-
‘మాట’తో చేస్తున్న సేవకు ఆనందంగా ఉంది: శ్రీనివాస్ గనగోని
మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్ ) ప్రారంభించిన పదినెలల్లోనే 22 బ్రాంచిలు ఏర్పాటు చేసి దాదాపు 5000 మందితో అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అసోసియేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని. మాట అధ్వర్యంలో ఫిబ్రవరి 17 నుంచి వివిధ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 10 వరకు ఈ సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్ ఆపరేషన్ల క్యాంప్ నేటితో(ఫిబ్రవరి 28) ముగియనుంది. ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ.. ఇండియాలో ఈ నెల 17న వరంగల్లో 500 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు మరియు జనరల్ మెడిసిన్ ట్రీట్మెంట్లు చేశాము. 18న ఆశలపల్లిలో మరో 300 మందికి క్యాన్సర్ టెస్ట్లతో పాటు జనరల్ టెస్ట్లు కూడా చేసి మందులను ఉచితంగా పంచిము. అలాగే 19న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారితో కలిసి కంటి ఆపరేషన్లకు సంబంధించి 2300మంది వరకు టెస్ట్లు చేశాము. దాదాపు 200 మందికి ఆపరేషన్లు నిర్వహించి 100 మందికి ఉచిత కళ్లజోళ్లను పంపిణి చేశాము. మరో 250 మందిని చెన్నైకి పంపించి వైద్యం చేయిస్తున్నాం. ఇదంతా చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని అన్నారు. ఫెస్టివల్స్ ఫర్ జోయ్ అధ్యక్షురాలు, ప్రముఖ యాంకర్ సుమ కనకాల మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు 2000మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్ టెస్ట్లు చేయగలిగారని, దాదాపు 195 ఆపరేషన్లు జరిగినందుకు శంకర్ నేత్రాలయ టీమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ–‘‘ గతంలో నన్ను అందరూ సుమ భర్త అని ఎవరన్నా అంటుంటే చిరగ్గా ఉండేదని ఇప్పుడు సుమ ఇలాంటి మంచిపనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలర్ ఎగరేసుకుని మరి సుమ భర్తనే అని చెప్పుకోవాలి అనిపిస్తుంది’’ అన్నారు. కార్యక్రమంలో శంకర్ నేత్రాలయ ప్రతినిధి అరుల్, డాక్టర్ విజయ్ భాస్కర్ బొలగం, ప్రవాసాంధ్రుడు ప్రదీప్ సామల టివి ఫెడరేషన్ సభ్యులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజం గెలిచి కాదు.. కంటి ఆపరేషన్కే బెయిల్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసం హైకోర్టు నాలుగు వారాల పాటు తాత్కాలిక బెయిల్ ఇస్తే.. టీడీపీ నేతలు న్యాయం గెలిచిందంటూ హంగామా చేయటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిజం, సత్యం, ధర్మం గెలిచి చంద్రబాబు బయటకు రాలేదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ఎందుకు ఇచ్చారనే విషయాన్ని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. చంద్రబాబు గతంలో ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని.. మరో కంటికి కూడా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో మానవతా దృక్పథంతో కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చిందని వివరించారు. అందువల్ల చంద్రబాబు ఆపరేషన్ చేయించుకొని.. 4 వారాల తర్వాత మళ్లీ జైలులో సరెండర్ కావాల్సిందేనన్నారు. శరీరంపై దురదలు వస్తున్నాయంటే ఏసీబీ కోర్టు మొన్న ఏసీ ఏర్పాటు చేయమన్నదని.. ఇప్పుడు జైలులో కంటి ఆపరేషన్ చేయలేరు కనుక హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చిందన్నారు. అంతేగానీ ఏదో సత్యం, ధర్మం, న్యాయం గెలిచి.. చంద్రబాబు బయటకు రాలేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబుపై కేసు విచారణలో ఉందని.. ఇప్పటికే కొందరు సహ నిందితులను ఆయన విదేశాలకు పంపించారని.. వారిని కూడా విచారించాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వస్తే.. లోకేశ్ యుద్ధం మొదలైందని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు యుద్ధం మొదలైతే మరి ఎర్ర డైరీ పట్టుకుని ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికినప్పుడు, ఏం పీకారంటూ సవాల్ విసిరినప్పుడు ఏం మొదలైందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. జ్ఞానేశ్వర్కు జ్ఞానోదయంఅయ్యింది ఎక్కడైతే ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించారో.. అక్కడే టీడీపీ జెండాను చంద్రబాబు పీకేశారన్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం మూతపడిందని.. అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానేశ్వర్కు జ్ఞానోదయమై రాజీనామా చేశారని చెప్పారు. జ్ఞానేశ్వర్ను పార్టీ అధ్యక్షుడిగా పెట్టి, ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టించి, బీసీలకు పట్టం కడతామని పెద్దపెద్ద ఉపన్యాసాలిచ్చి.. చివరకు చంద్రబాబు, లోకేశ్ కలిసి తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని అన్నారు. ఇతర పార్టీల గెలుపు కోసం టీడీపీని తాకట్టు పెట్టారని జ్ఞానేశ్వర్ స్పష్టంగా చెప్పారంటే.. టీడీపీ దుస్థితేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏపీలో కూడా ఎన్నికల ముందో, ఆ తర్వాతో టీడీపీ జెండా పీకేయటం ఖాయమన్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లోకేశ్ ఎత్తలేదంటే.. ఆయన సంస్కారమేంటో, పార్టీ పట్ల నిబద్ధతేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బెయిల్ రాదని తెలిసిపోయింది !..అందుకే బాబు గారి కొత్త డ్రామా..?
-
ఆ గ్రామ పెద్దలకే అలా జరగడంతో.. భయంతో వణికిపోతున్న జనం
ఆదిలాబాద్: పదిరోజుల వ్యవధిలో మండలంలోని డోంగర్గామ్ గ్రామపెద్దలు మడావి దేవ్రావ్, గ్రామపటేల్ పెందోర్ బాదుపటేల్ కంటిచూపు పోగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. 10రోజుల క్రితం గ్రామానికి చెందిన మడావి దేవ్రావ్ కంటిచూపు కోల్పోయాడు. అతడి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా చూపు రాలేదు. నాలుగు రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయింది. బుధవారం రాత్రి ఉన్నట్టుండి గ్రామపెద్ద, గ్రామపేటల్ పెందోర్ బాదుపటేల్ కంటిచూపు పోయింది. పదిరోజుల వ్యవధిలో ఇద్దరు గ్రామపెద్దల చూపు పోవడంతో గ్రామ ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, 40రోజుల క్రితం ఓ ప్రజాప్రతినిధి డోంగర్గామ్ గ్రామాన్ని సందర్శించాడు. గ్రామ పొలిమేరలోని హనుమాన్ విగ్రహానికి బంగారు కళ్లు చేయిస్తానని అప్పటికే ఉన్న వెండికళ్లు తీసుకువెళ్లాడు. బంగారు కళ్లు చేయిస్తానన్న సదరు ప్రజాప్రతినిధి జాప్యం చేయడంతోనే గ్రామపెద్దలు వరుసగా చూపు కోల్పోతున్నారని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు దృష్టి సారించి కంటిచూపు కోల్పోతున్న వారిని పరీక్షించి చూపు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. -
రెండు కళ్ళకి ఒకేసారి శుక్లం ఆపరేషన్ చేయించవచ్చా..?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement