-
154 మంది ఎన్యూమరేటర్ల షోకాజ్ నోటీసులు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వే పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఎన్యూమరేటర్లకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కర్నూలు జిల్లా సర్వేలో రాష్ట్రంలోనే వెనుకబడి ఉండటంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివిధ జిల్లాల్లో 80 శాతంపైగా సర్వే పూర్తయింది. జిల్లాలో మాత్రం 60 శాతం మాత్రమే ఉంది. దీంతో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి సర్వేను నిర్లక్ష్యం చేస్తున్న ఎన్యూమరేటర్ల వివరాలను తీసుకున్నారు. ఏకంగా 154 మంది ఎన్యూమరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో పలువురు సర్వేకు గైర్హాజర్ కాగా మరికొందరు తూతూ మంత్రంగా సర్వేకు హాజరువుతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం అయిన ప్రజా సాధికార సర్వేను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలుపాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తొలుత నంద్యాల మున్సిపాలిటీలో 18 మందికి, ఆత్మకూరు నగరపంచాయతీలో 6 మంది, వివిధ మండలాల్లో 13 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజాగా కర్నూలు నగరపాలక సంస్థలో 31 మంది షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కర్నూలు రెవెన్యూ డివిజన్లో 40 మందికి, నంద్యాల డివిజన్లో 8 మంది, ఆదోని రెవెన్యూ డివిజన్లో 38 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
‘సర్వే’జనాగ్రహం
– ప్రహసనంగా ప్రజాసాధికార సర్వే – నిలిచిపోతున్న అభివృద్ధి పనులు – విద్యార్థులకు అందని ధ్రువీకరణ పత్రాలు – పరిష్కారం కాని ప్రజా సమస్యలు – అధికారులంతా సర్వేలోనే..! – వెలవెలబోతున్న ప్రభుత్వ కార్యాలయాలు కర్నూలు(అగ్రికల్చర్) : సాధికార సర్వే..ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. అధికారులను ఇబ్బంది పెడుతోంది. అభివృద్ధి పనులకు సైతం అడ్డంకిగా మారుతోంది. పారదర్శకత పేరుతో ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో 5,060 మంది ప్రభుత్వ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. సర్వే కోసం రెవెన్యూ శాఖతోపాటు అన్ని శాఖల సిబ్బందిని తీసుకున్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 2,380 బ్లాక్లుగా విభజించి సర్వే చేస్తున్నారు. ఒక్కో బ్లాక్కు ఒక ఎన్యుమరేటర్, ఆయనకు అసిస్టెంట్ ఉంటారు. 240 మంది సూపర్వైజర్లు, 64 మంది చార్జి ఆఫీసర్లు సర్వేలో పాలు పంచుకుంటున్నారు. సాంకేతిక సమస్యలు అడుగడుగునా అడ్డంకిగా మారాయి. దీంతో సర్వే సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఉద్యోగులు సర్వేలో ఉండడంతో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. ఇక్కట్లు ఇవీ.. వివిధ ధ్రువపత్రాల జారీలో ముందుగా గ్రామ రెవెన్యూ అధికారుల సంతకాలు అవసరం. మీ సేవ కేంద్రాల నుంచి వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయాల్లో డౌన్లోడ్ చేసి వెరిఫికేషన్ నిమిత్తం వీఆర్వోలకు రెఫర్ చేస్తారు. వారు పరిశీలించి ఓకే చేసిన తర్వాతనే ముందుకు పోతుంది. వీఆర్వోలతో పాటు రెవెన్యూ సిబ్బంది సైతం ప్రజాసాధికార సర్వేలో నిమగ్నం కావడంతో విద్యార్థులు,రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా కోర్సుల అడ్మిషన్ల కార్యక్రమం జరుగుతోంది. అలాగే స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ధ్రువపత్రాలు సకాలంలో లభించక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 15 రోజుల నుంచి ఇన్కమ్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లు, వారసత్వపు సర్టిఫికెట్లు, 1బీ అడంగల్ తదితర వాటికి దరఖాస్తులు దాదాపు 8000 వరకు వచ్చాయి. ప్రజాసాధికార సర్వే వల్ల ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. పడకేసిన అభివృద్ధి ప్రజాసాధికార సర్వేతో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ఆటోమేటిక్ మ్యుటేషన్లు ఆగిపోయాయి. వెబ్ల్యాండ్లో సవరణలు నిలిచిపోయాయి. నీటి తీరువా వసూళ్లు ఆగిపోయాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడంలో పది శాతం వసూలు చేయడాన్ని వన్టైమ్ కన్వర్షన్ అంటారు. ఇదీ నిలిచిపోయింది. వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, సంక్షేమ శాఖలతో పాటు వివిధ శాఖల సిబ్బంది సర్వేలో పాల్గొనడం వల్ల ఆయా శాఖల కార్యక్రమాలు నిలిచిపోయాయి. తొలగని అడ్డంకులు... ఒక ఎన్యుమరేటర్ ప్రతిరోజూ విధిగా 14 కుటుంబాలను సర్వే చేయాలని నిబంధన విధించారు. ఈ ప్రకారం రోజుకు 33,320 కుటుంబాలు సర్వే చేయాలి. జిల్లా 2,380 బ్లాక్లు ఉండగా రోజుకు సగటున ఒక్కో బ్లాక్లో మూడు ఇళ్లు కూడా సర్వే చేయడం కష్టమవుతోంది. ఈనెల 10వ తేదీ సర్వే మొదలు అయినప్పటికీ ఇంతవరకు 60 వేల కుటుంబాలు కూడా పూర్తి కాలేదు. జిల్లాలో దాదాపు పది లక్షల కుటుంబాల నుంచి వివరాలు సేకరించాల్సి ఉంది. రోజుకు 300 నుంచి 500 ఎన్యుమరేటర్లు ఆన్లైన్లో లాగిన్ కాలేకపోతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరి అథంటికేషన్ తీసుకోవాల్సి ఉంది. ఉదయం లేచింది ఎవ్వరి పనులకు వారు వెళ్తున్నారు. దీంతో అథెంటికేషన్ సమస్యలు ఏర్పడ్డాయి. సర్వర్ డౌన్ కావడం, నెట్వర్క్ సమస్యలు ఏర్పడటం, ట్యాబ్ల చార్జింగ్ పడిపోతుండటంతో సమస్యలను అధిగమించడం పెద్ద సమస్యగా మారింది. సర్వేలో చిన్నారులకు ప్రశ్నలు ఉన్నాయి. నిరుద్యోగులా... సంపాదించేవారు అనే ప్రశ్నలు ఉండటం గమనార్హం. పేరు ఒకరిది...సర్వే చేసేది మరొకరు వివిధ మండలాల్లో ఎన్యూమరేటర్లు ప్రజాసాధికార సర్వేలో బినామీలను పెట్టుకున్నట్లు సమాచారం. ఎన్యూమరేటర్ ఇటు సర్వేకు వెల్లకుండా.. ఇటు విధులు నిర్వహించకుండ బినామీలకు అప్పగించి స్వంత పనులు చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో సర్వేలో పారదర్శకత లోపిపంచే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితి వెల్దుర్తి మండలంలో ఎక్కువగా ఉంది. రాత్రివేళల్లోను సర్వే... పలువురు ఎన్యుమరేటర్లు రాత్రిపూట సైతం సర్వే చేపడుతున్నారు. రోజుకు విధిగా 14 కుటుంబాలు సర్వే చేయాలని కలెక్టర్, జేసీ ఆదేశాలు ఇస్తుండటం రాత్రిపూట నెట్వర్క్ ఉంటుందనే ఉద్దేశంతో సర్వే చేస్తున్నారు. పది శాతం మంది ఎన్యుమరేటర్లు రాత్రిపూట సైతం సర్వే చేస్తున్నారు. రాత్రివేళల్లో సైతం సర్వర్ పనిచేయడం లేదని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. సర్వే వేగవంతం కావడానికి, ప్రజా సమస్యలు సత్వరం పని చేయడానికి ఆఫ్లైన్ సర్వేనే శరణ్యమని పలువురు సూచిస్తున్నారు. -
సర్వే.. సక్సెస్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కుటుంబ సమగ్ర సర్వే జిల్లాలో సక్సెస్ అయింది. ఉదయం మందకొడిగా మొదలైన సర్వే, రాత్రిదాకా కొనసాగింది. కలెక్టర్ చిరంజీవులు నల్లగొండ మున్సిపాలిటీలోని 6వ వార్డు, పద్మావతి కాలనీతోపాటు నార్కట్పల్లి మండలంలో పర్యటించి సర్వే తీరును పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా సూర్యాపేట మున్సిపాలిటీ, కోదాడ, నడిగూడెం, మునగాల మండలాల్లో పర్యటించారు. సర్వే సందర్భంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఇదే పరిస్థితి కనిపించింది. సర్వే సందర్భంగా అన్ని చోట్లా దాదాపు ఒకేరకమైన సమస్యలు తలెత్తాయి. ఎన్యుమరేటర్లకు సరైన శిక్షణ లేకపోవడం కొంత ప్రభావం చూపించింది. కుటుంబాల సంఖ్యకు తగిన రీతిలో ఎన్యుమరేటర్ల సంఖ్య కూడా లేదు. చాలాచోట్ల ఇళ్లకు నంబర్లు కేటాయించడంలో జరిగిన పొరపాట్లు సర్వేను ప్రభావితం చేశాయి. గ్రామాల్లో ఎన్యుమరేటర్లతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. నంబర్లు కేటాయించని కారణంగా చాలా కుటుంబాలు సర్వేలో తమ వివరాలను నమోదు చేయించుకోలేకపోయారు. నల్లగొండ పట్టణంలో సాయంత్రం వరకు ఎన్యుమనేటర్ల కోసం ఎదురు చూశారు. దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వచ్చిన వారి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లతో ఆందోళనకు దిగి నంబర్లు వేయించుకోవాల్సి వచ్చింది. దాంతో ఒక్కో ఎన్యుమనేటర్కు కేటాయించిన కుటుంబాల సంఖ్య పెరిగింది. నల్లగొండ పట్టణంలో ఇంటి నంబర్లు వేయలేదని గాంధీనగర్కు చెందిన 20 మంది మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కాగా, కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్రావు, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్ నల్లగొండ పట్టణంలోనే సర్వే ఫారాలు నింపారు. నల్లగొండ మండలంలోని అన్నేపర్తి, రాములబండ, అప్పాజిపేట, నర్సింగ్భట్ల గ్రామాలలో హైదరాబాద్కు వలస వెళ్లిన వారి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యుమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. దాంతో బై నంబర్లు వేసి సర్వేలో నమోదు చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలోని కొన్ని ఏరియాలలో ఇంటి నంబర్లు వేయకపోవడంతో ఆలస్యంగా 12 గంటలకు సర్వే ప్రారంభమైంది. పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, మాడ్గులపల్లి గ్రామాలలో 50 చొప్పున ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో స్థానికులు ఆందోళన చేశారు. నోడల్ అధికారులు అదనపు సర్వే ఫారాలను తెప్పించి సర్వే నిర్వహించారు. కనగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇంటి నంబర్లు కోసం ఆందోళనలు జరిగాయి. నోడల్ అధికారలు స్పందించి బై నంబర్లు ఇవ్వడంతో సర్వే కొనసాగింది. కనగల్ మండలంలో ఎన్యుమనేటర్లు కాకుండా వారి బంధువులు సర్వే చేయడం వల్ల తప్పలు దొర్లినట్లు పలువురు పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు సర్వేకోసం గ్రామాలకు చేరుకునే సరికి వారి ఇళ్లకు నంబర్లు లేవన్న సాకుతో ఎన్యుమరేటర్లు కుటుంబాల వివరాలు సేకరించ లేదు. భువనగిరి మున్సిపాలిటీ, భువనగరి మండలం, బీబీనగర్, పోచపల్లి, వలిగొండ మండలాల్లో సర్వే సందర్భంగా పెద్ద ఎత్తున కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇక ఎన్యుమరేటర్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లల్లోంచి బయటకు వెళ్లకుండా వేచి ఉన్నారు. వీధుల్లో జనసంచారం ఎక్కడా కనిపించలేదు. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి, చందంపేట వంటి మండలాల్లో సర్వే నిర్వహణకు ఎన్యుమరేటర్లకు ట్రైనింగ్ ఇచ్చినా చివరికి సిబ్బంది సరిపోక అధికారులు అప్పటికప్పుడు ఏమాత్రం శిక్షణ తీసుకోని విద్యార్థులకు, ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఎన్యుమరేటర్ బాధ్యతలు అప్పగించారు. ఇంటి నంబర్లు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోని వైనం సర్వే సందర్భంగా బయట పడింది. చాలా కుటుంబాలకు ఇంటి నంబర్లు వేయలేదు. దీంతో ఎన్యుమరేటర్లకు పరిమితి సంఖ్యలో సర్వే ఫారాలు ఇవ్వగా అవి సరిపోక, చాలా కుటుంబాలు తమ పేర్లను నమోదు చేయించుకోలేకపోయాయి. పట్టణాలలో బతుకు దెరువుకు వెళ్లిన పలువురు సర్వే కారణంగా గ్రామాలకు, తండాలకు చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా సౌకర్యాలు లేక చాలా మంది సర్వేకు అందుకోలేకపోయారు. తప్పనిసరిగా ఆధార్కార్డు నంబరు వేయాలని సూచించడం, చాలా మందికి ఆధార్ కార్డులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్యుమరేటర్లు ఆధార్ను తప్పనిసరిగా చూపించాలనడంతో కొన్ని గ్రామాల్లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ ఆయకట్టులో వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నా పనులకు వెళ్లకుండా సర్వేలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనేందుకు దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారు హుజూర్నగర్ నియోజకవర్గంలోని తమసొంత గ్రామాలకు చేరుకున్నారు. అయితే సర్వే నిర్వహణకు ముందుగా ఒక్కొక్క ఇంటికి ఒక నంబర్ మాత్రమే కేటాయించారు. ఒకే ఇంటిలో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తుండటంతో తమను కూడా సర్వేలో భాగస్వాములు చేయాలని మిగిలినవారు కోరారు. దీంతో ఎన్యుమరేటర్లు తమ జాబితాలో పేరు లేదని నిరాకరించడంతో దాదాపు అన్ని గ్రామాల్లో వివాదం చెలరేగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఆయా గ్రామాలకు చేరుకొని వారికి కూడా సర్వేలో భాగస్వాములు చేస్తామని హామీలు ఇచ్చారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన జాబితా కుటుంబాల వారిని మాత్రమే సర్వే చేస్తామని అదనపు కుటుంబాలకు సర్వే నిర్వహించమంటూ అన్ని గ్రామాల్లో నిరాకరించారు. హుజూర్నగర్ పట్టణంలోని 19, 20 వార్డుల్లో ఎన్యుమరేటర్లకు కేటాయించిన ఇళ్లు ఒకేచోట లేక సర్వే నిర్వహణకు ఇబ్బందులు పడ్డారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, విద్యార్థులను ఎన్యుమరేటర్లుగా నియమించడంతో సర్వే పత్రాలు నింపడానికి వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో కొన్ని గ్రామాల్లో ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉండగా ఒకే నంబరు వేయడంతో మిగితా కుటుంబాలను సర్వే చేయకపోవడంతో ఎన్యుమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అధికారులు అన్ని కుటుంబాలను సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్యుమరేటర్లకు ఉదయం టిఫిన్ , మధ్యాహ్న భోజనం సమయానికి అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రశాంతంగా ముగిసింది. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో చాలా చోట్ల కుటుంబాలు ఎక్కువగా ఉండి ఫారాలు సరిపోను అందక సర్వే ఆలస్యమైంది. శాలిగౌరారం మండలం వల్లాల, చిత్తలూరు గ్రామాల్లో ఇళ్లకు నంబర్లు కేటాయించలేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వచ్చి ప్రజలను సముదాయించారు. మోత్కూరు మండలంలో సర్వే ఫారాలు సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్యుమరేటర్లకు సమయానికి భోజనం అందించలేక పోయారు. రాత్రి వరకు సర్వే కొనసాగింది. ప్రతి గ్రామంలో సర్వే ఫారాల కొరత ఏర్పడింది. సూర్యాపేట నియోజకవర్గంలో సమగ్ర సర్వే చిన్నచిన్న సమస్యల నడుమ కొనసాగింది. దూర ప్రాంతంలో ఉన్న వారు సైతం సొంతూళ్లకు రావడంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. సూర్యాపేట, పెన్పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో సర్వే రాత్రి వరకు కొనసాగింది. సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాలకు వచ్చిన ఎన్యుమరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో సర్వే కొంత ఆలస్యంగా మొదలైంది. కొన్ని గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లకు డోర్ నంబర్లు వేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెన్పహాడ్ మండలం అనంతారం, గాజులమల్కాపురం గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సర్వే ఫారాలు నింపడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో విద్యావంతులు, యువకుల సాయంతో కూడా సర్వే ఫారాలను నింపిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో సర్వేను జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కోదాడ నియోజకవర్గంలో సమగ్ర సర్వే ప్రశాంతంగా సాగింది. కోదాడ పట్టణంతో పాటు గ్రామాల్లో ఎన్యుమరేటర్లు ఉదయం ఏడు గంటలకే సర్వే ప్రారంభించారు. ముందుగా వేసిన ఇంటినంబర్ల ఆధారంగా సర్వే నిర్వహించారు. పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులనే నియమించడంతో ప్రశాంతంగా సాగింది. సర్వే జరుగుతున్న తీరును కోదాడ మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. కోదాడ పట్టణంతో పాటు గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వీధులన్ని నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. గ్రామాల్లో సర్వే వివరాలు చెప్పడానికి పలువురు తటపటాయిస్తుండటంతో ఒక్కొక్క ఇంటివద్ద 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకున్నారు. చౌటుప్పల్లో అద్దెకున్న వారి వివరాలను చాలా చోట్ల నమోదు చేయలేదు. ఇంటి యజమాని వివరాలను తీసుకున్న ఎన్యుమరేటర్లు, ఆ ఇంటిలో అద్దెకున్న వారికి బై నంబర్లు వేసి వివరాలు తీసుకోవాలి. కానీ, అలా తీసుకోలేదు. ఇతర ప్రాంతాల్లో నివాసముండే వారు అక్కడ వివరాలు ఇవ్వకుండా, స్వగ్రామంలోనే సర్వేలో పాల్గొంటామని వచ్చారు. అలాంటి వారి వివరాలను కూడా ఎన్యుమరేటర్లు నమోదు చేయలేదు. ఒక కుటుంబంలో తండ్రి, ఇద్దరు కొడుకులు ఉంటే, వారికి వివాహమైతే, మూడు కుటుంబాలుగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లను కోరారు. అందుకు వారు ఒకే ఇంట్లో ఉంటున్నందున ఒకే కుటుంబంగా పరిగణిస్తామని చెప్పారు. డి.నాగారం గ్రామంలో గ్రామస్తులు ఈ విధంగానే వీఆర్వోను నిలదీశారు. పోలీసులు వచ్చి గ్రామస్తులను పంపించి వేశారు. మునుగోడు, ఊకొండిలలో ఎన్యుమరేటర్లు అవగాహన లోపంతో వివరాల నమోదులో కోడ్లకు బదులుగా వివరాలు రాశారు. చండూరులో సర్వే ఫామ్స్ లేక గంటన్నర ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉంటే వారి వివరాలను నమోదు చేయలేదు. ఆలేరు నియోజకవర్గంలో సమగ్ర సర్వే సందర్భంగా పెద్దఎత్తున కుటుంబాలు అదనంగా నమోదయ్యాయి. ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, గుండాల, ఆత్మకూరు (ఎం), తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో పలువురు ఆందోళన చెందారు. ఆలేరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లు అదనపు కుటుంబాల వివరాలు సేకరించకుండానే పోయారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సర్వే సమయంలో గంటల తరబడి ఒక్కోకుటుంబం వివరాలు సేకరించారు. ఇళ్లకు నంబర్లు వేయలేదని వాటిని వదిలిపెట్టడంతో ఆయా కుటుంబాల వారు అధికారుల చుట్టూ తిరిగారు. ఆలేరు, తుర్కపల్లి మండలాల్లో ఈ పరిస్థితి కన్పించింది. నాలుగు ఇళ్లు ఉంటే ఒక్కటే నంబరు వేశారు. దీంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందాయి. బొమ్మలరామారం మండలం మర్యాలలో సర్వే కోసం వచ్చిన ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. భక్తులు లేక యాదగిరికొండ వెలవెలబోయింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సర్వే అస్తవ్యస్తంగా జరిగింది. హాలియా, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, గుర్రంపోడు మండలాల్లో పెద్ద ఎత్తున కొత్త కుటుంబాలు నమోదయ్యాయి. ఆయా మండలాల్లో ఒక ఇంటికి ఒకటే నంబర్ ఇవ్వడం, అందులో నివాసం ఉండే ఇతర కుటుంబాలకు బై నంబర్లు ఇవ్వకపోవడంతో పలువురు ఆందోళన చెందారు. ఎన్యుమరేటర్లు తమకు ఇచ్చిన ఇంటి నంబర్లను మాత్రమే సర్వే చేశారు. హాలియా మండలంలో ఎన్యుమరేటర్లు తమకు ఇచ్చిన ఇళ్లనే సర్వే చేసి అదనపు ఇళ్లను సర్వే చేయకుండానే వెళ్లిపోయారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్లకు నంబర్లు వేయలేదని వాటిని వదిలిపెట్టడంతో ఆ కుటుంబాల వారు అధికారుల చుట్టూ తిరిగారు. హాలియా, త్రిపురారం, నిడమనూరు, నాగార్జునాగర్లలో ఈ పరిస్థితి కనిపించింది. నకిరేకల్ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో కుటుంబాల సంఖ్య ఎక్కువగా కావడం, ఇంటినంబర్లు తక్కువ వేయడంతో సర్వే ఫారాల కొరత ఏర్పడింది. దీంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. చందుపట్ల గ్రామంలో కుటుంబాలు ఎక్కువగా ఉండడం, సరిపడా పత్రాలను ఇవ్వకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కట్టంగూర్ మండలం ఈదులూరు, పరడ, కట్టంగూర్, కల్మెర గ్రామస్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. చిట్యాలలో దుకాణాల వెనుక నివాసం ఉంటున్న కుటుంబాలకు నంబర్లు కేటాయించలేదు. -
ఎన్యుమరేటర్గా జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఎన్యుమరేటర్ అవతారం ఎత్తారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ వివరాలను సేకరించనున్నారు. ఉదయం 11 గంటలకు తన క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేటర్కు కేసీఆర్ వివరాలు అందించనున్నారు. మరోవైపు సమగ్ర సర్వేతో హైదరాబాద్ బోసిపోయింది. హోటళ్లు, దుకాణాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. సమగ్ర సర్వే కోసం నగరంలో నివసించేవారు తమ తమ స్వస్థలాలకు తరలి వెళ్లటంతో పాటు, మిగతావారు సర్వే కోసంగా ఇళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడు కిటకిటలాడే నగరమంతా నిర్మానుష్య వాతావరణం నెలకొంది. -
ఎన్యుమరేటర్ పట్ల అసభ్య ప్రవర్తన
హైదరాబాద్ : సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విధులు అడ్డుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి కథనం ప్రకారం సుల్తానా అనే ఎన్యుమరేటర్ ఎస్పీఆర్ హిల్స్లో ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు ఇస్తూ సర్వే చెక్ లిస్టులను పంపిణీ చేస్తోంది. అక్కడే నివాసం ఉంటున్న టీడీపీ నేత రాజు నాయుడు ఆమె వద్దకు వచ్చి సర్వే చేయడానికి వీలు లేదని, అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఆమెను దుర్భాషలాడాడు. బాధిత యువతి తల్లి కూడా అక్కడికి వచ్చి తన కూతుర్ని ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రశ్నించగా ఆమెను తిట్టాడు. దీంతో బాధితురాలు సుల్తానా పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి రాజు నాయుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement