-
24 నుంచి ఈరన్నస్వామి ఉత్సవాలు
- నెలరోజుల పాటు నిర్వహణ - భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి - వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశంలో ఆర్డీఓ కౌతాళం: అందరం సమన్వయంతో పని చేసి ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణమాస ఉత్సవాలను విజయంతం చేద్దామని ఆదోని ఆర్డీఓ ఓబులేష్ వివిధశాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం దేవాలయ ఆవరణలోని కాలక్షేప మంటపంలో ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ నెల 24నుంచి ఆగష్టు 21వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. అన్ని శాఖల అధికారులతో పాటు గ్రామస్తులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు భక్తులకు తమవంతు సహయ సహకారం అందించాలని కోరారు. నెల రోజుల పాటు దేవాలయం వద్ద విద్యుత్ కోత లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఇందుకు అదనంగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు పుణ్యస్నానాలు అచరించే తుంగభద్ర దిగువ కాలువలో నిత్యం నీరు ఉండేల చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని దేవస్థానం ఈఓ మల్లికార్జున ప్రసాద్కు, చైర్మన్ చెన్నబసప్ప, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కోరారు. ఉరుకుందకు వచ్చే అన్ని రోడ్లను మరమ్మతులు చేయాలని రోడ్డు భవనాలశాఖ అధికారులకు, బస్సు సర్వీసులు పెంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. స్వామి దర్శనానికి సుమారు 15నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఈఓను ఆదేశించారు. ఆలయ ఆవరణలో వైద్య శిబిరాలు, పోలీస్బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు చెప్పారు. ఉత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల శ్రావణమాస ఉత్సవాల ఆహ్వాన పత్రికను చైర్మన్ చెన్నబసప్ప, ఆర్డీవో, డీఎస్పీ శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ నెల 24నుంచి ఆగష్టు 21వరకు జరిగే ఉత్సవాల్లో ఐదు సోమవారాలు, నాలుగు గురువారాలు వస్తాయని ఈఓ మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. సమావేశంలో తహస్లీల్దారు షేక్షావలి, సీఐ దైవప్రసాద్, ఎస్ఐ సుబ్రమణ్యంరెడ్డి, ట్రాన్స్కో ఏడీఈ రంగయ్య, ఏఈ మద్దిలేటి, ఎంపీపీ లక్ష్మి, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, సర్పంచ్ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ ముత్తమ్మ, పాలక మండలి çసభ్యులు, ఆలయ పర్యవేక్షకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
నిఘా నీడలో ఈరన్న క్షేత్రం
- ఉరుకుంద భక్తులకు కట్టుదిట్టమైన భద్రత - రూ.4.80 లక్షలతో డిజిటల్ సీసీ కెమెరాల ఏర్పాటు - 37 సీసీ కెమెరాలు.. 42 ఇంచుల మానిటర్ అమరిక మంత్రాలయం: ఎట్టకేలకు ఈరన్న క్షేత్రం అధికారులు మేలుకొన్నారు. భద్రత రీత్యా నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రంలో ఒక్కరి ప్రతి కదలికపై నిఘా పెంచారు. అందుకోసం రూ.4.80 లక్షలుపైగా వెచ్చించారు. భక్తుల దోపిడీ మొదలు ప్రమాదకర శక్తులను పనిపట్టేందుకు నిఘానేత్రాలు తప్పనిసరి. ఏటా శ్రావణమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసంలోని ప్రత్యేక రోజులు సోమవారం, గురువారాల్లో భక్తులు లక్షలాదిగా స్వామి క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉగాది, గద్వాల పూర్ణిమ, అమావాస్య, సోమవారాల్లోనూ భక్తుల రద్దీ ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా స్వామి భక్తులు ఉన్నారు. ఏటేటా ఈరన్నస్వామి భక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. క్షేత్రం భద్రత రీత్యా అధికారులు నిఘాపై దృష్టి కేంద్రీకరించారు. గతంలో ఆలయంలో 12 సీసీ కెమెరాలతో నిఘాను నెట్టుకొచ్చారు. కౌతాళం ఎస్ఐ సుబ్రమణ్యంరెడ్డి సూచన మేరకు ఈవో మల్లికార్జున ప్రసాద్ నిఘా పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. రూ.4.80 లక్షలు వెచ్చించి సీపీప్లస్ కంపెనీకి చెందిన 37 డిజిటల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గర్భాలయంలో 5, ధ్వజస్తంభ క్యూలైన్తో 02, క్యూలైన్ ఎదురుగా 02, టిక్కెట్ కౌంటర్ 02, క్యూలైన్ షెడ్లో 02, అన్నదాన సత్రంలో 04, ఆలయ కార్యాలయం ఎదుట 01, క్యూలైన్ ఎగ్జిట్లో 02, ఆదోని, మంత్రాలయం, ఉరకుంద గ్రామ ము«ఖద్వారాలతో 03, షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో 01, మిగతా కెమెరాలు ఆలయ ప్రాకారాలు, ఓపెన్ ప్రదేశాల్లో అమర్చారు. ఆఫీస్లో 40 ఇంచుల మానిటర్ టీవీ (నిల్వ సామర్థ్యం 12,000 జీబీ)లో కెమెరాల దృశ్యాలను అనుసంధానం చేస్తారు. కెమెరాల ప్రత్యేకత : సాధారణ కెమెరాల కంటే మెరుగైన టెక్నాలజీ డిజిటలైన్ కెమెరాలు ఇవీ. అల్యూమినియం మెటల్తో తయ్యారు చేయబడినవి. నీళ్లలో తడిచినా పనిచేయగలవు. చీకటిలోనూ చాలా క్లారిటీగా వీడియో దృశ్యాలు చిత్రీకరిస్తాయి. సాధారణ కెమెరాలు కేవలం 20 మీటర్లు దూరం వరకు మాత్రమే దృశ్యాలను కాస్త క్లారిటీగా తీయగలవు. ఇవీ మాత్రం 60 మీటర్ల మేర క్లారిటీతో వీడియో దృశ్యాలు చిత్రీకరించగలవు. అక్కడెందుకు మినహాయించారో : క్షేత్రం దర్శించిన భక్తులు దాదాపుగా తలనీలాలు సమర్పిస్తారు. కల్యాణకట్టతో భక్తులు ఏటా దోపిడీకి గురవుతున్నారు. టిక్కెట్ కాదని, గుండుకో రేటు పెట్టుకుని నిలువు దోపిడీ సాగిస్తున్నారు. అందులో అధికారులు మొదలు వాటాలు ఉన్నవే. హుండీ ఆదాయం పక్కతోవ పడుతోందని ఎన్నోసార్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. హుండీ లెక్కింపు భవనంలో పాత కెమెరాలకు పరిమితం చేశారు. భక్తులు నిలువుదోపిడీ గురవుతున్న కల్యాణకట్ట, హుండీ ఆదాయం అడ్డదారిలో పోతోందన్న ఆరోపణలు ఉన్న లెక్కింపు భవనాలను ఎందుకు విస్మరించారో తెలియని వైనం. ఏదీ ఏమైనా క్షేత్రం భద్రతకై అధికారులు చర్యలు తీసుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రతే ముఖ్యం : సుబ్రమణ్యంరెడ్డి, ఎస్ఐ, కౌతాళం భక్తుల భద్రత కోసమే క్షేత్రంలో నిఘాను పెంచాం. కల్యాణకట్టలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తాం. శ్రావణ మాసంలో స్నానపు ఘాట్లతో భక్తులు సొమ్ము దోపిడీకి గురికాకుండా ఇప్పటికే సీసీ కెమెరాలు నిల్వ ఉంచుకున్నాం. ముఖ్యంగా భక్తుల సొమ్ము దారి మళ్లకుండా చూస్తాం. భక్తుల సొమ్ము భక్తుల సౌకర్యాలు కేటాయించాలన్నదే మా ఉద్దేశం. ఇటీవల హుండీ కౌంటింగ్ సమయంలో స్వతహాగా ఖర్చుపెట్టుకుని వీడియో గ్రాఫర్ను ఏర్పాటు చేయించాం. భక్తుల సౌకర్యార్థం ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎండోమెంట్ అధికారులకు లేఖలు రాశాం. మహిళా భక్తులకు బాత్రూమ్లు, భక్తులు బసచేసేందుకు డార్మిటరీలు కావాలని కోరాం. వేసవి దృష్ట్యా భక్తులకు నీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించాం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement