-
‘మైక్రోమ్యాక్స్’యూనిట్ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో మైక్రోమ్యాక్స్ మొబైల్ ఫోన్ తయారీ యూనిట్ను మంత్రి కె.తారకరామారావు గురువారం ఉదయం ప్రారంభించారు. భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోటీఎస్ ఐపాస్ విధానంలో ప్రారంభమైన మొదటి సంస్థ మైక్రో మ్యాక్స్ అని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారనుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. -
ఫ్యాబ్ సిటీలో మైక్రోమ్యాక్స్
భూమి పూజ చేసిన ప్రతినిధులు - రూ.200 కోట్ల పెట్టుబడి; 500 మందికి ఉపాధి మహేశ్వరం : ప్రముఖ సెల్ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్... తెలంగాణలో తన సెల్ఫోన్ తయారీ ప్లాంటుకు శుక్రవారం భూమి పూజ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల, శ్రీనగర్ రెవెన్యూ పరిధిలో ఉన్న ఫ్యాబ్సిటీలో కంపెనీ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. ఈ ప్లాంటులో సెల్ ఫోన్లతో పాటు, ఎల్ఈడీ స్క్రీన్లను తయారు చేయనున్నట్లు వారు తెలియజేశారు. ఫ్యాబ్ సిటీలోని 19 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ కమర్షియల్ అధికారి రాకేష్ గుప్త చెప్పారు. త్వరలోనే ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ‘‘ఈ ప్లాంటుపై రూ.200 కోట్లపెట్టుబడి పెడుతున్నాం. సుమారు 500 మందికి దీన్లో ఉపాధి దొరుకుతుంది’’ అని తెలియజేశారు. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్కు దేశంలో ఒక ప్లాంట్ ఉందని, ఇది రెండో ప్లాంటు అవుతుందని చెప్పారాయన. మంచిరోజు కాబట్టి ఇపుడు భూమి పూజ చేశామని, త్వరలో మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో కలిసి అధికారికంగా శంకుస్థాపన చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మైక్రోమ్యాక్స్ ఏజీఎం గజేందర్ కుమార్, ప్రాజెక్ట్ అధికారి ఆనంద్ ప్రకాష్, టీఐఐసీ అధికారి శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాబ్సిటీలో ‘మొబైల్ హబ్’
సెల్ఫోన్ విడిభాగాల తయారీకి సర్కారు గ్రీన్సిగ్నల్ మైక్రోమ్యాక్స్ సంస్థకు 50 ఎకరాలు కేటాయింపురూ.200 కోట్లతో ఆ సంస్థ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకొత్తగా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న పలు సంస్థలు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: సెల్ఫోన్ విడిభాగాల తయారీకి మహేశ్వరం మండలం రావిరాల సమీపంలోని ఫ్యాబ్సిటీ కేంద్రంగా మారనుంది. ఈ ప్రాంతంలో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూముల్లో సెల్యులార్ పరిశ్రమల స్థాపనకు పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ మైక్రోమ్యాక్స్ సంస్థ 50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.200కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ ఏర్పాట్లు వేగిరం చేసింది. దీంతో గురువారం రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనుంది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత పలు కంపెనీలు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు.. రావిరాలలో ఏర్పాటు చేసే ‘మొబైల్ ఫోన్ తయారీ హబ్’తో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. ఈ నెల మొదటివారంలో ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్తో సమావేశమైన సంగతి తెలిసిందే. అనంతరం ఆ ప్రతి నిధుల బృందం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్ సంస్థ ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది. సామ్సంగ్ కంపెనీ సై తం యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. అదేవిధంగా తైవాన్కు చెందిన మరో కంపెనీ ప్రతినిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ అయ్యారు. ఇలా పలు సంస్థలు ఇక్కడ యూనిట్ల ఏర్పాటుకు సానుకూలత చూపుతుండడంతో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు అధికారవరా్గాలు చెబుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానంలో కంపెనీలకు భారీ రాయితీలివ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పరోక్షంగా పేర్కొంది. మొత్తంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. -
ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు
బస్వగూడ తండాపై ఎమ్మెల్యే ‘తీగల’ వరాల జల్లు ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయం.. మరోవైపు ఫ్యాబ్సిటీ, హార్డ్వేర్ పార్కు వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు.. వీటికి అర కిలో మీటర్ దూరంలోనే ఉంది మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామమైన బస్వగూడ తండా. ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం ఉన్న మహేశ్వరం మండలంలోని ఈ ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోనే బస్వగూడ తండా ఉన్నా ఈ గ్రామానికి కనీసం బస్సు, బడి, రహదారి, స్వచ్ఛమైన తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా తండాకు వచ్చారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. తమ్ముడూ.. చెల్లీ.. తాతా.. అవ్వా.. పెద్దమ్మా అంటూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ తండా అంతా కలియతిరిగారు. సమస్యలను సావధానంగా విన్నారు. తండాను దత్తతను తీసుకుని గిరిజనులకు అండగా నిలుస్తానని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే హామీలు తుక్కుగూడ నుంచి బస్వగూడ తండా వరకు బీటీ రోడ్డు వేయిస్తా ఫలక్నుమా డిపో నుంచి రెండు ట్రిప్పులు బస్సు నడిపిస్తా తండాకు కృష్ణా నీరు అందిస్తా తండాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఔట్లెట్ ను ఏర్పాటు చేయిస్తా తండాలో ప్రాథమిక పాఠశాల తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. ఎమ్మెల్యే:నీ పేరేంటమ్మా..ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? మహిళ: నా పేరు బుజ్జి. మా తండాకు బస్సు రాదు. రోడ్డు సరిగ్గా లేదు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బియ్యం తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే: ఇక్కడ రేషన్షాపు లేదా? బుజ్జి: లేదు. మంఖాల్కు పోయి తెచ్చుకోవాలే ఎమ్మెల్యే: నీ పేరు ఏంటమ్మా.. నీ సమస్య ఏమిటి? వృద్ధురాలు: నా పేరు లక్ష్మమ్మ. రెండు నెలల నుంచి పింఛన్ వస్తలేదు ఎమ్మెల్యే: ఇక్కడ ఎంత మందికి పింఛన్లు రావడంలేదు? మహిళలు: చాలా మందికి రావడంలేదు సార్ ఎమ్మెల్యే: వచ్చే నెల నుంచి అందరికీ రూ.వెయ్యి వస్తాయి ఎమ్మెల్యే: ఏమమ్మా.. ఏం పని చేస్తున్నావ్.. నీ సమస్య? బూరీ: రోజూ కూలికి పోతా సారు... ఎమ్మెల్యే: ఎంత ఇస్తున్నారు, ఉపాధి పనులు నడవడం లేదా? బూరీ : రోజుకి రూ.150 వస్తుంది,ఉపాధి పనులు చేయిస్తలేరు. ఎమ్మెల్యే: ఇంకా తండాలో ఏమేం సమస్యలు ఉన్నాయమ్మా? మయూరి: చిన్న పిల్లలు రోజూ కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. తాగుడుకు బానిసై చిన్న వయస్సులోనే చాలామంది చచ్చిపోయారు. బస్సులు లేక పెద్దలు, పిల్లలు ఇబ్బందిపడుతున్నారు. ఎమ్మెల్యే: ప్రభుత్వ పాఠశాల లేదా? మయూరి: లేదు సారు. అంగన్వాడీ ఉంది. బోరు ఉన్నా ట్యాంక్ లేదు. కరెంట్ ఉన్నప్పుడే అరగంట నీళ్లు వస్తాయి. ఎమ్మెల్యే: ఏం పని చేస్తావమ్మా.. పిల్లలు ఏం చేస్తారు? చాందీ: కూలీ దొరికితే చేస్తా.. లేకపోతే ఇంటి దగ్గరే ఉంటా. ఇద్దరు పిల్లలు చదువుకున్నా డ్యూటీ రాలే. ఇంటి జాగ లేదు. ఎమ్మెల్యే:ఏం బాబు నేనెవరో తెలుసా.. నన్ను గుర్తుపట్టారా .. ఏం చదువుతున్నావు, ఏం కావాలనుకుంటున్నావు? కల్యాణ్: తెలుసు సార్. తుక్కుగూడలో చదువుతున్నా. పోలీస్ కావాలనుకుంటున్నా. ఎమ్మెల్యే: మీ తండాకు మెరుగైన సేవలకు ఏం చేయాలి? భాస్కర్: నేను డీఎడ్ చదివాను. పాఠశాల లేక చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇక్కడే స్కూల్ ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే: నీకు వికలాంగ పింఛన్ వస్తోందా, ఎంత వస్తోంది? శంకర్: ఇప్పటి వరకు రూ.500 వచ్చింది. ఎమ్మెల్యే: ఏం పంటలు వేసావు. కరెంట్ సక్రమంగా వస్తుందా? రైతు కోఠియా: వరి వేశాను. ఇప్పుడు కూరగాయలు వేద్దామనుకుంటున్నా. కరెంట్ సక్కగా రావడంలేదు. ఇచ్చే ఆరుగంటలు ఒకేసారి ఇవ్వాలి. ఎమ్మెల్యే: ఎయిర్పోర్టు దగ్గరే ఉన్నా మీ తండా అభివృద్ధి కాలేదు. ఏం చేస్తే బాగుపడుతుంది? శ్రీనివాస్నాయక్: తండాలో ఎక్సైజ్ కేసులు తొలగించి, విద్యా సౌకర్యంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి. ఎమ్మెల్యే: ఏం చదువుతున్నావు బాబు. నీ సమస్య ఏమిటి? విద్యార్థి: నా పేరు చలపతి. తుక్కుగూడలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. వర్షం పడితే రోడ్డు బురదగా మారి స్కూల్కు పోలేకపోతున్నాం. రోడ్డు, బస్సు సమస్య తీర్చాలి. ఎమ్మెల్యే: ఏమమ్మా .. డ్వాక్రా రుణాలు వస్తున్నాయా? సాలీ: ఇస్తలేరు సార్. ఇళ్లు, భూమి ఉన్నోళ్లకు రేషన్ బియ్యం కూడా కట్ చేస్తమంటుండ్రు సార్ .. ఎట్లా బతకాలి. ఎమ్మెల్యే: తప్పుడు ప్రచారం నమ్మొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం ఇప్పించే బాధ్యత నాది. హస్లీ: మా తండాకు బస్సు లేదు సార్. రోజూ పిల్లలు సదువుకోవడానికి రానుపోను 7 కిలోమీటర్లు నడుస్తుండ్రు. ఎమ్మెల్యే: రెండు నెలల్లో ఆర్టీసీ బస్సును వేయిస్తా. విజయ: సార్ నాకు వితంతువు పింఛన్, రేషన్ బియ్యం వస్తలేవు? ఎమ్మెల్యే: వచ్చేనెల నుంచి రూ.1500 పింఛన్ వస్తుంది. బియ్యం ఒక్కొక్కరికి 6 కిలోలకు పెంచాం. లలిత: సార్ నాభర్త ఇటీవల చనిపోయిండు. పిల్లలను చదివించలేకపోతున్నా. ఎలాంటి ఆధారం లేదు. ఎమ్మెల్యే: మీ పిల్లలను ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో వేసి చదివిస్తా. అవసరమనుకుంటే ఒకరిని దత్తత తీసుకొని చదవిస్తా. వచ్చే నెల నుంచి రూ.1000 పింఛన్ వచ్చేలా అధికారులతో మాట్లాడతా. ఎమ్మెల్యే: ఎం పెద్దాయనా పింఛన్ వస్తోందా? బాషా: రెండు నెలల నుంచి వస్తలేదు. ఎమ్మెల్యే: పాపా నీ పేరేంటి.. అంగన్వాడీ కేంద్రంలో రోజూ భోజనంతోపాటు గుడ్డు, పాలు ఇస్తున్నారా? జ్యోత్స్నప్రియ: ఇస్తున్నారు సార్. అంగన్వాడీ కార్యకర్త: సార్ పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. కానీ మాకు కనీస వేతనాలు లేవు. ఎమ్మెల్యే: ప్రభుత్వం కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తుంది. అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు వస్తున్నారు? గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారా? అంగన్వాడీ సూపర్వైజర్ సరోజ: మొత్తం 21 మంది పిల్లలు ఉన్నారు. రోజు 15 మంది వస్తారు. గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలకు పౌష్టికాహారం అందిస్తున్నాం సార్. ఎమ్మెల్యే: ఏఎన్ఎం గారూ.. తండాలో సూదులు, మందులు ఇస్తున్నారా? ఏఎన్ఎం: ప్రతి శనివారం వచ్చి వ్యాక్సిన్లు, మం దులు ఇస్తున్నాం సార్. ఎమ్మెల్యే: ఏం ఎస్ఐ గారూ.. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఎస్ఐ నర్సింగ్ రాథోడ్: శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నాం. తండాలో గుడుంబా కేసులు ఎక్కువగా వస్తాయి. ఇటీవల అందరూ సారా తయారీని నిషేధించారు. మదన్మోహన్ (ఎంపీటీసీ): తండావాసులు సారా తయారీని నిషేధించారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. తండాలో డ్రైనేజీ ఔట్లెట్ ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే: సారా తయారీ నిషేధించడం అభినందనీయం. డ్రైనేజీ ఔట్ లెట్ ఏర్పాటు చేస్తా. రవి నాయక్: తండావాసులకు ఇళ్ల స్థలాలివ్వాలి. స్మశానవాటికకు ప్రభుత్వం నుంచి స్థలం ఇవ్వాలి. ఎమ్మెల్యే: తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుంది. ప్రభుత్వ స్థలం ఉంటే స్మశానవాటికకు కేటాయించేందుకు కృషి చేస్తా. సామెల్ రాజ్ (వార్డు సభ్యుడు): తండా అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలి. ఎమ్మెల్యే: తప్పకుండా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. తుక్కుగూడ నుంచి బస్వగూడ వరకు బీటీ నిర్మాణానికి రూ. 26 లక్షలు మంజూరయ్యాయి. టెండర్లు పిలిపించి పనులు ప్రారంభిస్తాం. రోడ్డు పూర్తి కాగానే ఆర్టీసీ బస్సు నడిపిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. -
కేసీఆర్ పాలనపై వ్యతిరేకత..
మహేశ్వరం: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్యాబ్సీటి, హార్డ్వేర్ పార్కు, ఔటర్ రింగ్ రోడ్డు, పలు కంపెనీలను తీసుకొచ్చింది టీడీపీనే అని పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇమాంగూడ శ్రీశైలం రహదారిపైన సామ సంజీవరెడ్డి గార్డెన్లో టీడీపీ నియోజకవర్గ విసృ్తత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ప్రథమంగా లేఖ ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని అభివర్ణించారు. సమగ్ర సర్వే పేరుతో స్థానికేతరులను భయపేట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు జీ 4 పరిపాలన ఇస్తానని హామీ ఇచ్చి గెలుపొందాక కే 4 (కేసీఆర్ కుటుంబం... కేసీఆర్, కేటీఆర్, కవిత, హరిష్రావు) పాలన అందిస్తున్నాడని ఆరోపించారు. మూడు నెలల పాలనలో పలువురు రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నాక కూడా సీఎం కేసీఆర్ స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా టీ టీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ త్వరలో జరిగే జీఎచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో కేసీఆర్ ప్రజలకు అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ..కేసీఆర్ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఆకర్ష్లకు ఎవరు లొంగరన్నారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి తప్పారని అన్నారు. 2019లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వ రం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బతికున్నంత కాలం టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు కన్నతల్లిలాంటి టీడీపీని వీడొద్దని సూచించారు. అంతకుముందు ఇటీవల గెలుపొందిన ఎంపీటీసీలు, నగర పంచాయతీ వార్డు సభ్యు లు, సర్పంచ్లకు ఘనంగా సన్మానించారు. కార్యకర్తలు లేక వెలవెల ఇమాంగూడలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తలు లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. మహేశ్వరం , కందుకూరు నుండి నాయకులు, కార్యకర్తలు అశించినంతగా హజరుకాలేదు. సరూర్నగర్ డివి జన్, ఆర్కేపురం నుండి జనాలను తీసుకొచ్చారు. టీఆర్ఎస్లో చేరే టీడీపీ నాయకులు, కార్యర్తలు సమావేశానికి గైర్హాజరయ్యారు. ముఖ్యనేతలు ప్రసంగిస్తున్నప్పుడు కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. దీంతో నేతలు ఒకింత అసహనానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో మాల్కజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి పెద్దిరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్, సరూర్నగర్ జెడ్పీటీసీ జె. నరేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధానకార్యదర్శి ఎడ్మ మోహన్రెడ్డి, సర్పంచ్ లు జె.లక్ష్మయ్య, డి. సుధాకర్, ఆనందం, మంద కవిత, ముత్యం, పోచయ్య, సాలీ, యాదమ్మ , పార్టీ సీనియర్ నాయకులు కరుణాకర్రెడ్డి, కృష్ణ, యాదగిరి, కందుకూరు, సరూర్నగర్ మండలాల అధ్యక్షులు పి. ఆనంద్, తీగల అమర్నాథ్రెడ్డి, నాయకులు జయేందర్, లక్ష్మినర్సింహ్మరెడ్డి, సత్యనారాయణ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement