-
తెలుగువారి పరువు తీయొద్దు: సుజనా
సాక్షి, న్యూఢిల్లీ : విభజన నేపథ్యంలో చిన్నచిన్న సమస్యలు తప్పవని, వాటిని ఇరువురు సీఎంలు పరిష్కరించుకోవాలి తప్ప పార్లమెంట్లోకి తెచ్చి తెలుగువారి పరువు తీయొద్దని టీడీపీ పార్లమెంటరీ నేత వై.సుజనాచౌదరి టి. ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాడు టీఆర్ఎస్, కాంగ్రెస్ దగ్గరుండి బిల్లును పాస్ చేయించాయని, ప్రస్తుతం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల్ని అమలు చేసే సమయంలో అడ్డుకోవడం సరికాదన్నారు. టి సర్కారు 19న చేపట్టిన సమగ్ర సర్వే రాజ్యాంగానికి విరుద్ధమని, ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధమన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీలతోపాటు బీజేపీ ఎంపీ హరిబాబు పాల్గొన్నారు. -
జాతీయ సంస్థలపై.. తర్జనభర్జన
సాక్షి ప్రతినిధి, తిరుపతి : విభజన నేపథ్యంలో రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆ హామీ మేరకు ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు 2014-15 బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయిం చింది. ఇందులో ఐఐటీని తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఐఐటీతోపాటు ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్), సెంట్రల్ వర్సిటీలను ఏర్పాటుచేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ సంస్థల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు-శ్రీకాళహస్తి మండలాల పరిధిలోనూ.. చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోనూ.. రామచంద్రాపురం మండలంలోనూ అటవీ, ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ భూములను రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జిల్లా అధికారయంత్రాంగంతో కలిసి ఇటీవల పరిశీలించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుపై టీడీపీ నేతల మధ్య రచ్చ మొదలైంది. జాతీ య సంస్థల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.కోట్లను కొల్లగొట్టడానికి ప్రణాళిక రచించారు. తమ ప్రాంతంలో ఏర్పాటుచేయాలంటే తమ ప్రాంతంలో నెలకొల్పాలని పట్టుబట్టారు. చంద్రగిరి మండలంలో రంగంపేటకు సమీపంలోనే జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటుచేయాలంటూ నారావారిపల్లెలో సమావేశమైన టీడీపీ నేతలు తీర్మానం చేసి అధిష్ట్ఠానానికి పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ సిద్ధార్థజైన్ తిరుపతి ఆర్డీవో రంగయ్య, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తిరుపతి రూరల్, చంద్రగిరి తహశీల్దార్లతో భూములను పరిశీలించి.. సమీక్ష సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రగిరి మండలం రంగంపేట వద్ద అటవీభూములు, ప్రైవేటు భూములు ఉన్నాయి. అసైన్డు, డీకేటీ, ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. అటవీ భూములను డీ-నోటిఫై చేయాలంటే కేంద్ర అటవీశాఖ అనుమతి అవసరం. అనుమతి వచ్చాక.. అటవీ భూమి తీసుకున్న మేరకు ప్రభుత్వ భూమిని కేటాయించాలి. ఆ తర్వాత అటవీశాఖకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం అంత సులువుగా తేలేది కాదని రెవెన్యూ వర్గాలు స్పష్టీకరించాయి. ఏర్పేడు-శ్రీకాళహస్తి మండలల పరిధిలో మేర్లపాక, పాగాలి, పంగూరు, చిందేపల్లె, చింతలపాళెం, పల్లాం, ఎంపేడు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రభుత్వ భూము లు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు గుర్తించాయి. రేణిగుంట విమానాశ్రయం, జాతీయ రహదారులు, తెలుగుగంగ జలాలు అందుబాటులో ఉంటాయని.. ఆ ప్రాంతమే జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు అనుకూలమని ప్రాథమిక నివేదికను సర్కారుకు పంపినట్లు సమాచారం. టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగాఈ ప్రతిపాదనపై ఆమోదముద్ర పడే అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐఐటీ ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాన్ని నెలాఖరులోగా ఎంపిక చేసి, భూముల వివరాలను కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖకు పంపాల్సి ఉంటుంది. జాప్యం చేస్తే.. ఐఐటీ ఏర్పాటు వాయిదా పడే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement