-
తుడా చైర్మన్గా వెంకటరమణ కొనసాగేనా?
తుడా వదులుకుంటే టీటీడీ ఎక్స్అఫిషియో పోతుంది ధర్మసంకటంలో ఎమ్మెల్యే సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా) చైర్మన్గా ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ కొనసాగే అంశంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో తుడా చైర్మన్గా నియమితులయ్యారు. అనంతరం వారం రోజుల వ్యవధిలోనే టీటీడీ పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా ప్రమాణం చేశారు. ఇదంతా వెంకటరమణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగింది. ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, తిరుపతి నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. శాసనసభ్యునిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంకటరమణ తుడా చైర్మన్ పదవిలో కొనసాగే విషయమై శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో ఎమ్మెల్యేగా ఎన్నికైనందున తుడాను వదులుకున్నట్టయితే ఆ పదవి మరో కార్యకర్తకు ఇచ్చే అవకాశం ఉంటుందని కొందరు సూచించినట్టు చెబుతున్నారు. నైతికంగా కూడా ఇది మంచిదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే తుడాను వదులుకుంటే టీటీడీ ఎక్స్అఫిషియో సభ్యత్వం కూడా పోతుంది. దీంతో తుడాను వదులుకునే విషయంలో ఎమ్మెల్యే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి నగరాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుడా చైర్మన్ కీలకం కానుంది. దీంతో వెంకటరమణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తెలుగుదేశం వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. -
తారుమారు
తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్కు అక్కడి రాజ్యసభ సభ్యులు ఇక్కడికి ‘లాటరీ’ కేటాయింపులో మారిన వైనం సాక్షి, సిటీబ్యూరో: రాజ్యసభ సభ్యుల్ని లాటరీ పద్ధతిలో ఇరు రాష్ట్రాలకు కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు తెలంగాణలో.. తెలంగాణకు చెందిన కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య కూడా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్లుగా ఉండే పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు రాజ్యసభ సభ్యులు కూడా జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పలువురు రాజ్యసభ సభ్యులు హైదరాబాద్లో ఓటర్లుగా ఉండటంతో వారు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగారు. అలాంటి వారిలో కేవీపీ రామచంద్రరావు,సీఎం రమేశ్, నందమూరి హరికృష్ణ, జైరాం రమేశ్ తదితరులున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారిలో ఉన్న కె. కేశవరావు, ఎంఏ ఖాన్, జైరాం రమేశ్, టి.సుబ్బిరామిరెడ్డి, చిరంజీవిలు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఎంపిక కా వడంతో... తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం లేదు. అంటే.. వారు జీహెచ్ఎంసీలోఎక్స్అఫీషియో సభ్యులు కారు. కాగా, ప్రస్తుత లాటరీలో తెలంగాణ రాష్ట్రానికి ఎంపికైన కేవీపీ రామచంద్రరావు, వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, సీఎం రమేశ్లు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. వారు యథావిధిగా కొనసాగుతారు. కాగా, తెలంగాణ రాష్ట్రానికి ఎంపికైన పాల్వాయి గోవర్ధనరెడ్డి, గుండు సుధారాణి, గరికపాటి మోహనరావులు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా లేరు. వారు గ్రేటర్లో ఓటర్లుగా లేనందున వారి జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో ఎక్స్అ ఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఎంపికైన దేవేందర్గౌడ్ గ్రేటర్కు చెందిన వారైనప్పటికీ జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండే అవకా శం లేదు. జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండేవారు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాలకు హా జరై తమ వాణి వినిపించవచ్చు. ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. ఆంధ్రప్రదేశ్కు ఎంపికైన మిగతా రాజ్యసభ స భ్యులు రేణుకాచౌదరి, సుజనాచౌదరి, సీతారామలక్ష్మి, జేడీ శీ లంలు ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement