-
ఎంసెట్లలో మెరవాలంటే..
ఎంసెట్.. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ విద్యార్థుల లక్ష్యం.. ఎంసెట్. ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే ఎంసెట్ ప్రిపరేషన్ ప్రారంభిస్తారనడంలో సందేహం లేదు. రెండు రాష్ట్రాల్లో 3 లక్షల మంది వరకూ ఎంసెట్ ఆశావహులున్నారు. గతేడాది వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఒకే ఎంసెట్ జరగగా.. ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరుగా ఎంసెట్-2015 నిర్వహణకు ప్రకటనలు విడుదల చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ (ఆంధ్రప్రదేశ్లో మే 8న, తెలంగాణ రాష్ట్రంలో మే 14న) ఎంసెట్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్ ప్రణాళిక.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు పరీక్ష కాలం నేటి నుంచి తెలంగాణలో; బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంసెట్ ప్రకటనలు విడుదల చేశాయి. దాంతో ఇటు ఇంటర్ పరీక్షల్లో మార్కులు; అటు ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించడం అనే ఆలోచనలతో విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇంటర్ సిలబస్పై పట్టు సాధిస్తే ఎంసెట్ గురించి ఆందోళన చెందనవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఈ సమయం.. ఇంటర్కే వాస్తవానికి ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల ఔత్సాహికులు ఇంటర్లో చేరిన తొలి రోజు నుంచే ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించే దిశగా కృషి చేస్తారనడంలో సందేహం లేదు. కానీ.. ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్ పరీక్షలు బాగా రాసి మెరుగైన మార్కులు సాధించడంపైనే దృష్టిపెట్టాలి. ఎందుకంటే రాష్ట్రాల స్థాయిలో జరిగే ఎంసెట్, జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈలో తుది ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ (ఎంసెట్- 25 శాతం; జేఈఈ మెయిన్- 40 శాతం) ఉంటుంది. టీఎస్ 47.. ఏపీ 38: ఎంసెట్ అభ్యర్థులు ఇంటర్ పరీక్షల తర్వాతే ఎంసెట్కు ఉపక్రమించాలి. పరీక్షల తర్వాత తెలంగాణ ఎంసెట్కు 47 రోజులు; ఏపీ ఎంసెట్కు 38 రోజుల వ్యవధి ఉంటుంది. రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్స్కు ఎక్కువ టైమ్ కేటాయించాలి. ఇంటర్లో అకడమిక్ పరంగా క్లిష్టంగా భావించి విస్మరించిన అంశాల జోలికి వెళ్లకూడదు. ఎంసెట్ ప్రిపరేషన్లో సమయపాలన చాలా ముఖ్యం. గంటల కొద్దీ ఒకే టాపిక్ను చదవకుండా.. ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా సమయం కేటాయించాలి. ఇందుకోసం గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. రోజూ పది నుంచి 12 గంటలు ప్రిపరేషన్కు కేటాయించాలి. కాన్సెప్ట్స్.. ప్రాక్టీస్ ముఖ్యం ఎంసెట్లో సిలబస్, ప్రశ్నల స్వరూపాన్ని పరిశీలిస్తే అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్ సిలబస్లోని భావనల ఆధారంగానే ఉంటున్నాయి. దీన్ని గుర్తించి అన్ని సబ్జెక్టుల్లోని కీలక భావనలపై పట్టు సాధించాలి. భావనలు/ఫార్ములాలతో కూడిన షార్ట్ నోట్స్లు రివిజన్లో ఎంతో ఉపకరిస్తాయి. ఎంసెట్లోని అన్ని సబ్జెక్ట్ల ప్రాక్టీస్కు ప్రాధాన్యమివ్వాలి. పూర్తిగా ప్రాక్టికల్గా ఉండే మ్యాథమెటిక్స్, బొమ్మలు, చార్ట్ల రూపంలో ఉండే బయాలజీ అయినా ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్ ఎంతో మేలు చేస్తుంది. ప్రాక్టీస్తో ప్రశ్న లేదా సమస్యను సాధించే క్రమంలో మూల భావన ఆధారంగా మరెన్నో కొత్త కోణాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రశ్నను ఏ విధంగా అడిగినా రాయగలిగే నేర్పు లభిస్తుంది. ఎంసెట్ కామన్ సక్సెస్ టిప్స్ ⇒ ఇంజనీరింగ్, మెడికల్ విభాగమేదైనా విద్యార్థులకు ఎంసెట్లో విజయానికి మంచి మార్కుల సాధనకు ఉపయోగపడే టిప్స్.. ⇒ ఎంసెట్లో దాదాపు ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారంగానే ఉంటాయి. అవి ఇన్డెరైక్ట్గా ఆయా భావనల ఆధారంగా ఉంటాయి. దీన్ని గుర్తించి కాన్సెప్ట్స్పై పట్టు సాధించాలి. ⇒ అకాడమీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్ చివరలో ఇచ్చిన ప్రాక్టీస్ ప్రశ్నలు, ఆయా అధ్యాయాల్లో హైలైట్ చేసిన అంశాలను కచ్చితంగా చదవాలి. ⇒ టేబుల్స్; చార్ట్స్; పాయింటర్స రూపొందించుకోవడం వల్ల సమయం ఆదా చేసుకోవచ్చు. ⇒ ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. ఎంసెట్ సిలబస్ ఆధారంగా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం; ద్వితీయ సంవత్సరం అంశాల ప్రిపరేషన్కు నిర్దిష్ట టైం ప్లానింగ్ అనుసరించాలి. ⇒ ఎంసెట్-2015కు హాజరవుతున్న విద్యార్థులు ఇంటర్ పరీక్షల తర్వాత 15 రోజుల సమయాన్ని మొదటి సంవత్సరం సిలబస్కు కేటాయించాలి. ⇒ కనీసం మూడు గ్రాండ్ టెస్ట్లు, వీలైనన్ని మాక్ టెస్ట్లకు హాజరవడం మేలు చేస్తుంది. ⇒ ఇంజనీరింగ్ విద్యార్థులు 110 నుంచి 130 మార్కులు; మెడికల్ విభాగం విద్యార్థులు 120 నుంచి 145 మార్కులు పొందే విధంగా చదవాలి. ఎంసెట్తో జతగా జేఈఈ ఎంసెట్ రాసే అభ్యర్థుల్లో దాదాపు సగం మంది జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్లకు కూడా పోటీపడుతున్నారు. గతేడాది ఎంసెట్ ఇంజనీరింగ్కు 2,82,799 మంది పోటీ పడగా.. జేఈఈ మెయిన్కు హాజరైన తెలుగు విద్యార్థుల సంఖ్య 1.22 లక్షలుగా నమోదవడమే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్కు 20వేలకు పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. రెండింటికీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఒకే సమయంలో ఎంసెట్, జేఈఈ ప్రిపరేషన్లను ఫలవంతం చేసుకోవచ్చు. ఉమ్మడి ప్రిపరేషన్కు టిప్స్.. ⇒ ఎంసెట్, జేఈఈ మెయిన్ సిలబస్ల మధ్య వ్యత్యాసాలు, పోలికలు గుర్తించాలి. ⇒ జేఈఈకి అదనంగా ఉన్న అంశాలను గుర్తించి వాటి కోసం ప్రతిరోజూ కనీసం రెండు గంటల అదనపు సమయం కేటాయించాలి. ⇒ జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ల్లో ప్రశ్నలన్నీ కాన్సెప్ట్, అప్లికేషన్ ఆధారితంగానే ఉంటాయి. ఈ విధానంలో ప్రిపరేషన్ అటు ఎంసెట్కూ ఉపయుక్తమే. ⇒ ఈ ఏడాది జేఈఈ-మెయిన్ ఆఫ్లైన్లో ఏప్రిల్ 4న; ఆన్లైన్లో ఏప్రిల్ 10, 11 తేదీల్లో జరగనుంది. అంటే.. ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత ఆఫ్లైన్ ఔత్సాహికులకు వారం రోజులు; ఆన్లైన్ అభ్యర్థులకు పదిరోజులు సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో జేఈఈ ప్రిపరేషన్కు ఎక్కువ టైమ్ కేటాయించాలి. ⇒ జేఈఈ అడ్వాన్స్డ్ మే 24వ తేదీన జరగనుంది. కాబట్టి విద్యార్థులు ప్రిపరేషన్ పరంగా ఆందోళన చెందక్కర్లేదు. ప్రస్తుత ఇంటర్మీడియెట్ సిలబస్ ప్రకారం అడ్వాన్స్డ్కు సులువుగానే సన్నద్ధత పొందొచ్చు. ⇒ అడ్వాన్స్డ్ గత పరీక్షల తీరుతెన్నులు పరిశీలిస్తే ప్రాక్టీస్ ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. దీన్ని గుర్తించి విద్యార్థులు ప్రాక్టీస్కు పెద్దపీట వేయాలి. ఇది అటు అడ్వాన్స్డ్కు, ఇటు ఎంసెట్కు రెండింటికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఎంసెట్ సమాచారం తెలంగాణ, ఎంసెట్-2015 అర్హత: ఇంజనీరింగ్: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. అగ్రికల్చర్ - మెడికల్: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: - అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. - ఇందుకోసం ముందుగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాలు లేదా ఏపీ ఆన్లైన్ కేంద్రాల వద్ద ఇంటర్మీడియెట్ హాల్ టికెట్ నెంబర్; పుట్టిన తేదీ; తండ్రిపేరు వంటి వివరాలు తెలియజేసి రూ. 250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ట్రాన్సాక్షన్ ఐడీ పొందాలి. - ట్రాన్సాక్షన్ ఐడీ ఆధారంగా www.tseamcet.in వెబ్సైట్లోని APPLY ONLINE బటన్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫాం విండో ఓపెన్ అవుతుంది. అందులో పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. - ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 28, 2015 నుంచి ఏప్రిల్ 9, 2015 వరకు. రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు; రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకు; రూ.5 వేల అపరాధ రుసుంతో మే 5 వరకు; రూ. 10 వేల అపరాధ రుసుంతో మే 12 వరకు దరఖాస్తు చేయొచ్చు. - ఆన్లైన్ అప్లికేషన్లో లోపాల సవరణకు అవకాశం: ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 20 వరకు - హాల్టికెట్ డౌన్లోడ్: మే 8 నుంచి మే 12 వరకు. పరీక్ష తేదీ: మే 14, 2015 వెబ్సైట్: www.tseamcet.in ఆంధ్రప్రదేశ్, ఎంసెట్-2015 అర్హత: ఇంజనీరింగ్: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. అగ్రికల్చర్ - మెడికల్: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: - ఏపీ ఎంసెట్ ఔత్సాహికులు కూడా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. - రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 250 - ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 6 నుంచి ఏప్రిల్ 11 వరకు; - రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు; రూ. 1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకు; రూ.5వేల అపరాధ రుసుంతో మే 2 వరకు; రూ. 10వేల అపరాధ రసుంతో మే 6 వరకు దరఖాస్తు చేయొచ్చు. పరీక్ష తేదీ: మే 8, 2015 వెబ్సైట్: www.apeamcet.org ఏపీ విద్యార్థులూ అర్హులే తెలంగాణలో నిర్వహించే ఎంసెట్-2015కు రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హాజరు కావచ్చు. లోకల్-నాన్ లోకల్ రిజర్వేషన్ ప్రకారమే ప్రవేశాలు ఉంటాయి. అంటే.. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల విద్యార్థులు ఓపెన్ కేటగిరీలోని 15 శాతం పరిధిలోకి వస్తారు. పరీక్షలో సిలబస్లో పేర్కొన్న అంశాల పరిధిలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్లో తమ సబ్జెక్టులపై పట్టు సాధించిన అభ్యర్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. - ప్రొఫెసర్ ఎన్.వి. రమణరావు, కన్వీనర్, టీఎస్ఎంసెట్-2015 సిలబస్ యథాతథం ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ఎంసెట్లో సిలబస్గా గత ఏడాది వరకు ఉన్న సిలబస్నే నిర్దేశించాం. కాబట్టి విద్యార్థులు సిలబస్ పరంగా ఆందోళన చెందక్కర్లేదు. 1,70,000 ఇంజనీరింగ్ సీట్లు, 3,100 మెడికల్ సీట్ల కోసం నిర్వహించే ఎంసెట్కు రెండున్నర లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. దీనికి అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. - ప్రొఫెసర్ సి.హెచ్. సాయిబాబు,కన్వీనర్, ఏపీఎంసెట్-2015 ఏకాగ్రతే ముఖ్యం ఎంసెట్ పరీక్షలో విజయం.. ఇందుకు ప్రిపరేషన్ విషయంలో ఏకాగ్రత ఎంతో కీలకం. సబ్జెక్ట్ పరంగా ప్రాక్టీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాథమిక భావనలు అధ్యయనం చేయాలి. మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లకు హాజరవడం లాభిస్తుంది. - ఎన్. పవన్ కుమార్,బీటెక్ సీఎస్ఈ మొదటి సంవత్సరం ఎంసెట్-2014 స్టేట్ ఫస్ట్ ర్యాంక్; జేఈఈ అడ్వాన్స్డ్- 9వ ర్యాంక్ సిలబస్లోని అంశాలపై పట్టుతో.. ఎంసెట్లో విజయం సాధించాలంటే.. ఇంటర్ సిలబస్లోని అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి సబ్జెక్ట్కు సంబంధించి షార్ట్ కట్ మెథడ్స్, ప్రాక్టికల్ థింకింగ్ అలవర్చుకోవాలి. రోజూ కనీసం పది గంటలు ప్రిపరేషన్కు కేటాయించాలి. బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్ను క్లిష్టంగా భావిస్తారు. కానీ ఫార్ములాలను రియల్ లైఫ్తో అన్వయించుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగానే ఎదుర్కోవచ్చు. - జి. సాయి శ్రీనివాస్,ఎంబీబీఎస్ ఫస్టియర్,జిప్మర్ పుదుచ్చేరి ఎంసెట్-2014 మెడికల్ ఫస్ట్ ర్యాంక్ సబ్జెక్ట్లవారీగా అనుసరించాల్సిన విధానం ఎంసెట్ ఇంజనీరింగ్; అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాల్లో సిలబస్ను పరిశీలిస్తే విద్యార్థులు ప్రిపరేషన్ పరంగా ప్రత్యేక దృక్పథంతో వ్యవహరించాలి. ఈ క్రమంలో అనుసరించాల్సిన విధానం సబ్జెక్ట్ల వారీగా.. గణితం మొత్తం 160 మార్కులకు నిర్వహించే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 80 మార్కులకు ఉండే మ్యాథమెటిక్స్లో సాధించే మార్కులే మెరుగైన ర్యాంకుకు మార్గం వేస్తాయి. కాబట్టి ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. టైం ప్లాన్లోనూ ఎక్కువ సమయం కేటాయించాలి. ముఖ్యంగా ఎంసెట్ సిలబస్ను పరిశీలించి అందులో ఇంటర్లో లేని అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. స్టాటిస్టిక్స్లోని మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్; మీన్ వాల్యూ థీరమ్లపై ఫోకస్ చేయాలి. వీటితోపాటు మ్యాథమెటిక్స్లో మంచి మార్కుల కోసం వెక్టార్ అల్జీబ్రా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; బైనామియల్ థీరమ్; మ్యాట్రిసెస్; సర్కిల్స్; పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్; ఇంటిగ్రల్ కాలిక్యులస్పై పట్టు సాధించాలి. భౌతిక శాస్ర్తం ఫిజిక్స్లో మంచి మార్కుల సాధనకు భావనల ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఆయా అంశాల ఫార్ములాలను తెలుసుకోవడంతోపాటు వాటి అనువర్తిత అంశాల తీరుతెన్నులపై అవగాహన పెంచుకోవాలి. ఒకే ప్రశ్నను కనీసం రెండు పద్ధతుల్లో సాధన చేసే విధంగా యత్నించాలి. అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న సమయంలోనే ఎలక్ట్రో మ్యాగ్నటిజం; మ్యాగ్నటిజం; వేవ్మోషన్; హీట్; న్యూక్లియర్ ఫిజిక్స్; అటామిక్ ఫిజిక్స్; సెమీ కండక్టర్ డివెసైస్ అంశాల పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో లభించే వెయిటేజీ పరంగానూ ఈ అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది. రసాయన శాస్త్రం ప్రశ్నల క్లిష్టత పరంగా సులువుగా ఉండే విభాగం.. కెమిస్ట్రీ. మిగతా సబ్జెక్ట్లతో పోల్చితే కెమిస్ట్రీలో మంచి మార్కులు పొందేందుకు అవకాశాలెన్నో. విద్యార్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీ; కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్స్పై పట్టు సాధించాలి. ఇవి మార్కుల సాధనలో కీలకంగా ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; థర్మోడైనమిక్స్; స్టేట్ ఆఫ్ మ్యాటర్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో తులనాత్మక ప్రిపరేషన్పై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా మూలకాల ధర్మాలను బేరీజు వేస్తూ అధ్యయనం చేయాలి. వృక్ష శాస్త్రం బోటనీ విషయంలో ఇంటర్ రిలేటివ్ అప్రోచ్ ఎంతో మేలు చేస్తుంది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలోని అంశాలు చాలా వరకు రెండో సంవత్సరంలో కొనసాగింపుగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అంశాలను ఒకే సమయంలో చదివే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. సూక్ష్మ జీవ శాస్త్రం; కేంద్రక పూర్వ జీవులు; బ్యాక్టీరియా; వైరస్; మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవుల పాత్ర అంశాలను తప్పనిసరిగా చదవాలి. అదే విధంగా ఖనిజ మూలకాల ఆవశ్యకత, మొక్కల హార్మోన్ల్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి. జంతు శాస్త్రం జువాలజీ విషయంలో ప్రాథమిక భావనలపై పట్టు సాధించడం అవసరం. కాలేయం; వానపాము; బొద్దింకల జీవ వ్యవస్థ; ప్రొటీన్లు; ఎంజైమ్లు, క్షీర గ్రంథులు; నాడీ వ్యవస్థ; నేత్ర పటలం; జీవావరణం-పర్యావరణం; జన్యుశాస్త్రం; జీవ పరిణామం; అనువర్తిత జీవ శాస్త్రం చాప్టర్లలోని అంశాలన్నింటినీ అధ్యయనం చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. -
మెరిసేందుకు మేలిమి వ్యూహాలు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులకు రాబోయే ఆర్నెల్లు చాలా ముఖ్యమైనవి. నచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలో, ఇష్టమైన బ్రాంచ్లో చేరాలనుకునే లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందే. పటిష్ట ప్రణాళిక ప్రకారం చదవాల్సిందే. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది కాబట్టి పోటీ పరీక్షలకు సమాంతరంగా పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఎంపీసీ+ఎంసెట్ ప్రిపరేషన్ ప్రణాళికఅక్టోబర్ 10 నుంచి జనవరి 10 వరకు ఇంటర్ సబ్జెక్టుల్లోని కాన్సెప్టులు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ ప్రశ్నల ప్రిపరేషన్కు అధిక సమయం కేటాయించాలి. జనవరి 11 నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రాక్టికల్స్ చేయడానికి, రికార్డులు రాయడానికి, భాషల సబ్జెక్టుల ప్రిపరేషన్కు, ఇంటర్లో అధిక మార్కుల సాధనకు కేటాయించాలి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇంటర్ ప్రి ఫైనల్ పరీక్షలు రాయాలి. ఆపై ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్లో ఎంసెట్ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్తో పాటు రోజువారీ పరీక్షలు, వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్లు రాయాలి. మ్యాథమెటిక్స్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ మ్యాథమెటిక్స్లో 2-ఎకు 75 మార్కులు, 2-బికు 75 మార్కులు కేటాయించారు. అదే విధంగా ఎంసెట్లో 160 మార్కులకు 80 మార్కులు మ్యాథమెటిక్స్కు ఉంటాయి. అందువల్ల ఈ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించడం ద్వారా ఎంసెట్లో ఉత్తమ ర్యాంకును కైవసం చేసుకోవచ్చు. ఎంసెట్లో విజయానికి కచ్చితత్వంతో పాటు వేగం అవసరం. అందువల్ల ప్రతి చాప్టర్ను ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోణంలో అధ్యయనం చేసిన తర్వాత,ఎంసెట్ కోసం సంక్షిప్త సమాచారం, సూత్రాలపై దృష్టి కేంద్రీకరించాలి. సమస్యలను సాధించాలి. ముఖ్య అంశాలు (ఇంటర్ పరీక్షలకు): ద్విపద సిద్ధాంతం- 16 మార్కులు సంకీర్ణ సంఖ్యలు, ఈ్ఛ కౌజీఠిట్ఛ*ట ఖీజిౌ్ఛట్ఛఝ 17 మార్కులు సాంఖ్యక శాస్త్రం- 9 మార్కులు సంభావ్యత- 15 మార్కులు వృత్తాలు- 22 మార్కులు నిశ్చిత, అనిశ్చిత సమాకలనాలు - 33 మార్కులు అవకలన సమీకరణాలు- 13 మార్కులు ముఖ్య అంశాలు (ఎంసెట్కు): ఇంటెగ్రల్ కాలిక్యులస్, 3డీ జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, వెక్టార్ అల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, మ్యాట్రిసెస్-డిటెర్మినెంట్స్, సర్కిల్స్ చాప్టర్ల ప్రిపరేషన్కు అధిక సమయం కేటాయించాలి. ఎంసెట్ 2014,2013 ప్రకారం వివిధ చాప్టర్ల వెయిటేజీ: చాప్టర్ ప్రశ్నలు బీజ గణితం 26 కలనగణితం 19 రేఖాగణితం 17 త్రికోణమితి 9 సదిశా బీజగణితం 6 3డీ-జ్యామితి 3 ఫిజిక్స్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. పబ్లిక్ పరీక్షల కోణంలో చూస్తే ఎలక్ట్రో స్టాటిక్స్, వేవ్ మోషన్, ఆప్టిక్స్ చాలా కష్టమైనవిగా భావిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రతి చాప్టర్లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకంలోని అంశాలను క్షుణ్నంగా చదివి, ప్రతి చాప్టర్ వెనుక ఉన్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి. వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఎంసెట్: ఎంసెట్ కోణంలో చూస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఫిజిక్స్ను క్లిష్టమైందిగా భావిస్తారు. అయితే కాన్సెప్టులపై పట్టు సాధించడం ద్వారా ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. సూత్రాలను అర్థం చేసుకొని, వాటికి సంబంధించిన సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి. మూలసూత్రాలను పట్టిక రూపంలో రాసుకొని, వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం సిలబస్లోని శక్తి, ద్రవ్యవేగ, కోణీయ వేగ నిత్యత్వ సూత్రాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఉష్ణగతిక శాస్త్రంలో ఇంటర్నల్ ఎనర్జీ సూత్రం, సరళహరాత్మక చలనంలోని డోలనం, డోలనావర్తన కాలం వాటి అనువర్తనాలను అధ్యయనం చేయాలి.సీనియర్ ఇంటర్ సిలబస్లోని కిర్కాఫ్ నియమాలు, ఫ్లెమింగ్ కుడి, ఎడమ చేయి సూత్రాలు, ఎంసీజీ, ప్రవాహ విద్యుత్ శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను నేర్చుకోవాలి.ఎలక్ట్రో మ్యాగ్నటిజం, ఫిజికల్ ఆప్టిక్స్, వేవ్ మోషన్, సౌండ్, హీట్, కొలిజన్, మ్యాగ్నటిజం అంశాలపై దృష్టిసారించాలి. వీటి నుంచి దాదాపు 25 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కెమిస్ట్రీ ఫిజిక్స్ తరహాలోనే కెమిస్ట్రీకి ఇంటర్లో 60 మార్కులు, ఎంసెట్లో 40 మార్కులు ఉంటాయి. కెమిస్ట్రీ తెలుగు అకాడమీ పుస్తకంలోని అంశాలను క్షుణ్నంగా చదివితే ఇంటర్, ఎంసెట్ రెండింటిలోనూ అధిక మార్కులు సాధించేందుకు దోహదపడుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని సమీకరణాలను వీలైనంతలో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి.ఇంటర్మీడియెట్ కోణంలో చూస్తే సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కష్టమని భావిస్తారు. ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఒక పద్ధతి ప్రకారం విశ్లేషణాత్మకంగా చదవడం ద్వారా ఈ అంశాలపై పట్టు సాధించవచ్చు. ఒక్క ఫిజికల్ కెమిస్ట్రీలోని సమస్యా సాధనలు మినహా మిగిలిన కెమిస్ట్రీ చాప్టర్లలో ఇంటర్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్కు పెద్దగా తేడా ఉండదు.ఎంసెట్లో మెరుగైన ర్యాంకు సాధించడంలో కెమిస్ట్రీ కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే తక్కువ సమయంలో పూర్తిస్థాయిలో సమాధానాలు గుర్తించేందుకు అవకాశమున్న సబ్జెక్టు ఇది. 70% నుంచి 80% ప్రశ్నలకు సమాధానాలను తేలిగ్గా గుర్తించవచ్చు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి.ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని రసాయనిక సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులు నేర్చుకోవాలి. ఆల్కహాల్స్, ఫినాల్స్, అమైన్స్లోని నేమ్డ్ రియాక్ష న్స్; ఆర్డర్ ఆఫ్ యాసిడ్, బేసిక్ స్ట్రెంథ్ అంశాలను బాగా గుర్తుంచుకోవాలి.సూత్రాలన్నింటినీ నేర్చుకుని, వాటిపై ఆధారపడిన సమస్యల్ని సాధన చేయాలి.ఎంసెట్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12-16 ప్రశ్నలు వస్తాయి. మిగిలిన విభాగాలతో పోల్చితే ఇది కొంత క్లిష్టమైన విభాగం. ఇందులోని మూలకాల ధర్మాలను ఒకదాంతో మరోదాన్ని పోల్చుకుంటూ అధ్యయనం చేయాలి. అన్ని గ్రూప్స్లో మూలకాల ధర్మాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయి. వాటి భిన్న ధర్మాలపై పట్టు సాధించాలి. పట్టిక రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. 2014 ఎంసెట్లో ప్రశ్నలు: ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 11, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 16, సమ్మిళిత భావనలు (Mixed Concepts) నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి. మొదటి సంవత్సరం: అంశం ప్రశ్నలు అటామిక్ స్ట్రక్చర్ 2 పీరియాడిక్ టేబుల్ 1 కెమికల్ బాండింగ్ 2 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 స్టాకియోమెట్రీ 1 థర్మోడైనమిక్స్ 1 కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స అండ్ బేసెస్ 2 హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ 1 ఆల్కలి, ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ 2 గ్రూప్ 13 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 14 ఎలిమెంట్స్ 1 ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 1 ఆర్గానిక్ బేసిక్స్, హైడ్రోకార్బన్స్ 4 ద్వితీయ సంవత్సరం అంశం ప్రశ్నలు సొల్యూషన్స్ 2 సాలిడ్ స్టేట్ 1 ఎలక్ట్రో కెమిస్ట్రీ 2 కెమికల్ కెనైటిక్స్ 1 మెటలర్జీ 1 గ్రూప్ 15 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 16 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 17 ఎలిమెంట్స్ 1 డి-బ్లాక్ ఎలిమెంట్స్ 1 నోబెల్ గ్యాసెస్ 1 పాలిమర్స్ 1 రోజువారీ జీవితంలో కెమిస్ట్రీ 1 ఆర్గానిక్ కాంపౌండ్స్ 4 సర్ఫేస్ కెమిస్ట్రీ 1 వృక్షశాస్త్రం ఎంసెట్ లేదా ఇతర పోటీ పరీక్షల ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశించే ప్రక్రియలో ఇంటర్మీడియెట్ మార్కులకు ప్రాధాన్యం పెరిగింది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి, నచ్చిన కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఐపీఈలో 90 శాతానికి (540/600) తక్కువ కాకుండా మార్కులు సాధించారు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇంటర్, ఎంసెట్ పరీక్షలకు సబ్జెక్టులు ఒకటే అయినప్పటికీ ప్రిపరేషన్ మాత్రం భిన్నంగా ఉండాలి. వెయిటేజీని అనుసరించి ప్రిపరేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు ప్రధానంగా వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు వివిధ పాఠ్యాంశాల్లో చేర్చిన కొత్త విషయాలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేనందున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెయిటేజీ: యూనిట్ మార్కుల వెయిటేజీ 1. వృక్ష శరీరధర్మ శాస్త్రం 28 2. సూక్ష్మజీవ శాస్త్రం 6 3. జన్యుశాస్త్రం 6 4. అణుజీవ శాస్త్రం 8 5. జీవసాంకేతిక శాస్త్రం 16 6. మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు 12 మొత్తం మార్కులు 76 మొత్తం దీర్ఘ సమాధాన ప్రశ్నలు 15. ఇవి సాధారణంగా 1, 5, 6 యూనిట్ల నుంచి వచ్చేందుకు అవకాశముంది. గమనించాల్సిన అంశాలు: వీలైనంత వరకు పాఠ్యపుస్తకాల్లోని వాక్యాలను/ నిర్వచనాలను యథాతథంగా రాయాలి.పాఠ్యపుస్తకాల్లో లేని ఉదాహరణలు రాయకూడదు.చక్కని చిత్రపటాలు గీచి, భాగాలు రాయాలి. శరీరధర్మ శాస్త్రంలోని క్రెబ్స్, కెల్విన్ వలయాలు పూర్తిగా ఉండాలి. ప్రతి చర్యను విశదీకరించాలి.మొదటి యూనిట్కు మొత్తం మార్కుల్లో దాదాపు సగం వెయిటేజీ ఇచ్చిన కారణంగా.. ఈ యూనిట్పై అధికంగా దృష్టి సారించాలి.సమాధానాలను రాసే క్రమంలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ప్రతి సమాధానానికి సబ్-హెడ్డింగ్, అవసరమైన చోట ఫ్లో చార్ట్ వేయడంవంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే వీటికోసం ప్రత్యేకంగా కొన్ని మార్కులు కేటాయిస్తారు.అవసరమైన చోట పటాలను చక్కగా వేయడంతోపాటు మంచి వివరణ కూడా ఇవ్వాలి. ఎంసెట్ ప్రణాళిక: పాఠ్యాంశాలను చదవడం ప్రారంభించాలి. సిలబస్ మొత్తం జనవరి చివరి నాటికి పూర్తయ్యేలా చూడాలి. డిసెంబర్, జనవరి నెలల్లో ప్రాక్టికల్స్ కారణంగా రెగ్యులర్ విద్యార్థులకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రిపరేషన్లో జాప్యం జరుగుతుంది. అందువల్ల పటిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పబ్లిక్ పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధంకావాలి. 2014లో ఎంసెట్ పరీక్ష తేలిగ్గానే ఉన్నప్పటికీ మొత్తంమీద తెలుగు మాధ్యమం అభ్యర్థులకు కొంత నిరాశ ఎదురైంది. చిత్రపటాలకు సంబంధించి అనవసర స్థాయిలో ప్రశ్నలు వచ్చాయి. ప్రస్తుతం ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఈసారి శాస్త్రవేత్తల చిత్రపటాలపై ప్రశ్నలు రావని ఆశిద్దాం! 2014 ఎంసెట్ వెయిటేజీ: ప్రథమ సంవత్సరం యూనిట్ ప్రశ్నలు యూనిట్-1 4 యూనిట్-2 4 యూనిట్-3 3 యూనిట్-4 1 యూనిట్-5 4 యూనిట్-6 2 యూనిట్-7 1 ద్వితీయ సంవత్సరం యూనిట్ ప్రశ్నలు యూనిట్-1 8 యూనిట్-2 2 యూనిట్-3 2 యూనిట్-4 3 యూనిట్-5 3 యూనిట్-6 3 మొదటి, రెండో సంవత్సరం పాఠ్యాంశాల్లో సారూప్యం ఉన్నవాటిని కలిపి చదవాలి. ఎంసెట్కు కనీసం 20 రోజులు ముందుగా సిలబస్ పూర్తిచేయాలి. దీనివల్ల పునశ్చరణకు తగిన సమయం అందుబాటులో ఉంటుంది. -బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. జంతుశాస్త్రం విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్షల సన్నద్ధతకు దాదాపు వంద రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు, ఎంసెట్కు మధ్య దాదాపు 40-45 రోజుల వ్యవధి ఉంటుంది. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధత: ఇంటర్ ద్వితీయ సంవత్సరం జంతుశాస్త్రం సిలబస్లో ఎనిమిది అధ్యాయాలున్నాయి. వీటిలో మొదటి అయిదు మానవ అంతర్నిర్మాణం, శరీరధర్మ శాస్త్రానికి సంబంధించినవి. మిగిలినవి జన్యుశాస్త్రం, పరిణామం, అనువర్తిత జీవశాస్త్రానికి చెందినవి. జంతుశాస్త్రానికి 60 మార్కులు కేటాయించారు. వీటిలో అతి స్వల్ప, స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 76 మార్కుల పేపర్లో 60 మార్కులకు సమాధానాలు రాయాలి. యూనిట్ల వారీగా వెయిటేజీ: యూనిట్ మార్కులు యూనిట్ 1 10 యూనిట్ 2 10 యూనిట్ 3 8 యూనిట్ 4 8 యూనిట్ 5 12 యూనిట్ 6 12 యూనిట్ 7 8 యూనిట్ 8 8 మానవ నిర్మాణానికి సంబంధించిన యూనిట్ల నుంచి 48 మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన మూడు యూనిట్లకు సంబంధించి 28 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. గమనించాల్సిన అంశాలు: ఇప్పటి వరకు పూర్తయిన ప్రిపరేషన్ను విశ్లేషించుకోవాలి. ఎంత వరకు సిలబస్ పూర్తయింది? మిగిలిన సిలబస్కు ఎంత సమయం కేటాయించాలి? ఏ అంశాలు క్లిష్టంగా ఉన్నాయి? తదితర అంశాలపై స్పష్టత ఏర్పరుచుకోవాలి. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవ హృదయ నిర్మాణం-పనిచేసే విధానం, మానవుని విసర్జక వ్యవస్థ, మూత్రం తయారీ విధానం, కండర సంకోచ విధానం, మానవుని మెదడు-నిర్మాణం, విధులు తదితర అంశాల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. {పతి అధ్యాయం చివర ఇచ్చిన ప్రశ్నలను ప్రణాళికాబద్ధంగా సాధన చేయాలి. పటాలను ప్రాక్టీస్ చేయాలి. ఎంసెట్కు ఎలా సిద్ధమవాలి? ఎంసెట్ మెడికల్ పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలకు గాను జంతుశాస్త్రం నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్కు దాదాపు సమాన ప్రాధాన్యమిస్తారు. 2014 ఎంసెట్ వెయిటేజీ: యూనిట్ ప్రశ్నలు యూనిట్-1 2 యూనిట్-2 2 యూనిట్-3 3 యూనిట్-4 2 యూనిట్-5 2 యూనిట్-6 6 యూనిట్-7 3 యూనిట్-8 2 తెలుగు అకాడమీ నుంచి నేరుగా: ఎంసెట్-2014 జంతుశాస్త్రం ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు చాలా వరకు సరళంగా ఉన్నాయి.తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకం నుంచి ప్రశ్నలు నేరుగా వచ్చాయి.ప్రతి పాఠ్యాంశంలోని అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రతి చాప్టర్ను ఇంటర్ పరిధిలో చదువుతున్నప్పటికీ ఎంసెట్కు ఉపయోగపడేలా ముఖ్య అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి.ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్కు తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకొని రెండింటికీ సమాంతరంగా ప్రిపరేషన్ కొనసాగించాలి.సమయ పాలన, కచ్చితత్వం ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. గుర్తుంచుకోండి: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంతో పోల్చితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే ద్వితీయ సంవత్సరంతోపాటు మొదటి సంవత్సరం సిలబస్ను సమాంతరంగా చదవడమేకాకుండా.. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది.ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ సమాధానాలు గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్ను నేర్చుకోవాలి.హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ యూనిట్లలోని పటాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అధిక శాతం సమాధానాలు వీటితోనే ముడిపడి ఉంటాయి.ప్రతి యూనిట్ చివర ఇచ్చిన అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలను కచ్చితంగా నేర్చుకోవాలి. మెరుగైన మార్కుల సాధనకు ఇవి బాగా ఉపయోగపడతాయి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు పాయింట్ల వారీగా జవాబులు రాయాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో పటాలతో కూడిన ప్రశ్నలను ఎంపిక చేసుకోవడం వల్ల ఎక్కువ మార్కులు సాధించొచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement