-
రుచి తగ్గిన బ్రాయిలర్.. నాటుకోడికి జై, కిలో రూ.600
సాక్షి,తూర్పుగోదావరి: బ్రాయిలర్ రాకతో కనుమరుగైన నాటుకోళ్ల పెంపకం జిల్లాలో మళ్లీ ఊపందుకుంటోంది. మార్కెట్లు, రోడ్ల పక్కన వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నాటుకోడి గుడ్లు, మాంసాన్ని బలవర్ధక ఆహారంగా పరిగణిస్తారు. పూర్వం మాంసాహార ప్రియుల ఇళ్ల వద్ద కోళ్ల గూళ్లలో 10 నుంచి 30 వరకూ నాటుకోళ్లను పెంచేవారు. ఇంట్లో కూరలకు వీటి గుడ్లనే వినియోగించేవారు. చుట్టాలు వచ్చినప్పుడు వారికి నాటు కోడి కూర పెట్టడంతో పాటు పండగలప్పుడు నైవేద్యాలకు నాటుకోళ్లనే కోసేవారు. 1988–92 మధ్య కాలంలో జిల్లాలో లేయర్ కోళ్ల పరిశ్రమ విస్తరణతో తక్కువ ధరకే గుడ్లు లభించడం, ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు కనుమరుగవడంతో రానురానూ నాటుకోళ్ల పెంపకం తగ్గిపోయింది. మరోపక్క దుమ్ములు కూడా మెత్తగా నమలడానికి వీలుగా ఉండే బ్రాయిలర్ కోళ్ల వినియోగం పెరిగింది. అయితే కాలక్రమేణా మాంసాహార ప్రియుల అలవాట్లలో మార్పులొస్తున్నాయి. త్వరగా బరువు పెరగడానికి బ్రాయిలర్ కోళ్లకు చేస్తున్న హార్మోన్లు ఇంజక్షన్లు ఆరోగ్యానికి చేటు తెస్తాయన్న భావన పెరిగింది. దీనికితోడు వీటి మాంసం రుచి తగ్గడంతో నాటుకోడి వైపు మాంసాహార ప్రియులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నాటుకోళ్ల పెంపకం రెండేళ్లుగా జోరందుకుంది. లాభదాయకంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 200 పైగా నాటుకోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి. గ్రామాల్లోని ఫారాల్లో కోళ్లను పెంచి వారాంతంలో పట్టణాలకు, నగరాలకు తీసుకువచ్చి మార్కెట్లు, రోడ్లు పక్కన ఉంచి విక్రయిస్తున్నారు. మార్కెట్లో నాటుకోడి లైవ్ కిలో రూ.600, చికెన్ రూ.700 ఉంటోంది. మటన్, నాటుకోడి ధరలు మార్కెట్లో దాదాపు ఒకేలా ఉంటున్నాయి. లేయర్ కోడి గుడ్డుతో పోలిస్తే నాటుకోడి గుడ్డులో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో ఒక్కో గుడ్డు రూ.20 పలుకుతోంది. లాభసాటిగా ఉంది నాటుకోళ్లకు డిమాండ్ పెరగడంతో రెండేళ్ల క్రితం పశువుల మకాం వద్ద నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడిపుంజుకు రూ.75 వేలు, పెట్టకు రూ.12 వేలు వెచ్చించాం. పూర్తి ఆర్గానిక్ తరహాలో ఒక్కో బ్యాచ్ సిద్ధం కావడానికి ఎనిమిది నెలలు పడుతోంది. మా వద్ద పెంచిన కోళ్లను చికెన్ వ్యాపారులు హోల్సేల్గా తీసుకువెళుతుంటారు. నాటుకోళ్ల పెంపకం లాభసాటిగా ఉంది. – పిల్లా విజయ్కుమార్, ఆర్గానిక్ నాటుకోళ్ల రైతు, పాలతోడు చదవండి: ప్రకాశం జిల్లా: 11 మంది వీఆర్వోల సస్పెన్షన్ -
అమ్మకానికి ఉద్యోగాలు
‘పశు’ సంవర్థక శాఖలో సొమ్ములే సొమ్ములు 8 31 పోస్టులకు 28 అమ్మకం కావల్సినవారైనా కాసులు పడాల్సిందే 8 లక్షల రూపాయల బేరసారాలు కొత్త కలెక్టర్ దృష్టి సారించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి ఏ సంస్థయినా ఉద్యోగిని వేసుకోవాలంటే నోటిఫికేష¯ŒS ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైనా దరఖాస్తుచేస్తే మీరేమి చదువుకున్నారు?మీకున్న అర్హతలేమిటని అడుగుతారు. అర్హతలు పక్కాగా ఉంటే నిబంధనల ప్రకారం ఇంటర్వూ్య నిర్వహించి నియమిస్తారు. కానీ ఉద్యోగుల భర్తీకి ఇవేమీ అవసరం లేదంటున్నారు పశుసం వర్థకశాఖలో అధికారులు. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీ అంటే కాసుల పంట పండిస్తోంది. గతంలో 14 పోస్టుల భర్తీలో లక్షలు మెక్కేసిన వారే ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరించి ఆదాయం మూటగడుతున్నారు. అలాఅని అవి పర్మినెంట్ ఉద్యోగాలు కూడా కావు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాంట్రాక్ట్ ఉద్యోగమైనా ‘లక్ష’ కొట్టండి ‘పోస్టు’ పట్టేయండి జిల్లా పశు సంవర్థక శాఖలో వసూళ్ల దందా నడుస్తోంది. గడచిన ఏడాది కాలంగా ఆ శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనే తేడా లేకండా ఉద్యోగమేదైనా పైసలిస్తే పని కానిచ్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలే ప్రభుత్వం మూడేళ్లుగా పర్మినెంట్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఫలితంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగమైనా నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ‘క్యూ’ కడుతున్నారు. నిరుద్యోగుల అవసరాన్ని ఆ శాఖలో కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ శాఖ పరిధిలో ఉన్న వెటర్నరీ డిస్పెన్సరీలనవెటర్నరీ ఆస్పత్రులుగా మార్పు చేశారు. ఆ ఆస్పత్రులకు పశువైద్యుల స్థానే అసిస్టెంట్ డైరక్టర్ స్థాయికి తీసుకు వచ్చారు. అలా జిల్లాలో గొల్లప్రోలు, కరప, సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, ఆలమూరు, రావులపాలెం తదితర ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. వెటర్నరీ ఆస్పత్రుల నిర్వహణకుగాను జిల్లాకు 31 డీఈఓ (డేటా ఎంట్రీ ఆపరేటర్లు) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేపట్టాల్సి ఉంది. నోటిఫికేష¯ŒS పిలిచి అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఏజెన్సీ తీసుకుని సంబంధిత శాఖకు అందజేస్తుంది. శాఖాధికారులు వాటిని పరిశీలించి సంయుక్తంగా ఇంటర్వూ్యలు నిర్వహించి ఎంపిక చేస్తారు. అదే సందర్భంలో సంబంధితశాఖ అధికారుల అభీష్టానికి భిన్నంగా ఏమీ చేయలేని పరిస్థితి. అదే వారికి సిరులు కురిపించే కామధేనువుగా మారిందంటున్నారు. పోస్టుల భర్తీకి గ్రీ¯ŒSసిగ్నల్ ఇచ్చి నెల రోజులైనా నోటిఫికేష¯ŒS ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. దీని వెనుక పెద్ద ‘తతంగమే’ నడుస్తోందని కార్యాలయ వర్గాల సమాచారం. గతంలోనూ ఇంతే... ఇదే పంథాలో గతంలో 14 పోస్టులు అమ్మేసుకున్నారనే విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ పోస్టులను కార్యాలయంలో పనిచేసే వారు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో భర్తీ చేశారనే విమర్శలున్నాయి. అయినవారైనా ముడుపులు తీసుకోకుండా పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఒకేసారి 31 పోస్టులు, అన్నీ డేటా ఎంట్రీ ఆపరేటర్లే కావడం, జీతం కూడా ఆశాజనకంగా ఉండటంతో పోస్టుల కోసం పోటీపడి మరీ చేజిక్కించుకునేందుకు లక్షలు కుమ్మరించారంటున్నారు. ఇలా వెనుకేసుకున్న ఆ అధికారి 28 మందితో ఒక జాబితాను సిద్ధం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జిల్లా కలెక్టర్పైనే ఆశలన్నీ.. ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అవకతవకలపై కొరడా ఝళిపిస్తున్న కొత్త కలెక్టర్ కార్తికేయ మిశ్రా పశు సంవర్థక శాఖలో పోస్టుల బాగోతంపై దృష్టి పెట్టాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. బేరం ఇలా... మొత్తం 31 పోస్టులకుగాను ఇప్పటికే 28 పోస్టులు లక్షా, రూ.1.25 లక్షలు, రూ.1.50 లక్షలు..ఇలా అవకాశాన్ని బట్టి అమ్మేసు కున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్కు నెలకు రూ.16 వేలు జీతం. ఇందులో ఏజెన్సీకి రూ.1500లు, íపీఎఫ్ రూ.1500 పోను రూ.13 వేలు చేతికొస్తుంది. పర్మినెంట్ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం సడలిపోవడంతో ఈ పోస్టులకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ కారణంగానే లక్ష, లక్షన్నర ఇవ్వడానికి కూడా వెనుకాడలేదంటున్నారు. వెటర్నరీ జాయింట్ డైరక్టర్ కార్యాలయంలో ఒక అధికారి తన వద్ద పనిచేసే ఇద్దరు నాలుగో తరగతి ఉద్యోగుల ద్వారా ఈ లంచాల బాగోతాన్ని నడిపించినట్టు తెలియవచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement