-
కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా..
మన పూర్వికులు మట్టితో కట్టిన ఇళ్లలో జీవించారు. సైన్స్ అభివృద్ధిచెందని కాలంలో మట్టి ఇళ్లను నిర్మించుకుని నివాసమున్నారు. ఐతే టెక్నాలజీపై ప్రపంచానికే పాఠాలు చెప్పగల ఈ సంపన్న దేశంఎందుకో మట్టితో ఇళ్లను కట్టుతోంది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ఇటలీలోని రావెన్న ప్రాంతంలో కుండ ఆకారంలో బంకమట్టితో ఇళ్లు కడుతున్నారు. అచ్చం.. మన పూర్వికుల ఇళ్లమాదిరి కట్టేస్తున్నారు. వీటిని టెల్కా హౌసులు అని అంటారు. అంతేకాదు 3డీ ప్రింటింగ్ సహాయంతో కేవలం మూడున్నర గంటల్లో వీటిని నిర్మిస్తున్నారు. 645 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ గుండ్రని ఇళ్ల లోపల బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ రూములతో సకల సౌకర్యాలతో కూడి ఉన్నాయి. ఈ డోమ్ హౌస్ల నిర్మాణాల వెనుక గొప్ప సందేశం కూడా ఉందండోయ్! వీటిని నిర్మించాలనే ఆలోచన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ మారియో కుసినెల్లా నుండి ఉద్భవించింది. ఇళ్లు లేనివారు వీటిని వాడుకోవచ్చట కూడా. రాబోయో రోజుల్లో ఇంకా తక్కువ సమయంలో కట్టేస్తానంటున్నాడు మారియో. ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత ఇళ్లివి (ఎకో ఫ్రెండ్లీ హౌస్). ప్రకృతి విపత్తుల్లో ఒక వేళ ఇవి కూలిపోతే 3డి ప్రింటింగ్తో తిరిగి నిర్మించుకోవచ్చిన మారియో చెబుతున్నాడు. విపత్తు సంభవించే ప్రాంతాలకు ఇటువంటి ఇళ్లు మంచి ఎంపిక అని మారియో చెప్పారు. జీరో కార్భన్ కన్స్ట్రక్షన్ ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయబడింది. ఈ ప్రాజెక్ట్ క్లైమాట్ ఛేంజ్ సమ్మిట్లో కూడా ప్రదర్శించబడింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
పర్యాటక హంగులు!
కందనూలు జిల్లాకు పర్యాటక శోభ నల్లమలలో ప్రకృతి రమణీయ దృశ్యాలు ఈకో టూరిజం అభివృద్ధికి శ్రీకారం రూ.109కోట్లతో ప్రణాళికలు సిద్ధం కొత్తగా ఏర్పాటుకానున్న నాగర్కర్నూల్ జిల్లాకు పర్యాటక హంగులు కలగనున్నాయి. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు నల్లమల అడవులు ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను పర్యాటకకేంద్రాలుగా మార్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా ఈకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చాయి. ఆదిశగా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. కేంద్ర పర్యాటకశాఖ రూ.109కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. – అచ్చంపేట పేదల ఊటీ అభివృద్ధికి రూ.10.5కోట్లు అచ్చంపేట ప్రాంతంలోని ఉమామహేశ్వర క్షేత్రం కింది కొండ బోగమహేశ్వరం వద్ద పర్యాటకుల కోసం కాటేజీలు, బేష్ క్యాంపు, కొండపైకి మొట్లు అభివృద్ధి వంటి పనులకు రూ.10.50 కోట్లకు టెండర్లు ఖరారు చేశారు. పేదల ఊటీగా అభివర్ణిస్తున్న ఉమామహేశ్వర క్షేత్రం ఇప్పటికే ప్రముఖ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతోంది. మరోవైపు మల్లెల తీర్థం జలపాతం వరకు రోడ్డు అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. మల్లెలతీర్థం లోయలోకి వెళ్లేందుకు 270మెట్లు ఉన్నాయి. మెట్లదారి ఇబ్బందికరంగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు సులువుగా ఎక్కేందుకు వాటి డిజైన్ మార్చడంతో పాటు రోప్వే ఏర్పాటు చే యనున్నారు. ఇక్కడ విద్యుత్ సౌకర్యం, సోలార్లైట్లు, డ్రస్సింగ్ రూమ్లతో పాటు పర్యాటకుల విశ్రాంతి కోసం షెడ్లు నిర్మాణం వంటి ప్రతిపాదనలు రూపొందించారు. రూ.12కోట్లతో టెండర్లు ఫర్హాబాద్ వ్యూఫాయింట్ వద్ద కాటేజీలు, టూరిజం హోటళ్ల ఏర్పాటుకు రూ.12కోట్లు మంజూరు చేస్తూ టెండర్లు పిలిచారు. అన్ని హంగులతో కూడిన వసతులు, రాత్రివేళల్లో విడిది చేసేందుకు పల్లె వాతావరణాన్ని తలపించే సూట్లు, చెంచుల నివాసంలా ఉండే బొడ్డు గుడిసెల నమూనాలతో రూములు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దట్టమైన అభయారణ్యంలో వ్యూపాయింట్ ఉంది. నల్లమలలోని అటవీ అందాలు, వన్యమృగాల సంచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ ప్రదేశంలో జింకలు, నెమళ్లు, ఎలుగుబంట్లు, పులుల సంచారం బాగా ఉంటుంది. పర్యాటకుల రక్షణ కోసం వన్యమృగాల నుంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అటవీశాఖ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది కేంద్ర పర్యాటకశాఖ ఆడిషనల్ డీజీ భారతీశర్మ కృష్ణానది తీరం వెంట ఏర్పాటు చేసే కాటేజీలు, స్టాల్స్, పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రాంతాలను పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంలో పనులు ఊపందుకున్నాయి. వెనకబడిన అచ్చంపేట,కొల్లాపూర్ ప్రాంతాలకు మంచి గుర్తింపు, ఆదాయ వనరులు సమకూరడటంతో పాటు వ్యాపార సంబంధాలు బలపడనున్నాయి. పర్యాటకంగా రూపుదిద్దుకొనే ప్రాంతాలు.. శ్రీశైలం ఎడమగట్టు పాతాళగంగా, ఈగలపెంట, మల్లెలతీర్థం, అక్కమదేవి గుహలు, ఫర్హాబాద్ ప్యూపాయింట్ అందాలు, ఉమామహేశ్వరం క్షేత్రం, కొల్లాపూర్ మండలం సోమశిల లలితాంబికా సోమేశ్వరాలయం, సింగోటం లక్ష్మినర్సింహస్వామి ఆలయం, రత్నగిరి కొండ, శ్రీవారిసముద్రం ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. శ్రీశైలం–సోమశిల కృష్టానదిలో బోట్ ప్రయాణం నల్లమల పర్యాటకకేంద్రాలను సందర్శించేందుకు పర్యాటకుల కోసం హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సోమశిలకు వాహనాల్లో చేరవేస్తున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం క్షేత్రానికి కృష్ణానదిలో 80కిలోమీటర్ల దూరం. 80మంది పర్యాటకులు ప్రయాణించే సామర్థ్యం కలిగిన బోటు ఏర్పాటు చేశారు. ఎడమ పాతాళగంగ ఈగలపెంటలో కృష్ణానది ఒడ్డున 30అడుగుల ఎత్తయిన వాష్ టవర్ ఏర్పాటు చే సేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కృష్ణమ్మ ఓడిలో ప్రయాణిస్తే అతిపెద్ద శిలాతోరణంగా పేరున్న అక్కమ్మ బిలాన్ని చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అక్కమదేవి గుహలను సోమశిల, ఈగలపెంట నుంచి చూపించే అవకాశం కల్పించింది. చుట్టూ ఎత్తయిన కొండలు, ఆకాశన్నంటే చుక్కల పర్వతం, జల సవ్వడుల మధ్య సాగే ప్రయాణం యాత్రికులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement