-
మృత్యువే గెలిచింది
చిట్టినగర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన శివకేశ్వరి మృతి 7 రోజులుగా మృత్యువుతో పోరాడినా దక్కని ఫలితం నాలుగుకు చేరిన మృతుల సంఖ్య చిట్టినగర్ : పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ తల్లి గాయాల బాధను తట్టుకుంటూ బిడ్డల భవిష్యత్తును చూసుకోవాలనే కోరికతో మృత్యువుతో ఏడురోజుల పాటు పోరాటం చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మృత్యువే గెలిచింది. తల్లి మరణంతో ఆమె పిల్లలిద్దరు పడుతున్న వేదన వర్ణనాతీతం. విజయవాడ కేఎల్రావు నగర్లో గత మంగళవారం ఉదయం భారీ విస్ఫోటనంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్తపల్లి శివకేశ్వరి సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. కేఎల్రావునగర్ రాజీవ్శర్మనగర్లోని మరుపిళ్ల బాలరాజుకు చెందిన రెండంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో గత మంగళవారం భారీ విస్ఫోటనం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు గాయాలతో నగరంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 70 శాతం కాలిన గాయాలతో కొత్తపల్లి శివకేశ్వరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన శివకేశ్వరి ఇంట్లోనే జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినా ప్రమాదం కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే శివకేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు అమె నుంచి ఫిర్యాదు మాత్రమే స్వీకరించారు. అమె కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలను తెలుసుకోవాలని భావించారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది శివకేశ్వరితో విచారణ జరిపితే బయట పడుతుందని అటు పోలీసులు, ఇటు కేఎల్రావునగర్ వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం తెల్లవారుజామున మరణించింది. ఆమె మృతదేహం వద్ద కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొత్తపేట పోలీసులు వచ్చి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా, వారు స్వగ్రామానికి తరలించారు. శివకేశ్వరి చనిపోవడంతో కేసు పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. ఆమె మరణంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. -
పేలుడు ఘటనపై వీడని మిస్టరీ
విజయవాడ సిటీ : కేఎల్రావు నగర్లో మంగళవారం జరిగిన పేలుడు ఘటన మిస్టరీ వీడలేదు. ప్రభుత్వ శాఖల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో పోలీసులు సమగ్ర దర్యాప్తుపై దృష్టిసారించారు. అధికారులు వచ్చి విచారణ చేస్తేనే దీని వెనుక కారణాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కేఎల్రావు నగర్లోని ఓ ఇంట్లో మంగళవారం ఉదయం జరి గిన పేలుడు ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా, ఐదుగురు స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మరికొంత సమయం పడుతుంది... ఇన్చార్జి పోలీసు కమిషనర్ ఎన్వీ సురేంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా డీసీపీ అశోక్కుమార్ పర్యవేక్షణలో పోలీసు శాఖలోని వివిధ విభాగాల అధికారులు రెండోరోజు కూడా ఘటనాస్థలిని పరిశీలించి ఆధారాల సేకరణకు ప్రయత్నించారు. ఫోరెన్సిక్ అధికారులు మరోసారి ఘటనాస్థలిని పరిశీలించారు. తొలిరోజు పోలీసులు, అగ్నిమాపక అధికారులు వ్యక్తంచేసిన అభిప్రాయాలనే ఫోరెన్సిక్ విభాగం అధికారులు కూడా వ్యక్తంచేసినట్లు తెలిసింది. వివరాల సేకరణ గ్యాస్ లీకైనందున ఈ ప్రమాదం జరగలేదని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు, గ్యాస్ డీలర్లు అభిప్రాయపడుతున్నారు. మరేదైనా పేలుడు పదార్థాల కారణంగా ఈ విస్ఫో టనం జరిగి ఉండవచ్చని వీరు అనుమానిస్తున్నారు. బుధవారం ఎక్స్గ్రేషియా పంపిణీ చేసే సమయంలో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా కూడా పరోక్షంగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీంతో పోలీసులు ఆచితూచి విచారణ జరుపుతున్నారు. పేలుడుకు హెచ్పీ గ్యాస్ సిలిండర్ కారణమని భావిస్తున్న పోలీసులు.. సంబంధిత అధికారుల నుంచి వివరాల సేకర ణకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణంగా గుర్తించిన సిలెండర్, పైపు, ట్యూబును ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వాటిని అధికారుల సమక్షంలో పరిశీలించి వివరాలు నమోదుచేస్తారు. తమ ప్రాథమిక దర్యాప్తులో పేలుడుకు గ్యాస్ లీకేజీ కారణమని తేలినందున, కాదని నిరూపించాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల పైనే ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కుటుంబ చరిత్రలపై ఆరా.. పేలుడు ఘటనలో మృతిచెందిన వారు, గాయపడిన వారి కుటుంబాల నేపథ్యం గురించి పోలీసు అధికారులు ఆరా తీశారు. చిన్నపాటి పనులు చేసుకునే వీరిలో ఏ ఒక్కరికీ నేర చరిత్ర లేదని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. దీంతో పేలుడు పదార్థాలు నిల్వ చేయడం, ఉపయోగించడం వంటి పనుల్లో వీరి పాత్ర ఉండేం దుకు అవకాశం లేదంటున్నారు. ఆమె నోరు విప్పాలి.. ఈ కేసులో చిక్కుముడి వీడాలంటే తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కేశినేని ట్రావెల్స్ కార్గో డ్రైవర్ చిట్టిబాబు భార్య శివకేశ్వరి మాట్లాడాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఉండే పోర్షన్ నుంచే పేలుడు జరిగిందని గుర్తించారు. ఆమె అపస్మారకస్థితిలో ఉండగా, గాయపడిన ఆమె పిల్లలు కీర్తి, నిఖిల్తో పోలీసు అధికారులు మా ట్లాడారు. తల్లితోపాటు తాను కూడా నిద్ర లేచానని, క్షణాల్లోనే పెద్దగా శబ్దం వచ్చిందని కీర్తి చెప్పినట్టు తెలిసింది. సిలెండర్లు వారివి కావు ఘటన జరిగిన భవనంలోని వారు ఉపయోగిస్తున్నట్టుగా చెబుతున్న గ్యాస్ సిలెండర్లు బాధితుల పేర్లపై లేనట్టు తెలిసింది. వేర్వేరు పేర్లతో, వేర్వేరు చిరునామాలతో ఉన్నట్టు గ్యా స్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. వీరికి ఆ సిలెండర్లు ఎలా వచ్చాయి? ఎవరి నుం చి తీసుకున్నారు? వంటి విషయాలపై ఆరా తీయాల్సి ఉంది. కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ సహా వివిధ పార్టీల నాయకులు బుధవారం ఘటనాస్థలిని పరిశీలించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..
మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement