-
తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!
సోన్: ఇక్కడ దండేనికి వేళాడుతున్న చేపలను చూశారా? ఇవన్నీ ఎండు చేపలు. పచ్చి చేపలను ఎండబెట్టడానికి చేసుకున్న ఏర్పాటు ఇది. ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో నివసించేవారంతా గంగపుత్రులే. నాలుగు వందల జనాభా ఉండగా అంతా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిలో చేపల వేట సాగించి జీవనోపాధి పొందుతారు. అమ్ముడు పోగా మిగిలిన చేపలను నాలుగు రోజుల పాటు ఎండబెడతారు. ఎండుచేపలను కూడా అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) -
తెల్లవారకముందే ముగియడం ఈ సంత మార్కెట్ ప్రత్యేకం!
మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాతపాడు సంత అంటే ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పేరు. వేకువజామున 3 గంటలకు ప్రారంభమై తెల్లవారకముందే ముగియడం ఈ సంత ప్రత్యేకం. ఎండు చేపలు, కూరగాయలు, కిరాణా సరుకులు, దుస్తులు, బంగారు వస్తువులు, ఫ్యాన్సీ సామాన్లు వంటివి అమ్ముతుంటారు. ప్రతి మంగళవారం జరిగే సంత కోసం సోమవారం సాయంత్రానికే అమ్ముకునేవారు, కొనుగోలుదారులతో గ్రామం కోలాహలంగా మారుతుంది. సంత ఏర్పడిందిలా.. పాతపాడు పూర్తిగా మత్స్యకార గ్రామం. ఇక్కడకు వచ్చేందుకు పూర్వం సరైన రవాణా సదుపాయాలు లేవు. గ్రామం చుట్టూ ఏరులు ఉండటంతో లాంచీలు, పడవలే ఆధారం. మత్స్య సంపద అపారంగా ఉండటం, బయట ప్రాంతాలకు తరలించే అవకాశం లేకపోవడంతో ఇక్కడ సంత ఏర్పడింది. ముఖ్యంగా ఎండుచేపలకు పెట్టింది పేరుగా మారింది. వేటలో లభ్యమయ్యే చేపలు కోసి వాటికి ఉప్పు దట్టించి ఎండబెట్టి ఉప్పు చేపలు లేదా ఎండు చేపలుగా విక్రయిస్తారు. ఇరుగుపొరుగు గ్రామాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి కూడా చిరువ్యాపారులు తమ మత్స్య ఉత్పత్తులను ఇక్కడకు తీసుకువచ్చి విక్రయించడంతో సంత పేర్గాంచింది. మత్స్య సంపదతో పాటు మిగిలిన వస్తువుల క్రయవిక్రయాలు మొదలయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల కోసం బంగారు తాళిబొట్టును కూడా ఇక్కడ ఆర్డరు ఇచ్చి చేయించుకునేవారు. సంతలో దొరికే రకాలు పాతపాడు సంతలో పలురకాల ఎండు చేపలు లభిస్తాయి. పండు గప్ప, వంజరం, మాగ, సప్పిడి గొరక, పార, సండువాయి చుక్కర్లు, కవర్లు, బల్లపరిగ, సావిడాయి, కట్టి పరిగ, కారెగప్ప, రొయ్యలు, పీతలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ ఎండు చేపలను దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల్లో నివసించే బంధుమిత్రులకు పంపించేవారు. సంతలో దుకాణాల నిర్వహణలో మహిళలదే ప్రధాన పాత్ర. ఇక్కడ దుకాణాల్లో మహిళలు విక్రయిస్తుంటే మగవారు సాయం చేస్తుంటారు. తగ్గిన ఆదరణ మండల కేంద్రం మొగల్తూరు నుంచి పాతపాడు రావాలంటే రెండు రేవులు దాటాలి. ఇటీవల రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, ఆక్వా పరిశ్రమలు పెరగడం, మత్య్స సంపదను కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచడం వంటి పరిణామాలతో పాతపాడు సంతకు ఆదరణ తగ్గింది. గతంలో సంత జరిగే రోజు సుమారు 200 టన్నుల మత్య్స సంపద విక్రయాలు జరగ్గా ప్రస్తుతం టన్ను సరుకు కూడా అమ్ముడవడం లేదని గ్రామ పెద్దలు అంటున్నారు. రాష్ట్రంలోనే పేరు పాతపాడు సంతకు రాష్ట్రంలోనే పేరుంది. అయితే మారిన కాలానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, మత్య్స సంపదను నిల్వ చేసుకునే అవకాశం ఉండటంతో పాతపాడు సంత తన ప్రాభవాన్ని కోల్పోయింది. –కొప్పాడ లక్ష్మీతులసి, సర్పంచ్, పాతపాడు ఎక్కడెక్కడ నుంచో వచ్చేవారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాతపాడు సంతకు వస్తున్నా. ఎండుచేపలను కొనేందుకు ఎక్కడెక్కడ నుంచో కొనుగోలుదారులు వచ్చేవారు. ఎక్కడికక్కడ ఎండుచేపలు అందుబాటులోకి రావడంతో పాతపాడు సంత తగ్గింది. –చింతా వెంకటేశ్వరమ్మ, చినగొల్లపాలెం -
ఎండు చేపకు జీఎస్టీ పోటు
► కుళ్లిపోతున్న ఎండు చేపలు ► లక్షల్లో నష్టపోతున్న వ్యాపారులు ► వెనక్కి వస్తున్న ఎండుచేపల లోడ్లు ► విశాఖ హార్బర్లో పేరుకుపోయిన నిల్వలు పాతపోస్టాఫీసు : కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న జీఎస్టీ (వస్తు సేవల పన్ను) ఎండు చేపల వ్యాపారాన్ని సంక్షోభంలోకి నెట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం విధించిన 12 శాతం పన్ను ఎండుచేపల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతంత మాత్రంగా ఉండే మత్స్యపరిశ్రమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కొత్తగా పన్ను విధించడంతో పరిశ్రమ మరింత లోతుగా కష్టాల్లో కూరుకుపోతోంది. మత్స్యకారులు వేట సమయంలో ఉపయోగించే వివిధ రకాల వస్తువులతోపాటు, రొయ్య, పచ్చి, ఎండు చేపల ఎగుమతిపై విధించిన పన్ను తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ముందుకురాని వ్యాపారులు ఎండు చేపల కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు దిగాలుగా కూర్చుంటున్నారు. ప్రతి రోజు చేపల రేవుకు వచ్చి ఎండు చేపలను గుత్తగా కొని ఇతర ప్రాంతాలకు పంపే వ్యాపారులు రావడం మానేశారు. దీంతో ఉన్న సరకును ఏం చేయాలో తెలియక మత్స్యకార మహిళలు దిగాలు పడిపోతున్నారు. ఎగుమతులు : విశాఖ చేపల రేవు నుంచి కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్, చెన్నై, ఒడిశా, కర్నాటక వంటి రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని ఏలూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, నెల్లూరు, తిరుపతి, ప్రాంతీయంగా నక్కపల్లి, చందోలు, మానాపురం, కొత్తవలస, పూసపాటిరేగల్లో జరిగే పెద్దసంతలకు సరుకును ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రాం తాలకు సరుకుతో Ððవెళ్తున్న వ్యాన్లు అక్కడ కొనుగోలు చేయకపోవడంతో తిరిగి సరుకుతో చేపల రేవుకు వచ్చేస్తున్నాయి. బోటు డ్రైవర్లు, కలాసీలతో తగాదాలు చేపల రేవులో ఉన్న సుమారు 700 బోట్లు నిత్యం వేటకు వెళ్లి వస్తుంటాయి. వేటలో పడే పెద్ద చేపలు, ఎగుమతి ర కం రొయ్యలు బోటు యజమానికి పోగా.. గొరసలు, కానాగడతలు, పట్టిసావళ్లు, గుండరొయ్య, కవ్వళ్లు, గులివిందలు, నెత్తళ్లు వంటి చిన్నచేపలను బోటులో పనిచేసే కలాసీలు, డ్రైవరు అమ్ముకుంటారు. వీటిలో కొంత శాతం బోటులోనే ఎండబెట్టి రేవుకు వచ్చిన తరువాత ఎండుచేపల వర్తకులకు అమ్మేస్తారు. ప్రస్తుతం మంచి ధర పలకడం లేదు. ఎండుచేపలు అమ్మే వర్తకులే సిండికేట్ అయ్యి ధరను తగ్గించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎండుచేపల వర్తకులతో తగాదా పడుతున్నారు. జీఎస్టీ బాదుడని వివరించినా బోటు కలాసీలు వినడం లేదని ఎండుచేపల వర్తకులు వాపోతున్నారు. పేరుకుపోతున్న నిల్వలు ఎగుమతి అవుతున్న ఒక్కొక్క ఎండు చేపల లారీకి సుమారుగా రూ.25 వేల వరకు జీఎస్టీ చెల్లించాలని వ్యాపారులు చెబుతుండడంతో సరుకు వెనక్కి వచ్చేస్తోంది. దీంతో విశాఖపట్నం చేపల రేవులో ఎండుచేపలు టన్నుల కొద్దీ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రూ. లక్షల విలువ చేసే సరుకు కుళ్లిపోతోంది. మత్స్యకార వ్యాపారులు కన్నీళ్లు దిగమింగుకుంటూ వీటిని తిరిగి సముద్రంలో పారబోస్తున్నారు. ఇరవై రోజులుగా వ్యాపారం లేదు 20 రోజులుగా ఎండు చేపల వ్యాపారం సాగకపోవడంతో ఎండు చేపల బస్తాలను టార్పాలిన్తో మూసివేశారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా రేవులోనే ఉండిపోయి సరుకును రక్షించుకోవడంతో పాటు కొనుగోళ్లు జరుగాతాయన్న ఆశతో వీరంతా ఎదురు చూస్తున్నారు. అమ్మకాలు నిలిచిపోయాయి గత ఇరవై రోజులుగా ఎండు చేపల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి తయారుచేసిన సరుకును ఏం చేసుకోవాలో తెలియడం లేదు. ప్రభుత్వం పెద్ద మనసుతో చేపల వర్తకులను జీఎస్టీ నుంచి తొలగించాలి - చింతపల్లి కొర్లమ్మ, చింతపల్లి, విజయనగరం జిల్లా సరుకు కుళ్లి పోతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండు చేపల మీద పన్ను వేయడంతో కొనుగోళ్లు పడిపోయాయి. దీంతో సరకు కుళ్లి పోతోంది. లక్షల విలువ చేసే సరుకును తిరిగి సముద్రంలో పారబోయడం చాలా బాధగా ఉంది. అధికారులు ఆదుకోవాలి - బర్రి పెంటమ్మ, చింతపల్లి, విజయనగరం జిల్లా బోటు సిబ్బందితో గొడవలు జీఎస్టీ వల్ల సరుకు కొనుగోలు కాకపోవడంతో మేము కూడా బోట్లలోని సరకును తక్కువ ధరకే అడుగుతున్నాం. దీంతో ఎండు చేపల వ్యాపారం చేసేవారంతా కలిసిపోయి చేపల ధర తగ్గించేస్తున్నామని మాతో గొడవకు దిగుతున్నారు. ప్రభుత్వం చేసిన పనికి మేము బాధ్యులం ఎలా అవుతాం –బొడ్డు పెద్ద ఎల్లయ్యమ్మ, నాగమయ్యపాలెం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement