-
ఏపీ హిస్టరీ
కుతుబ్షాహీల కాలంనాటి సాంఘిక పరిస్థితులు యూరోపియన్ యాత్రికులు, వర్తకులు, రాయబారులు రాసిన గ్రంథాల ద్వారా కుతుబ్షాహీల కాలంనాటి మత-సాంఘిక పరిస్థితులు తెలుస్తున్నాయి. గోల్కొండ నవాబుల రాజభాష పారశీకం అయినా, తెలుగు భాష కూడా వారి పాలనలో మంచి అభివృద్ధినే సాధించింది. తెలుగు, దక్కనీ ఉర్దూ, పారశీక భాషలు ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. ఈ యుగంలో మతమౌఢ్యాలు, మూఢాచారాలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. జ్యోతిషం, ముహూర్త బలాలు, దుష్టఘడియల ప్రమాదాలు, సూర్య చంద్రులను, నక్షత్రాల్ని దేవతలుగా నమ్మడం లాంటివి ఉన్నట్లు బెర్నియర్ రాశాడు. బ్రాహ్మణులకు గణితం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రాల్లో మంచి పరిజ్ఞానం ఉందని మూర్ల్యాండ్ పేర్కొన్నాడు. వైశ్యులు వర్తకం చేసేవారని, గణితంలో వీరికి మంచి పట్టు ఉండేదని బౌరే రాశాడు. శూద్రులు ప్రభువుల వద్ద సేవకులుగా, సైనికులుగా పనిచేసేవారని మెత్హాల్డ్ పేర్కొన్నాడు. సంఘంలో వితంతువులది బాధాకరమైన స్థితి. నగలు పెట్టుకోకూడదు, శుభ్రమైన దుస్తు లు ధరించకూడదు. బంధువులకు దూరంగా ఉండేవారు. సమాజంలో వేశ్యలకు గౌరవం ఉండేది. వారికి అండగా పాలకవర్గం ఉండేది. గోల్కొండలో 20 వేల మంది వేశ్యలు ఉండే వారని టావెర్నియర్ రాశాడు. వారికి ప్రభుత్వం లెసైన్సులు ఇచ్చేది. వారి నుంచి పన్నులు వసూలు చేసేవారు కాదు. దేవదాసీలకు సంఘంలో మంచి గౌరవం ఉంది. హైదరాబాద్ నగర నిర్మాత మహ్మద్ కులీకుతుబ్షా ‘కుల్లియత్’ అనే గ్రంథాన్ని ఉర్దూ భాషలో రచించాడు. ఇందులో హిందువుల, ముస్లింల పండగల గురించి వివరించాడు. మొహర్రం, రంజాన్, దీపావళి, హోళీ, వసంతోత్సవం లాంటి పండగలను వర్ణించాడు. మహమ్మదీయుల వాస్తు కట్టడాల్లో పూర్ణ కుంభం, లతాపద్మాలు, హంసలు, ఏనుగులు లాంటి హిందూ వాస్తు సంప్రదాయాలు ప్రవేశించాయి. కుతుబ్షాహీలు పారశీక దేశం నుంచి వచ్చిన షియా మతస్థులు. షియా సంప్రదాయానికి సహజమైన సహనాన్ని పరిపాలనలో ప్రదర్శించారు. జాతి, మత విభేదాలు పాటించకుండా, అర్హత ఉన్నవాళ్లకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి, తెలుగువారి సహాయంతో ఆంధ్రదేశాన్ని సమైక్యం చేశారు. వాస్తు - స్మారక నిర్మాణాలు గోల్కొండ కుతుబ్షాహీల కట్టడాలు, షియామత సూత్రాలకు అనుగుణంగా పారశీక, బహమనీ హిందూ సంప్రదాయాల సమ్మేళనంగా ఉంటాయి. ఈ శైలిలో గుమ్మటాలు, కమాన్లు, మీనార్లు ఉంటాయి. పుష్పాలు, లతలు, పక్షులు ఈ నిర్మాణాల్లో కన్పిస్తాయి. వాస్తుపరంగా విశిష్టమైన కుతుబ్షాహీ శైలి వెలుగులోకి వచ్చింది. వీరు ప్రధానంగా పారశీక వాస్తుతో పాటు బహమనీ సుల్తానుల వాస్తునే అనుసరించారు. పెద్ద గుమ్మటాలు, విశాలమైన ప్రవేశ ద్వారాలు, ఎత్తయిన మీనార్లు అష్ట కోణాకృతి నిర్మాణాలు ఈ శైలికి ముఖ్య లక్షణాలు. హైదరాబాద్లోని చార్మినార్, చార్కమాన్, మక్కామసీదు, టోలీ మసీదు, గోల్కొండ కోట, కుతుబ్షాహీల సమాధులు, బాదుషాహీ అసూర్ఖానా లాంటి నిర్మాణాలు, కుతుబ్షాహీ వాస్తుకు అద్దం పడతాయి. కుతుబ్షాహీ మూడో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్షా కాలంలో మూసీనదిపై క్రీ.శ. 1578 పురానాఫూల్ (పాతవంతెన)ను నిర్మించారు. ఇతడి కాలంలోనే హుస్సేన్ సాగర్, బద్వేల్, ఇబ్రహీంపట్నం, గోల్కొండ కోటలోని ఇబ్రహీం మసీదులను నిర్మించారు. మహ్మద్ కులీకుతుబ్ తన ప్రేయసి భాగమతి పేరుపై మూసీ నది దక్షిణ ప్రాంతంలో క్రీ.శ. 1591లో చిచిలం గ్రామం (ప్రస్తుత షా-ఆలి-బండ ప్రాంతం)లో ప్లేగు వ్యాధి నివారణకు జ్ఞాపకంగా నాలుగురోడ్ల కూడలి మధ్య చార్మినార్ను నిర్మించాడు. చార్మినార్ పక్కనే ఉన్న జమామసీదును 1594లో కులీ నిర్మించాడు. దీంతోపాటు మహ్మద్ కులీ పత్తర్గట్టి ప్రాంతం (హైదరాబాద్)లో బాదుషాహీ అసూర్ఖానా, దారుల్షిఫా(ఆసుపత్రి), చార్ కమాన్ లాంటి నిర్మాణాలు చేశాడు. వీటిని రాయి, సున్నంతో నిర్మించారు. కులీ కుతుబ్షా అల్లుడైన మహ్మద్ కుతుబ్షా (క్రీ.శ. 1612- 1626) దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మక్కా మసీదును క్రీ.శ. 1617లో నిర్మించాడు. కుతుబ్షాహీల ఇతర స్మారక నిర్మాణాలు, గోల్కొండ కోట అంతర్భాగంలో భక్తరామదాసు బందిఖానా, రాణీమహల్లు, సుల్తాన్ల మరణాంతరం ఖననానికి ముందు స్నానం చేయించే గదులు నేటికీ ఉన్నాయి. సుమారు వంద ఎకరాల స్థలంలో నిర్మించిన కుతుబ్షాహీల సమాధులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాస్తు నిర్మాణాలు. ఒకే రాజవంశానికి చెందిన సుల్తానుల సమాధులన్నీ (అబుల్ హసన్ తానీషా తప్ప) ఒకే ప్రాంగణంలో నిర్మించడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కన్పించదు. సమాధుల డోమ్ అంతర్భాగాన్ని అష్టకోణాకృతిలో ప్రత్యేక పరిజ్ఞానంతో నిర్మించారు. కుతుబ్షాహీల కాలంనాటి చిత్రకళ, మొగలులు, హిందూ- పారశీక సంప్రదాయం లో దక్కనీ చిత్రకళ చరిత్రలో పేరుగాంచింది. తారీక్ హుస్సేన్ ‘షాహిద్ -షాహీ దక్కన్’ గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి. మహమ్మద్ కులీకుతుబ్షా రచించిన ‘కుల్లియత్’ గ్రంథంలో 14 సూక్ష్మచిత్రాలు (మీనియేచర్ చిత్రాలు) ఉన్నాయి. దక్కను ఉర్దూలో రాసిన మొదటి గ్రంథంగా ‘కుల్లియత్’ను పేర్కొంటారు. మాదిరి ప్రశ్నలు 1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి 2. ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ను శంకరకవి ఏ భాషలో రచించాడు? తెలుగు 3. కుతుబ్షాహీల రాజభాష ఏది? పారశీకం 4. ఏ గోల్కొండ నవాబును కవులు తమ రచనల్లో ఇభరాముడని కీర్తించారు? ఇబ్రహీం కుతుబ్షా (మూడో నవాబు) 5. ‘సుగ్రీవ విజయం’ యక్షగాన నాటకం తెలుగుభాషలో మొదటిది. దాని రచయిత ఎవరు? కందుకూరి రుద్రకవి 6. ‘నిరంకుశోపాఖ్యానం’ అనే శృంగార కావ్యాన్ని తెలుగుభాషలో ఎవరు రచించారు? కందుకూరి రుద్రకవి 7. పొన్నగంటి తెలగనార్యుడు ‘యయాతి చరిత్ర’ అనే అచ్చతెలుగు కావ్యాన్ని ఎవరికి అంకితమిచ్చాడు? గోల్కొండ తరఫీదార్ అమీన్ఖాన్ 8. మహ్మద్ కులీ కుతుబ్షా గోల్కొండ పాలకుల్లో ఎన్నో సుల్తాన్? ఐదు 9. ‘వైజయంతీ విలాసం’ అనే శృంగార కావ్యాన్ని రచించిన సారంగు తమ్మయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? మహ్మద్ కులీ కుతుబ్షా 10. {పసిద్ధ పదకర్త, మువ్వగోపాల పదాలు రచయిత క్షేత్రయ్య ఏ కుతుబ్షాహీ పాలకుడికి సమకాలీకుడు? అబ్దుల్లా కుతుబ్షా 11. దాశరథీ శతకం రచయిత? కంచర్ల గోపన్న 12. కూచిపూడి (కృష్ణా జిల్లా) నాట్యాచార్యుల సేవలకు గుర్తింపుగా ఏ గోల్కొండ నవాబు ‘కూచిపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా దానం చేశాడు? అబుల్ హసన్ తానీషా 13. మూసీ నదిపై పురానాపూల్ (వంతెన)ను క్రీ.శ. 1578లో ఏ గోల్కొండ నవాబు నిర్మించాడు? ఇబ్రహీం కుతుబ్షా 14. మహ్మద్ కులీ కుతుబ్షా చార్మినార్ని ఎప్పుడు నిర్మించాడు? {Mీ.శ. 1591లో 15. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన మక్కా మసీదును హైదరాబాద్లో ఏ గోల్కొండ నవాబు నిర్మించాడు? మహ్మద్ కుతుబ్షా 16. తొలి ఉర్దూ గ్రంథంగా పేరు పొందిన ‘కుల్లియత్’ను ఎవరు రచించారు? మహ్మద్ కులీ కుతుబ్షా 17. గోల్కొండ సుల్తాన్లలో చివరి నవాబు? అబుల్ హసన్ తానీషా 18. గోల్కొండను స్వాధీనం చేసుకోవడానికి 1687లో మొగలు చక్రవర్తి ఔరంగజేబుకు ఎన్ని నెలల కాలం పట్టింది? 8 నెలలు 19. కుతుబ్షాహీ - గోల్కొండ రాజ్యస్థాపకుడు? సుల్తాన్ కుతుబ్ - ఉల్- ముల్క్ 20. కైఫీయతులు అంటే ఏమిటి? స్థానిక కథనాలు 21. కుతుబ్షాహీలు ఏ మహ్మదీయ శాఖకు చెందినవారు? షియా మతస్థులు 22. మజ్లిస్ - దివాన్ దరి - మజ్లిస్ - ఇ - కింగాష్లు దేన్ని సూచిస్తాయి? సుల్తాన్కు సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన పండిత పరిషత్తులు 23. పీష్వా, దివాన్ పదాలు దేన్ని సూచిస్తాయి? {పధానమంత్రి పదవి 24. గోల్కొండ చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా ప్రధాన మంత్రి ఎవరు? మాదన్న 25. అబుల్హసన్ తానీషా సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? అక్కన్న 26. మీర్ జుమ్లా అంటే ఎవరు? మంత్రి (ఆర్థిక - రెవెన్యూ శాఖల అధిపతి) 27. కుతుబ్షాహీల కాలంలో మజుందార్ అంటే ఎవరు? గణాంకాధికారి 28. కుతుబ్షాహీల తరఫీలు (రాష్ట్రాలకు) అధిపతి ఎవరు? తరఫీదార్ (గవర్నర్) 29. కొత్వాల్ అంటే ఎవరు? రక్షక భటాధికారి 30. కుతుబ్షాహీల పాలనలో ప్రధాన రేవు అధికారిని ఏమని పిలిచేవారు? షా బందర్ 31. గోల్కొండ రాజ్యంలో గ్రామ వ్యవహారా లను ఎవరు నిర్వహించేవారు? బారా బలవంతులు (పన్నిద్ధరు ఆయగాండ్రు) 32. గోల్కొండ సైన్యం ఎవరి పర్యవేక్షణలో ఉండేది? ఐనుల్ ముల్క్ 33. {Mీ.శ. 1687లో ఔరంగజేబు కాలంలో గోల్కొండ కోటను ముట్టడించారు. అప్పటి కుతుబ్షాహీ చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా సైన్యాధ్యక్షుడు? అబ్దుల్ రజాక్ లారీ -
ఏపీ హిస్టరీ
విజయనగర సామ్రాజ్యం-యుగ విశేషాలు విజయనగర సామ్రాజ్యం దాదాపు రెండు శతాబ్దాల పాటు మహోన్నతమైన దశను అనుభవించింది. మధ్యయుగ చరిత్రలో అత్యంత సుసంపన్నమైన రాజ్యాల్లో ప్రథమ స్థానం పొందింది. విజయనగరాన్ని సందర్శించిన న్యూనిజ్, పేస్, అబ్దుల్ రజాక్, నికోలి-డి-కాంటే, బార్బోసా, వర్తెమా వంటి విదేశీయుల యాత్రా కథనాలు, శాసనాలు, నాణేలు, సమకాలీన సాహిత్యం ఆనాటి యుగ చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. విజయనగరం 60 మైళ్ల చుట్టుకొలతతో, 7 ప్రాకారాలతో విరాజిల్లుతోందని, సిరిసంపదలతో తులతూగుతోందని నికోలా-డి- కాంటే ప్రశంసించాడు. విజయనగరం వంటి నగరాన్ని చరిత్రలో మరెక్కడా చూడలేదని, వీధుల్లో రత్నాలను రాశులుగా పోసి విక్రయించేవారని చరిత్రకారుడు రజాక్ తన రచనల్లో కొనియాడాడు. రాజ్యంలో అత్యంత సార వంతమైన భూములు ఉన్నాయని, పంటలు విస్తారంగా పండుతాయని విదేశీ యాత్రికులు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమి పన్ను. వివిధ వృత్తుల వారినుంచి వసూలు చేసే పన్నులు, సామంతులు చెల్లించిన కప్పాల ద్వారా కూడా ఆదాయం సమకూరేది. రాజులు శత్రురాజ్యాల నుంచి ధనరాశులను చేజిక్కించుకొనేవారని, రాజ ప్రతినిధులు భరణాలను చెల్లించేవారని, బహుమతులు ఇచ్చేవారని, పుత్రోదయ, వివాహాది శుభకార్యాల్లో సామంతులు ధనరూపంలో, ఆభరణాల రూపంలో కానుకలు అందజేసేవారని పేస్ తన రచనల్లో వెల్లడించాడు. విజయనగర రాజులు, సామంతులు, ఉద్యోగులు రాజ్యంలో అనేక చెరువులను తవ్వించారు. కాల్వల ద్వారా నీటిపారుదల సౌకర్యాలను కల్పించారు. పెనుగొండ దగ్గర బుక్కరాయలు శిరువేరు తటాకాన్ని, అనంతపురం దగ్గర సాళువ నరసింహుడు నరసాంబుధి చెరువును తవ్వించారు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు ఇంజనీర్ల సాయంతో నాగలాపురం తటాకాన్ని నిర్మించి, పంటకాల్వలను తవ్వించాడు. కొండమరసు కొండవీటి రాజ్యంలో తిమ్మ సముద్రాన్ని నిర్మించాడు. రాజులు నూతన వ్యవసాయిక గ్రామాలను నిర్మించి, కొన్ని సంవత్సరాల పాటు పన్నులను వసూలు చేయకుండా వ్యవసాయాభివృద్ధికి అండగా నిలిచారు. దేశంలో జామ, మామిడి, నిమ్మ, వరి, జొన్నలు, రాగులు, అరటి, కొబ్బరి, ఆకుకూరలను పుష్కలంగా పండించేవారు. విజయనగర రాజులు పంట పొలాలను సర్వే చేయించారు. పంటపొలం, అందులోని సారం, దిగుబడులను పరిగణనలోకి తీసుకొని పన్నులను మదింపు చేసేవారు. ఫలసాయంలో ఆరో వంతును పన్నుగా వసూలు చేసేవారు. తెలుగు తీరాంధ్ర ప్రాంతంలో మంత్రి తిమ్మరసు.. భూమిని సర్వే చేయించినట్లు తెలుస్తోంది. భూమిని కొలవడానికి భిన్న ప్రాంతాల్లో వేర్వేరు కొలమానాలను ఉపయోగించేవారు. పాకనాడులో రెండు గడలు, తీరాంధ్ర ప్రాంతంలో కేసరిపాటి గడలు, రేనాడులో దోరగడలు ఉపయోగంలో ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. సాధారణంగా భూమిని రెండు రకాలుగా విభజించారు. నీరాంబర(మాగాణి భూమి), కాడాంబర(మెట్ట పొలాలు)గా వర్గీకరించారు. నీరాంబర భూముల్లో పండిన పంటకు ధాన్యరూపంలో పన్నును చెల్లించేవారు. కాడాంబర పొలాల్లో పండే పంటకు(అరటి, కూరగాయలు, ఆకుకూరలు) ధనరూపంలో పన్నులు చెల్లించేవారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద గ్రంథం ప్రకారం... రాజుకు లభించే ఆదాయాన్ని నాలుగు భాగాలుగా విభజించి, ఖర్చు చేసేవారు. రాజు దానధర్మాలు, రాజు వ్యక్తిగత వ్యయం, గుర్రాల నిర్వహణ, దండయాత్రలు, దేశాభివృద్ధి, దేశ రక్షణకు ఆదాయాన్ని ఖర్చు చేసేవారు. గ్రామాల్లో పంటపొలాలు, శిస్తుల వివరాలను కరణాలు ‘కవిలె’ అనే పద్దుపుస్తకాల్లో నమోదు చేసేవారు. పన్నుల స్వరూపం భూమి, వృత్తి, వివాహం, పారిశ్రామిక ఉత్పత్తులపై పన్నులను విధించేవారు. ఒకే స్థలంలో అమ్మకానికి వచ్చే సరకులపై స్థలాదాయం అనే పన్ను, ఒకచోట నుంచి మరోచోటుకు తీసుకెళ్లే వస్తువులపై మార్గాదాయం అనే పన్ను, ఇతర రాజ్యాలకు ఎగుమతి చేసే వస్తువులపై మామూలాదాయం పన్ను, నేత మగ్గాలపై మగ్గం పన్నును విధించేవారు. దూదిని ఏకి దారం తీసేవాళ్లు పింజుణీ సిద్ధాయం అనే పన్నును చెల్లించేవారు. విజయనగర రాజ్యంలోని కొన్ని సీమల్లో వివాహ సుంకాలను రద్దు చేసిన మొదటి రాజు తుళువ వీరనరసింహుడు. శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యమంతటా వివాహ సుంకాలను(కన్యాశుల్కాలు) రద్దు చేశాడు. నేత పరిశ్రమపై మగ్గరి స్థావరం, నూనె పరిశ్రమపై గానుగ స్థావరం, ఇంటిపై ఇల్లరి పన్ను, అంగళ్లపై మడిగె లేదా అడికాసు పన్ను, పశువులు మేసే పచ్చిక బయళ్లపై పుల్లరి పన్ను, గొర్రెలను విక్రయించేవారిపై అడ్డగడ సుంకం, తృణధాన్యాలు, కూరగాయలపై మలబ్రమ, కుల తగవుల ద్వారా సమయ సుంకం వంటి వివిధ రకాల పన్నులను వసూలు చేసేవారు. ఈ పన్నుల వివరాలన్నీ శ్రీకృష్ణదేవరాయలు వేయించిన కొండవీడు శాసనంలో ఉన్నాయి. ఉప్పు కొటార్లపై ఉప్పరి సిద్ధాయం పన్నును, నిధి నిక్షేపాలపై సంపత్తి పన్నును విధించేవారు. చలివేంద్రాలు, సంతలు వంటి ప్రదేశాలు సుంకాల వసూలు కేంద్రాలుగా ఉండేవి. సుంకందార్లు వేలం పాట ద్వారా సుంకాలను వసూలు చేసే హక్కులను పొందేవారు. వివాహ శుభకార్యాల్లో ఉభయ పక్షాలపై గుడి కల్యాణం, కల్యాణ కానికె అనే పన్నులను వసూలు చేసేవారు. వివాహ సుంకాలను ప్రజలు తీవ్రంగా నిరసించారు. కల్యాణ కానుకలను వసూలు చేసేవాడు తల్లికి మొగుడు అని ఒక శాసనంలో పేర్కొన్నారు. ఈ మాటను బట్టి వివాహ సుంకాలను ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో తెలుస్తోంది. వేశ్యలపై విధించిన పన్నులను రక్షక భటులకు జీతాలుగా చెల్లించేవారని డొమింగో పయస్ పేర్కొన్నాడు. యాచక వృత్తిపై విధించిన పన్నును గణాచారి అని పిలిచేవారు. పుత్రులు లేని కుటుంబీకుల ఆస్తులు ప్రభుత్వ వశమయ్యేవి. కోటల నిర్వహణ కోసం కూడా పన్నులు విధించేవారు. సుంకాధికారుల దౌర్జన్యాలతో ప్రజలు తీవ్రంగా కుంగిపోతున్నారని న్యూనిజ్, పేస్ల రచనలు వివరిస్తున్నాయి. రైతులు అప్పులు చేసి పన్నులు చెల్లించేవారని, తమ భూములను వదిలి వలస వెళ్లేవారని అప్పటి కైఫియత్తుల ద్వారా తెలుస్తోంది. ప్రతి గ్రా మంలో వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు, నూనెల తయారీ, నీలిమందు, వస్త్ర పరిశ్రమలు వెలిశాయి. సాలె, పద్మసాలె, కురుబ, మాల కులాలవారు నేత వృత్తిలోకి ప్రవేశించారు. తాడిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ పట్టణాలు నూలు పరిశ్రమ కేంద్రాలుగా ప్రసిద్ధిగాంచాయి. వజ్రకరూర్ ప్రాంతంలో వజ్రాల గనులు ప్రఖ్యాతిగాంచాయి. ఇనుము, రాగి, కంచు మొదలైన లోహాలతో వ్యవసాయ పనిముట్లు, గృహోపకరణాలు, దేవతా విగ్రహాలను తయారు చేయడంలో పంచాణం వారు సిద్ధహస్తులు. విజయనగరం నుంచి రాజ్యం నలుమూలలకు రహదారులుండేవి. తిరుపతి బాట, విజయనగరం, కంచి, మచిలీపట్నం - కోవిలకొండ అనే బాటలు ప్రధానమైనవి. కావళ్లు, ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఎడ్లబండ్లు, పల్లకీలు అప్పట్లో ప్రధాన ప్రయాణ సాధనాలు. విజయనగర రాజ్యంలో ఆనాడు ఆదోని, పెనుగొండ, ఉదయగిరి, కొండవీడు, వినుకొండ, పొదిలి, దేవరకొండ, మాచర్ల, మార్కాపురం, మంగళగిరి, కొండపల్లి వంటి పట్టణాలు ప్రముఖ వ్యాపార కేంద్రాలుగా మారాయి. విదేశీ వాణిజ్యానికి పులికాట్, మచిలీపట్నం, మోటుపల్లి ప్రధాన రేవు కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ రేవుల ద్వారా గుర్రాలు, పచ్చకర్పూరం, పట్టుబట్టలు, కస్తూరి, ముత్యాలు, మణులు దిగుమతి అయ్యేవి. ఎగుమతుల్లో రత్నకంబళ్లు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు ముఖ్యమైనవి. వర్తకులు, పాంచాణం వారు, సాలె, మేదర మొదలైన చేతి వృత్తుల వారు, ఉప్పు కొటార్లవారు సంఘాలుగా ఏర్పడి తమ వృత్తులను ని ర్వహించుకొనేవారు. సంఘం సమావేశాలు ఆలయ మండపంలో జరిగేవి. ప్రతి సంఘానికి ఒక లాంఛనం ఉండేది. రాజ్యంలో ఆర్థిక అభివృద్ధి జరిగినప్పటికీ ప్రజానీకం విపరీతమైన పన్నుల భారంతో కుంగిపోయేది. రైతులు పండించిన పంట పన్నుల రూపంలో హరించుకుపోయేది. తరచుగా యుద్ధాలు జరగడం వల్ల గ్రామాలు దోపిడీలకు గురయ్యేవి. దీనికితోడు అజ్ఞానం, మూఢవిశ్వాసాలు రాజ్యమేలేవి. యాత్రలు, సంతర్పణలు, వివాహాది శుభకార్యాలు, ఆడంబరాలతో ప్రజల బతుకులు చిన్నాభిన్నం అయ్యేవి. పట్టణాల్లో ప్రభువులు ఐశ్వర్యం, విలాసాల్లో మునిగితేలుతుండగా, సామాన్య ప్రజలు దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారని అప్పట్లో బహమనీ రాజ్యంలో పర్యటించిన రష్యా యాత్రికుడు నికితిన్ తన రచనల్లో పేర్కొన్నారు. విజయనగర రాజ్య పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండేవికావు. న్యాయవ్యవస్థ- శిక్షలు విజయనగర న్యాయవ్యవస్థలో ఉన్నతాధికారి చక్రవర్తే. అత్యున్నత న్యాయస్థానం రాజాస్థానం. న్యాయాధీశులను ప్రాడ్వివాకులు అని పిలిచేవారు. స్వయంగా రాజే నేరాలను విచారించి, నిందితులను శిక్షించేవాడు. అయోగ్యులకు న్యాయ నిర్వహణాధికారం ఇవ్వొద్దని శ్రీకృష్ణదేవరాయలు సూచించాడు. కొన్ని సమయాల్లో రాజుకు బదులుగా ప్రధానమంత్రి న్యాయ నిర్వహణ జరిపేవాడని రజాక్ తెలిపాడు. ప్రాడ్వివాకులు (న్యాయాధీశులు) రాజుకు న్యాయ నిర్వహణలో సహాయపడేవారు. రాష్ట్రాల్లో రాష్ర్టపాలకులు, అమరు నాయకులు న్యాయ నిర్వహణ జరిపేవారు. వారిచ్చే తీర్పులు సంతృప్తికరంగా లేకపోతే రాజుకు నివేదించుకొనే అవకాశం ఉండేది. ఆస్తి తగాదాలను పరిష్కరించేందుకు తాత్కాలిక న్యాయస్థానాలుండేవి. వీటిని ధర్మాసనాలు అనేవారు. ఇవి ఆలయ మండపంలో సమావేశమవుతుండేవి. నేరస్థులను హింసించి, నేరం ఒప్పుకునేలా చేసే ఆచారం ఉండేది. సివిల్ నేరాలను ధనోర్భవ, క్రిమినల్ నేరాలను హింసోద్భవ అని పిలిచేవారు. నేర నిరూపణకు దివ్య పరీక్షలు ఉండేవని నికోలా-డి- కాంటే పేర్కొన్నాడు. కొన్ని నేరాలకు శిక్షలు అత్యంత కఠినంగా, క్రూరంగా ఉండేవని న్యూనిజ్ వెల్లడించాడు. చిన్న చిన్న దొంగతనాలకు పాల్బడేవారి కాలు, చెయ్యి నరికేసేవారు. పెద్ద దొంగతనాలకు పాల్పడేవారి గొంతు కింద కర్రగుచ్చి వేలాడదీసేవారు. రాజద్రోహానికి పాల్పడినవారిని కత్తులతో, శూలాలతో పొత్తి కడుపులో పొడవడం లాంటి శిక్షలు అమల్లో ఉండేవి. సమాజంలో బ్రాహ్మణులకు మరణశిక్ష అమల్లో లేదు. కానీ కనుగుడ్లను పెరికివేయడం, గాడిదలపై ఊరేగించడం లాంటి శిక్షలుండేవి. అట్టడుగు కులాలవారు నేరాలు చేస్తే శిరోముండనం(తల గొరిగించడం) చేసేవారు. నేరస్థులను ఏనుగులతో తొక్కించేవారు. అల్ప నేరాలకు పాల్పడిన వారి వీపులపై బండరాళ్లు ఎత్తించేవారు. కింది తీర్పులపై రాజువద్ద పునర్విమర్శ ఉండేది. సత్య ప్రమాణం చేయించి, శాస్త్రాలు చూసి న్యాయాన్ని నిర్ణయించేవారు. గ్రామ చావడి, దేవాలయ ప్రాంగణం, ఊరి రచ్చబండల వద్ద తీర్పులు చెప్పేవారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement