-
వయసు తగ్గె.. లెక్క పెరిగె..!
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో పింఛన్దారులు మరింత పెరగనున్నారు. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు పూర్తికాగానే.. వారిలో అర్హులను గుర్తించి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ వృద్ధాప్య పింఛన్దారుల వయసు కుదిస్తామని, ఇక 57 ఏళ్ల వయసు నుంచి పింఛన్ అందిస్తామని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందడం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో దీనికి సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత హామీల అమలుపై దృష్టి సారించిన సీఎం.. ఆసరా పింఛన్లపై వెనువెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆసరా పింఛన్లను అందించేందుకు అర్హులను గుర్తించే పనిని ముమ్మరం చేశారు. ఆసరా పింఛన్లు అందుకుంటున్న 63,655 మంది.. జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లను 63,655 మంది పొందుతున్నారు. గతంలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారికి పింఛన్లు అందజేస్తున్నారు. ప్రతినెలా వీరికి పింఛన్లు సకాలంలో అందుతుండడంతో వీరికి ఎంతో కొంత ఆసరాగా ఉంటోంది. వారి మందులు, ఇతర అవసరాలు తీరుతుండడంతో వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ పొందేందుకు 57 ఏళ్ల వయసును అర్హతగా పేర్కొనడంతో మరింత మందికి పింఛన్లు అందనున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇతర కారణాలతో పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. 60 ఏళ్లలోపే వృద్ధాప్యంతో అనేక మంది తమ పనులు తాము చేసుకోలేని స్థితికి చేరుతున్నారు. పింఛన్ తీసుకునే వయసు 65 ఏళ్లు చేయడంతో ఆ కింద వయసు కలిగిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లోని వృద్ధులకు కనీస ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో జీవనం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ వయసు 57 ఏళ్లకు తగ్గించడం.. అలాగే ఆసరా పింఛన్ కూడా పెంచడంతో వారికి ఈ డబ్బు ఎంతో ఉపయోగకరంగా మారనున్నది. ఇప్పటివరకు వృద్ధాప్య పింఛన్ రూ.1000 ఇచ్చే వారు. అయితే ఇప్పుడు ఆ పింఛన్ కూడా రెట్టింపు కావడంతో వృద్ధులకు మందులు, వారికి ఉండే ఇతర అవసరాలకు సొమ్ము చేతిలో ఉండే పరిస్థితి ఉంది. ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పింఛన్ రూ.2,016 చొప్పున అందించనున్నారు. లెక్కలు కట్టే పనిలో అధికారులు.. కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేందుకు అధికారులను కసరత్తు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో అందుకు సంబంధించిన పనుల్లో కిందిస్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. 2018 నవంబర్ ఓటర్ల జాబితా ప్రకారం 57 నుంచి 64 ఏళ్లలోపు వృద్ధులు ఎంతమంది ఉన్నారనేది లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 90,959మంది ఉన్నారు. అయితే 56 ఏళ్లు దాటినవారు 1,81,442 మంది ఉన్నారు. అయితేఅధికారులు 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు ఉన్న వారి లెక్కలను తీసుకుని.. అందులో అర్హులను గుర్తించనున్నారు. అర్హులకు ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పింఛన్లు అందజేసే అవకాశం ఉంది. అర్హులను గుర్తిస్తున్నాం.. వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. వృద్ధాప్య పింఛన్ అందుకునే వారి వయసు 57 ఏళ్లకు కుదించడంతో ఆ వయసు కలిగిన అర్హులైన లబ్ధిదారులు జిల్లాలో ఎంతమంది ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తున్నాం. ఓటరు జాబితాను అనుసరించి మొదట 57 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు వారు ఎంతమంది ఉన్నారనేది గుర్తిస్తున్నాం. అందులో నుంచి అర్హుల జాబితాను తయారు చేసి.. ఉన్నతాధికారులకు అందజేస్తాం. – ఇందుమతి, డీఆర్డీఓ -
సోషల్ మీడియా వారిని కలిపింది..!
టొరంటోః వారి వివాహం జరిగి 62 ఏళ్ళు దాటింది. జీవిత చరమాంకంలో ఉన్న ఆ వృద్ధ దంపతులిద్దరూ బలవంతంగా వేర్వేరు నర్సింగ్ హోమ్స్ లో ఉండాల్సి రావడం వారి హృదయాలను కలచి వేసింది. కన్నీరు పెట్టించింది. ఒకరికి ఒకరై బతికిన ఆ జంట.. చివరి దశలో విడివిడిగా ఉండేందుకు తల్లడిల్లింది. ఆ సన్నివేశంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్ గా మారింది. వారిద్దరూ కన్నీరు తుడుచుకుంటున్న ఫోటో అంతర్జాతీయంగా తీవ్రమైన సానుభూతిని పొందడమే కాక, వారిద్దరినీ తిరిగి కలిపేందుకు సహకరించింది. వోల్ ఫ్రేం, అనితా గోట్సాక్ అనే 83, 81 ఏళ్ళ వయసున్న వృద్ధ కెనడియన్ జంట ఆగస్టు నెల్లో బలవంతంగా విడిపోవాల్సి వచ్చింది. పెళ్ళయి 62 పాటు వారి సంసార జీవితం హాయిగా గడిచిపోయింది. లింఫోమియాతో బాధపడుతున్న వోల్ ఫ్రేం కు చికిత్స అందించడంకోసం నర్సింగ్ హోం లో స్థలాభావం ఏర్పడింది. దీంతో ఆయన్నుమరో హోం కు తరలించాల్సి వచ్చింది. సుమారు ఆరు దశాబ్దాలు హాయిగా గడిచిన సంసార జీవితంలో చివరి దశలో తీవ్రమైన ఎడబాటు రావడంతో ఆ దంపతులు కుమిలిపోయారు. ఒకేచోట ఉండలేని పరిస్థితిని జీర్ణించుకోలేకపోయారు. వోల్ ఫ్రేం ను మరో హోం కు తరలిస్తున్న సమయంలో దంపతులిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు. ఆ సన్నివేశంలో చిత్రించిన ఓ ఫోటోను వారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫోటోద్వారా వారి కథను తెలుసుకున్న వారంతా ఎంతో సానుభూతిని చూపించారు. దీంతో ఆ ఫోటో సుమారు 3000 సార్టు రీ పోస్ట్ అయ్యింది. ఇదే వారిద్దరినీ తిరిగి కలిపేందుకు సహకరించింది. ప్రస్తుతం వారిద్దరూ సర్రే లోని బ్రిటిష్ కొలంబియా నర్సింగ్ హోమ్ లో తిరిగి కలిసినట్లు వారి మనుమరాలు ఆర్ష్లే బార్త్యిక్ ఫేస్ బుక్ లో రాసింది. వోల్ ఫ్రేం, అనితా గోట్సాక్ కలిసి జీవించే అవకాశం రావడంతో కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. ఆ వృద్ధ జంట కూడా ఓ ప్రేమతో కూడిన స్పర్మను, ముద్దులను పంచుకుంటూ తమ కలయికను ఆనందంగా ఆస్వాదిస్తున్న వీడియోలోని సన్నివేశం అందరికీ సంతోషాన్నిచ్చింది. వారు చివరి దశలో తిరిగి ఒకేచోట జీవించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆ దంపతుల తరపున మనుమరాలు ఆర్ష్లే బార్త్యిక్ కృతజ్ఞతలు తెలిపింది. కెనడియన్ హెల్త్ కేర్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లే ఆ వృద్ధులను విడదీయాల్సి వచ్చిందంటూ బార్త్యిక్ ఆరోపించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement