-
చిరు తప్పిదం.. భారీ మూల్యం
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల నియామకాలకు సంబంధించి నిర్వహించిన డీఎస్సీ-2014 పరీక్షల్లో ఓఎమ్మార్ షీట్లలో దొర్లిన పొరపాట్లు అభ్యర్థుల కొంపముంచాయి. బబ్లింగ్ (గడులు నింపడం) చేయడంలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా అనేక మందికి మార్కులు తారుమారయ్యాయి. ఫైనల్ ‘కీ’లోని సమాధానాల ఆప్షన్లను పరిశీలించుకొని అంచనా వేసుకున్న మార్కులకు ఫలితాల వెల్లడిలో వచ్చిన మార్కులకు మధ్య వ్యత్యాసం ఉండడంతో అభ్యర్థులు గగ్గోలుపెడుతున్నారు. ఓఎమ్మార్ షీట్లలో సమాధానాల ఆప్షన్లను నింపడంలో అభ్యర్థులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణను అధికారులు వినిపిస్తున్నారు. ఓఎమ్మార్ షీట్లలోని ఆప్షన్ల గడులను గతంలో పెన్సిల్తో నింపే పద్ధతి ఉండగా వాటిని స్కానింగ్ యంత్రాలు సరిగా గుర్తించలేకపోవడంతో ఇబ్బందిగా మారింది. దీంతో పెన్సిల్కు బదులు పెన్నుతో నింపే విధానాన్ని ప్రవేశ పెట్టారు. నిర్ణీత ప్రశ్నకు సమాధానంగా గుర్తించిన ఆప్షన్కు ఇచ్చిన గడిలోపల మాత్రమే పూర్తిగా నింపాల్సి ఉంటుంది. అప్పుడే స్కానింగ్ యంత్రం దాన్ని మూల్యాంకనం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. గడిని దాటి బయటకు వస్తే స్కానింగ్ యంత్రం దాన్ని స్వీకరించదు. ఇతర ఏ గుర్తులు పెట్టినా, గడుల బయట వేరే మార్కింగ్లు చేసినా స్కానింగ్ కాదు. ఈ విషయాలను స్పష్టంగా వివరిస్తూ ఓఎమ్మార్ షీటు వెనుక, అలాగే అభ్యర్థులకు ఇచ్చిన బుక్లెట్లోనూ పొందుపరిచామని, వాటిని అభ్యర్థులు పూర్తిగా పాటించాల్సి ఉందన్నారు. ఇవేవీ చూసుకోకుండా కొంతమంది గడులను ఇష్టానుసారంగా నింపేశారని చెబుతున్నారు. 50వేలకు పైగా ఓఎమ్మార్ పత్రాల్లో ఇలాంటి తప్పులు దొర్లాయని అధికారులు గుర్తించారు. సిరీస్ను గుర్తుపెట్టని అభ్యర్థులు దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఓఎమ్మార్ షీట్లలో తాము ఏ సిరీస్ ప్రశ్నపత్రానికి సమాధానాలు గుర్తిస్తున్నారో తెలియచేసే గడులను పూరించకుండా వదిలేశారు. ఇలాంటి వాటిని తిరిగి పరిశీలింపచేసి ఏ కేంద్రంలో ఏ టేబుల్కు ఆ ఓఎమ్మార్ పత్రం వెళ్లింది? అక్కడ ఏ సిరీస్ ప్రశ్నపత్రం ఇచ్చిందీ పరిశీలించి ఆమేరకు మళ్లీ స్కానింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువమంది ఓ గడిని దాటి రెండో గడిని తాకేలా మార్కు చేశారు. వాటిని స్కానింగ్ యంత్రాలు స్కాన్ చే సి ఉండకపోవచ్చని వివరిస్తున్నారు. అభ్యర్థులు చేసిన పొరపాట్ల కారణంగా ఓఎమ్మార్ షీట్లను స్కానింగ్ యంత్రాలు మూల్యాంకనం చే యకపోవడానికి విద్యాశాఖ బాధ్యత వహించబోదని స్పష్టం చేస్తున్నారు. -
నేటితో డీఎస్సీ పరిసమాప్తం..
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండు రోజులుగా జరిగిన డీఎస్సీ పరీక్షలు సోమ వారం ముగియనున్నాయి. డీఎస్సీ-2014లో భాగంగా ఉపాధ్యాయ అర్హత-నియామక పరీక్ష (టెట్ కం టీఆర్టీ) ఆదివారం సజావుగా జరిగింది. గుంటూరులోని 20 కేంద్రాల్లో జరిగిన భాషా పండిట్, పీఈటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 3,663 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 16 కేంద్రాల్లో జరిగిన ఎల్పీటీ పరీక్షలకు దరఖాస్తు చేసిన 3,402 మంది అభ్యర్థుల్లో 3,012 మంది హాజరయ్యారు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాలుగు కేంద్రాల్లో జరిగిన పీఈటీ పరీక్షకు దరఖాస్తు చేసిన 780 మంది అభ్యర్థులకు 651 మంది పరీక్ష రాశారు. కేంద్రాల పరిధిలో అభ్యర్థులకు తాగునీరు, ఫర్నీచర్ సదుపాయాలను కల్పించ డంలో విద్యాశాఖాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు నిర్ణీత సమయానికే కేంద్రాలకు చేరుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఈవో కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నేటితో ముగియనున్న డీఎస్సీ పరీక్షలు .... రెండు రోజులుగా జరుగుతున్న డీఎస్సీ పరీక్షలు సోమవారం ముగియనున్నాయి. సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో జరిగే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 25,679 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందు కోసం గుంటూరు నగరంలోని 107 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 వరకు 25 కేంద్రాల్లో జరిగే స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పరీక్షకు 5,259 మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.15 వరకు 92 కేంద్రాల్లో జరిగే స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) పరీక్షలకు 20,420 మంది హాజరుకానున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. పట్నంబజారు (గుంటూరు): ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పిన్నమనేని వెంకటరామారావు తెలిపారు. ఆదివారం సైతం రీజియన్ పరిధిలో 548 బస్సులు తిరగగా 200 బస్సులను ప్రత్యేకంగా డీఎస్సీ పరీక్షలకు కోసం కేటాయించడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం 8 గంటల్లోపు గుంటూరు చేరుకునేందుకు రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి బస్సులు తిరుగుతాయని చెప్పారు. అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని అధికంగా సర్వీసులు నడిపేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. రీజియన్ పరిధిలో 952 బస్సులు తిరగాల్సి ఉండగా, తాత్కాలిక కార్మికులచే సుమారు 600 సర్వీసుల వరకు తిప్పుతున్నామని వివరించారు. విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement