-
మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ - 4
-
డ్యూయల్ సిమ్ ఐఫోన్ వచ్చేసింది
క్యుపర్టినో, కాలిఫోర్నియా : టెక్ దిగ్గజం యాపిల్ మొట్టమదటిసారిగా డ్యూయల్ సిమ్ ఐఫోన్లను తీసుకొచ్చింది. కొత్త ఐఫోన్తో పాటు పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈవో టిమ్ కుక్.. ఐఫోన్ 10ఎస్ ఫోన్లను ఆవిష్కరించారు. 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల (ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్) ఓఎల్ఈడీ డిస్ప్లేతో ఇవి లభిస్తాయి. 64జీబీ, 256జీబీ, 512జీబీ మెమరీ వేరియంట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 14 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 21 నుంచి వీటి తొలి దశ డెలివరీ మొదలవుతుంది. రెండో దశ డెలివరీ సెప్టెంబర్ 28 నుంచి చేపట్టనుంది. ఆ సమయం నుంచే భారత్కు కూడా ఈ డివైజ్లు వస్తాయి. ఐఫోన్ 10ఎస్ ధర 999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుండగా.. ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ ధర 1099 డాలర్ల నుంచి మొదలువుతుంది. రెండింటిలో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ను చేర్చారు. వాచ్లలో సిరీస్ 4ను కూడా యాపిల్ ప్రవేశపెట్టింది. పాత వాటితో పోలిస్తే ఈ వాచ్ల స్క్రీన్ 30 శాతం పెద్దదిగా ఉంటుంది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్ను పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ తీసుకోవచ్చు. వీటి ధర 399 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డ్యూయల్ సిమ్ ఐఫోన్ వచ్చేస్తోంది..!
ఆపిల్ ఈ ఏడాది మూడు ఐఫోన్ మోడల్స్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త ఫోన్ల తయారీ కూడా ఆపిల్ ప్రారంభించింది. ఈ ఫోన్లపై గత కొంత కాలంగా వస్తున్న రిపోర్టుల బట్టి రెండు ఐఫోన్ మోడల్స్ ఓలెడ్ డిస్ప్లేతో, మూడో ఐఫోన్ ఎల్సీడీ డిస్ప్లేతో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. అయితే తాజాగా కేజీఐ సెక్యురిటీస్ విశ్లేషకుడు మింగ్-చి కువో రిపోర్టు ప్రకారం ఎల్సీడీ డిస్ప్లే కలిగిన ఐఫోన్ స్క్రీన్ సైజు 6.1 అంగుళాలు ఉంటుందని సమాచారం. అంతేకాక ఈ స్మార్ట్ఫోన్తోనే ఆపిల్ డ్యూయల్ సిమ్ సపోర్టును అందిస్తుందని రిపోర్టు పేర్కొంది. ఓలెడ్ డిస్ప్లే ఐఫోన్ల కంటే కూడా ఈ ఐఫోనే తక్కువగా ఉంటుందని కువో అంచనా వేస్తున్నారు. 6.1 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో రాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అవుతుందని కువో చెబుతున్నారు. దీనిలో ఒకటి సింగిల్ సిమ్ సెటప్ కాగ, మరొకటి డ్యూయల్ సిమ్ సపోర్టును అందిస్తుందని తెలిపారు. డ్యూయల్ సిమ్ మోడల్ ఫోన్ 6.5 అంగుళాల స్క్రీన్తో రూపొందబోతోందని సమాచారం. ధర పరంగా సింగిల్ సిమ్ ఐఫోన్ ధర 550 డాలర్ల నుంచి 650 డాలర్ల రేంజ్లో ఉంటుందని టాక్. అంటే భారత్లో రూ.36వేల నుంచి రూ.42వేలలో ఉండనుంది. మరోవైపు డ్యూయల్ సిమ్ మోడల్ ధర ఎలాగైనా ఎక్కువగానే ఉంటుందని కువో రిపోర్టు చెబుతోంది. అంటే 650 డాలర్ల నుంచి 750 డాలర్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.42వేల నుంచి రూ.50వేల వరకు అందించవచ్చని తెలుస్తోంది. అయితే ఆపిల్ తీసుకురాబోతోన్న సింగిల్ సిమ్ మోడల్ చైనా, ఇతర వాణిజ్య మార్కెట్లలో మార్కెట్ షేరును పెంచడానికి దోహదం చేస్తుందని కువో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ను 100 మిలియన్ల నుంచి 120 మిలియన్ల యూనిట్ల విక్రయాలు చేపట్టాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కువో చెప్పారు. -
ఓపో ఎఫ్3 స్మార్ట్ఫోన్ వచ్చేసింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఓపో తాజాగా ఎఫ్3 స్మార్ట్ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరా దీని ప్రత్యేకత. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, అలాగే గ్రూప్ సెల్ఫీల కోసం 120 డిగ్రీల కోణంలో చిత్రాన్ని తీయగల 8 ఎంపీ కెమెరాను సైతం పొందుపరిచారు. వెనుకవైపు 13 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. 5.5 అంగుళాల ఎఫ్హెచ్డీ ఇన్–సెల్ స్క్రీన్, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్–5, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4జీ డ్యూయల్ సిమ్, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, మెటల్ బాడీ, ఫింగర్ప్రింట్ అన్లాక్ వంటి ఫీచర్లను జోడించారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్తోపాటు ఓపో ఆఫ్లైన్ స్టోర్లలోనూ ఇది లభిస్తుంది. ధర రూ.19,990. మే 12 వరకు ప్రీ–ఆర్డర్లు స్వీకరిస్తారు. మే 13 నుంచి విక్రయాలు ప్రారంభం. హైదరాబాద్లో గురువారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ తెలంగాణ సీఈవో జోన్, నటి అదా శర్మ ఈ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. -
పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాల తరలింపు
నాటకీయ పరిణామాలు అప్పగింత వద్ద ఉద్రిక్తత కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): కాకినాడ రామారావుపేటలో ఈ నెల 2న హత్యకు గురైన బడుగు బాల గంగాధరతిలక్ (బాలా), జగడం రామస్వామిల మృతదేహాలను పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తరలించారు. హత్య జరిగిన గురువారం జంట మృతదేహాలకు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారం అందజేయాలని, ఏ1 ముద్దాయిగా సుబ్బయ్య హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనే డిమాండ్లతో బాధిత కుటుంబాల సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు పోస్ట్మార్టం పూర్తయిన మృతదేహాలను మార్చురీ నుంచి తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో నాలుగు రోజులుగా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి, జేసీకి వినతి పత్రం అందించారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ను సంఘం నేతలు కలుసుకుని బాధితులకు న్యాయం చేయాలని , ఏ1 ముద్దాయిగా హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్పీని కలిసిన అనంతరం సోమవారం ఛలో కాకినాడ నిర్వహిస్తున్నామని, ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా ప్రణాళిక రచించారు. ముందుగానే మృతదేహాలను తరలించేందుకు కార్పొరేషన్ నుంచి లెటర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం నుంచి జీజీహెచ్ మార్చురీ వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. సాయంత్రం అయిదు గంటల నుంచి జిల్లాకు చెందిన సుమారు 600 మంది వరకూ ప్రత్యేక పోలీసు బలగాలు, పలు సబ్ డివిజినల్కు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది జీజీహెచ్కు చేరుకున్నారు. ఆఖరిసారిగా మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలకు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో 5.45 గంటలకు రెండు అంబులెన్స్లో పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ మృతదేహాలను వారి స్వస్థలాలు పెదపూడి మండలం రామేశ్వరం, కాకినాడ రామారావుపేటలోకి పంపిచేశారు. మృతదేహాలను తీసుకునేందుకు బాధిత బంధువులు నిరాకరించారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను ఎలా తీసుకొచ్చి అప్పగిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల వ్యవధి ఇచ్చామని, పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత నాలుగు రోజులు మార్చురీ వద్ద పడిగాపులు కాశామని, ఇక కుదరదని, కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు మృతదేహాలను తరలించినట్టు కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అనంతరం మృతదేహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసులు పాల్గొన్నారు. జంట హత్యల కేసులో పురోగతి పోలీసుల అదుపులో అయిదుగురు నిందితులు ఏ 2 ముద్దాయి కోసం గాలింపు కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): ఈ నెల 2న కాకినాడ రామారావుపేటలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య జరిగిన రోజునే పోలీసులకు లొంగిపోయిన ప్రధాన నిందితుడు జగన్నాథపురానికి చెందిన అడ్లబోయిన అశోక్కుమార్, ఆ తర్వాత పోలీసుల విచారణలో మరో అయిదుగురు పేర్లు చెప్పినట్టు çతెలిసింది. ఈ హత్యలో తనతో పాటూ మరో వ్యక్తి పాల్గొన్నట్టు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రెండో నిందితుడు సుబ్బయ్య హోటల్ సమీపాన సతీష్ పేకర్స్, మూవర్స్ అనే పేరుపై వాహనాలను నడుపుతున్నట్టు ప్రధాన నిందితుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. హత్య జరిగిన రోజున కేటరింగ్లో వేన్లో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వీరు హత్య జరిగిన తర్వాత అక్కడ నుంచి పరారైనట్టు తెలిసింది. ప్రధాన నిందితుడి వివరాల మేరకు ఇప్పటికే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడు సతీష్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలో రెండో ప్రధాన ముద్దాయిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జంట హత్యల కేసులో లోతుగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారిని విచారిస్తున్నామని విచారణ అధికారి, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement