-
నాడు గ్లామర్ ఫోటోలతో రచ్చ.. నేడు మూడు భారీ సినిమాల్లో ఛాన్సులు
చియాన్ విక్రమ్ అంటేనే వైవిధ్యానికి మారు పేరు. ఈయన తాజాగా నటించిన తంగలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో విక్రమ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన నటించే 62వ చిత్రం అవుతుంది. ఇటీవల చిత్తా (చిన్నా) వంటి సక్సెస్పుల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్యూ అరుణ్కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హెచ్ఆర్.పిక్చర్స్ పతాకంపై రియా శిబూ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టెయిన్ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. కాగా ఇందులో నటుడు ఎస్జే.సూర్య, సురాజ్ వెంజరముడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. హీరో యిన్గా నటించే లక్కీఛాన్స్ను యువ నటి దుషారా విజయన్ దక్కించుకున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంపరై చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసిన ఈ చిన్నది అందులో మరియమ్మ పాత్రలో జీవించి, అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత నక్షత్రం నగరుదు వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్ వైపు దృష్టి సారించారు. అలా గ్లామరస్ ఫొటోలను ప్రత్యేకంగా తీయించుకుని, సామాజక మాధ్యమాల్లో విడుదల చేశారు. అలా మరింత వార్తల్లోకి ఎక్కిన దుషారా ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఆయన 50వ చిత్రంలో నటించారు. ఇది త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ ఈ అమ్మడు నటించడం విశేషం. తాజాగా విక్రమ్తో జత కట్టే లక్కీఛాన్స్ను దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు బుధవారం అధికారికంగా ప్రకటించాయి. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతం, తేని ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ క్రేజీ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
గ్లామర్కు గేట్లు ఎత్తేసిన బ్యూటీ.. ఫోటోలు వైరల్
నటి దుషారా ఇప్పుడిప్పుడే కోలీవుడ్లో సత్తా చాటుతోంది. ఈమె చేసింది తక్కువ చిత్రాలే అయినా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో మెప్పించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా చక్కని నటనను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఆ తరువాత మళ్లీ పా.రంజిత్ దర్శకత్వంలో నక్షత్రం నగరగిదు చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత కరువేక్తి ముహుర్తం, వసంత పాళెం దర్శకత్వంలో చిత్రాలు చేశారు. తాజాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 50వ చిత్రంలో దుషారా నటిస్తున్నారు. అదే సమయంలో నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టయ్యన్ చిత్రంలోని ప్రత్యేక పాటలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. కాగా ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా కనిపించిన దుషారా ఇప్పుడు గ్లామర్కు గేట్లు ఎత్తివేయటం విశేషం. ఇటీవల ఈమె ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించుకుని తీయించుకున్న గ్లామరస్ ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టయాన్ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్లో నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు పుష్ప చిత్రంలో సమంత నటించిన ఊ అంటావా మామా పాట జైలర్ చిత్రంలో తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా పాట ఎంత పాపులర్ అయ్యాయో అంతకంటే ఎక్కువగా వేట్టైయాన్ చిత్రంలో దుషారా ఐటమ్ సాంగ్ పాపులర్ అవుతుందనే ప్రచారం ప్రస్తుతం కోలీవుడ్లో జోరందుకుంది. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్
తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో అయ్యకు జంటగా కథానాయికిగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత నక్షత్రం నగర్గిరదు చిత్రంలో మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. కాగా తాజాగా వసంత బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనిత చిత్రంలో నటుడు అర్జున్దాస్తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాలాజి మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న దుషారా ఈ చిత్రంతో పాటు ధనుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దుషారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికై నా సిద్ధం అన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా దానికి ప్రాధాన్యత ఉండాలన్నారు. (ఇదీ చదవండి: అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్) కుటుంబకథా చిత్రాల నాయకి ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని చాలామంది అడుగుతున్నారని, అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉందని, అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు. అందాలారబోతలో హద్దులు తనకు తెలుసని, అలాంటి పరిమితులుతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని అన్నారు. బాలుమహేంద్ర, మణిరత్నం దర్శకులు అంటే ఇష్టం అని చెప్పారు. -
‘బ్లడ్ అండ్ చాక్లెట్’లో ప్రేమ, అభిమానం రెండూ ఉంటాయి
అర్జున్ దాస్, దుషారా విజయన్ జంటగా నటించిన చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్’. ఎస్ పిక్చర్స్పై ప్రముఖ దర్శకుడు శంకర్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21న విడుదలకానుంది. ఈ మూవీని తెలుగులో ఎస్ఆర్డీఎస్ సంస్థపై దేవసాని శ్రీనివాసరెడ్డి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వసంత బాలన్ మాట్లాడుతూ..‘బ్లడ్ అంటే సాధారణంగా మనకు వయొలెన్స్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే బ్లడ్ అండ్ చాక్లెట్ అంటే ప్రేమ, అభిమానం. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి’ అన్నారు. ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ సినిమాను మా ఎస్.ఆర్.డి.ఎస్ బ్యానర్లో రిలీజ్ చేయటంపై చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సినిమాను అందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరుతున్నాను’అని అన్నారు నిర్మాత దేవసాని శ్రీనివాసరెడ్డి. ‘నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వసంత బాలన్గారితో కలిసి పని చేయటం మెమొరబుల్ ఎక్స్పీరియెన్స్’అని హీరో అర్జున్ దాస్ అన్నారు. -
తెలుగులో నటించడానికి రెడీ: దుషారా విజయన్
తమిళ సినిమా: రాజకీయ నేపథ్యం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ దుషారా విజయన్. బోదై ఏరి బుద్ధి మారి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్ దృష్టిలో పడ్డారు. అలా ఆయన నిర్వహించిన ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి సార్పట్టా పరంపరై చిత్రంలో కథానాయకగా నటించారు. అందులో నటుడు ఆర్యకు జంటగా మరియమ్మ అనే పాత్రను పోషించారు. ఒక ధైర్యవంతురాలైన పల్లెటూరి యువతగా ఆ పాత్రకు జీవం పోసి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్నే రూపొందించిన నక్షత్రం నగర్గిరదు చిత్రంలోని నటించారు. ప్రస్తుతం కళువేత్తి మూర్కన్, అవినీతి, నటుడు అర్జున్దాస్ సరసన ఒక చిత్రం అంటూ మూడు, నాలుగు చిత్రాలు దుషారా చేతిలో ఉన్నాయి. వీటిలో అరుళ్ నిధికి జంటగా నటించిన కళువేత్తి మూర్కన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఎస్.అంబేత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గౌతమ్ రాజ్ దర్శకత్వం వహించారు. (చదవండి: కమల్ హాసన్ ఖాతాలో మరో అరుదైన అవార్డు) ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నటి దుషారా విజయన్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ కళువేత్తి మూర్కన్ తనకు స్పెషల్ చిత్రమని పేర్కొన్నారు. నటుడు అరుళ్ నిధితో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. అయితే ఆయన సెట్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని అన్నారు. తాను ఇందులో కవిత అనే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించినట్లు చెప్పారు. (చదవండి: ప్యాలెస్లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఎన్ని కోట్ల ఖర్చంటే?) చిత్రంలో అరుళ్ నిధితో కలిసి నటించిన రొమాన్స్ సన్నివేశాలు డిఫరెంట్గా ఉంటాయని చెప్పారు. దర్శకుడు పా..రంజిత్ సార్పట్టా పరంపరైకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందనీ అదే జరిగితే అందులో తానే నటిస్తానని చెప్పారు. తాను నట జీవితం సార్పట్టా పరంపరై చిత్రంలోని మరియమ్మ పాత్రకు ముందు, ఆ తరువాత అన్నట్టుగా మారిందన్నారు. తెలుగు చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉందనీ అయితే తనకు నచ్చిన పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
ఇంటర్లో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్
‘అధికారులు తీరు మార్చుకోవాలి’
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement