-
విద్యుత్ లైన్లు మృత్యుపాశాలు!
సాక్షి, ఉప్పునుంతల: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. 11కేవీఏ లైన్లు ఇళ్లపై వేలాడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులు, ఉరుములు మెరుపుల సమయంలో మరింత భయపడుతున్నారు. దీంతోపాటు గ్రామాల్లో ఎన్నో ఏళ్ల క్రితం పాతిన స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వ్యవసాయ పొలాల్లో రైతులు కర్ర స్తంభాలపైనే విద్యుత్ లైన్లను అమర్చి ప్రమాదపుటంచున వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు ఏళ్ల తరబడిగా ప్రజలను వేధిస్తున్నాయి. పలుమార్లు ప్రజాప్రతినిధులకు, సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా ఫలితంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లపై 11కేవీఏ లైన్లు.. మండలంలోని వెల్టూరులోని ఫకీర కాలనీలో 11కేవీఏ విద్యుత్ లైన్లు ఇళ్ల పై నుంచి ఉన్నాయి. దీంతో ఆ కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. దాసర్లపల్లిలో కూడా అలాగే ఉన్నాయి. మూడేళ్ల క్రితం గాలి దుమారానికి విద్యుత్ లైన్ తీగలు తెగిపడి పశుగ్రాసం, గుడిసెలు కాలిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ లైన్ మారుస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉప్పునుంత మడ్డవోనిపంపు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, తిర్మలాపూర్, తిప్పాపూర్, వెల్టూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ లైన్లు ఇళ్లపై ఉన్నాయి. వీటితో పాటు కొన్నేళ్ల క్రితం ఆయా గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పొలాల్లో.. వ్యవసాయ పొలాల్లో విద్యుత్ లైన్లు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. గుట్టమీది తండా శివా రులో విద్యుత్ తీగలు పూర్తిగా కిందకు వేలాడుతున్నాయి. ఉప్పునుంతల నుంచి కొత్త రాంనగర్ వెళ్లే దారి పక్కన బల్సోని బావి వద్ద రైతులు కొన్నేళ్ల నుంచి రైతులు కర్ర స్తంభాలపైనే విద్యుత్ తీగలు అమర్చుకొని మోటార్లు నడుపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సంబంధిత ట్రాన్స్కో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మార్పునకు ప్రొవిజన్ లేదు కాలనీలు, ఇళ్లపై ఉన్న విద్యుత్ లైన్లు మార్చడానికి శాఖాపరంగా ప్రొవిజన్ లేదు. కాలనీ వాసులు, ఇళ్ల యజమానులు లైన్ మార్పిడికి అయ్యే ఖర్చు భరిస్తే మాత్రం అవకాశం ఉన్నచోట ప్రతిపాదనలు తయారుచేసి విద్యుత్ లైన్ మార్పిడి చేసే అవకాశం ఉంది. గ్రామాల్లో కొన్నేళ్ల క్రితం వేసిన కరెంట్ లైన్లు వేలాడుతుంటే, స్తంభాలు ఒరిగిపోతే, బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లిస్తే మార్చే అవకాశం ఉంది. వ్యవసాయ మోటారు కనెక్షన్కు డీడీలు కట్టిన రైతులకు మాత్రం ఇంతకుముందు మెటీరియర్ డ్రా చేయకుండా ఉంటే ప్రస్తుతం వాటిని పరిశీలించి వారికి వచ్చే మెటీరియల్ను ఇప్పిస్తున్నాం. – సురేష్, డిస్కం ఏఈ, ఉప్పునుంతల -
కరెంట్తో ఆటలు!
గట్టుపల్లి రఘుమారెడ్డి(29). విద్యుత్ పంపిణీ సంస్థలో అనధికార ఉద్యోగి. నల్లగొండ జిల్లా తానేదార్పల్లిలోని కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజుకు మరమ్మతులు చేస్తూ కొద్దిరోజుల క్రితం మరణించాడు. పాల్వయి సబ్స్టేషన్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్కు ఎల్సీని తిరిగి అప్పగించాల్సి ఉండగా, లైన్మన్కు అవగాహన లేక మరో ఫీడర్కు విద్యుత్ సరఫరాను నిలిపివేయించాడు. మరమ్మతు కోసం ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన రఘుమారెడ్డి విద్యుదాఘాతానికి గురై కన్నుమూశాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి ఇలాంటి ఎందరో అమాయక నిరుద్యోగుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సాంకేతిక శిక్షణ, నైపుణ్యం లేని ప్రైవేటు వ్యక్తులతో డిస్కంలు అనధికారికంగా పనులు చేయించుకుంటూ వారి మరణాలకు కారణమవుతున్నాయి. లైన్మన్లు క్షేత్రస్థాయిలో సొంతంగా సహాయకులను నియమించుకుని వారికి తమ పనులు అప్పగిస్తున్నారు. అయితే సరైన నైపుణ్యం లేకపోవడంతో వీరు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికు(ఆర్టిజన్)ల సమ్మె ఈ నెల 21న ప్రారంభం కాగా, వారం రోజుల్లో ఇద్దరు ప్రైవేటు సహాయకులు మరమ్మతు పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. సొంతంగా సహాయకుల నియామకం క్షేత్రస్థాయిలో జూనియర్ లైన్మన్లు, అసిస్టెంట్ లైన్మన్లు, లైన్మన్లు సొంతంగా ప్రైవేటు వ్యక్తులను తమ సహాయకులుగా నియమించుకుని తాము చేయాల్సిన ‘ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓఅండ్ఎం)’పనుల బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. వీరే అన్ని పనులు చేస్తుండటంతో చాలామంది రెగ్యులర్ లైన్మెన్లు విద్యుత్ స్తంభాలను ఎక్కడం కూడా మానేశారు. పల్లెల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే క్షేత్ర స్థాయికి వెళ్లి మరమ్మతులు చేయడం ఇష్టం లేక ఎక్కడికక్కడ గ్రామాల్లో స్థానిక నిరుద్యోగ యువకులను సహాయకులుగా నియమించుకుంటున్నారు. నిపుణత, అత్యంత అప్రమత్తతో చేయాల్సిన విద్యుత్ సరఫరా వ్యవస్థల నిర్వహణ, మరమ్మతు పనులు చేస్తూ ఏటా పదుల సంఖ్యలో ప్రైవేటు వ్యక్తులు విద్యుదాఘాతాలకు గురై మృత్యువాతపడుతున్నారు. ఆర్టిజన్ల సమ్మె ప్రభావం.. ఈ నెల 21 నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ వారం రోజుల్లో ఇద్దరు ప్రైవేటు సహాయకులు మరమ్మతు పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై మరణించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ప్రకటించిన సేఫ్టీ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై మార్గదర్శకాల ప్రకారం ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో కనీసం రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణతతో పాటు వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసిన వ్యక్తులనే డిస్కంలు మరమ్మతు, నిర్వహణ పనులకు నియమించుకోవాలి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో 5,149 మంది, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్)లో 4,625 మంది ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ సిబ్బంది పని చేస్తుండగా, వీరిలో చాలా మంది కనీసం ఇద్దరు, ముగ్గురిని ప్రైవేటు సహాయకులుగా నియమించుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో 10 వేల మంది ప్రైవేటు వ్యక్తులు డిస్కంలలో అనధికారికంగా పనిచేస్తున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రైవేటు నియామకాల విషయం డిస్కంల యాజమాన్యాలకు తెలిసినా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు చనిపోతే అనధికారికంగా పనిచేస్తూ చనిపోయారని పేర్కొంటూ సంస్థ తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి. ఎల్సీపై ఆర్టిజన్లకే అవగాహన సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిస్కంలలో పనిచేస్తున్న పోల్ టూ పోల్ వర్కర్లు, సబ్స్టేషన్ ఆపరేటర్లు, బ్రేక్ డైన్ గ్యాంగ్లు, రూట్ రైడర్లు, ఎంఆర్టీ వర్కర్లతో పాటు ట్రాన్స్కోలోని 132/33 కేవీ సబ్స్టేషన్ ఆపరేటర్లుగా పని చేస్తున్న ఆర్టిజన్లు విధులను బహిష్కరించారు. ఏ ఫీడర్ పరిధిలో ఎన్ని లైన్లు ఉన్నాయి.. మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసేందుకు ఎక్కడ లైన్ క్లీయర్(ఎల్సీ) తీసుకోవాలన్న విషయం ఆర్టిజన్లకు తెలిసినంతగా క్షేత్ర స్థాయి ఇంజనీర్లు, రెగ్యులర్ లైన్మెన్లకు తెలియని పరిస్థితి. సాధారణంగా లైన్మెన్లు ఎల్సీ తీసుకుని, ఆర్టిజన్లు/ప్రైవేటు సహాయకులతో మరమ్మతులు చేయిస్తుంటారు. కార్యాలయాలకే పరిమితమై పనిచేసే సబ్ ఇంజనీర్, ఏఈ, ఆపై స్థాయి అధికారులు అరుదుగా క్షేత్ర స్థాయిల్లో పర్యటిస్తుంటారు. ఎక్కడ ‘ఎల్సీ’తీసుకోవాలో తెలీదు! సాంకేతిక పరిభాషలో ఓ ఫీడర్కు ఎల్సీ తీసుకుంటే.. సంబంధిత ప్రాంతానికి విద్యుత్ సరఫరా అందిస్తారు. ఎల్సీని తిరిగి అప్పగిస్తున్నట్లు స్థానిక లైన్మెన్ సబ్స్టేషన్కు సమాచారం అందిస్తే సంబంధిత ఫీడర్కు సరఫరాను నిలుపుదల చేస్తారు. అయితే, ఎల్సీ తీసుకోవడంలో లైన్మెన్లు చేస్తున్న పొరపాట్లతో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టిజన్ల సమ్మె ప్రభావం కనిపించకుండా చూసుకోవాలని, సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలిగితే అప్పటికప్పుడు మరమ్మతులు జరిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని డిస్కంల యాజమాన్యాలు క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించాయి. దీంతో క్షేత్ర స్థాయిలో వందలాది మంది ప్రైవేటు సహాయకులను కొత్తగా నియమించుకుని పనులు చేయించుకుంటున్నారు. విద్యుత్ సంస్థల్లో ప్రైవేటు వ్యక్తిగా చేరినా భవిష్యత్తులో కాంట్రాక్టు లైన్మెన్లుగా అవకాశం లభించవచ్చనే ఆశతో ముందుకొస్తున్న నిరుద్యోగ యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. -
'విద్యుత్ లైన్ల నిర్మాణానికి రంగంలోకి దిగండి'
హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో 2 వేల మెగావాట్ల విద్యుత్ను ఛత్తీస్గఢ్ను నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్గడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. విద్యుత్పై సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వీలైనంత తర్వగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ లైన్ల నిర్మాణానికి రంగంలోకి దిగాలని ఈ సందర్భంగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రానున్న రెండేళ్ల తెలంగాణలో విద్యుత్ సమస్యలను అధిగమించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement