-
రాహుల్ పాస్పోర్టుకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: కొత్త పాస్పోర్టు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మూడేళ్ల పాటు సాధారణ పాస్పోర్టు పొందడానికి అనుమతి మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాతరాహుల్ గాంధీ తన డిప్లొమాటిక్ పాస్పోర్టును, ఇతర ప్రయాణ అనుమతి పత్రాలను అధికారులకు అందజేశారు. విదేశాల్లో ప్రయాణించడానికి వీలుగా సాధారణ పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉండడంతో పాస్పోర్టు కోసం నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంది. ఎన్ఓసీ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. మూడేళ్లపాటు సాధారణ పాస్పోర్టు కోసం ఎన్ఓసీ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. -
ప్రత్యేక విమానంలో వారికి నో ఎంట్రీ!
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం భారత్ నుంచి చైనా వెళ్లేందుకు దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు సహా పలువురు భారతీయులను విమానంలోకి చైనా అనుమతించలేదు. జూన్ 21న భారత్ నుంచి షాంఘై వెళ్లిన ప్రత్యేక విమానంలో ఇద్దరు భారతీయులకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చైనా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు భారతీయులకు కరోనా సోకడంతో వారిని స్వదేశానికి తరలించేందుకు భారత్ నుంచి ఖాళీ ప్రత్యేక విమానాన్ని పంపేందుకు చైనా అధికారులు అనుమతించారు. ఇక గ్వాంజు నగరం నుంచి 86 మంది భారతీయులతో వందే భారత్ మిషన్ మూడో దశలో భాగంగా భారత్కు బయలుదేరింది. జూన్ 21న షాంఘైకు చేరుకున్న విమానం కూడా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకే వెళ్లింది. ప్రత్యేక విమానాల్లో దౌత్య పాస్పోర్టులు కలిగిన భారతీయులను సైతం చైనా అనుమతించకపోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విమానాల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. కాగా భారత్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో జూన్ 29న గ్వాంజు నగరానికి వచ్చే విమానంలో ప్రయాణీకులను అనుమతించరాదని ఇరు దేశాలు నిర్ణయించాయని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : వందే భారత్ మిషన్ : ఆ విమానాలకు బ్రేక్? -
మహమూద్ అలీకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ డిప్లొమాటిక్ పాస్పోర్టు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్లోని రీజనల్ పాస్పోర్టు కార్యాలయంలో మహమూద్ అలీతో పాటు ఆయన భార్య డిప్లొమాటిక్ పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పాస్పోర్టు కార్యాలయం పనితీరు అద్భుతంగా ఉందని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ముఖ్యంగా హజ్యాత్రకు వెళ్లే యాత్రికుల పాస్పోర్టుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. -
చంద్రబాబుకు డిప్లొమాటిక్ పాస్పోర్టు
హైదరాబాద్: డిప్లొమాటిక్ పాస్పోర్టు కోసం ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్టు కార్యాలయానికి వచ్చారు. పాస్పోర్టు అధికారిణి అశ్విని సత్తారు, డీపీవో మదన్కుమార్రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఫొటోను, ఫింగర్ ప్రింట్స్ను తీసుకున్న అధికారులు 10 నిమిషాల్లో పాస్పోర్టును అందించారు. అంతకుముందు ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ కూడా పాస్పోర్టు కార్యాలయానికి వచ్చి డిప్లొమాటిక్ పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement