-
తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధూళిపాళ్ల
సాక్షి, అమరావతి : గుంటూరులో అతిసార వ్యాధిపై మున్సిపల్ శాఖ వ్యవహరించిన తీరును అధికార పార్టీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుపట్టారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో కాలింగ్ అటెన్షన్ ద్వారా అతిసార విషయాన్ని ప్రస్తావించారు. అధికార యంత్రాంగం అతిసార నివారణకు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే కొందరి ప్రాణాలైనా రక్షించేగలిగేవారని తెలిపారు. ‘ఈ-కొలి బ్యాక్టిరీయా కారణంగా కిడ్నీలు కూడా దెబ్బ తిన్నాయనే ప్రచారం జరుగుతోంది. అతిసార వ్యాధి ప్రబలడానికి అధికారులు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరులో అతిసార వ్యాధితో 10 మంది చనిపోతే సభలో కనీస ప్రస్తావన లేకపోవడం బాధాకరం. అసెంబ్లీలో అరకొర సమాధానం ఇవ్వడం సరైన పద్దతి కాదు’ అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరుకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మంజూరైందనగానే నగర ప్రజలు ఎంతో ఆనందించారు. అయితే యూజీడీ పనులు జరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్నారు. రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి, పైపులైనులు వేసిన అనంతరం జరిగా పూడ్చకపోవడంతో నగరం మొత్తం గుంతలమయంగా మారింది. యూజీడీ పనుల కోసం చేపట్టిన తవ్వకాల వల్ల భూమిలోని తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా తాగునీటిలోకి మురుగు చేరింది. దీంతో నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా వృద్ధి చెందింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా వ్యాధి ప్రబలి తొమ్మిది మందిని బలితీసుకుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పైపులైనులు లీకై మురుగునీరు చేరింది. దీంతో తాగునీరు కలుషితమైంది. ఆ నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా చేరింది. ఈ బ్యాక్టీరియా కారణంగా వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారని డీఎంహెచ్ఓ జొన్నలగడ్డ యాస్మిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తమ ప్రాంతాల్లో సైతం యూజీడీపనుల వల్ల పైపులైనులు లీకవడం, పగిలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
అతిసార.. మేల్కోరా!
జిల్లాలో విజృంభిస్తున్న - నెల రోజుల్లో ముగ్గురు మృతి - అనంతపురంలోనే ఇద్దరు మృత్యువాత - వందల సంఖ్యలో బాధితులు - పీహెచ్సీలో అందని వైద్య సేవలు - మరణాలే లేవంటున్న అధికారులు - ముందస్తు చర్యలు శూన్యం అతిసార వ్యాధి విజృంభిస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దోమల వ్యాప్తితో పాటు ఈగల బెడద కారణంగా వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి. కనీసం అవగాహన శిబిరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అనంతపురం మెడికల్: జిల్లాలో పల్లెలు.. పట్టణాలు తేడా లేకుండా వ్యాధుల తీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జబ్బుతో మంచం పడుతున్నారు. విష జ్వరాలకు తోడు అతిసార వ్యాధి తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. అనంతపురం సర్వజనాసుపత్రిలోని ఐడీ వార్డులో ఈనెల 5న నగరానికి చెందిన సరోజమ్మ(50) మృతి చెందగా.. గత నెల 8న మిస్సమ్మ కాలనీకి చెందిన శ్రీరాములు, బెళుగుప్ప మండలం ఆవులెన్న గ్రామస్తురాలు హుసేనమ్మ మృత్యువొడి చేరారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్నా వైద్య ఆరోగ్య శాఖ మేల్కోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా కాకి లెక్కలతో కాలం వెల్లదీస్తోంది. అతిసార మరణాలను ఇతరత్రా వ్యాధులతో మరణించినట్లుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలను పక్కనపెడితే జిల్లా కేంద్రంలోనూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలో ఎటు చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తున్నా ప్రజా ప్రతినిధులు మేల్కొంటున్నట్లు దాఖలాల్లేవు. పీహెచ్సీల్లో అందని వైద్యం అతిసార సోకగానే బాధితులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం.. రోగి పరిస్థితి ఆందోళనకరంగా లేనప్పటికీ ‘మనకెందుకొచ్చిందిలే’ అని వైద్యులు సీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. కొందరు ప్రాణభయంతో ప్రైవైట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వైద్యులు వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. అతిసార లక్షణాలు వాంతులు, విరేచనాలు(బేదులు), కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం. అతిసార కారణాలు కలుషితమైన నీరు తాగడంతో పాటు, ఆహార పదార్థాలు తినడం వల్ల అతిసార సోకుతుంది. నిలువ ఉన్న ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. మంచి నీరు సరఫరా చేసే పైపులు పగిలిపోయి అందులో కలుషిత నీరు కలవడం వల్ల ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. పరిసర, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం కూడా ఓ కారణమే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : క్లోరిన్ కలిపిన నీరు సరఫరా అవుతుందా? లేదా? పరిశీలించాలి. గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో సరిగ్గా బ్లీచింగ్ అవుతోందా తెలుసుకోవాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పగిలిన పైపులను మరమ్మతు చేయించుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లను నిలువ ఉంచుకోవాలి. ఇంట్లో నీటిని కాచి.. చల్లార్చి తాగే అలవాటు చేసుకోవాలి. పరిశుభ్రమైన నీరు తాగాలి అతిసార ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. వంట చేసే ముందు.. భోజనం వడ్డించే సమయంలో.. భోజనం చేసే ముందు.. మల విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ఈగలు వాలకుండా వంట పాత్రలపై మూతపెట్టాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. ప్రధానంగా మురికినీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. పరిసరాల్లో చెత్తకుప్పలు ఉండకుండా చూసుకోవాలి. – డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్, చిన్నపిల్లల వైద్యుడు, సర్వజనాస్పత్రి చర్యలు తీసుకుంటాం వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అతిసారపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తాం. అతిసారతో అధికారికంగా ఒక్కరూ చనిపోలేదు. ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో బాధితులుంటే సీరియస్గా పరిగణిస్తాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement