-
ఓకే ఈవెంట్లో సందడి చేసిన సామ్- చైతూ.. కాకపోతే!
హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్లో అగ్ర కథానాయకిగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండు సంచలనమే. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయకిగా మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సిటాడెల్ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ నిర్వహించిన ఈవెంట్లో సందడి చేసింది సామ్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది తమ ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లకు సంబంధింటిన వివరాలను ఈ గ్రాండ్ ఈవెంట్లో వెల్లడించింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటాడెల్ సిరీస్ కూడా ఉంది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ పేరును కూడా మార్చేశారు. సిటాడెల్: హనీ బన్నీ పేరును ఖరారు చేశారు. సిటాడెల్ యూనివర్స్లో హనీ బన్నీ ఇండియన్ సిరీస్ అనే క్యాప్షన్తో సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఊహించని విధంగా ఈ ఈవెంట్లో అక్కినేని హీరో నాగచైతన్య కూడా సందడి చేశారు. గతేడాది తాను నటించిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత సక్సెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈవెంట్లో వెబ్ సిరీస్ టీమ్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్ట్ చేసింది. తెలుగు మోస్ట్ సక్సెస్ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్గా దూత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే చాలా రోజుల తర్వాత నాగచైతన్య, సమంత ఓకే ఈవెంట్లో కనిపించారు. విడిపోయాక వీరిద్దరు కలిసి ఈవెంట్స్లో కనిపించడం చాలా అరుదు. గతంలో వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీరిద్దరు పాల్గొన్నట్లు సమాచారం. కానీ చాలా రోజుల తర్వాత ఓకే ఈవెంట్లో ఈ జంట మెరిసింది. అయితే ఇద్దరు కూడా వేరు వేరుగా తమ మూవీల ప్రమోషన్స్లో భాగంగానే ఈవెంట్కు హాజరయ్యారు. విడివిడిగానైనా చై- సామ్ ఓ ఈవెంట్కు హాజరు కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. our homegrown spy 🔎 #SamanthaRuthPrabhu #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Cd8U5RE5df — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 Celebrating #DhoothaOnPrime - Our most successful Telugu Original series.#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/PeZ6I8bZlb — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
ఓటీటీలో మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు వెబ్ సిరీస్ ఏదో తెలుసా!
ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. గతేడాది నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో డిసెంబర్ 1న స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఎనిమిది ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్ను శరద్ మరార్ నిర్మించారు. ఈ సిరీస్కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగులో అత్యంత సక్సెస్ఫుల్గా నిలిచిన వెబ్ సిరీస్గా ఘనతను సొంతం చేసుకుంది. ఇవాళ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రైమ్ వీడియో ప్రజెంట్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేదికపై నాగచైతన్యతో పాటు ఈ సిరీస్ దర్శక, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. కాగా.. ఇటీవలే ఈనెల 19న దూత సీజన్-2 గురించి హింట్ ఇచ్చారు నాగచైతన్య. కానీ అప్డేట్ అయితే రాలేదు.. దూత సిరీస్ మాత్రం అమెజాన్ ప్రైమ్లో తెలుగు సక్సెస్ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్గా నిలిచింది. Celebrating #DhoothaOnPrime - Our most successful Telugu Original series.#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/PeZ6I8bZlb — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
38 భాషల సబ్ టైటిల్స్తో 240 దేశాల్లో ‘దూత’.. ఆనందంగా ఉంది: నిర్మాత
‘‘దూత’ వెబ్ సిరీస్ని అమేజాన్ సంస్థ వారు 38 భాషల్లో సబ్ టైటిల్స్తో 240 దేశాల్లో విడుదల చేశారు. వీక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో నాగచైతన్య, విక్రమ్, నేను.. ఇలా ‘దూత’ టీమ్ అంతా చాలా ఆనందంగా ఉన్నాం’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘దూత’. నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్పై శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 1 నుంచి అమేజాన్ ప్రైమ్లో ప్రసారమవుతోంది. ఈ సందర్భంగా శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘విక్రమ్ చెప్పిన ‘దూత’ ఆలోచన, కథాంశం చాలా నచ్చింది. ఈ కథకి నాగచైతన్యనే మొదటి ఎంపిక. ఆయనకు ఇది తొలి వెబ్ సిరీస్. కథ వినగానే చేద్దామన్నారు. సినిమా, వెబ్ సిరీస్.. ఏదైనా నిర్మాణం అనేది సవాల్తో కూడుకున్న వ్యాపారం. ప్రస్తుతం నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్పై రెండు చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: 'దూత' వెబ్ సిరీస్ నటీనటులు: నాగచైతన్య, ప్రియ భవాని శంకర్, పార్వతి తిరువతు, పశుపతి తదితరులు నిర్మాత: నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ డైరెక్టర్: విక్రమ్ కే కుమార్ మ్యూజిక్: ఇషాన్ చబ్రా సినిమాటోగ్రఫీ: మికాలాజ్ సైగుల విడుదల తేదీ: 2023 డిసెంబర్ 01 ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో ఎపిసోడ్స్: 8 స్టార్ హీరోల సినిమాలు కరోనా టైంలో డైరెక్ట్ ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి గానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నేరుగా మన తెలుగు హీరోలు నటించలేదు. ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్య.. తొలిసారి ఓ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. 'దూత' పేరుతో దీన్ని వెబ్ సిరీస్ గా తీశారు. తాజాగా ఇది ఓటీటీలో రిలీజ్ అయింది. థ్రిల్లర్ కథతో తీసిన ఈ సిరీస్ ఎలా ఉంది? టాక్ ఏంటనేది? ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి? సాగర్ వర్మ(నాగ చైతన్య) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. విలువలు కంటే డబ్బే ముఖ్యం. కొత్తగా పెట్టిన 'సమాచార పత్రిక' న్యూస్ పేపర్ కి చీఫ్ ఎడిటర్ గా అప్పాయింట్ అవుతాడు. ఈ బాధ్యతలు అందుకున్న కాసేపటి తర్వాత చిన్న పేపర్ క్లిప్ దొరుకుతుంది. సాగర్ కారుకి ఏక్సిడెంట్ అయ్యి అందులో కుక్క చనిపోతుంది అని రాసి ఉంటది. సాగర్ ఇది చదివిన క్షణాల్లోనే అలానే ప్రమాదం జరుగుతుంది. ఇలానే పేపర్ క్లిప్స్ సాగర్ కి దొరకడం, అతడి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వరసగా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ వీళ్ళ చావులకి, పేపర్ క్లిప్స్ తో సంబంధం ఏంటి? వీళ్లనే ఎందుకు చంపుతున్నారు? డీసీపీ క్రాంతి(పార్వతి), సత్యమూర్తి (పశుపతి)కి సాగర్ తో లింక్ ఏంటి అనేదే 'దూత' స్టోరీ. ఎలా ఉంది? తన ఫ్రెండ్ అయిన జర్నలిస్ట్ కాసేపట్లో చనిపోతాడని హీరో జర్నలిస్ట్ కి తెలుస్తుంది. దీంతో భయపడతాడు. పరిగెత్తుకుని మరి వెళ్లి అతడి చావుని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ తన కళ్ళ ముందే.. జర్నలిస్ట్ ఫ్రెండ్ నోట్లో గన్ పెట్టుకుని కాల్చుకుని చనిపోవడం హీరో చూస్తాడు. ఇది ఒక్కటే కాదు ప్రతిసారీ ఎవరో ఒకరు చనిపోతారని ముందు తెలియడం, వాళ్ళని కాపాడటానికి వెళ్లేలోపు వాళ్ళు చనిపోవడం.. చదువుతుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది కదా.. స్క్రీన్ పై చూస్తుంటే ఇంకా మజాగా ఉంటుంది. దూత సిరీస్ గురించి సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే. స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుని హీరో సాగర్ చనిపోవడానికి ట్రై చేసే సీన్ తో ఈ వెబ్ సిరీస్ మొదలవుతుంది. కట్ చేస్తే టైటిల్స్ పడతాయి. స్టోరీ ఆరు రోజులు క్రితానికి వెళ్తుంది. 'సమాచార పత్రిక ' న్యూస్ పేపర్ లాంచ్, దీనికి చీఫ్ ఎడిటర్ గా సాగర్ నియామకం, కాసేపటి తర్వాత ఫ్యామిలీతో కలిసి సాగర్... కార్ లో ఇంటికి రిటర్న్ వెళ్తుండగా ఓ దాబా దగ్గర కారు ఆగిపోతుంది. పక్కనే ఉన్న హోటల్ కి సాగర్ వెళ్తే అక్కడ.. కాసేపట్లో తన కార్ కి ఏక్సిడెంట్ అవుతుందని, కుక్క చనిపోతుందని ఉంటుంది. సరిగ్గా అలానే జరుగుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్టోరీ పరిగెడుతుంది. కుక్క దగ్గర నుంచి స్టార్ట్ అయినా చావులు.. ఓ లారీ డ్రైవర్, యూట్యూబర్.. ఇలా ఎపిసోడ్ కి ఒకటి చొప్పున జరుగుతుంటాయి. మరోవైపు సాగర్ ఓ హత్య చేస్తాడు. అతడ్ని అరెస్ట్ చేయాలని డీసీపీ క్రాంతి.. ఆధారాలు సేకరించే పనిలో ఉంటది. ఇంతకీ ఈ హత్యలకు.. అప్పుడెప్పుడో స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఉన్న 'దూత' అనే న్యూస్ పేపర్ కి లింక్ ఏంటనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. అయితే ఈ సిరీస్ లో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. మొదట్లో కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వున్నాయా అనిపిస్తుంది. కానీ చివరి రెండు ఎపిసోడ్స్ లో మొత్తం లింక్స్ అన్ని డైరెక్టర్ కనెక్ట్ చేసిన తీరు మంచి హై ఇస్తుంది. ఇక వెబ్ సీరీస్ లో 'f వర్డ్' తో పాటు ఓ బూతు పదేపదే వినిపిస్తుంది. కానీ కథకి అది ఏం ఇబ్బంది అనిపించదు. అలానే సిరీస్ లో చూపించే చావులన్ని కొంచెం హారిబుల్ గా ఉంటాయి. వీటికి ముందే ప్రిపేర్ అయితే సిరీస్ తెగ నచ్చేసింది. ఎవరెలా చేశారు? నాగ చైతన్యకి ఇది ఓటీటీ ఎంట్రీ. ఫస్ట్ వెబ్ సిరీస్ తోనే హిట్టు కొట్టేశాడు. సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో సెటిల్డ్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. డీసీపీ క్రాంతిగా మలయాళ నటి పార్వతి తిరువత్తు.. బాగా చేసింది. సాగర్ భార్య ప్రియాగా చేసిన ప్రియ భవాని శంకర్ కూడా ఉన్నంతలో అలరించింది. ఇకపోతే డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్రహ్మీ కొడుకు రాజ గౌతమ్ కనిపించింది కాసేపే అయిన నెగటివ్ రోల్స్ లో డిఫెరెంట్ గా కనిపించారు. మిగిలిన వాళ్ళందరూ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ విషయాలకు వస్తే.. డైరెక్టర్ అండ్ రైటర్ విక్రమ్ కే కుమార్ ని మెచ్చుకుని తీరాలి. చాలా రోజుల తర్వాత తను గతంలో తీసిన '13B' లాంటి థ్రిల్లర్ కథతో కేక పుట్టించారు. సిరీస్ లో సీన్స్ అన్ని కూడా నైట్, వర్షంలోనే ఉంటాయి. వాటన్నిటినీ సినిమాటోగ్రాఫర్ బ్యూటిఫుల్ గా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే.. 'binge watch' సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారా.. 'దూత' బెస్ట్ ఆప్షన్. -
దూత ఓ కొత్త అనుభూతి
‘‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ‘దూత’ వెబ్ సిరీస్ గురించి నాగచైతన్యతో చెప్పాను. హారర్, థ్రిల్లర్ నేపథ్యం అంటే నాకు భయం అన్నాడు. కథ వినమన్నాను. ఆ తర్వాత కథ నచ్చడంతో చేస్తానని చెప్పాడు. సూపర్ నేచురల్, ఊహాతీతమైన అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీశంకర్, ్రపాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ డిసెంబరు 1 నుంచి అమేజాన్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎనిమిది ఎపిసోడ్స్గా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ కె. కుమార్ చెప్పిన విశేషాలు. ► ‘దూత’ పూర్తిగా కల్పిత కథ. ‘దూత’ అంటే ఏదైనా సమాచారాన్ని చేరవేసేవాడు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటేనే సవాల్తో కూడుకున్నది. సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వాస్తవాలను సాగర్ ఎలా పాఠకుల ముందు ఉంచాడు? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? అనేది ప్రేక్షకులు అంచనా వేయలేరు. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకి వచ్చి, ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రని సవాల్గా తీసుకుని చేశాడు నాగచైతన్య. ►‘దూత’లో మూడు సినిమాలు తీసేంత కథ ఉంది. అందుకే వెబ్ సిరీస్గా తీశాం. పైగా సినిమాగా తీస్తే మన ప్రేక్షకులకు మాత్రమే చేరువ అవుతుంది. ఓటీటీలో ప్రసారం చేయడం ద్వారా ఇతర దేశాల్లోని వారు కూడా మన ఇండియన్ వెబ్ సిరీస్లు చూసే అవకాశం ఉంటుంది. ►షార్ట్ ఫిలిం, వెబ్ ఫిల్మ్, సినిమా.. దేని కష్టం దానికి ఉంటుంది. అయితే సినిమా తీయడం సులభమే.. కానీ, మంచి మూవీ తీయడం చాలా కష్టం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement