-
ఎంసెట్ స్కాంలో ఎట్టకేలకు చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో కలకలం రేపిన ఎంసెట్ (మెడికల్) స్కాంలో సీఐడీ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్ దాఖలు చేశారు. 2016 జూలైలో లీకేజీ ఉదంతం వెలుగుచూడగా 2019 జూలై అంటే నాలుగేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలైంది. 90 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో దర్యాప్తు జరుగుతుం డగానే ఇద్దరు మరణించగా ఇప్పటిదాకా 67 మంది అరెస్టయ్యారు. వరంగల్ నుంచి మొదలైన సీఐడీ దర్యాప్తు ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, ముంబై, కటక్ తదితర ప్రాంతాలకు విస్తరించింది. పలుమార్లు విచారణాధికారులు మారడం, కేసులో జేఎన్టీయూ, శ్రీచైతన్య కార్పొరేట్ కళాశాల డీన్కు ఉన్న సంబంధాలు వెలుగుచూడటంతో కేసు మలుపులు తిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ చరిత్రలో ఒక కుంభకోణంలో చార్జిషీట్ దాఖలుకు ఇంత సుదీర్ఘ సమయం తీసుకున్న అరుదైన కేసుగా ఈ ఘటన నిలిచింది. తాజాగా చార్జిషీటు దాఖలుతో కోర్టులో వాదనలు మొదలు కానున్నాయి. ఢిల్లీ లింకుతో మొదలు.. వరుసగా రెండోసారి కూడా ఎంసెట్ (మెడికల్) పేపర్ లీకైందన్న విషయం కలకలం రేపడంతో దర్యాప్తు చేసిన నాటి డీఎస్పీ బాలు జాదవ్, కానిస్టేబుల్ సదాశివరావు, మరో ఇన్స్పెక్టర్ నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు తీరుపై విమర్శలు రావడంతో కేసును సీఐడీకి బదిలీ చేశా రు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఢిల్లీలోని జేఎన్టీ యూ ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీకైన విషయా న్ని గుర్తించింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీసింగ్ను సూత్రధారిగా తేల్చింది. ప్రశ్నపత్రాన్ని ఎస్బీ సింగ్ తన మనుషుల ద్వారా బయటకు తెప్పించాడని గుర్తించింది. ఈ కేసులో 62 మంది బ్రోకర్లు సహా మొత్తం 90 మందిని నిందితులుగా పేర్కొంది. స్థానికంగా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు గుమ్మడి వెంకటేశ్, ఇక్బాల్లు విద్యార్థులకు లీక్ చేసిన పేపర్లను చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. వారితోపాటు శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు (ఏ–89), మరో ఏజెంట్ శివనారాయణరావు(ఏ–90)లతో కలిపి 90 మంది నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో కమిలేశ్ కుమార్ సింగ్ (55), రావత్ (43)లు మరణించారు. పకడ్బందీగా చార్జిషీటు.. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వివిధ రాష్ట్రాలకు విస్తరించిన ఈ కేసులో ఆధారాలు, సాక్ష్యాల సేకరణ క్లిష్టంగా మారింది. ఎస్బీ సింగ్ను 2017లో సీఐడీ పోలీసులు అరెస్టు చేసినా తగినన్ని సాక్షాలు లేక చార్జిషీట్ దాఖలు ఆలస్యమైంది. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకొని చివరకు పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా పకడ్బంది సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం. కేసులో 90 మంది నిందితులు, 400 మందికిపైగా తల్లిదండ్రులు, విద్యార్థులు, వారికి సహకరించిన వారు సాక్షులుగా ఉన్నారు. -
తెలంగాణ ఎంసెట్ స్కాం: సీఐడీ విచారణ
-
‘ఎంసెట్’ దర్యాప్తు ఇంకెన్నాళ్లో?
సాక్షి, హైదరాబాద్: ఒక్క కేసు.. 80 మందికి పైగా నిందితులు.. నలుగురికి పైగా మారిన దర్యాప్తు అధికారులు.. అయినా క్లారిటీ లేని ఎంసెట్ కుంభకోణం దర్యాప్తు. అసలు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ దర్యాప్తులో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టని స్థితి. సీఐడీ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. 2016లో ప్రశ్నపత్రం లీకేజీ జరిగితే ఇంకా దర్యాప్తు దశలోనే కేసు నడుస్తుండటం అధికారులను ఒత్తిడికి గురిచేస్తోంటే.. మరోవైపు అసలు నిందితులు ఎంత మంది అన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. ఇప్పటివరకు 80 మంది నిందితులు అనుకుంటే మరో 40 మంది వెలుగులోకి రావడం వారిని కలవరపెడుతోంది. ఇంత మంది ఇన్నాళ్లు ఎక్కడున్నారు? వీరిని కావాలనే గుర్తించలేదా? తెలియక పట్టుకోలేదా? అన్న అనుమానం వేధిస్తోంది. దర్యాప్తు అధికారులపై సందేహం కేసు మొదలైనప్పటి నుంచి నలుగురు దర్యాప్తు అధికారులు మారుతూ వచ్చారు. ఒక దశలో ఓ డీఎస్పీ బ్రోకర్ నుంచి లంచం డిమాండ్ చేసి సస్పెండ్ అయ్యారు. తర్వాత దర్యాప్తు బాధ్యతలు ఎస్పీ స్థాయి వరకు వెళ్లాయి. కానీ తాజా దర్యాప్తులో కొంత మంది పోలీస్ అధికారుల పాత్రపై ఉన్నతాధికారులకు అనుమానం కలుగుతున్నట్లు తెలిసింది. గత దర్యాప్తు సమయంలో కీలక నిందితులతో సంబంధాలున్న వారిని అరెస్టు చేయకపోవడంతో.. వారితో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అరెస్టయిన బిహార్కు చెందిన కొరియర్ అఖిలేష్ వ్యవహారంతో ఈ లింకులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎంసెట్ కుంభకోణంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా సీఐడీ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. రెండేళ్లు గడుస్తున్నా చార్జిషీట్ దాఖలులో అలసత్వంపై సర్కారు గుర్రుగా ఉన్నట్టు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఉపేక్షించేది లేదని, నిందితులతో ములాఖత్ అయినట్లు రుజువైతే సస్పెన్షన్ వేటు తప్పదని పోలీస్ శాఖ పేర్కొంది. -
నత్తలా నడుస్తూనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు కుంభకోణాల కేసులు ఇంకా ‘నానుతూనే’ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ఏడాదిన్నర గడిచినా చార్జిషీటు దాఖలుకాని ఎంసెట్ కేసు ఒకటికాగా.. రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు కన్నం వేసిన బోధన వాణిజ్య పన్నుల కుంభకోణం మరొకటి. రెండు కేసులూ సీఐడీ చేతుల్లో ఉన్నా.. దర్యాప్తు మాత్రం ‘సాగుతూనే’ఉంది. కేవలం నోటీసులు, లేఖలు, ప్రశ్నించడాలతోనే సరిపోతోంది. ఈ నాన్చివేత ధోరణిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఎంసెట్’పై కొత్త సందేహాలు? 2016 ఆగస్టులో ఎంసెట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణ ప్రారంభించిన మొదట్లో సీఐడీ చురుగ్గా వ్యవహరించినట్లు కనిపించింది. 68 మంది బ్రోకర్లు, 16 మంది సూత్రధారులను పట్టుకోగలిగింది. అయితే ఓ కీలక సూత్రధారి కస్టడీలో మృతిచెందగా, ప్రశ్నపత్రం లీక్ చేసిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు చార్జిషీట్ దాఖలు చేయలేదు. డ్రాఫ్ట్ చార్జిషీట్ సిద్ధం చేసి నాలుగు నెలలు గడిచింది. ఇది అటు కోర్టుకు వెళ్లక, ఇటు తుది దశకు చేరక సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దీనిపై సీఐడీ అధికారులను వివరణ కోరగా... జేఎన్టీయూకు లేఖలు రాశామని, ప్రశ్నపత్రం తయారీ కమిటీ, ఆ కమిటీ మినిట్స్ తదితర సమాచారం కావాలని కోరామని చెబుతోంది. అంటే దర్యాప్తు దాదాపు పూర్తయి డ్రాఫ్ట్ చార్జిషీట్ సిద్ధమయ్యాక మళ్లీ విచారణ యూటర్న్ తీసుకోవడం, జేఎన్టీయూ అధికారులపై అనుమానాలు లేవంటూనే మళ్లీ నోటీసులిచ్చి మినిట్స్ కావాలనడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. చార్జిషీట్ రూపొందించడానికి ముందే ఈ నోటీసులు ఎందుకు జారీచేయలేదు. అప్పుడే ఈ కోణంలో ఎందుకు విచారణ సాగించలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. వందల కోట్లు గండికొట్టినా చర్యల్లేవు.. రాష్ట్ర ఖజానాకు రూ.450 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టిన బోధన్ కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం వ్యవహారం సీఐడీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి చివరలో కేసు నమోదు చేసిన సీఐడీ.. పాత్రధారులుగా ఉన్న 8 మంది అధికారులను, ఇద్దరు సూత్రధారులను అరెస్టు చేసింది. కానీ ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన డిస్టిబ్యూటర్లు, ఏజెన్సీలు, ఇతర వ్యక్తులవైపు సీఐడీ కన్నెత్తి చూడకపోవడం సందేహాలను లేవనెత్తింది. రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగానే జాప్యం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ చలానాలను ట్రెజరీ కార్యాలయాలకు పంపి వెరిఫికేషన్ చేయిస్తున్నామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మేలోనే 5,540 నకిలీ చలాన్లు గుర్తించామని, వాటిని చెక్ చేసేందుకు సీఐడీ బృందం సబ్ ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లిందని గతంలోనే ఉన్నతాధికారులు తెలిపారు. కొందరు అధికారులపై విచారణకు ఆ శాఖ ఉన్నతాధికారులు అడ్డుపడ్డారని సీఐడీ ఆరోపించింది. కానీ తర్వాత వారి నుంచి క్లియరెన్స్ వచ్చినా... చర్యలు చేపట్టడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారన్నది అనుమానాస్పదంగా మారింది. ఇందిరమ్మ కేసు మూసేసినట్లే! ఇందిరమ్మ ఇళ్ల కేసును మూసివేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. లబ్ధి దారులు సబ్సిడీ పొందిన సమయం, ఇళ్లు నిర్మించిన సమయం తదితర సరిగా వివరాలు దొరకడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వివరాలు దొరికినా సరైన తేదీల్లోనే లబ్ధిదారులకు చేరినట్టు కొన్నిచోట్ల వెల్లడికావటంతో బలమైన ఆధారాలు లేవని అభిప్రాయపడుతున్నారు. దీంతో కేసును మూసివేయడమే మేలని సీఐడీ ప్రభుత్వానికి సంకేతాలు పంపింది. ఈ కేసులో సీఐడీకి ముందుకెళ్లే అవకాశం లేదని సీఐడీ ఉన్నతా«ధికారి ఒకరు వెల్లడించారు. కొత్త డీజీపీకి సవాలే.. ఎంసెట్, బోధన్ కుంభకోణాల్లో చార్జిషీట్ల దాఖలు పెండింగ్లో ఉంది. ఈ కేసులు కొత్త డీజీపీ మహేందర్రెడ్డికి సవాలుగా నిలవనున్నాయి. ఈ కేసులపై ఎలా ముందుకెళ్తారు? చార్జిషీట్ల నమోదు సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్న దానిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది. -
ఆ తల్లిదండ్రులపైనా చార్జిషీట్!
ఎంసెట్ స్కాంలో పాత్రధారులపై సీఐడీ తకరారు.. - పేరెంట్స్ను నిందితుల జాబితాలో చేర్చడంపై సందిగ్ధం - నేరుగా పాలుపంచుకున్న వారిపై చర్యలు..? - ప్రభుత్వానిదే తుది నిర్ణయం: సీఐడీ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ స్కాం.. దేశవ్యాప్తంగా నిందితులు.. 65 మందికి పైగా బ్రోకర్లు.. 15 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ స్కాంలో విద్యార్థుల తల్లిదండ్రులను నిందితులుగా చేర్చాలా, వద్దా అన్న అంశంపై సీఐడీ సందిగ్ధంలో పడింది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్ దర్యాప్తు పదిహేను రోజుల కిందట పూర్తయింది. బిహార్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన నిందితులను సీఐడీ అరెస్టు చేసింది. కేసులో ప్రధాన నిందితుడైన కమిలేశ్ కుమార్ సింగ్ సీఐడీ కస్టడీలో గుండెపోటుతో మృతి చెందాడు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకు ఇచ్చిన రావత్ కూడా అనారోగ్యంతో పోలీసుల అరెస్ట్కు ముందే మృత్యువాత పడ్డాడు. ఇక మిగిలిన కీలక నిందితులతో కలిపి మొత్తం ఇప్పటివరకు 65 మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. వారి విషయంలో స్పష్టత కావాలి ఈ కుంభకోణంలో బ్రోకర్ల అరెస్ట్ వరకు అంతా బాగానే ఉంది. కానీ బ్రోకర్లతో కలిసిపోయి తమ పిల్లలకే కాకుండా మరికొంత మంది పిల్లలకు ప్రశ్నపత్రం లీక్ చేసిన తల్లిదండ్రులను పాత్రదారులు చేయాలా, వద్దా అన్న అంశంపై సీఐడీ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ప్రశ్నపత్రాలపై శిక్షణ తీసుకొని అక్రమంగా ర్యాంకులు పొందిన విద్యార్థులను సాక్షులుగా మార్చుకున్న సీఐడీ.. వారి తల్లిదండ్రులను నిందితులుగా గుర్తించేందుకు కసరత్తు చేసింది. మొత్తం 125 మంది విద్యార్థులు అక్రమ ర్యాంకులు పొందగా.. వీరిలో 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లుగా తేలారు. వీరినీ నిందితుల జాబితాలో చేర్చాలని సీఐడీ భావిస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం ఒప్పుకుంటుందా, లేదా అనే అంశంపై సీఐడీ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఒకవేళ వారిని సాక్షులుగా మార్చుకుంటే నిందితుల వైపు నుంచి కేసును నీరుగార్చేందుకు అవకాశం లభిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్రోకర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కలసి ఇతర విద్యార్థుల నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేసినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. ఇలాంటి సందర్భంలో సంబంధిత తల్లిదండ్రులను చార్జిషీట్లో పేర్కొనాల్సి ఉంటుందని ఓ సీఐడీ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం.. ఈ వ్యవహారంపై న్యాయ సలహా తీసుకోవడంతోపాటు ప్రభుత్వానికి కూడా సమాచారం ఇస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం తాము ముందుకు వెళ్తామని, తల్లిదండ్రులు పాత్రదారులే కావడంతో ప్రభుత్వం వారిని నిందితులుగా పరిగణించమంటే అలానే చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement