-
25న మళ్లీ చంద్రయాన్–3 కక్ష్య దూరం పెంపు
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్సెంటర్ షార్ నుంచి ఈనెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్కు ఈనెల 25న అయిదోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు. బెంగళూరులోని ఇ్రస్టాక్ కేంద్రం శాస్త్రవేత్తలు 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు. భూమికి సంబంధించిన కక్ష్యలో ఆఖరిసారిగా చేపట్టే ఆపరేషన్తో చంద్రయాన్–3 భూమి నుంచి విశ్వంలో చంద్రుడ్ని చేరుకునే దిశగా ప్రయాణిస్తుంది. ఆగస్ట్ 1 నాటికి చంద్రయాన్–3 లూనార్ ఆర్బిట్ (చంద్ర కక్ష్య)కు చేరుకుంటుంది. అక్క డ నుంచి 17 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరి్రభమిస్తూ ఆగస్ట్ 23న చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్ను విడిచి పెడుతుంది. అదే రోజు సాయంత్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. -
Chandrayaan-3 Updates: కీలక దిశగా చంద్రయాన్–3
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/తిరువనంతపురం/శ్రీహరికోట: విజయవంతంగా రోదసి చేరిన చంద్రయాన్–3 ప్రయోగం 41 రోజుల ముఖ్యమైన ప్రయాణంలో కీలక దశ దిశగా సాగుతోంది. దానికి జత చేసిన థ్రస్టర్లను మండించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం నుంచే మొదలు పెట్టారు. తద్వారా ఉపగ్రహాన్ని భూమి నుంచి కక్ష్య దూరం పెంచే ప్రక్రియ మొదలైంది. అంతిమంగా చంద్రయాన్–3ని ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై వీలైనంత సున్నితంగా దించాలన్నది లక్ష్యం. చంద్రయాన్–3ని శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. రోదసిలో దాని ప్రయాణం అద్భుతంగా సాగుతోందని తిరువనంతపురంలోని విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్ శనివారం మీడియాకు తెలిపారు. తొలి దశ ప్రయోగం నూటికి నూరు శాతం విజయవంతమైందన్నారు. -
UTS App: రైలు ప్రయాణికులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. టికెట్ కోసం చాంతాడంత క్యూలు బెంబేలెత్తిస్తుంటాయి. . రైలు బయలుదేరే సమయం దాకా క్యూలు తరగవు.. ఇలాంటి తరుణంలో ప్రయాణికులకు వరంగా మారింది ‘యూటీఎస్’ యాప్. గతంలో అన్రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణమంటే కచ్చితంగా స్టేషన్కు వెళ్లి క్యూలో నిలబడి టికెట్ కొనాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఆ కోచ్లలో కూడా ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఈ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ యాప్ ద్వారా.. అన్ రిజర్వ్డ్ కోచ్లలో టికెట్ బుక్ చేసుకునే దూర పరిధిని పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సబర్బన్ స్టేషన్లకు సంబంధించి గతంలో స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల గరిష్ట పరిధిలో యాప్ ద్వారా టికెట్ను బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని ఇప్పుడు 10 కిలోమీటర్లకు పెంచారు. అలాగే.. నాన్ సబర్బన్ స్టేషన్ల గరిష్ట పరిధిని 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు విస్తరించారు. స్టేషన్కు 15 మీటర్ల దూరం నుంచి ఈ పరిధి లెక్కలోకి వస్తుంది. ఈ వెసులుబాటు లేక గతంలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవాళ్లు. అన్ రిజర్వ్డ్ బోగీలో సీట్ల రిజర్వేషన్ ఉండదు. కేవలం టికెట్ మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నది తెలిసే ఉంటుంది. అలా ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి టికెట్ వివరాలు సంబంధిత ఫోన్కు మెసేజ్ రూపంలో అందుతాయి. రైళ్లలో టీటీఈలకు ఆ వివరాలు చూపితే సరిపోతుంది. ఈ యాప్ ద్వారా అన్ రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్లు, సీజన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వివిధ రకాల వాలెట్లు.. ఆర్–వాలెట్, పేటీఎం,మోబిక్విక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరపొచ్చు. ఇదీ చదవండి: ఛలాన్లు కట్టకుంటే ‘మోత’ మోగుద్ది -
పీఎం–జీకేవై పంపిణీ సజావుగా జరపాలి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎం–జీకేవై) మంజూరుచేసిన రూ.27,500 కోట్లను లబ్ధిదారులకు సజావుగా పంపిణీ అయ్యేలా చూడాలని కేంద్రం కోరింది. హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు. శుక్రవారం నుంచి బ్యాంకుల్లో మొదలయ్యే నగదు పంపిణీ సమయంలో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు గుమికూడకుండా వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని బ్యాంకుల శాఖలు, ఏటీఎంల వద్ద శాంతిభద్రతల నిర్వహణకు అవసరమైన భద్రతా సిబ్బందిని నియమించాలన్నారు. -
ప్రేమ, ఆప్యాయత.. మిస్సింగ్
- తీరిక లేకుండా గడుపుతున్న తల్లిదండ్రులు - మంచీచెడు బోధించడంలో వైఫల్యం - కనీస పర్యవేక్షణ కరువు - పెడతోవ పడుతున్న పిల్లలు - క్షణికావేశంతో బంగారు భవిష్యత్తు నాశనం - తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు చెందిన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఉదంతం యావత్ దేశాన్ని ఆలోచనలో పడేసింది. సినిమాల మోజులో 40 రోజుల క్రితం ఇల్లు విడిచిన ఈ బాలిక పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల ఆశలను కాలరాస్తూ.. ఎంచుకున్న లక్ష్యానికి ప్రాధాన్యతనిస్తూ పూర్ణిమ తీసుకున్న నిర్ణయం ఆ వయస్సు పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతోంది. - జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈనెల 10న అదృశ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు ఆమెను తిరిగి తీసుకొచ్చారు. ప్రేమ వ్యవహారంతోనే వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అదృశ్యం కేసులు ఇలా.. సంవత్సరం మొత్తం కేసులు మహిళలు మైనర్ బాలికలు 2015 375 124 151 2016 455 277 178 2017 360 135 125 కుటుంబ గొడవలు.. క్షణం తీరిక లేని జీవనం.. ఉద్యోగ బాధ్యతలు.. వ్యాపారం.. వ్యాపకం ఏదయినా పిల్లలతో గడిపే సమయం క్రమంగా తగ్గిపోతోంది. నాలుగు గోడల మధ్య చదువులు.. ర్యాంకుల వేట.. దిశానిర్దేశం చేసే పెద్దరికం లేకపోవడం.. మంచీచెడులు తెలుసుకోలేని మానసిక సంఘర్షణలో సాంత్వన కలిగించే గొంతుక ‘తప్పు’టడుగు వేయిస్తోంది. కళ్ల ముందు కనిపించే రంగుల ప్రపంచం వైపు తీసుకెళ్లే జీవితం తెగిన గాలిపటంగా మారుతోంది. ఆ తర్వాత తేరుకున్నా.. వేలెత్తి చూపే సమాజం, అనుమానంతో చూసే కుటుంబం.. ఆత్మహత్యలకు పురిగొలుపుతోంది. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య పెరుగుతున్న అంతరం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. అనంతపురం సెంట్రల్ : ప్రపంచం చేతిలో ఇమిడిపోతోంది. సినిమాలు.. ఇంటర్నెట్ ప్రభావం పిల్లలపై పెను ప్రభావం చూపుతున్నాయి. తెలిసీ తెలియని వయస్సులో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలను బుగ్గి చేస్తున్నాయి. జిల్లాలో ఇటీవల నమోదువుతున్న మిస్సింగ్ కేసుల్లో అధిక శాతం మైనర్ బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరి వయస్సు 15 నుంచి 18 సంవత్సరాల్లోపు ఉండటం తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి ఉరుకులు పరుగుల జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ.. ఆదాయ సముపార్జనకే అధిక సమయం కేటాయిస్తుండటంతో పిల్లలతో గడిపే సమయం క్రమంగా తగ్గిపోతోంది. పిల్లల చదువు ఎలా సాగుతోంది? రోజు ఎలా గడిచింది? అనే విషయాలపైనా దృష్టి సారించలేని పరిస్థితి ఉంటోంది. పిల్లలతో ప్రేమగా మాట్లాడటం.. వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం.. కనీసం చిన్న చిన్న సంతోషాలను అందివ్వలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. రోజులో అరగంట కూడా పిల్లలతో గడపని తల్లిదండ్రులు వేలల్లోనే. కనీసం చెప్పింది వినే ఓపిక కూడా లేకపోతోంది. నా సమస్యలే నాకు ఎక్కువగా ఉన్నాయని.. మధ్యలో నీ పోరు ఏంటని విసుక్కోవడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో తల్లిదండ్రుల మధ్య సఖ్యత కొరవడి చోటు చేసుకునే గొడవలు కూడా పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పిల్లలు దారితప్పుతున్నారు. ఆకతాయిల గాలం కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలకు దూరమవుతున్న బాలికలు ఎక్కువ సమయం కేటాయించే ఆకతాయిలకు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల కాలంలో బాలికల అదృశ్యం కేసులను పరిశీలిస్తే ఇదే విషయం వెల్లడవుతోంది. తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణకు లోనవుతూ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అప్పటికే వివాహమైన వ్యక్తులను, అల్లరిచిల్లరగా తిరిగే యువకుల మాయలో పడి తల్లిదండ్రుల కలను చిదిమేస్తున్నారు. - నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదవుతున్న విద్యార్థి ఆటోడ్రైవర్తో ప్రేమలో పడింది. పాఠశాల ఎదురుగా ఆటోస్టాండ్లో ఉంటున్న సదరు వ్యక్తి ఆ అమ్మాయిని మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఇతనికి గతంలోనే వివాహమైంది. ఇలా.. కొంతకాలానికి ఆ అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు ఆ బాలిక ఇల్లు చేరింది. - నగరంలో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె ఇటీవల ఓ ఆకతాయితో వెళ్లిపోయింది. పుట్టపర్తిలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకొని నెలరోజుల పాటు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత ఒక రోజు బాలికను అర్ధరాత్రి నగరానికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత ఆకతాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లల మనసెరిగి నడుచుకోవాలి ఇటీవల జిల్లాలో మైనర్ బాలికల అదృశ్యం కేసులు అధికమయ్యాయి. ఇందులో ప్రేమ వ్యవహారాలే అధికంగా ఉంటున్నాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు మనసెరిగి నడుచుకోవాలి. తప్పు చేస్తున్నట్లు తెలిస్తే సున్నితంగా హెచ్చరించాలి. అవసరమైతే స్నేహితులు, ఇష్టమైన వ్యక్తులతో చెప్పించాలి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల ప్రవర్తనను ఓ కంట కనిపెట్టి తల్లిదండ్రులకు సమాచారం చేరవేయాలి. మైనర్ బాలికలు ఇష్టపూర్వకంగా వెళ్లినా.. అందుకు కారణమైన అవతి వ్యక్తులపై చర్యలు తప్పవు. - జీవీజీ అశోకుమార్, జిల్లా ఎస్పీ నైతిక విలువలు నేర్పాలి తల్లిదండ్రులతో విభేదించడం.. మితిమీరిన కోపం.. లగ్జరీకి అలవాటు పడడం.. ఇవన్నీ ‘కాండక్ట్ డిజార్డర్’ కిందకు వస్తాయి. 8 నుంచి 12 ఏళ్ల మధ్యలోనే ఈ సమస్య ప్రారంభమవుతుంది. ఆ వయస్సులో అడిగినవన్నీ సమకూర్చడం.. అతి గారాబం చేయడంతో 18 ఏళ్ల వయస్సుకు అది ఎక్కువవుతుంది. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమపూర్వకంగా మెలగాలి. ఎక్కువ సేపు వారితో గడపాలి. పిల్లల ఎదుట గొడవ పడకూడదు. మంచీచెడు నేర్పించాలి. ఎవరితో తిరుగుతున్నారో గమనించాలి. - ప్రొఫెసర్ డాక్టర్ యెండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, సర్వజనాస్పత్రి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement