-
CM Jagan: జగనన్నకు కృతజ్ఞతలు
సాక్షి, కర్నూల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద రూ.253.72 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్ వద్దకు చేరుకునే క్రమంలో.. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధితులు ఆయన్ని కలిశారు. వైద్యచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కావాలని విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను సీఎం జగన్ ఓపికగా విని వారితో కాసేపు మాట్లాడారు. అయితే.. వాళ్లలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తూనే ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున నలుగురికి రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజనని ఆదేశించారు. ఆర్థిక సహాయంతో పాటు మెరుగైన వైద్య సహాయం అంద చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం నలుగురు బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు. ఆర్థిక సహాయం అందుకున్న వారు ► కర్నూలు పట్టణం నరసింహారెడ్డి నగర్ కు చెందిన ఎస్.వెంకటేశ్వర గౌడ్, ఉషారాణి దంపతుల 7 నెలల కుమారుడు నివాన్ష్ స్పైనల్ మస్కులార్ డిజార్డర్ (ఎస్ఎమ్ఏ)తో బాధపడుతున్నాడని, వ్యాధి నివారణ కొరకు ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆర్థిక సాయం నిమిత్తం లక్ష రూపాయలు చెక్ అందచేశారు.. ► కృష్ణగిరి మండలం, పోతుగల్లు గ్రామానికి చెందిన టి.వెంకట రాముడు నాలుగు సంవత్సరాల నుంచి బ్రైన్ స్ట్రోక్, పక్షవాతంతో బాధపడుతున్నాడని అతని కుమారుడు టి.హరికృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యల్ని విన్నవించుకోగా.. తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.. ఆ మేరకు జిల్లా కలెక్టర్ వారికి లక్ష రూపాయలు చెక్ అందచేశారు.. ► కృష్ణగిరి మండలం, పోతుగల్లు గ్రామానికి చెందిన బి.రామ్ ప్రసాద్ ఆరు సంవత్సరాల నుంచి వెన్నపూస సమస్యతో బాధపడుతున్నాడు. అతని అన్న బి.కౌలుట్ల.. తన సమస్యను విన్నవించుకోగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ అతనికి లక్ష రూపాయలు చెక్ అంద చేశారు. ► తుగ్గలి మండలం, చెన్నంపల్లి గ్రామ నివాసి తన తండ్రి ఓ.వెంకటేశ్వర రెడ్డికి డయాలసిస్ చేయించడంతో పాటు అత్యవసరంగా కిడ్నీ అవసరం కావడంతో తన తల్లి కిడ్నీ ఇచ్చి 24వ తేదిన సర్జరీ చేయగా.. జులై 19వ తేది హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో మరణించారని, అందుకు సంబంధించిన బిల్లుల మొత్తాన్ని మంజూరు చేసి సహాయం చేయాలని ఓ.జనార్ధన్ రెడ్డి.. సీఎం జదన్ ఎదుట సమస్యను విన్నవించుకోగా తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు చెక్కును కలెక్టర్ అందచేశారు. ఆర్థిక సహాయం అందచేసిన సందర్భంగా నలుగురు బాధితుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. ఇదీ చదవండి: సీమ నీటి కష్టాలు నాకు తెలుసు: సీఎం జగన్ -
డోన్ రాజు ఎవరో?
మహాభారతంలో పాండవుల గురువైన ద్రోణాచార్యుడుఈ ప్రాంతంలోని ఒక కొండపై తపస్సు చేయడంతో ద్రోణాచలమనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధి. కాలక్రమంలో ఆ పేరు కాస్తా డోన్గా స్థిరపడింది. కర్నూలు జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీల్లో ఒకటైన డోన్ జిల్లాలో పేరొందిన రైల్వే జంక్షన్. రాజకీయంగాను, చారిత్రకంగాను ఎంతో ప్రాధాన్యమున్న నియోజకవర్గంలో ఈ ఐదేళ్లూ అరాచకాలు, భూ ఆక్రమణలతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. స్వయానా డిప్యూటీ సీఎం సోదరుడే ఈ దందాలకు లీడరు. అత్యంత నాణ్యమైన సున్నపురాయికి, మైనింగ్ పరిశ్రమలకు డోన్ పెట్టింది పేరు. ఆ పరిశ్రమలు కాస్తా చంద్రబాబు సర్కారు కరెంటు షాక్తో కుదేలయ్యాయి. వరుసగా నాలుగేళ్లు పెరిగిన విద్యుత్ చార్జీల దెబ్బతో పాటు రాయల్టీ పెంపు తదితర కారణాలతో 1500 గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి బుగ్గన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్పై 11,152 ఓట్ల మెజార్టీతో బుగ్గన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచాక తన సొంత నిధులతో బేతంచర్లలో షాదీఖానా, డోన్ హైస్కూల్లో అదనపు తరగతులు నిర్మించారు. ప్యాపిలిలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు పనుల్ని ప్రారంభించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ హోదాలో రాష్ట్రంలో వివిధ నౌకాశ్రయాల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై అధికారులను నిలదీశారు. వివిధ పథకాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ఎండగట్టారు. సౌమ్యుడిగా పేరొందడంతో పాటు సమస్యలపై అవగాహన ఉన్న మేథావిగా బుగ్గనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాల్ని ఎదిరిస్తూ.. ప్రజా సమస్యలపై నిలదీస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ నుంచి మళ్లీ కేఈ ప్రతాపే! తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి కేఈ ప్రతాప్ పోటీలో ఉన్నారు. వాస్తవానికి కోట్ల కుటుంబం టీడీపీలో చేరాక డోన్ టికెట్ ఇవ్వాలని కేఈ సుజాతమ్మ పట్టుబట్టారు. అయితే ప్రతాప్కే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం సోదరుడి హోదాలో రెవెన్యూ విభాగంలో ఖాళీగా ఉన్న అనేక స్థలాల్ని ఆక్రమించారనే పేరుంది. అధికారుల్ని బెదిరించి ప్రోటోకాల్ పాటించేలా చేసుకున్నారన్న తీవ్ర విమర్శలున్నాయి. డోన్ నియోజకవర్గంలో జరిగిన మరుగుదొడ్ల కుంభకోణంలో ఒక ఎంపీడీవో సస్పెండయ్యారు. ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించకుండానే రూ.కోట్ల నిధుల్ని అధికారపార్టీ నేతలు కాజేశారు. జాగా కనిపిస్తే కబ్జా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్.. ఖాళీ స్థలం కనబడితే చాలు ఆక్రమణలకు తెరదీశారు. డోన్ పట్టణ నడిబొడ్డున ఉన్న వక్ఫ్భూమిని ఆక్రమించారు. ఏకంగా గ్రామాల్లో పొలాలకు సాగునీరందించే వాగు స్థలం కబ్జాకు ప్రయత్నించారు. మున్సిపాలిటీలో ఇతరులు టెండర్లో పాల్గొంటే ఏకంగా భౌతిక దాడులకు దిగారు. విద్యుత్, రాయల్టీ చార్జీలు తగ్గిస్తామని జగన్ హామీ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గ్రానైట్ పరిశ్రమలకు కరెంటు చార్జీల్ని యూనిట్కు రూపాయి మేర తగ్గించగా.. చంద్రబాబు సీఎం అయ్యాక అమాంతం పెంచేశారు. 2014 వరకూ టన్నుకు రూ.280 ఉన్న రాయల్టీ చంద్రబాబు హయాం లో బ్లాక్ గ్రానైట్పై రూ.600, కలర్ గ్రానైట్పై రూ.560కు పెంచారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఎఫెక్ట్తో బ్లాక్ గ్రానైట్పై రాయల్టీని టన్నుకు రూ.300కు తగ్గించారు. గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్, రాయల్టీ చార్జీలు తగ్గించడంతో పాటు డోన్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. డోన్ పట్టణంతో పాటు మరికొన్ని గ్రామాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి మంచినీటి సరఫరా పథకాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రారంభోత్సవంతో సరిపెట్టింది. ప్రధాన సమస్యలు : నియోజకవర్గపు పరిధిలో ఖనిజ సంపద అపారంగా ఉంది. సున్నపురాయి, గ్రానైట్, మొజాయిక్ చిప్స్, కలర్ స్టోన్స్ ఆధారిత పరిశ్రమలున్నాయి. ఇక్కడ లభించే ఖనిజానికి సరైన మార్కెట్ లేకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలకు విద్యుత్ చార్జీలు పెంచడం, రాయల్టీ చార్జీలు పెరగడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం లేకపోవడంతో అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. 45 వేల మంది ఉపాధి కోల్పోయారు. గత ఎన్నికల సమయంలో పరిశ్రమల్ని ఆదుకునేందుకు డెహ్రడూన్ తరహాలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారు. డోన్ నియోజకవర్గంలోని చెరువులు నీరు లేక నోరెళ్లబెట్టాయి. చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించాలి. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రసుత్తం డోన్లో ఉన్న 30 పడకలున్న ప్రభుత్వ ఆస్పత్రి స్థాయిని 100 పడకలకు పెంచాలి. బాలికలు ఉన్నత చదువులు చదివేందుకు మహిళా, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు అవసరం. ప్యాపిలిలో 10 పడకల ఆస్పత్రిని 30 పడకలకు పెంచాలి. బేతంచర్లకు అవుకు రిజర్వాయర్ నుంచి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీనీ చంద్రబాబు విస్మరించారు. – కె.జి. రాఘవేంద్రరెడ్డి, సాక్షి ప్రతినిధి, కర్నూలు -
చంద్రబాబుకి క్రెడిబిలిటి లేదు: వైఎస్ విజయమ్మ
డోన్: వైఎస్ఆర్ ఆశయాలకు, సంక్షేమాలకు వారసత్వంగా పుట్టిందే తమ పార్టీ తని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎంతోమంది అభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు వైఎస్ఆర్ తోడ్పడ్డారని గుర్తు చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ చేస్తానని మభ్య పెడుతున్నారని విమర్శించారు. మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. చంద్రబాబుకి క్రెడిబిలిటి లేదన్నారు. చంద్రబాబు వస్తున్నారు జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా డోన్ వచ్చిన వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ జనభేరిలో ప్రసంగించారు. వైఎస్ఆర్ ఆశయాలను జగన్బాబు నెరవేరుస్తారని ఆమె హామీయిచ్చారు. ప్రజలపై భారం పడకుండా సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా జగన్బాబు పాలన రావాలన్నారు. డోన్ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజారెడ్డి, ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డిని వైఎస్ విజయమ్మ ప్రకటించారు.
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
కిక్కిరిసిన కర్నూల్
డైరెక్ట్గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
తప్పక చదవండి
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement