కరెక్షన్ తర్వాత దూకుడు... సమీప భవిష్యత్తులో మార్కెట్లో కరెక్షన్ వుండవచ్చని, అటుతర్వాత దూకుడు కొనసాగవచ్చని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ చెప్పారు. గత కొన్ని సెషన్లుగా అమెరికాలోనూ, మన స్టాక్ మార్కెట్లోనూ ర్యాలీ కొనసాగుతోందని, ఈ వారంలో కన్సాలిడేషన్కు ఆస్కారముందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కు చెందిన వి.కె. శర్మ పేర్కొన్నారు. లాభాల స్వీకరణకు ఆస్కారం.. ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు ఈ వారంలో ముగియనున్నందున, లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశాలున్నాయని బొనాంజా పోర్ట్ఫోలియో రీసెర్చ్ ఎనలిస్ట్ ఫోరమ్ పరేఖ్ చెప్పారు. భారీ పన్ను సంస్కరణల్లో ఒకటైన జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైందని, జీఎస్టీ రేట్లు ఖరారైన నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడుతుందని యెస్ సెక్యూరిటీస్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిటాషా శంకర్ పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల విషయంలో ఎఫ్ఎంసీజీ, యుటిలిటీస్, బొగ్గును ఉపయోగించే లోహ కంపెనీలు, డెయిరీ కంపెనీలు లాభపడతాయని వివరించారు. కీలక కంపెనీల ఫలితాలు నేడు(ఈ నెల 22న) గెయిల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీలు తమ గత ఆర్థిక సంవత్సరం, క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం(ఈ నెల 23న) టాటా మోటార్స్, ఓల్టాస్, సెంట్రల్ బ్యాంక్, జిందాల్ స్టీల్ కంపెనీలు, బుధవారం(ఈ నెల 24న) అదానీ ఎంటర్ప్రైజెస్, లుపిన్, గురువారం(ఈ నెల 25న) బాష్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అశోక్ లేలాండ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, శుక్రవారం (ఈ నెల26న) ఐటీసీ, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్, మహానగర్ గ్యాస్, ఎన్బీసీసీ, దివీస్ ల్యాబ్స్ తమ తమ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. వెలుగులో జీఎస్టీ షేర్లు జీఎస్టీ మండలి వివిధ సేవలపై పన్ను రేట్లను ఖరారు చేసిన నేపథ్యంలో హాస్పిటాలిటీ చెయిన్స్, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ వంటి వినోద సంబంధ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. జీఎస్టీ రేట్లు విమానయాన సంస్థలపై సానుకూల ప్రభావం చూపుతాయని జెట్ ఎయిర్వేస్, స్పైస్జెట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేర్లు వెలుగులో ఉంటాయని నిపుణులంటున్నారు. టెలికం సేవలుపై పన్ను రేట్లను 18 శాతంగా(గతంలో 15 శాతంగా) నిర్ణయించిన నేపథ్యంలో టెలికం షేర్లపై ఒత్తిడి ఉంటుందని అంచనా. కాగా ఈ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 277 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ పెట్టుబడుల జోరు విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటిదాకా 266 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో అధిక భాగం డెట్ మార్కెట్లోకి రావడం విశేషం. రూపాయి నిలకడగా ఉండటమే దీనికి కారణమని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) మన స్టాక్ మార్కెట్లో రూ.4.157 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.12,941 కోట్ల చొప్పున వెరసి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.17,099 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ కాలానికి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.94,900 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. దీంతో మొత్తం మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ఈ ఏడాదిలో రూ. 1 లక్ష కోట్లకు మించాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement