-
భోజనశాల నిర్మాణానికి రూ.20 లక్షల విరాళం
అమరావతి : గ్రామీణ ప్రాంత పాఠశాలలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మండల పరిధిలోని నరుకుళ్లపాడుకు చెందిన ప్రవాసాంధ్రుడు, పాఠశాల పూర్వ విద్యార్థి తుమ్మల సురేష్ శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో విద్యార్థుల భోజనశాల నిర్మాణానికి రూ.20 లక్షల విరాళాన్ని అందజేశారు. బుధవారం భోజనశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి పరిసర ప్రాంతాల పేద విద్యార్థులకు 70 సంవత్సరాలుగా ఉత్తమ విద్యను అందిస్తుందన్న శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో తామంతా చదువుకున్నామని తెలిపారు. తుమ్మల సురేష్ పాఠశాల అభివృద్ధి రూ.20 లక్షల చెక్కులను పాఠశాల కరస్పాండెంట్ మల్లెల శ్రీనాథ్చౌదరికి అందించారు. -
వర్ణం: జుట్టున్నమ్మ...
జుట్టుతో ఆకట్టుకుంటున్న ఈ యువతి ఐవరీ కోస్ట్ దేశంలోని ‘నాపీ డీ బాబి’ క్లబ్ మెంబర్. ఇలాంటి జుట్టు (ఫ్రిజీ హెయిర్) ఉన్న వారంతా ఆ క్లబ్లో మెంబర్లు. అబిజాన్ నగరం కేంద్రంగా నడుస్తున్న ఈ క్లబ్లో 2400 సభ్యులున్నారట. ఇలా జట్టు పెంచుకోవడం ఎలా? పెంచిన దాన్ని ఎలా కాపాడుకోవాలి? దాన్ని ఎన్నిరకాలుగా తీర్చిదిద్దుకోవచ్చు? అనే విషయాలన్నీ వీరు సెమినార్లు పెట్టి మరీ ఫ్రీగా చెబుతున్నారట. ఖరీదైన గది ఇది ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ సొంత ఇంటిలోని డైనింగ్ హాలు. ఈయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెట్టి ఇదిగో ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నారు. తొలుత ప్రభుత్వ భవనంగా ఉన్న దీనిని ఆయన ప్రైవేటు ప్రాపర్టీగా మార్చుకున్నాడు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇంటీరియర్తో ఈ ఇంటిని తీర్చిదిద్దారు. ఈయన మీద విదేశీ నిధుల దుర్వినియోగం, ఆందోళనకారుల ఊచకోత వంటి కేసులున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న షాండ్లియర్ విలువే కోట్ల రూపాయలలో ఉంటుంది. ఎన్ని పాండాలో... చైనాలోని తైపే నగరంలోని ఓ విచిత్రమైన ప్రదర్శన ఏర్పాటుచేశారు. దానిపేరు ‘పాండాస్ ఆన్ టూర్’. ఇందులో పేపరుతో చేసిన వేలాది పాండాలు రక రకాల ఫోజుల్లో కనిపించి అలరిస్తున్నాయి. నేషనల్ థియేటర్ లో ఓ ప్రదర్శన తిలకిస్తున్నట్లు కూర్చున్న పాండాలివి. సుమారు ఇక్కడ 1600 పండాలున్నాయి. -
మష్రూమ్... ఖుష్రూమ్!
పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? మనలో చాలామందికి డౌట్. దీనికి సమాధానం... ఒకసారి తిని చూడ్డం! డీప్ మష్రూమ్ కర్రీ, మష్రూమ్ కర్రీ, రాజ్మా మష్రూమ్ కర్రీ, టొమాటో పాస్తా కర్రీ, కొరమీను మష్రూమ్ పొరటు... వీటిలో ఏం తిన్నా మీకు ఒకటే అనిపిస్తుంది ‘శాకాహరమైతేనేం? మాంసాహారమైతేనేం మష్రూమ్ ఇంత టేస్టుగా ఉంటే’ అని!! ఇవే కాదు... ఇంకా రకరకాల ప్రయోగాలను మీరు మష్రూమ్తో చెయ్యండి. ఈ ఆదివారం మీ డైనింగ్ హాల్ని... ఖుష్రూమ్గా మార్చండి. డీప్ మష్రూమ్ కర్రీ కావలసినవి: మష్రూమ్స్ - 2 కప్పులు చింతపండు - కొద్దిగా (నీళ్లలో నానబెట్టాలి) ఉప్పు - తగినంత గరంమసాలా - టీ స్పూను శనగపప్పు - టేబుల్ స్పూను మిరియాల పొడి - టీ స్పూను నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను ఎండుమిర్చి - 2 కొత్తిమీర - కొద్దిగా టొమాటో ముక్కలు - పావు కప్పు కరివేపాకు - 2 రెమ్మలు తయారి: చింతపండు గుజ్జు తీసి పక్కన ఉంచాలి బాణలిలో శనగపప్పు వేసి వేయించి మిరియాలపొడి జతచేసి కలిపి తీసేయాలి పాన్లో నూనె కాగాక కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాక టొమాటో ముక్కలు వేయించాలి. మష్రూమ్ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టి, ఉడికించాలి చింతపండు గుజ్జు జత చేసి పది నిముషాలయ్యాక, గరం మసాలా వేసి 5 నిముషాలు ఉడికించి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్చేయాలి. అలసందలు మష్రూమ్ కర్రీ కావలసినవి: అలసందలు - 50 గ్రా. మష్రూమ్స్ - 200 గ్రా., ఉల్లితరుగు - పావు కప్పు టొమాటో తరుగు - అర కప్పు పచ్చిమిర్చితరుగు - 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, కారం - అర టీ స్పూను పసుపు - చిటికెడు, ధనియాల పొడి - అర టీ స్పూను, గరంమసాలా - టీ స్పూను, జీడిపప్పులు - 8 జీలకర్ర - టీ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి - టే బుల్ స్పూను, ఉప్పు - తగినంత తయారి: అలసందలను రెండు గంటలసేపు నానబెట్టి, కుకర్ లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి దించేయాలి పాన్లో నెయ్యి కరిగాక ఉల్లితరుగు వేయించి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి రెండు నిముషాలు వేయించి తీసి పక్కన ఉంచాలి ధనియాలపొడి, జీడిపప్పు, టొమాటో తరుగు, కారం, పసుపు, గరంమసాలా జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించాలి మష్రూమ్ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు జత చేసి వేగాక మసాలా వేసి వేయించాలి ఉడికించిన అలసందలు, అర కప్పు నీరు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి గ్రేవీ చిక్కగా అయిన తర్వాత దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. మష్రూమ్ ఫ్రై కావలసినవి: మష్రూమ్ ముక్కలు - కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కొత్తిమీర - టీ స్పూను, కరివేపాకు పొడి - టీ స్పూను, నిమ్మరసం - టీ స్పూను, నూనె - 5 టేబుల్ స్పూన్లు, పసుపు - చిటికెడు తయారి: ఉప్పు కలిపిన వేడినీటిలో మష్రూమ్ ముక్కలను అర గంటసేపు నానబెట్టాలి బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి మష్రూమ్ ముక్కలు, మిరియాలపొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి వేయించాలి నిమ్మరసం జతచేసి రెండు నిముషాల తరువాత దించేయాలి. మష్రూమ్ టొమాటో పాస్తా కర్రీ కావలసినవి: పాస్తా /మాక్రోనీ/ మీల్మేకర్ - అర కప్పు, ఉప్పు - తగినంత, నానబెట్టిన మష్రూమ్ ముక్కలు - కప్పు, టొమాటోతరుగు - అర కప్పు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ తరుగు - అర కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, పుదీనా ఆకులు - అర కప్పు, వెల్లుల్లి రేకలు - 3, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 10, బాదంపప్పులు - 6, ఏలకుల పొడి - టీ స్పూను, పసుపు - చిటికెడు, కారం - టీ స్పూను, ధనియాల పొడి - అర టీ స్పూను, గరంమసాలా - టీ స్పూను, కొత్తిమీర - తగినంత తయారి: గిన్నెలో పాస్తా, తగినంత నీరు, ఉప్పు వేసి కుకర్లో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి బాణలిలో టేబుల్ స్పూన్ నూనె కాగాక వెల్లుల్లి రేకలు వేయించాలి పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పులు, బాదం పప్పులు, ఏలకుల పొడి జత చేసి వేయించాలి ఉల్లితరుగు, టొమాటో తరుగు వేసి, మెత్తబడేవరకు వేయించి, దించేసి, చల్లారాక, ఈ మిశ్రమానికి పుదీనా ఆకులు జతచేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె కాగాక, క్యాప్సికమ్ తరుగు, ఉడికించిన పాస్తా, మష్రూమ్ ముక్కలు వేసి వేయించాలి కారం, పసుపు, ధనియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలిపి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న పేస్ట్ వేసి రెండు నిముషాలు ఉడికించాలి కొద్దిగా నీరు జత చేసి నాలుగైదు నిముషాలు ఉడికించి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కొరమీను మష్రూమ్ పొరటు కావలసినవి: ఉడికించిన కొరమీనులు - కప్పు, మష్రూమ్ ముక్కలు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను, ఉల్లితరుగు - అర కప్పు, వెల్లుల్లి రేకలు - 6 అల్లం పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - టేబుల్ స్పూను, కరివేపాకు - ఒక రెమ్మ గరంమసాలా - అర టీ స్పూను, పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత, నూనె - 4 టేబుల్ స్పూన్లు తయారి: బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించాలి అల్లం పేస్ట్, వెల్లుల్లి రేకలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించి 5 నిముషాల తరవాత మష్రూమ్ ముక్కలు, ఉప్పు, పసుపు, నీరు జతచేసి మూత పెట్టాలి ముక్కలు ఉడికిన తర్వాత, ఉడికించి ఉంచుకున్న కొరమీనులు, సోయా సాస్ వేయాలి గరంమసాలా, నిమ్మరసం, కరివేపాకు వేసి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. కర్టెసీ: రఘువీర్ కె.సి. హైదరాబాద్ సేకరణ: డా. వైజయంతి -
నేర్చుకోడానికి, మార్చుకోడానికీ బిడియం ఎందుకు?
భోజనం ముగించి డైనింగ్ హాల్ నుంచి తన రూమ్కి వచ్చింది మీనా. రూమ్మేట్ సంధ్య కోసం హాస్టల్ మొత్తం వెతికింది. ఎక్కడా సంధ్య లేదు. కిందికి వచ్చి వాచ్మన్ని అడిగింది. ఆమె అసలు కిందికే రాలేదని చెప్పాడతను. తిరిగి పైకి వెళ్లిపోదామనుకుంటూండగా పెద్ద శబ్దం. ఓ గావుకేక. శబ్దం వచ్చిన వైపు చూసింది మీనా. రక్తపు మడుగులో సంధ్య! ఏడడుగుల హాస్టల్ భవనం మీద నుంచి దూకేసింది. పరుగు పరుగున స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది మీనా. కానీ అప్పటికే ఆమె ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది. హైదరాబాద్లో కొన్నాళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన. సంధ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీనా ద్వారా వెల్లడయింది. సంధ్య విజయనగరం జిల్లాలో ఓ చిన్న గ్రామం నుంచి సిటీకి వచ్చింది. తెలివైన పిల్ల. పీజీ చేసింది. కానీ వెనుకబడిన ప్రాంతానికి చెందినది కావడంతో కాస్త నాగరికత తెలియదంతే. చాలామంది అమ్మాయిల్లాగ సిటీకి అలవాటు పడలేకపోయింది. ఇక్కడి వాళ్లతో పోటీ పడలేకపోయింది. అంత యాక్టివ్గా, కాన్ఫిడెంట్గా ఉండలేక ప్రతి ఇంటర్వ్యూలోనూ ఓడిపోసాగింది. దాంతో తాను ఎందుకూ పనికిరానేమోనన్న న్యూనతను ఏర్పరచుకుంది. చివరికి అదే పెరిగి పెద్దదై ఆమె ప్రాణాలను తీసింది. మన దేశంలో ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎనభై శాతం మంది చదువుకున్నవారే. వారిలో సగానికి పైగా మహిళలే. కొందరు ప్రేమవ్యవహారాల వంటి వాటికి ప్రాణం తీసుకుంటుంటే... ఎక్కువమంది మాత్రం ఒత్తిడిని భరించలేక, న్యూనతను జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి న్యూనతను జయించడం అంత కష్టమేమీ కాదు. ఏదైనా విషయంలో మనం విజయం సాధించలేకపోతున్నామంటే... దిగులు పడే బదులు, ఎక్కడ దెబ్బతింటున్నామో చూసుకోవాలి. కారణం తెలిశాక దాని గురించి స్నేహితులు, ఇంట్లోవాళ్లతో చెప్పాలి. అప్పుడు వాళ్లేదైనా మార్గం చెబుతారు. లేదంటే మీరే ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం చేయవచ్చు. కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఖర్చు గురించి భయపడక్కర్లేదు. కొన్ని సంస్థల వారు ఉచితంగా కూడా నేర్పుతారు. అలాంటివేమీ అందుబాటులో లేవు, ఖర్చు పెట్టలేరు అనుకుంటే... మీకు లేవు అనుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లండి. మొహమాట పడకుండా, నేను నీలా అవాలంటే ఏం చేయాలని అడగండి. నేర్చుకోవడం మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుంది కాబట్టి... సంకోచం, సిగ్గు అవసరం లేదు. ఇక మరీ ముఖ్యమైనది... మీ బలాలేమిటో తెలుసుకోవడం. ఒకదాంట్లో సక్సెస్ కాలేనప్పుడు, ఒకటి మీకు చేతకానప్పుడు... మీరేం చేయగలరో దానిమీద ఎందుకు శ్రద్ధ పెట్టకూడదు? ఆ వైపుగా ఎందుకు అడుగులు వేయకూడదు? అవ్వదు అనుకున్నదానికోసం అవస్థ పడే బదులు, అవుతుంది అనుకున్న దానికోసం ఎందుకు సమయాన్ని వెచ్చించకూడదు? అందుకే మీ బలహీనతలను తెలుసుకోవడంతో పాటు మీ బలాలను గుర్తించడం కూడా ఎంతో అవసరం. అలా చేయకుండా... మీరు దేనికీ పనికి రారని, మీరేమీ సాధించలేరని కుమిలిపోవడం కరెక్ట్ కాదు. ఈ లోకంలో ఏ మనిషీ పర్ఫెక్ట్ కాదు. ప్రతివారిలోనూ కొన్ని బలాలుంటాయి. కొన్ని బలహీనతలుంటాయి. బలాలను ఉపయోగించుకుంటూ, బలహీనతలను అధిగమించుకుంటూ పోవడం నేర్చుకోవాలి. జీవితాన్ని మనకు నచ్చినట్టు, మనకు వచ్చినట్టు జీవించాలి. అప్పుడు మీలైఫ్ మీకు అందంగా కనిపిస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. న్యూనత మీ నుంచి దూరంగా పారిపోతుంది!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement