-
టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడిపై.. వైఎస్సార్సీపీ నాయకుడు ఫైర్!
అనంతపురం: తమ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి హెచ్చరించారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేసే అర్హత, స్థాయి ఆయనకు లేవన్నారు. అనంతపురంలోని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐపీ పెట్టిన కణేకల్లు మండలం హనకనహాల్కు చెందిన శనగల వ్యాపారి కృష్ణారెడ్డికి ఎర్రిస్వామిరెడ్డి సహకారం ఉందంటూ కాలవ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమ కుటుంబం ఎలాంటిదో ఒకసారి తమ సొంత గ్రామమైన హనకనహాల్కు వెళ్లి విచారించుకోవాలని హితవు పలికారు. కృష్ణారెడ్డి చేతిలో మోసపోయిన రైతుల పక్షాన నిలిచి తమ కుటుంబం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు. మా గ్రామంలోని రైతుల కోసం మంత్రి, ఇతర పెద్దలను తన సోదరుడు బి. గురునాథరెడ్డి మాట్లాడి 1,400 సబ్సిడీ విత్తన శనగను ఇప్పించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పని చేసిన కాలవ వాస్తవలు తెలుసుకోకుండా పనికిమాలిన దగుల్బాజీలను పక్కన కూర్చోబెట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. మానసిక స్థితి సరిగాలేని ఎస్సీ వృద్ధ మహిళను బలత్కారం చేసిన కేసులో నిందితులుగా ఉన్న వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన కాలవ... రాజకీయాలకు అనర్హుడన్నారు. ‘విలేకరిగా ఉన్నప్పుడు నీ ఆస్తులు ఎంత? ఈ రోజు నీ ఆస్తులు ఎంత? ఎలా వచ్చాయి., విలువల్లేని నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఎలా?’ అని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై ఊరి దేవునికట్ట వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. గ్రామంలో కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ తమ కుటుంబాన్ని ఆదరిస్తారని, తాము కూడా అంతేస్థాయిలో అక్కడి ప్రజలకు అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో హనకనహాల్కు చెందిన పూజారి రామాంజినేయులు, గెలివే అనిల్కుమార్, జయరామిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బాబు అవినీతివల్లే ‘గుండ్లకమ్మ’కు నష్టం -
కార్పొరేషన్ అవినీతిపై కమిటీ వేయాలి
– రోడ్డు విస్తరణ పేరుతో ఎంపీ, ఎమ్మెల్యే నాటకాలు – మేయర్ అవినీతి గురించి కార్పొరేటర్లే చెబుతున్నారు – వైఎస్సార్సీపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి అనంతపురం న్యూసిటీ : ‘రోడ్డు విస్తరణ చేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని సీఎం చంద్రబాబు నాయుడు వేశారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నగరపాలక సంస్థలో అవినీతి జరిగింది. అధికార పార్టీ దెబ్బకు ఎంత మంది కమిషనర్లు వెళ్లిపోయారో అందరికీ తెలుసు. వీరి అవినీతిపై కమిటీ వేస్తే మేయర్ స్వరూప, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఢొంక బయటపడుతుంది' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి అన్నారు. మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఎంపీ నిధుల కింద గతంలోనే భవనాన్ని ఏర్పాటు చేస్తే, వాటికి తిరిగి రూ.4.5 లక్షలు బిల్లు చేసిన ఘనత పాలకవర్గానికే దక్కుతుందన్నారు. దొంగ బిల్లులు చేసిన అధికారులు, ప్రగల్భాలు పలికే మేయర్పై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం వచ్చారని, స్వాతంత్య్ర వేడుకలంటూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారని ఆరోపించారు. కాసింత మట్టి తొలగించడం, లైట్లు వేయడం, మొక్కలు నాటడమే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి గురించి ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి తెలియదా? అని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యే రోడ్డు విస్తరణ పేరుతో నాటకాలాడుతున్నారన్నారు. ఇంతటి దౌర్భాగ్యమైన నగరపాలక సంస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. ఇక మేయర్ తమపై మాట్లాడడం అర్థరహితమన్నారు. మేయర్ అవినీతిని బయటపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే, మేయర్ ఎక్కడకు వెళ్లిన మిస్సమ్మ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారన్నారు. మిస్సమ్మ స్థలం బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కు చెందిందని కోర్టు చెప్పినా ఎవరిని మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీల చుట్టూ తిరిగి అదే ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆలోచనలతో ముందుకెళ్తున్నామని మా నిజాయితీ ఏంటో మీ పార్టీ ముఖ్యనేతలకే తెలుసన్నారు. కార్పొరేటర్లే తిరగబడుతున్నారు : మేయర్ స్వరూపపై అధికార పార్టీకు చెందిన కార్పొరేటర్లే తిరుగుబాటు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి ఆరోపించారు. సాక్షాత్తు మంత్రి నారాయణకు మేయర్పై అవినీతి ఆరోపణలు వచ్చాయని, అభివృద్ధి పనుల కేటాయింపులో వివక్ష చూపుతోందని ఆరోపించారన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో సొంత పార్టీకు చెందిన ఎంపీనే నగరపాలక సంస్థ ముందు ధర్నా చేశారన్నారు. ఎమ్మెల్యే, మేయర్ రాజకీయాలు ఏపాటివో అర్థం చేసుకోవాలన్నారు. ఆధిపత్య పేరుతో నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement