-
ఎన్ఎండీసీ వజ్రాల వేట!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఎన్ఎండీసీ లిమిటెడ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న 9 బిలియన్ డాలర్ల విలువైన (రూ.57,600 కోట్ల) వజ్రాల గనులకు బిడ్లు వేసే ఆలోచనతో ఉంది. ఇప్పటికే అదానీ, వేదాంత ఈ వజ్రాల గనులపై కన్నేసిన విషయం తెలిసిందే. వీటి సరసన పోటీలోకి ఎన్ఎండీసీ కూడా రానున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారులతో మాట్లాడేందుకు ఎన్ఎండీసీ త్వరలోనే ఓ బృందాన్ని కూడా పంపనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. వజ్రాల గనిని నామినేషన్ ప్రాతిపదికన తమకు నేరుగా కేటాయించాలని కోరగా, దాన్ని కేంద్రం తోసిపుచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. విశాల ప్రయోజనాల కోణంలో గనులను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. మధ్యప్రదేశ్లోని బందర్ ప్రాంతంలో 32 మిలియన్ క్యారట్ల నిల్వలు ఉన్నట్టు అంచనా. ఈ గనిని అంతర్జాతీయంగా వజ్రాల మైనింగ్లో పేరొందిన రియో టింటో ఈ ఏడాది ఆరంభంలో వదిలిపెట్టి వెళ్లిపోయిన విషయం గమనార్హం. ఈ నెలాఖరులోపు బందర్ వజ్రపు గనికి మధ్యప్రదేశ్ సర్కారు వేలం నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 30 నాటికి టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడుతుందని మధ్యప్రదేశ్ మినరల్ రిసోర్సెస్ ఉన్నతాధికారి మనోహర్లాల్ దూబే తెలిపారు. అటవీ అనుమతులు వేగంగా ఇచ్చేందుకు పర్యావరణ శాఖ లోగడే హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇక నూతన ఖనిజ వనరుల విధానంలో భాగంగా భారీ ప్రాజెక్టులకు బిడ్లు వేసేందుకు అర్హతలను సడలించనున్నారు. వజ్రాల వేట: మధ్యప్రదేశ్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న బందర్ గనిపై రియోటింటో సంస్థ 14 ఏళ్ల పాటు శ్రమించింది. 90 మిలియన్ డాలర్లు (రూ.576 కోట్లను) ఖర్చు చేసింది. ఈ ప్రాంతం పులులకు ఆవాసం కావడంతో పర్యావరణ అనుమతుల్లో ఆలస్యం చోటు చేసుకుంది. దీంతో రియోటింటో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తాజా వేలం ప్రతిపాదన నేపథ్యంలో ఇటీవలే వేదాంత రిసోర్సెస్, అదానీ గ్రూపు ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించారు. మరోవైపు ఎన్ఎండీసీ ఇప్పటికే వజ్రాల వెలికితీతలో ఉంది. మధ్యప్రదేశ్లోనే మజ్గావన్ గని నుంచి మిలియన్ క్యారట్ వజ్రాలను వెలికితీసిన అనుభవం కూడా ఉంది. దీంతో బందర్ గనికి కూడా పోటీ పడాలనుకుంటోంది. -
ఇక వజ్రాల వేట షురూ..
న్యూఢిల్లీ: దేశంలో మొదటి సారి వజ్రాల గనుల తవ్వకాల కోసం ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో విరివిగా వున్న వజ్రాల గనులకు వేలం పాటల్ని వచ్చే నెలలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చేవారం టెండర్లను ఆహ్వానిస్తూ నోటీసులు ఇవ్వనున్నట్టు మైన్స్ సెక్రటరీ బల్విందర్ కుమార్ పీటీఐకి తెలిపారు. ఫిబ్రవరిలో మొదటి సారి బంగారు గనులకు వేలం నిర్వహించిన ప్రభుత్వం ఇపుడు వజ్రాల అన్వేషణ కోసం నడుం బిగిస్తోంది. ఈ గనుల లీజు ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేవారం నోటీసులు ఇస్తుందని బల్విందర్ కుమార్ తెలిపారు. సుమారు మూడువారాలలో టెండర్ల పరిశీలన పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి మాత్రమే మైనింగ్ నిర్వహిస్తోందని తెలిపారు. దేశంలో ఇది ఏటా 81,000 క్యారెట్ల పైగా ఉత్పత్తి చేస్తోందన్నారు. దీంతోపాటుగా పన్నా, శాంతా జిల్లాలో 400 క్యారెట్ల షాలో డైమండ్స్ ను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. మధ్యప్రదేశ్ లో 10,45,000 క్యారెట్ల వజ్రాల నిధులు ఉండగా, పన్నా 976,05 వేల క్యారెట్లవరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశలో మొత్తం 42 గనులను గుర్తించినట్టు తెలిపారు. ఇనుప ఖనిజం, బాక్సైట్, బంగారు, సున్నపురాయి నిక్షేపాలతో ఇవి నిండివున్నాయన్నారు. వీటిలో ఆరు గనుల విజయవంతంగా వేలం వేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement