-
దేశానికి కాంగ్రెస్ చోర్ టీం
సాక్షి, హైదరాబాద్: దేశానికి కాంగ్రెస్ పార్టీ ‘సీ టీం’ (చోర్ టీమ్) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. తమ పార్టీ బీజేపీకి ‘బీ–టీం’ అన్న కాంగ్రెస్ విమర్శలపై ఆయన మండిపడ్డారు. కుంభకోణాలతో ఆకాశం నుంచి పాతాళం దాకా దోచుకున్న చరిత్ర కాంగ్రెస్దని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన ‘దివ్యాంగుల కృతజ్ఞత సభ’లో కేటీఆర్ మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ రామప్ప గుడికి వచ్చి గొంగడిలో వెంట్రుకలు ఏరినట్లు కుటు ంబ పాలన గురించి మాట్లాడారు. ఆయన లీడర్ కాదు.. ఇతరులు రాసింది చదివే రీడర్. రేవంత్ లాంటి ఒక 420ని, గజదొంగను పక్కన పెట్టుకొని రాహుల్ మాట్లాడటం సిగ్గుచేటు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ను మించిన గజదొంగ రేవంత్. నాడు నోటుకు ఓటు.. నేడు సీటుకు రేటు. ఒకవేళ ఎన్నికల్లో 10, 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినా రాష్ట్ర కాంగ్రెస్ను బీజేపీకి గంపగుత్తగా రేవంత్ అమ్మేయడం ఖాయం’ అని కేటీఆర్ విమర్శించారు. రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఎక్కడైనా రూ. లక్ష కోట్ల అవినీతి జరుగు తుందా? అని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో సోనియా, రాహుల్ విచారణ ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. మోదీ, రాహుల్కు తెలంగాణ పౌరుషం చూపాలి.. ‘తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకు తుపాకీతో వెళ్లిన రైఫిల్రెడ్డి ఒకరైతే... రాజీనామా చేయకుండా అమెరికా పారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మరొకరు. ఇలాంటి వారితో కేసీఆర్కు పోటీనా? ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి బుద్ధిచెప్పేలా తెలంగాణ పౌరుషం చూపాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు.. ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నా రు. కేసీఆర్ లాంటి నాయకుడు శతాబ్దానికి ఒకరు వస్తారు. ఆయన ప్రభుత్వాన్ని వదులుకోవద్దు. దివ్యాంగుల సంక్షేమానికి తొమ్మిదిన్నరేళ్లలో రూ. 10,300 కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ గఢ్లో దివ్యాంగులకు రూ. 200 చొప్పున, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ. 500 నుంచి రూ. వె య్యి వరకు మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. మేం మ ళ్లీ అధికారంలోకి రాగానే ప్రస్తుతమున్న రూ. 4,016 పింఛన్ను రూ. 6,016కు పెంచుతాం. దివ్యాం గులకు ఊత కర్రలా నిలిచిన కేసీఆర్కు ఎన్నికల్లో అండగా నిలవండి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదే వరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సుధీర్రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నా థం, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
రాష్ట్రంలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యా యి. ఈ మేరకు అంధులకు ఒక శాతం, బధిరులకు ఒక శాతం, డిసేబుల్డ్, మానసిక వికలాం గులకు ఒక్కొక్క శాతం అమలు చేయనున్నారు. ► అమల్లో రిజర్వేషన్ ► ప్రభుత్వం ఉత్తర్వులు సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉద్యోగ నియామకాల్లో మూడు శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఆ రిజర్వేషన్ పెంపునకు చర్యలు తీసుకుంది. దివ్యాం గుల హక్కుల చట్టం 2016 మేరకు వారికి నాలుగు శాతం రిజర్వేషన్ వర్తింప చేయడానికి నిర్ణయించారు. ఇందుకు తగ్గ కసరత్తులు ముగియడంతో సీఎం పళని స్వామి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు తగ్గ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మేరకు..1981 నుంచి రాష్ట్రం లోని దివ్యాంగుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ను అమలు చేస్తూ వస్తున్నట్టు వివరించారు. దివ్యాంగులకు సంక్షేమ బోర్డు, వారికి సదుపాయాల మెరుగు లక్ష్యంగా ముందుకు సాగడమే కాకుండా, ఆ బోర్డు, శాఖలకు ప్రత్యేకంగా కొత్త భవనాల నిర్మాణం సాగినట్టు పేర్కొన్నారు. ఉద్యోగ పరంగా దివ్యాంగులకు మరింత అవకాశం కల్పించడం లక్ష్యంగా ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. దీనిని నాలుగు విభాగాలు విభజించడం జరిగిందని వివరించారు. అంధులకు ఒక శాతం, బధిరులకు మరో శాతం, కాళ్లు, చేతులు దెబ్బ తిన్న వారికి, మానసిక వికలాంగులకు తలా ఓ శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ఈ రిజర్వేషన్ అమలు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రకటించారు. ముందుగా, సచివాలయంలో సీఎం పళనిస్వామి నేతృత్వంలో ప్రత్యేక పథకాలు, గ్రామీణాభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖ విభాగాలతో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఆయా శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ పాల్గొన్నారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement